Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, October 31, 2020

Bharatavarsha -60

వసతి గృహ గవాక్షమునుండి దామిని రహదారిని చూచుచుండెనుపసిమి వర్ణమున  మెరియుచున్నఅభిజాత  ఆమె పక్కనే నిలచియున్నది."వర్షుడి వాహనము వెడలిపోవుచున్నదిప్రస్తుతమునకు పేరు  అడగవలదనివర్షుడు చెప్పెనువర్షుడి వచ్చి మిమ్మల్ని నాకప్పగించే ననిన మీరు సామాన్యులు కాదు  కావున మీరిచట నుండరాదుమీరు నాకు మిక్కిలి పూజ్యనీయులు నాతొ రండు అని  దామిని ఆమె  పెట్టెను గ్రహించి సాగుచుండగాస్తబ్ధమై అజ్ఞాతమై  గుప్తవనిత ఆమెను అనుసరించ సాగెనుపనిపిల్ల  వెనుకనే ఆమె సంగీత పేటికను  తెచ్చుచుండెనువాహనము నందు వస్తువులు పెట్టిన పిదప వారిరువురూ వాహనమునెక్కిరిశీతల పవనముల సేదతీరుచూ వారుసాగుచుండిరి.  

శా.రంతా హరివి ల్లులాయె మదినే యాల లూగించు ఈ     

 తోరంపు  బృహదా రులప చ్చటికాం తిప్రాకె చూడంగ  నే   

 రంతా  పరిగె  త్తుచెట్లు  వనమే  రేగు నట్లున్న  దీ 

  దారంతా  భవనా లుగాత  లలనే  దాచేను మేఘాల లో  

  


అంబరమణి, కిరణము నిటారుగా పడుచున్నవి విశాలమైన విశాఖపట్టణ జాతీయ రహదారి నల్లని కాలసర్పము ను తలపించుచున్నది దానిని చూచి  భీతిల్లినట్టు  వాహనములన్నియూ   పరుగులు దీయఁచున్నవి. నున్నటి నల్లని రహదారిపై  దూరముగా నీటిఛాయలు  తారసపడి వాహనము సమీపించుచుండగా అవి మాయమగుచున్నవి. రహదారి కిరువైపులా పచ్చని చెట్లు. చెట్లు కూడా  అంతే  వేగముగా   పరిగెడుచున్నవి,  ఊరేగింపుగా వూరు తరలిపోవుచున్నట్లున్నది.”    ఆకులురాలి మొఖములు వేళ్ళాడు చెట్లు ఆసుపత్రి ముందు నిలిచిన  రోగులవలె.  మరకత దళములతో  గుంపులుగా నిలబడిన చెట్లు విహారయాత్రికులవలె, లేత హరిత పల్లవములతో జంటలుగా నిలబడిన చెట్లు వధూవరులవలె  నగపించుచుండెను.   కానీ చెట్ల పరుగు చూచినా అప్పులవాళ్ళు వెంటబడి తరముగా పరిగెడుతున్నట్లున్నది. 


తే. అప్పు    లిచ్చిన   వాడువ     చ్చప్ప   డగగ      

చెప్పు    లుమరచి    భీతితొ   చెడప రిగెడ    

 నేల     చెప్పుచు   గొప్పలు    నేటి తరము       

అప్పు    పాముల    చిక్కెనా    హార  మయ్యె                

   

ఊరేంత మారిపోయెనో కదా. అనుచున్న ఆమెతో దామిని “మీరు ఈవూరిలో మునిపుండిరా” యని అడిగిఆయ్యో  అనవసరముగా వివరములడుగుచున్నానే యని కలత చెందెను.  

బుల్లయ్య కళాశాలమీదుగా ఫోక్స్ వాగను  పోవుచుండగా ఒక కుర్రవాని చూసిన ఆ తల్లి హృదయము తడిమినట్టయి నది . “యితడు మా అబ్బాయి వలే యున్నాడు”  అని అతడినే చూచుచూ  “ఎట్లుండెనో నాబిడ్డ తినుచుండెనో లేదో?” అని వాపోచుండగా " ఎంతుండునమ్మా నీ బిడ్డ" అని దామిని అడిగెను " ఇరువది నాలుగు  వర్షములుండును " యని చెప్పగా విని అవాక్కయ్యి తేరుకుని నవ్వసాగెను.

ఆశీలుమెట్ట వద్దకు చేరి దారిదీపముల వద్ద ఎడమ చేతివైపు మలుపు తిరిగి పైకి ఎగయుచుండెను. “ఇది ఆంధ్రవిశ్వ విద్యాలయ మార్గము” అను చుండగా అచ్చటనున్న ఒక వీధిలో ప్రవేశించిన ఫోక్స్వాగన్ ఒక పెద్ద భవనము  ముందు నిలిచెను. “ఆ  వీధితో విడదీయరాని రెండు అనుబంధములు ఆమెకు గుర్తువచ్చెను. ఒక బంధమును భర్త తెంచిననూ మరొక బంధము తన బంధువుల గృహము. ఒక్కక్షణకాలము ఆ వీధిని కలియ చూచుచుండగా " ఏమండి , లోపలి రండి " అని దామిని పిలుచుచుండగా ఆ భవనము పై నున్న నామ ఫలకము పై " హృదయాలజిస్ట్ " అనుండుట  చూసి నివ్వెరపోయెను.  నవ్వుచూ  ఎవరీ హృదయాలజిస్ట్ కొంటె కోణంగి వలే నున్నాడే అనుచుండగా " దామిని మా ఆయనే ఆ కొంటె కోణంగి " అని జెప్పి నవ్వు చుండగా, మీనాక్షి మొఖమున అపరాధభావం మెదలుచుండెను.   ఈ ఇంటి యజమాని  అనుకొని అయ్యో పొరపాటు నంటిని  మీవారనుకొనలేదు. మీరన్నది నిజమే ఆ హృదయాలజిస్టు ఈ ఇంటి యజమానే. అంతేకాదు నా యజమాని కూడా. ఆయన ఎల్లప్పుడూ ప్రతివిషయమునందునూ హాస్యము చూచుచుండును ,  హాస్యము నద్దు చుండును.  ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకొని లోపలి వెడలిరి. లోపలి నుంచి  ఇద్దరు పని మనుషులు వచ్చి వారి సామాలు తెచ్చిరి. 

మీరు స్నానము జెసి వచ్చిన మనము కలిసి భోజనము జేయవచ్చు, వారు ఆసుపత్రి నుంచి  రాత్రి కే  ఇంటికి వచ్చెదరు. స్నానము జేయుటకాపడతి  స్నానాల గదిలోకి బోయి చూడ రోయపురమందు తనుండెడి ఇల్లు గుర్తొచ్చెను. ఆ విశాల గృహమునందధునాతన సౌకర్యములు హాయిగొలుపుచుండ ఆమె స్నానము  ముగించి బయటకు వచ్చెను.   దామిని దూరవాణిలో మాట్లాడు చుండెను. అటు  స్వరము వర్షుడని గ్రహించి అతడికి మనసులోనే దీవెనలందించెను.

