Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, March 27, 2020

కరోనా - కొత్త గురువు గారు వచ్చారు.

 మూర్ఖులు అనుభవం అనే పాఠశాలలో నేర్చుకుంటారు అనేవారు. ఒకప్పుడు అనుభవం నిజమైన గురువు. కానీ ఇప్పుడు కాలం మారి పోయింది. ఎంత  కఠిన అనుభవాన్ని పొందినా మారటం లేదు. అనుభవం అనే టీచర్ అంటే భయం పోయింది. అప్పుడు దేవుడు ఏ చేసాడో చదవండి.....


వేదం కాలంలో  దేముడు ఋషులుద్వారా , పండితులు ద్వారా మంచి చెపితే ప్రజలు విని ఆచరించేవారు. కాలక్రమేణా ప్రజలుకు వేదాలలో నమ్మకం సన్నగిల్లి సైన్స్  లో నమ్మకం ప్రబలింది. సైన్స్ సాధించిన విజయాలు తో  కిక్ ఎక్కి పోయాడు మనిషి.


ఆ కిక్ లో  మనిషి కి   మని,  షీ  సర్వస్వం అయ్యాయి. ఇంగ్లిష్ వాడు పెట్టిన పబ్లిక్ స్కూల్స్లో  ఫీజులుకట్టి చదువు నేర్చుకునే  దగ్గర నుంచి కార్పొరేట్ స్కూల్స్ లో మార్కులు కొనుక్కునే మూర్ఖులు  స్థితికి ఎదిగిపోయాడు.

ఈ స్థితిలో దేముడు కొత్త  పాఠశాల స్థాపించి , కఠినమైన అనుభవం అనే టీచర్లను నియమించి పాఠాలు నేర్పించాడు. కొంతకాలానికి మూర్కులు ముదిరి దేముడుకే పాఠాలు చెప్పసాగారు.


ఒకప్పుడు అనుభవం నిజమైన గురువు.  మూర్ఖులు అనుభవం అనే పాఠశాలలో నేర్చుకుంటారు అనేవారు. పాతకాలంలో మార్ఖులు కంటే , నేటి కాలంలో మూర్ఖులు జఢ మూర్ఖులు. అనుభవం అనే పాఠశాల లో ఎంత  కఠిన అనుభవాన్ని పొందినా మారటం లేదు.  అందుకే దేముడు కొత్త టీచర్ ని నియమించి సింగల్ సిట్టింగ్ పాస్ ఏర్పాటు చేసాడు. ఇంతకీ ఆ టీచర్ పేరు చెప్పలేదు కదూ! అతడి పేరు కొరోన.


బలిపీఠం మీద తప్ప ఏ పాఠం నేర్చుకోనివాడికి , మృత్యువే  ఉపాద్యాయుడు, కరోనా నే కరెక్ట్ గురువు. 

3 comments:

  1. Chala baga chaparu sir. Aavaru namina namakapoina idhi matrum nijam. Kani sir ee corona valla prajallu marutaru antara.

    ReplyDelete
  2. చాల బాగా చెప్పారు సార్ ఇ రోజులలో వేదాలు పురాణలు ఎవరు చదవడం లేదు సార్ ధర్మం
    ఎవరు పటించటం లేదు సార్

    ReplyDelete