 ఇద్దరూ భోజనములు చేయుచుండగా దామినికి ఆమె తనకు సంపత్ నగర్ తో గల  అనుభందమును వివరించెను. దామిని ఆమెను అబ్బురముగా కని హర్షమును తెలిపెను.భోజనములు ముగిసిన పిదప ఆ ముద్ద బంతులిద్దరూ అద్దాల కిటికీ వద్ద నిలిచి ఇంటి ఆవరణలో నున్న విశాలమైన తోటలో మొక్కలను  చూచుచుండిరి. అందమైన ఆరడుగుల పొడవుగల  వృక్షముల వరుస లో నిలిచున్నవి. వాటి గుండ్రని పచ్చని తలలు గోళములవలె  

మెరియుచున్నవి.  వాటి మధ్యలో మూడడుగుల  ఎర్రని చిన్న పొదలు కనువిందు చేయుచున్నవి. ఇద్దరు పని వారు వాటిని పెద్ద కత్తెరలతో కత్తిరించుచున్నారు. 

గోడ దగ్గర నిమ్మ, సపోట , కరివేప వంటి చెట్లు కూడా కలవు." ఇటువంటి చెట్లు గొడవద్ద వేసిన ఇబ్బందులు కలుగును కదా అని ఆమె అనగా విని దామని " అయ్యో మీకు అసలు విషయమును సూటిగా ఎట్లు చెప్పవలెనని ఆలోచించు చున్నాను" అని దామిని అనెను. “సూటిగా చెప్పన ప్రమాదమున్నదా.” ఆమె అనుచుండగా, ఎవరో ఒక వ్యక్తి గోడదూకి నిమ్మ చెట్టు క్రింద నక్కి కూర్చొనెను మొక్కలు కత్తిరించుటాపి పనివారు చెవులు రిక్కించి వినుచుండిరి. ఆ వచ్చిన వ్యక్తి దొంగ వలే నక్కుచూ వొంగి నడుచుచుండెను. ఊహకందనిది జరిగింది ఆ వ్యక్తి జేబులోంచి తుపాకీ తీసి పట్టుకొని పొదచాటున నెక్కెను. ఆశ్చర్యము , పనివారు కూడా జేబు నుండి చిన్న తుపాకులు తీసిరి. దామిని పక్కకు చూడగా ఆ భామకు కళ్ళు  తిరుగుచున్నవి,  ఆమె పక్కకు ఒరిగిపోవుచుండగా దామిని ఆమెను పట్టుకొనెను.

మొక్కల చాటున దాగొని వారు తుపాకులతో  కాల్పులు జరుపుకొనుట ప్రారంభించిరి. ఒక పొదనుండి మరొక పొదకు అతడు పరిగెడుట , వారుకూడా అతడిని వెంబడించుట చూచుచున్న ఆ యువతి " ఇది విశాఖ పట్నమునందు వైద్యుని ఇల్లా లేక హాలీ వుడ్ చిత్రమా " అనెను. అంతలో అతడి చరవాణి మ్రోగెను.  రాధకృష్ణ హియర్ అనుచూ మాట్లాడుచుండగా పనివారు తుపాకులు తలపై పెట్టినారు.  పనివారిని తుపాకులు  తీయమని బ్రతిమాలి మాట్లాడుట ముగించి లోపలి వచ్చిన కానీ  అతడు కేవలము ఆటలు ఆయూడ్చున్నాడని ఆమెకు అర్ధము కాలేదు . వైద్యులు ఇట్లు  కూడా ఉందురా  అని ఆమె దామినితో అనగా “అమ్మ ఇప్పటికైననూ మీకు అర్ధమైనది  నా భారము తీరినది.” అని ఆమె భర్త కు భోజనము వడ్డించెను. అతడు భోజనము చేయుచూ అప్పుడప్పుడూ ఛలోక్తులు విసురు చుండెను. " పక్క గదిలో ఆమె ఉన్నది కాస్త మీ ధోరణి మార్చ వలెను" అనెను.  

మార్చేద్దాం అనుచూ " ఆమె పేరు అడిగెను. "తెలియదు, చెన్న పట్నమునుండి వచ్చెను అని చెప్పుచూ తెలిసిన వివరములు తెలియ జేసెను."  పేరు తెలియదని చెప్పగానే , ఇదియునూ ఆటవలె నున్నదని భావించి సంబరపడుచుండ దామిని ఖంగు తినెను.  

రేపు విశాఖ ఉక్కు నగర కళాక్షేత్రమున భారతవర్ష తులాభారం ప్రదర్శన కలదు నీవు హైద్రాబాద్ కు పోలేదు కావునా ఇచ్చట చూడవచ్చు " ననెను. ఇట్లెన్ని ప్రదర్శనలు ఇత్తురు? ఎంత కాల మిత్తురు అని దామిని అనగా " చూచు వారున్నంతకాలమూ నాటికలు కొనసాగును,  నానాటికీ పెరుగుచున్న ప్రేక్షకాదరణ తో అతడికి ఈ నాటిక రాష్ట్ర వ్యాప్త కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టెను.   అతడి పేరు తరుచుగా పత్రిక లందు శీర్షికలుగా వచ్చుచున్నది.  అని అతడు చెప్పుచుండగా “పతాక శీర్షికగా వచ్చు సమయము సమీపములోనే ఉన్నది,  అనెను అతడు " సమీచనం " అనెను. 

"అతడు రాసిన భక్తి విజయము పద్యములు ఎంతో మనో రంజకముగా కూర్చబడినవి. మాలినిగారు నాకొక ప్రతిని ఇవ్వగా చదివి ఆందించుచున్నాను. సాహిత్య అకాడమీకి పంపి యున్నాడు." "సాహిత్య అకాడమీ పురస్కారం వర్షుని వరించుటయా" అని అతడు కిల్లి కజ్జములు పెట్టుకొనెను దామిని " ఎప్పుడూ హాస్యములాడు చుండుట యేనా మీ పని.. శుభం పలకరా పెళ్లి కొడకా అనిన సామెతను గుర్తు వచ్చుచున్నది.” వారిదారిమద్య వాగ్వివాదం చెలరేగెను. అతడు మాటలాపి  " ప్రక్కగదిలోనున్న మగువ వచ్చెను   అనుచూ  ఇట్లనుట కష్టము కనుక మిమ్మల్ని “మదాం  ఎక్స్” అని పిలుతును. అని “గుప్త నామమున వ్యవహరించిన అభ్యంతరము లేదు కదా!” అని అడుగగా. ఆమె నవ్వి నా పేరు మీనాక్షి అని చెప్పెను.

                                                                      ***

ఇంతలో ఒక హ్రద్రోగి వచ్చెను.  అతడు హృదయాలజిస్ట్ కు  పాత రోగి  అతడిని చూడ గానే డాక్టర్ రాధ కృష్ణ మొఖమంతయూ నవ్వు పూసెను.  వారిద్దరూ డాక్టర్ గారి గదిలోకి వెళ్లిరి. 

కూర్చో  శోభన్ బాబు,  "నాపేరు మోహన్ బాబు అండి. 

సరే మోహన్ బాబు, సుమారుగా  నీకు ఆస్తి ఎంతుండును? 

ఒక ఇల్లు,  పొలం ఉన్నాయండి. 

వీలైనంత తొందరలో వీలునామా రాసేయండి  

ఎందుకండీ , నా గుండె గట్టిదండి. 

సరే మందులు రాసిస్తాను అని చీటీ ఇచ్చి అతడిని పంపెను 

 సైకాలజిస్ట్ సత్యమూర్తి వచ్చెను. అతడు నేరుగా డాక్టర్ గదిలోకి పోయి కూర్చొనెను. 

పైనుండి మీనాక్షి దామిని లు చూచుచుండిరి, " రావణా ,  పిసికాలజిస్ట్ కి కాఫీ "

అని రాధాకృష్ణ గట్టిగా అరిచెను. "పనివాడు కాఫి పట్టుకొని లోపలకి పోవుచుండగా 

మీనాక్షి : రావణ యని పేరు కొత్తగా నున్నది   

అవునమ్మా నాకునూ కొత్తగానే యున్నది , నాపేరు రవణ.  అని అతడు లోపలి బోయెను.  

దామిని : ఇదమ్మా  ఈ హృదయాలజిస్ట్ సంగతి.  

మీనాక్షి: రేపు రావణ, రవాణా అగునేమో! 

దామిని : చూడమ్మా పిసికాలజిస్ట్ కి కాఫీ అని  హోటల్లో వలె  ఎట్లు అరుచుచున్నారో. పుణ్యం కొద్దీ పురుషుడన్నారు 

మీనాక్షి:అహ్హహ్హ మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలమయెనో  కదా! నీవు చాలా అదృష్టవంతురాలివి అతడే చిల్డ్ స్పెషలిస్ట్ అయినచో? 

దామిని : హతోస్మి ,  చైల్డ్ స్పెషలిస్ట్ , నీ నోట పడి చిల్డ్ స్పెషలిస్ట్ గా మారెనా!

డాక్టరు గదిలో  -  సత్య:  ఆసుపత్రి లో డాక్టర్ దమయంతితో గొళ్ళెము పడినదని విన్నాను.

ఆడవారితో మాట్లాడు పద్దతి  నేర్చుకోవయ్యా రాధాకృష్ణ . 

రాధా : పిసుకుడైననూ రాలేదు.  నేను పిసికాలజిస్ట్ నైనచో ఎంత బాగుండెడిది. 

మీనాక్షి విచారమంతయూ మరిచి ఆ ఇంటి వాతావర్ణమును ఆనందిచుచుండెను. 

Friday, October 30, 2020

Bharatavarsha -59

అగస్త్యని  బీరు మృగణ - నిష్ఫలా న్వేషణ 



చూచెద  పోయి చెన్నపు రికిప్పుడు

వేచెద నెంత వెక్కమ  యినగాని  


వెనుతిర గలేను మొఖము చూడక

నుమూయ నళినాక్షి నపడు చుండె.


గుండె ఆగె నో  క్షణము నిజము దెల్వగ   

ఎండె  గొంతుక టుబోయి  వెతికెద        

(తల్లి  ఆ బడుగు వాడను వీడేనని తెలిసి అవాక్కయ్యెను 

 గొంతు  తడారిపోగా అయోమయములో పడి అలమటించెను)


అయ్యో మూడునా ళ్లాలస్య మునకే 

కుయ్యో మనినేడ్వ  కష్టము  కలిగిను


ఎచటికి పోయెనో వాడ నొదిలి  (ఈ మురికివాడ నొదిలి ఎక్కడికి పోయెనో )

అచ మానస దార్య రమణి     (గొప్ప ఉదార మనసున్న అందమైన స్త్రీ ) 


విచ విమలాత్మ వాకిలి వీడె    (అస్థిరమైపోయి, స్వచ్ఛమైనమనస్సుగలఆమె ఇంటిని వీడి పోయెను ) 

విచకిల విభ్రమ ప్రోయాలు వోడె   (విప్పారిన శృంగార భావములు గల   ఇల్లాలు) 


ధనమెంత బోసిన దొరకదే నేడు

ఘనము గాచెప్పి గొలుచు  కొందు


నికి మాలిన పుత్రుని కన్నపా 

పానికి  బడుగు వాడలో వడిలేవు 


పాణిగ్ర  హణమున వంచింప బడిన    (వివాహమందు మోసపోయిన స్త్రీ)

రాణిమీ నాక్షిగా రాలబి  డ్డడికి          (సంపన్న కుటుంబమునుంచి వచ్చిన  మహారాణి వంటి స్త్రీ  )


ముడుపు గట్టుచు  మురికి  వాడలో

డుపు గట్టుకు కాలమే గడిపెనో


రాజక  న్యవుగాదె   రాజీవ నేత్రి       (రాజసము కలిగి కమలములవంటి కన్నులున్న స్త్రీ )

రాజగు  ణములతో  రాజిల్లు ధాత్రి   (గొప్ప గుణములతో వెలుగు భూమి తో సమాన మైన స్త్రీ )


మూడవ వారము మురికి వాడల

మూఢము గవెదకి  విసిగి నాను


తిరిగ తిరిగతా  తార సిల్లె

వొరుగుచు నాదేహ మేనీర సిల్లె


మిత్రుడని వేడగా ర్షుడు మెదలడే     

త్రువే మెరుగురా సారంగ పాణి 


తొగరాజ కలువను యజూడ వయ్య    (చంద్రమా కలువలాంటి సుకుమారమైన మగువను దయతో చూడు )

గరాజ విష్ణుప్రియ గావరా వయ్య         (విష్ణువాహన , గరుడా నీ సూక్ష్మ దృష్టి తో నా తల్లిని కనిపెట్టు )


న్నెడ  యానాల కెరిగించి బోయి

న్నెల  లోకాన వాలిన హాయి  

                                                                  ***


రుణతా  రనుపోలి  వధాన మయ్యె   

కుమ  తారపే  రుసువిది  తమాయే 

అవధానమైన అనగా ఉత్కృష్ట మైన స్థితిని, సువిదితమైన పేరు సంపాదించుకొని లకుమరాణివలె వెలుగుచుండెను.తల్లి వలె  ఆనతికాలములోనే  నగరంలో అందరి ఆదరణ చూరగొనెను. 

అంబర   ముకెగసె  అందాల    తారగా

సంబర   మునజేరి   నులు   వెలగా  

వానలు కురిసిన చెరువులు నిండును , చెరువులు నిండిన కప్పలు వచ్చునో రావో తెలియదు కానీ పేరు ఉన్న తారల వద్దకు అందరూ  ఆశలతో  వచ్చి చేరి తేనే పలుకులు పల్కుచుండుట  సహజమే కదా.  

తండ్రితో  తగువాడి  తెచ్చె ధనము

మండ్రాడి తెగువతో గువ నెత్తె 

అందమైన అతివ యున్నచో మగవారు విడుతురా, ఎవరెట్లు జేసిననూ అగస్త్య ఎట్టిపరిస్థితులలోనూ విడువడు. లకుమ చలన చిత్రములకు నిర్మాతగా మారి అగస్త్య ఆమెను అల్లుకొనెను. 

చిత్రధా   రలకుర్వ ఘనస్థా యినిజేరె  

ఛత్రధా   రియై   జాలము  నకదులు

 చిత్రాలు  వరుసగా ధారా వాలే ఆమె పై కురవగా ఆమె ఉన్నస్థాయికి చేరుకొనెను.  ఆమెకు ఛత్రమును పట్టి ఎల్లప్పుడూ ఒకదామె వెంట తిరుగుచుండును అందుచే ఆమె  ఛత్రధారి అయినది ఆమె ను అనుమతిలేనిదే ఎవరూ కలుసుకొనకుండా , బైటకు పోవునప్పుడు ఆటంక పరచకుండా రక్షక వలయములోనే ఎల్లప్పుడూ తిరుగుచుండెను 

రాణివా  సముకూరి రాజిల్లు పూబోడి

పాణికు  డుసతత ముప్రక్క నుండు

 అన్ని హంగులతో ఉన్న పెద్ద సొంత భవనము సమకూరి అందు ఆమె పాణికుడు  అనగా వ్యవహారములు చూచు మంత్రి ఆమెను ఎప్పుడూ అనుసరించుచుండగా ఆమె రాణి వలే కనిపించే చుండును. అదృష్టముండవలెను!  

బుధవర్గ తాకిడి  పెరుగుచూ  పోగ

మదవర్గ సంసర్గ ధువులు పొందె

బుధవర్గము అనగా పలుకుబడి గల పెద్దలు తరుచుగా ఆమెను కలిసుకొను వారి సంఖ్య పెరుగుచుండెను . బుధవర్గము అనగా మదవర్గము కూడా , అనగా క్రొవ్వు హెచ్చుగా గల వర్గము , లకుమ  వారి సంసర్గము అనగా రాపిడి పొందుచుడెను. సిగ్గు, నీతి మానము కొరకు చలనచిత్ర పరిశ్రమనందు వెదకరాదు, వలసినచో పరిశ్రమనందుండరాదు. ఆ సత్యమును గ్రహించి లకుమ ఉదారముగా నడుచుకొనుచున్నది .

కొత్త  దుస్తుల  కొత్తభం  గిమల

గిత్త  వలెకన   గిలిపెరి  గెచెలి కాడికి 

ఫోటో షూట్స్ గా వ్యవహరించబడు చున్న ఒక వ్యవహారమును అందములు ఒలక బోయుట అని చెప్పవచ్చు. ఆధునిక తారలందరూ శృంగార భంగిమలలో  వందలాది చిత్రములనుంచుచూ యువకులన్నాకర్షించు వృత్తాంత మిట్లుండును 

ప్రహ్లా మేచూడ  ప్రియురాలి మేను      

ఆహ్లా  మేతాక   అందాల నడుము

 

ర్ధరా  తిరివే   తిలోక  సుందరి

ర్ధన గ్నతకని   ర్ద్రత పొందెనే

 

ఖ్యత  తోసర  నస ఖుడుజేర

ముఖ్యుడ  డనికోర్కె ముదముగ తీర్చె

అటువంటి సమయములో ఆమె ఫాణికుడు, అనగా వ్యవహారములుచూచు అగస్త్య రిమ్మకొని ఆమెను సమీపించెను. అర్ధరాత్రి ఆమె ధరించు పొట్టి వస్త్రములు ఆమె అర్ధనగ్నసౌందరమును చూపుచుండగా చలించి  ఆమెతో సరసములు లాడుచుండగా  ఆ నిశి ఆమెకు మత్తె క్కించుచుండ ఆమె అతడికి చేరువాయెను.   

 నమున్న మాటలు  ధాటిగా  వచ్చు

 నతున్న వేదాంత తుర  తబ్బు 

వాక్ స్వాతంత్రాన్ని పొందవలెనన్న ధనము కావలెను.  పేరు  ఉన్నచో  స్వతంత్ర భావజాలమును కలిగి యుండుటకాక దానిని గొప్పగా ప్రచారము చేతురు . లకుమకు,తాగుటకు ఇంటిలోనే పాన శాల కలదు. ఆమె అట్లు తాగుట ను సమర్ధించుకొనును 

 ప్ప  తాగుచు  ప్పదం దురు      

 విప్పి చూపుక  నొప్పదం దురు 

 

హప  రంబులు చ్చట నెకలుగు   

హిలోని  మధిరతో భాదలే  తొలగు


వేల్పులే  ఇలకొచ్చి  క్తుల బ్రోవ  

గాల్పులే  బాప ట్టిరీ  మధుశాల.

 

నిత్యభో  గాలుతో నీలవే  ణిరాణి

ముత్యరో  చిస్సుతో మెరియు మదిరాక్షి.


చివరకు తారాపథములో దూసుకుపోతున్న లకుమ నైతికతను పట్టించుకొనక  సర్వ భోగములను అనుభవిస్తూ ఉచ్ఛ దశకు చేరి  వెలుగుచుండెను.   అగస్త్య లకుమలు తమకు ఒక చిరునామా సంపాదించుకొని విలాస జీవితమును గడుపు చుండిరి .


Tuesday, October 27, 2020

Bharatavarsha 58

మెర్సిడెస్ బెంజ్ విలాసశ్రేణీ రథము పదునాఱవ జాతీయ రహదారి  (విశాఖ - శ్రీకాకుళం) మీదుగా పోవుచున్నది. వేయి కిలో మీటర్లు పైబడి సాగుచున్న ఆ  పదునాఱవ జాతీయ రహదారిని కవిహృదయంతో తిలకించిన...... 

తే. దునారు వర్షము లనక  బెండ్లి జేయ   

   మిళ నాట వధువు  దారిచూ చువెడలె         

   ఆంధ్ర  గడప  దాటి  డిసాను ముద్దిడి 

   కొత్త   కోడలు చేరె కొలకత్త  పురికి

పదునారు సంవత్సరముల పిన్న వయసులో తండ్రి పెండ్లి జేయగా  చెన్నపట్టణము  నుండి బయలు దేరిన వధువు  మధ్యలో నున్న  ఆంధ్ర  ఒడిస్సాలను దాటి  కలకత్తా లో నున్న తన అత్తవారింటికి బోవుచున్నట్లు అగుపించును.  ఆంధ్ర దేశము తన గడప, ఆ గడపదాటి, ఒడిస్సాయను  ముద్దాడి  సుదూర ప్రయాణము జెసి తన అత్తవారింటికి చేరిన వదువువలె (పదునాఱవ జాతీయ రహదారి) కనిపించును,  అనగా  

"సొగసు చూడ  వలెనన్న కనులున్న  చాలదన్న 

కనులకు దొరకని అందము కవితకు దొరుకునన్న

 కవితా హృదయ మున్న  తిన్న పెంపారునన్న     

  అన్నన్న! అన్నుకు  పొన్ను కూరునన్న!     

జంతుప్రదర్శన శాల, కంబాలకొండను దాటి తూర్పుకనుమల సౌందర్యమును ఆస్వాదించుచూ  సాగుచున్న ఆ మేరు తేరు మధురవాడ  దాటి కొలది  దూరము పోయిన పిదప  ఎడమకి తిరిగి సన్నని పల్లె బాట పట్టినది. అచ్చట కొమ్మాది యనొక చిన్న పల్లె కలదు. ఆపల్లె యందొక చిన్న చర్చి గట్టి, విదేశీ నిధులను ఒడుపుగ బట్టి, ఇంద్రభవనమును తలపించు  ఐదు అంతస్తుల పాలరాతి భవనము గట్టి, అందు బైబిల్  కళాశాల నడుపుచుండెను.  బైబిల్  కళాశాల ముందు మెర్సిడెస్ బెంజ్ నిలిచినది. పెంచలయ్య మెల్లగా బయట కాలిడి, చుట్టూ కలియజూడ సాగెను.  అతడి ధనగర్వమును చాటు ఆ వాహనమును చూచిన జనులత్యంత భక్తి శ్రద్ధలు కనపరుచుచూ అతడిని చుట్టు  ముట్టిరి.

అతడు వాహనము అవరోహించగా  వాహనము వాహనశాలకేగెను. పెంచలయ్య  పుస్తక విక్రయశాల కేగెను. ఎన్నిపనులున్ననూ అతడు మొదట బోవునది అచటికే. మేరీ అరలనుండి పుస్తకములను తీయుచున్నది. ఎత్తునన్న పుస్తకముల కొరకు ఎగురుచున్న ఆమె పడుచు అందాలను వెనకనుంచి  చూసి "గోదావరి తుళ్లుతున్నట్టుంది " అన్నాడు 

ఆ. డుచు గుండెలూ గుచున్నవి  యిట జారి 

    పార్శ్వ దర్శ  నమగు పాల  పొంగు

    నుజూడ ఎగురుపి రుదులు రగిలించ   

    కాంక్ష రేగి  తట్టె గన సీమ

అట్లతడు మేరీ ని  పిరుదులపై తట్టగా  ఉలిక్కిపడిన మేరి పట్టు తప్పి అతడిపై పడెను.  "నీ అందాలను చూసిన పొంగు మీదున్న గోదారి గుర్తు కొచ్చుచున్నది."  "ఆ పొంగులలో  స్నానము చేయవలెనని ఆశ" అనుచూ మేరీ కిలకిలా నవ్వెను. అట్లు కొలది సేపు మాట్లాడి, కోశాధికారి  గదికిబోయి , పిదప తన గదికి పోయెను. కొద్దీ సేపటిలో  గౌరీ  వచ్చి అల్పాహారము ఇచ్చెను. రంగడు  వచ్చి కాఫీ ఇచ్చెను. అల్పాహారం పూర్తి చేయగానే కోశాధికారి వచ్చి జమాఖర్చుల వివరించి  నగదు ఇవ్వబోగా బాంక్ కు పంపమని జెప్పెను.  ఇంతలో పాలనాధికారి క్రిస్టోఫర్ వచ్చి 

" అమెరికా నుంచి   లూథరన్ పాల్ గారు వచ్చి అతిధి గృహమున యున్నారు." 

పెంచలయ్య : ధియోలజీ విద్యార్థులందరరినీ మూడవ అంతస్థు లోనున్న దృశ్య శ్రవణ  సమావేశ శాల యందు సమావేశపరిచి సిద్ధముగా నుంచవలెను. పాల్ గారికి వారిని పరిచయము జేసెదము. అటుపై వారికి చర్చి చూపించెదము. 
క్రిస్టోఫర్: అంతకంటే ముఖ్యముగా ఇతడికి మన మురికి వాడలు చూపవలెను, మనము చేసిన  ఉదారాసేవల చిత్రములు  చూపవలెను. అమెరికాలో అత్యుత్తమ క్రిష్టియన్ దాతృత్వ సంస్థ లలో నొకటైన మిషన్ జీసస్  నుండి వచ్చిన యితడిని  వప్పించినచో మన కంతయూ మంచి కాలమే. ఇంతక మునుపెన్నడూ రానంత  పెద్ద మొత్తము పొందవచ్చు.  

నాకవన్నియూ  తెలియవు అవినీవే చూసుకొనుము , నేను నిన్ను చూసు కొందును. " హి హి హి. విద్యార్థులందరూ  రుసుములు  చెల్లించిరా ? 
క్రిస్టోఫర్ : చెల్లించిరి, కానీ మనము ఉపన్యాసకులు జీతములే చెల్లించలేదు. 
పెంచ: ఇది  మొదటి  వారమే కదా , పదవ తారీకు రానిమ్ము " హి హి హి. 
గౌరీ నీవు అతిధి గృహమునకు పోయి పాలుగారికి ఏమి కావలెనో  చూడుము. 
రంగడు : అచ్చట అప్పలనర్సి ఉన్నది బాబు. 
హి హి హి, ముసలిది అది ఏమిచేయునురా ?
నన్ను బొమ్మన  నేను పోయెదను , పొమ్మందురా ?
హి హి హి, నీకు తొందర ఎక్కువగుచున్నదిరా రంగా . నీవు కోశాధికారి వద్దకు పోయి నీకు రావలసిన పైకము తీసుకొని ఇంటికి పొమ్ము. ఇంకరావలదు. గౌరి నీవు అచ్చటికి  పోవే అని చెప్పి పోయెను.
రంగడు : ఒక చిన్న చర్చ్  తో ప్రారంభించి ఇంతింతై వటుడింతై యని పెరుగుచూ అతిపెద్ద చర్చ్ ని నిర్మించుటయే కాక బైబిల్  కళాశాలను నెలకొల్పి  ప్రభువు పేరుతో ఈ పల్లెకే  ప్రభువు వలె  వెలుగుచున్నాడు.  వీడు పొమ్మన కున్ననూ నేనే పోదలిచితిని అందుకే ఇట్లు మాటలాడితిని.
గౌరీ: ఓరి నీ అసాజ్జం కూలా, ఇప్పుడేటిసేత్తావ్ ?
రంగడు : నేనేమి జేసినను నీవలె ఒక్క జీతమునకు రెడిళ్ల పని చేయలేను.
 
                                                               ***
సబ్బవరం : పెంచలయ్య గృహము : బంగళా పెంకులతో నిర్మితమైన సువిశాల ప్రాచీన గృహము.  దాని  చుట్టుకొలత నానుకొని యున్న ఎర్రని ఎత్తరుగులు.  ఆటస్థలమువలె ముచ్చటగొలుపుచు ముంగిటనున్న  సైకత ప్రాంగణము. ఆ ప్రాంగణమందు మామిడి చెట్లు. వాటి క్రిందనే తిరిగాడు బాతులు.

 

పైడమ్మ:  ఎండాడ నించి దాసొచ్చేడు . 
దాసు: ఎరా నమ్మడికొడకా బాగున్నావా! 
పెంచలయ్య: ఓరి నంజ కొడక ఎప్పుడొచ్చినావురా!
పైడమ్మ:  ఎక్కడికైనా (పెంచలయ్య) ఎల్తే మా సెడ్డ ఇదిగా మాట్లాడతాడు ఇంటికొత్తే ఇదే బాస.
దాసు:  ఇక్కడ దీన్ని ఇల్లంతారు , అదే హైద్రాబాద్లో ఉంతే బంగలా అంతారు అని పైడమ్మ తో అని 
పెంచలయ్యతో  "ఏట్రా ఉసారెక్కువయిపోనాది ఇయాల నందినమ్మొత్తంది కదా బాగానే ఉంటావులే!"   
పెంచలయ్య:  మనోల్ల  కాడ ఆపీసర్లాగ మాటడమంటావేటే  పైడమ్మా!
పెంచ: ఊ కూకోరాదాసు , అదే మల్లీ  గెలుత్తా దంతావా ?
దాసు: సూత్తం తలగే ఉంది, అదిగో మీ బామ్మర్ది ఆది గాడొత్తన్నాడు, ఆడినడుగు
పెంచలయ్య : ఆది నువ్వేతంతవురా ? రత్నకుమారి మల్లొత్త దంతావా?
ఆది: ఆలు లేదు సూలు లేదు ఊర్కోహే, ఇప్పుడేటి ఎలచ్చన్లొచ్చీ సేయేటి?
పైడమ్మ: ఆ ఎలచ్చన్ల ఊసెత్తితే నాను బిగిలి పోతాను. ఆ సివాసలాన్ని ఆ ఇంగిలీసు గుంట సంపీసిన కాంచి, నాకెలచ్చన్లంటే బెంగడిపోనాది.  మాయదా రెలచ్చన్లు మనకెందుకయ్యా?  
పెంచలయ్య : పెంచలయ్య అంతే ఏతనుకొంతన్నావే! 
ఆది: మాయక్కింక నువ్వు కోడిపెట్టలేపారం సేసుకొంతనవనుకొంతన్నాది. దాసు నువ్వేట్ర  పల్లకున్నావు.  
దాసు: మొగుడు పెల్లాల  మద్దిన దూరినానేటి సెపుతాన్రా, శివాచలం పెల్లామ్ ఉంది కదా? మొన్నీ  మద్దిన  గెలిసింది? అదికోడా సచ్చి పోనాదేటి? 
ఆది: అది పార్టీ మారిపోయిందికదా ఉప్పుడా గెలుపు సెల్లదు అంటన్నాడు బావ.
దాసు: ఎవుడు సెప్పేడు? పార్టీ మారితే గెలుపు సెల్లదని ఎక్కడైనా రాసుందా?
పైడమ్మ: లాయరు శంకర్రావు గారొచ్చారు, లోపాలకి రమ్మంటారా?
పెంచలయ్య : ఓస్ మన లాయరుగారే కదా బైరెడ్డి కేసు వాదించారు. నాకు తెల్వదేటీ

శంకర్రావు: ఆడుట్టి సన్నాసెదవండీ, సాక్షాలను మాయ జేయలేకపోయాడు. అన్ని సాక్షాలతో దిరికిపోతే లాయరేంచేస్తాడండీ?
పెంచలయ్య : అబ్బే  ఇప్పుడా విషయం కాదు లాయరుగారు. రత్నకుమారి పార్టీ మారిపోయింది కదా , మరిప్పుడేటండి  పరిచ్చితి. ఆ ఎన్నిక చెల్లదంటున్నారు. 
శంకర్రావు: అవునండి చెల్లదు, 1985 లో రాజీవగాంధీ ఏంటి డెఫెక్షన్ ( పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం) తెచ్చాడు , దాని ప్రకారం ఒక పార్ట్ లో గెలిచి మరో పార్టీ లోకి మారితే, మారిన ఎం ఎల్ ఏ లు అనర్హులౌతారు.   
పైడమ్మ: అంటే రత్నకుమారి ఎం ఎల్ ఏ పదవూడిపోనాదా?
పెంచలయ్య: పదవూడి పోనాదా అంటే ఊడిపోద్దేటి? అసంబ్లీలోన స్పీకర్ ఊడబీకేఎత్తే ఊడిపోతాది , కానీ ఆయన ఫైలు కిందెట్టుకొని కూకుంటే మనమేటి సేత్తామ్  
శంకర్రావు: అలా కిందపెట్టుకుని కూచోడానికి చట్టం ఒప్పుకోదండి. 2017 లో మణిపూర్లో కాంగ్రెస్కు చెందిన ఏడుగురు శాసనసభ్యులు ఇట్లే పార్టీ మారి బిజెపిలో చేరిన తరువాత బిజెపి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడుగురిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ను కోరినప్పటికీ, పిటిషన్లు పెండింగ్లో పెట్టి పట్టించుకోలేదు. అప్పుడు సుప్రీంకోర్టు మూడు నెలల్లో అనర్హతపై తీర్పు చెప్పాలని మణిపూర్ స్పీకర్ను ఆదేశించి, లేని యెడల ఉన్నత న్యాయ స్తానం జోక్యం చేసుకోవలసి వచ్చునని హెచ్చరించగా స్పీకర్ పార్టీ మారిన ఎం ఎల్ ఏ ల పై  అనర్హత వేటు వేసెను.
2019 లో కర్ణాటక లో  కూడా ఇట్లే జరిగెను. 14 మంది ఎం ఎల్ ఏ లు  కాగ్రెస్, మరియు జే డీ  పార్టీలనుండి మారగా వారిని సభాపతి అనర్హులుగా ప్రకటించెను. 
ఆది: ఇంకది  ఇంట్లో కూకోడమే, మంచి పనే అయ్యింది, ఆ కిట్ట పరమాత్మ ఉన్నాడు
పెంచలయ్య : ఒర్ర్ ఆది మరిసిపోనావేట్రా, కిట్ట పరమాత్మ కాదురా  పెబువు  పెబువు  అనాల్రా
ఊరుకో బావ నేనేంటి నీనాగ మతం మారనేదు , చర్చి ఎట్టనేదు 
పైడమ్మ: లాయరుగారు మన మడిసే, ఆయనకన్నీ తెలుసు నువ్వేటి నాటకాలాడక్కల్లెద్దు
మావు గొల్లోల్లమి బాబూ , మొదట్లో ఈడు  పాలు అమ్మేవాడు , నాను కూడా పాలమ్మేదాన్ని, ఈడు పాలేపారం ఒగ్గేసి కోడిపెట్టల యాపారం మొదలెట్టేడు. గొల్లోల్లవని సెప్పుకోడాని  సలుపు పుట్టి  చౌదరీ లని సెప్పుకున్నాడు బావు. ఇప్పుడు పెబువు పెబువు అని ఇంటికాడున్న నా కిట్టయ్య బొమ్మలన్నీ తీయించేశాడు. అందుకే కూతురెల్లి పోనాది.   
పెంచలయ్య: (పైడమ్మతో) ఎహే,యెల్లెస్, ఎదవగోల, ఏదేవుడైతేటి నాలుగు డొబ్బులు  సంపాదించుకోవాలి. సెబాస్ అనిపించుకోవాలి. పెబువుని ప్రాద్దించేను. దానంతటదే వచ్చేతాన్నది. ఇంకొక గంటలో మనం ఎయిర్ పోర్ట్ కెళ్ళాలి, ఏడుపుమొక మెట్టుకొని కూకొక తయారవ్వు. 
పెంచలయ్య: (లాయర్ శంకర్రావుతో)  పెబువు దయ ఎంతగొప్పదో సూడండి రత్నకుమారి ఎల్లిపోతంది నా కూతురొచ్చేత్తన్నాది.  
శంకర్రావు: కానీఅనర్హత వేటు పడిన వారికి   ఎన్నికలలో పోటీచేసే అర్హతుంది.  
దాసు: అయితే మనకేటి తోవ , ఎలచ్చన్లలో పోటీసేస్తే అదే నెగ్గెత్తాది
పెంచలయ్య: ఓస్, అదొట్టుకొని  నువ్వింక ఒగ్గవేట్రా? అప్పుడు దాని మొగుడు సచ్చిపోయాడు కాబట్టి పెజలు దానిగ్గుద్దేసేరు, మొగుడు సచ్చిపోతే పెళ్ళానికి, తండ్రి సచ్చిపోతే కొడుక్కి గుద్దేయడం, ఆళ్ళు నెగ్గేయడం మామూలేకదా. ఇప్పుడైతే మనకే ఓట్లు.
దాసు: అప్పట్నుంచి మనమేటిసేసి నామేటి పెజలకి, మన కోట్లేసీ డానికి? 
హి హిహి  ఏటి సేయ్యక్కరలేదురా, మనమీద  ఎవ్వుడినీ నిలబడకుండా సూసుకుంటే సాలు.
శంకర్రావు: అంటే రత్నకుమారిని…
సంపేయక్కల్లా  బెదిరించి తప్పిత్తే సాలు
పెంచలయ్య: బెదిరించడాలు తప్పించడాలు  మా బావ తర్వాతే ఎవ్వుడైన , 
కూతురు అని కూడా సూడకుంట నందినమ్మని ఇరికించి , పాఠాలు సెప్పే పంతులయ్యని  తప్పించేడు, బైర్రెడ్డి  కేసులో సాచ్చులని తప్పించడానికి సాయం సేతున్నట్టు  నాటకమాడాడు కానీ నిజంగా ఏటీసేయ్యనేదు. దాంతో బైరిగాడికి కారాగారం అయిపోనాది. కొడుకుపోయి  నాగిరెడ్డిని ఈగిపోనాడు.  మాబావ ఎం ఎల్ ఏ అవ్వకుంటెవ్వుడు ఆపలేదు.


Sunday, October 25, 2020

Bharatavarsha -57

బారామతి: గోల్ఫ్ క్షేత్ర పరిమాణమున హరిత కాంతులీను సువిశాల  పచ్చిక మైదానము  మందు వైమానిక శిక్షణా కేంద్ర భవనము నింగినందు  నీలభము వలె , చేట యందావగింజ వలె కనిపించుచుండెను. ఆ పచ్చిక మైదానమునం దనేక దారులు, అవిచ్ఛిన్నముగా ఆరేసిన చీరలువలె కనిపించుచుండెను.   ఆవైమానిక పథములందు రెక్కలు జాచి లోహ విహంగములు  రయమున పరుగిడి నింగికెగ యుచుండును. అందొక పథమున కాస్సేన యను చిన్ని విమాన మొకటి చిన్నకృష్ణుని వలె చూడమురిపెముగా నుండి నీటియందు బాతువలె సాగుచుండెను. అట్లు కొలది  దూరము పోయిన పిదప తన  వాలమును సవరించుకొని సునాయాసముగ చులకన ఓలమున  మలుపు తిరిగి పరుగు మొదలిడెను. ఆ వ్యోమయానమందు సుందరి  తన చెలిమి నందినితో కాకిపిట్ లో కూర్చొని యుండెను.



సుందరి :  డీర్ వేలీ గ్రౌండ్ ,   కస్సేన  756,  రన్వే 7 లెఫ్ట్ ,   హోల్డింగ్ షార్ట్ !

గ్రౌండ్ కంట్రోల్:    స్సేన  756   రన్వే 7 లెఫ్ట్ , ఆల్ఫా  హోల్డింగ్ షార్ట్లైన్ అప్.

సుందరి తన విమానమును నొక పక్క దారికి మళ్లించి నిలిపెను.

నందిని: యంత్రమునకేమొచ్చెను? ఏల నిలిచిపోయెను? ఆ భాష కర్ధమేమి?

సుందరి: యంత్రము నిలిచి పోవుటకాదు , యానమును నేనే నిలిపితిని.  ప్రక్కకు తొలగి నిలపమని తరంగ  సందేశము ( రేడియో మెసేజ్ ).  తరంగ సందేశ భాష ( రేడియో కమ్యూనికేషన్ ) అట్లే సంక్షిప్తముగా   యుండును.

నందిని: కానీ నాకు బహు సంక్లిష్టముగా యున్నది

సుందరి: నావలే  నీవునూ 18 నెలల  శిక్షణ పూర్తి జేసుకొన్నచో అన్నీ చక్కగా వివరించెదను.  ఎగురుటకింకనూ సమయమున్నది  అనుమతి లభించలేదు. నేను వివరించెదను వినుము.

డీర్ వేలీ  , మన స్థలనామము.  గ్రౌండ్, అనగా గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థ ; కస్సేన  అనగా మన విమాన నామము;  756  అనునది మన వాల సంఖ్య ( tail number) .

తరంగ సందేశ విధానమందు ముందు మనము ఎవరితో మాట్లాడుచున్నామో వారి పేరు తెలిపి పిదప మన పేరు (విమాన నామము, వాల సంఖ్య నందలి చివరి మూడు సంఖ్యలు ) చెప్పవలెను , ఆపై చివరిగా మన సందేశమును చెప్పవలెను.

డీర్ వేలీ గ్రౌండ్ ,( to address)   కస్సేన  756( from address) చెప్పిన పిదప, నా సందేశము  

రన్వే 7 లెఫ్ట్ ,   హోల్డింగ్ షార్ట్  అని జెప్పితిని అనగా ఏడవ వైమానిక పథము (రన్వే)ని దాటి తిని,  త్రోవ ముగియుచున్నది అని చెప్పితిని.  

అప్పుడు భూతల నియంత్రణ అధికారి : కస్సేన  756   రన్వే , ఆల్ఫా , 7 లెఫ్ట్హోల్డింగ్ షార్ట్(మనము చెప్పిన సందేశమును విన్నట్టు రుజువు పరచుటకు  తిరిగి చెప్పి పిదప వారి సందేశమును చెప్పెదరు)లైన్ అప్” అని చెప్పెను అనగా  వాలవలిసిన (landing)  విమానములుండుటచే ప్రక్కన వేచి యుండవలెను. సుందరి వివరణ  ముగించగానే మరు లిప్తలో ఒక విమానము చెంతనే వాలి పరిగెడుచుండెను.   

నందిని : ఓం భూర్భు తతః   తత్ సరణ్యు వరేణ్యం భర్గో దేవస్య గామిహి   వ్యోమయాన ప్రత్యోదయాత్

గాయత్రి మంత్రమువలె నున్న ఈ భాషాకర్థమేమి?

3500  సంవత్సరాల క్రితం  రుగ్వేదం లో రచించబడిన గాయత్రీ మంత్రం యొక్క సారాంశం : ఓం భూర్భువ సువః  తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధిమహి ధియో యోనః ప్రచోదయాత్

భూ (భూలోకము) భువః (భూస్వర్గములకు మధ్య నున్న జగత్తు  అనగా తార సూర్య చంద్రులతో నిండిన ఆకాశము ) సువ (స్వర్గ లోకము) తత్ (ఆ యొక్క) సవితుర్ (సూర్య కాంతి) వరేణ్యం (శ్రేష్టమైన ) భర్గో (జ్ఞాన తేజస్సు) దేవస్య ( ప్రార్ధిస్తాను) దీయో (బుద్దిని) ప్రత్యోదయాత్ (ప్రేరేపించుగాక).

 నందిని : ఓం భూర్భువనాంతర   సరణ్యు వరేణ్యం భర్గో దేవస్య గామిహి   వ్యోమయాన ప్రత్యోదయాత్

బూర్భువనాం తర -భూమ్యాకాశములలో నున్న ;  తతః  -(తతము అనగా గాలి)

సరణ్యు (సరణ్యువు – గాలి) ;  గామిహి ( సర్వత్రగామి - గాలి ) దేవస్య (ప్రార్ధిస్తాను)

వ్యోమయాన ప్రత్యోదయాత్ – (విమానమును ప్రేరేపించమని)

వర్షుని కొరకు తపమే చేయుచున్నావు. సంస్కృతము నేర్చుకొనుచున్నావు. అనుచూ వివరణ  ముగియు గానే లిప్తకాలమందు సుందరి  పరికరముల ఫలకము పై కరనర్తన మొనర్చెను.  మరు లిప్తలో విమానము రివ్వున వాయువేగముతో దూసుకు పోయెను.   

. రము  లాయవి  మాద్రినం దన  డ్గముల్ ని, రా!

    చురక    బెట్టగ    రేగిరి వ్వని ఘా  టమున్ లపించుచూ

    రలి  పాశుప   తమైమే   ఘప  మునన్     దిలాడు చూ

    మెరయు  చున్నద   దేతుషా  నగమో  మరాక యామో

విమానమును ప్రారంభించుటకు అనేక పనులను(తాళమును త్రిప్పుట , ప్రధాన మీటను(మాస్టర్ స్విచ్ ) నొక్కుట, ఇంధన పంప్ను ప్రారంభించుట, మిక్సర్ కాడను లోపలి నొక్కుట, త్రొటల్ ను పైకి లాగుట , ఏవియానిక్స్ బస్ 1,2 మీటలను నొక్కుట) ఏక కాలమున జేయవలెను. 

కరము   లాయవి  (అవి చేతులా )   కనినపరిశీలించిన;   మాద్రినం దన ఖడ్గముల్ =  నకుల సహదేవులు చేత  ఖడ్గములు వలెనున్నవి;    రా! ;  చురక బెట్టగ = ఇగ్నిషన్ లేదా అగ్ని రాజెయ్యగారేగి  = వేగము పెరిగిరివ్వని లఘాటమున్ తలపించుచూ = రివ్వని  గాలిలా దూసుకుపోయి;  తరలి  = ప్రయాణమై  పాశుపతమై ; మేఘ పథమునన్ మెరయుచున్నది అదే తుషానగమో? = హిమ వత్ప ర్వతమోమరి  ఆకాశయానమో? = లేక విమానమో!

 కాస్సేన 756,  18, 000 అడుగుల ఎత్తులో ఎగురు చున్నది నందిని సుందరిని  హత్తుకొని కేరింతలు కొట్టుచున్నది. భూమిపై  కొండలు బొమ్మలువలే  చెట్లు గుండు సూదులవలె కనిపించుచున్నవి. “విమానంలో ప్రయాణించుటవేరు కాకిపిట్ నందు కూర్చుని ప్రయాణించుట వేరు. తన బాల్యస్నేహితురాలు పైలట్ అయినచో, ఆ ఆనందము వర్ణనాతీతము. కాకినాడ వద్ద పల్లెటూరిలో వ్యవసాయకుటుంబమందు జన్మించి, నాతొ చదువుకొన్న సుందరేనా పైలట్ గా మారుచున్నది.”    

సుందరి: ఈజీవితమును ప్రసాదించింన దేవత అరుణతార గారికి నేను రుణపడి యున్నాను.

నందిని : ఆ నువ్వు కష్టపడితివి. పైకి వచ్చితివి. అని వేళాకోళముగా అనుచూ సుందరిని రెచ్చగొట్టెను

సుందరి: ఆమె ను పల్లెత్తి మాట అనిన విమానము నుండి దిగిపొమ్ము.

నందిని : ఆ …మీ శిక్షకుడే అనుమతిచ్చెను కదా    

సుందరి: ఎవ్వరనుమతిచ్చిననూ పైలట్కు దింపి వేయుటకధికారము గలదు. (ఇవువరూ నవ్వుకొనిరి)

విమానము మలుపు తిరుగుచున్నదిమనము 50 మైళ్ళ దూరము దాటివెళ్ళరాదు, క్లాస్ లో మాత్రమే ఎగరవలెను బి క్లాస్ నందు ఎగర రాదు ప్రయాణ విమానములు నడుపు (కమర్షియల్ పైలట్ లైసెన్స్) అనుమతి వచ్చినవారు మాత్రమే స్వఛ్చగా 45,000 అడుగుల ఎత్తు ఎగరగలరు. ఎంతదూరమైననూ పోగలరు.


నందిని: అనగా నీవింక పర్యవేక్షణలోనే యుంటివా ?

అవును, మా శిక్షణ ఇట్లుండును. మొత్తము 30 గంటలు 

(25 గంటలు బేసిక్ మానువర్స్,  5 గంటలు క్రాస్ కంట్రీ ఫ్లైయింగ్) శిక్షకుడి తో  కూడి నేర్చుకోవలెను

10 గంటలు ( సోలో ఫ్లైట్)  యుండవలెను. 

అందు ఐదు గంటలు గ్రౌండ్ కంట్రోల్ పర్యవేక్షణలో మిగితా 5 గంటలు సొంతగా ( క్రాస్ కంట్రీ) దూరప్రయాణము. రెండు విమానాశ్రయముల వద్ద దింపి తిరిగి రావలెను . ఆ పరీక్ష రేపు గలదు.  నేనిప్పుడు గ్రౌండ్ కంట్రోల్ పర్యవేక్షణలో యున్నాను.  

నందిని : అదియైన పిదప పైలట్ అనుమతి లభించునన్నమాట

అంతే  కాదు , తరువాత చెక్ రైడ్ ఒక గంట  విమాన ఆచరణీయ పరీక్ష ( ప్రాక్టికల్ ఫ్లైయింగ్ టెస్ట్ ) కలదు .

నందిని : పోనిలే ఇవియే కదా పరీక్షలు తప్పక  గెలుపొందెదువులే.

అంతే  కాదు , చెక్ రైడ్ కు ముందు మరిక పరీక్ష కలదు . అదే అత్యంత కీలకము

నందిని : ఇంకనూ పరీక్ష?

అవును,  వ్రాత పరీక్ష , అందు గణితము , భౌతిక శాస్త్రము, తర్కశాస్త్రము, ఆంగ్లము  చాలా కఠినముగా నుండును

నందిని :  పది రోజుల నుండి బాగుగానే చదువు యున్నావు కదే , అయినా అవన్నీ కిందకి దిగిన తర్వాత మాట్లాడుకొనవచ్చు,  ఈ విమానము చూడుము.అబ్బా ఎంత ము ద్దు గాయున్నదో, కొత్త ఆవకాయ జాడీ లా మెరియుచున్నవిమాన మునందు కుంకుమ భరణి  లాంటి కాకిపిట్ చూడముచ్చటగా నున్నది!

సుందరి :  అమ్మా నందిని ఇచ్చట  ఏమియునూ తాకకుండా కూర్చొన్నచో మనం క్షేమంగా ఇల్లు చేరగలము 

నందిని : ముట్టుకొనుటలేదు  ముద్దాడుచున్నాను అనుచూ  ఆల్టీ మీటరును ముద్దాడెను.

మనుషుల కే  ముద్దుల  లనుకొంటిని విమానములకుకూడా ముద్దులిచ్చువారుందురా ?

నందిని : ఇదియ  దియనిజూ  డక  వస్తు తలము లన్ని ప్రియుడి

 చెంపలని తలచుచు ముదముగ ముద్దా డిన తొలగు నిర్వేదము

 కలుగు నుత్సాహము వలపు వెగటైన  వగల మారి.

సుందరి : వలపు వెగటైన  వగల మారి అని ఎవరినే  అను చున్నావు , నన్నే కదూ, నాజీవితమున  కర్తవ్యమునకు , కృతజ్ఞతకు తప్ప ప్రేమకు స్థానము లేదు. పద్యము బాగున్నది యతుల  జతులం  గూడి   ప్రాసవిరాజిత పద్యము ము కాకున్ననూ మనోరంజకంగా మలచినావు. వర్షుని బుట్టలో వేయుటకు పెద్ద ప్రయత్నమే చేయుచున్నావు. యతి ప్రాసలున్నచో …

 నందిని :  ఆ ఉన్నచో… ఏమగును యతి ప్రాసలన్నకవుల కెందుకంత శ్రద్ధ?

  తే. ఈశుడు గిరిజ కుపదేశ  మివ్వ  బుట్టె

  పింగ  ళుండు విరచించ వచంద శాస్త్ర          

  మయ్యె  కావ్య  కంఠ  మందు పసిడిగా

  వ్యోమ  మందు  రవిసోమ భాసము గాదె 

పరమ శివుడు  పార్వతికి ఛందస్సునుపదే శించుచుండ పింగళుడు విని  రచించగా  ఛందోశాస్త్రము పుట్టెను. వ్యోమము ను  సూర్య చంద్రులు  స్త్రీలకు  కంఠములను స్వర్ణా భరణములు  అలంకరించును,  కావ్యముల కంఠములను వేద ఛందము అలంకరించును.

అవి యున్నచో వర్షుడు మరింత దగ్గరగును, అతగాడనినా ఎందుకె నీకంత మోజు? ఏమున్నదతడిలో?

నందిని : ఏమియూ లేకున్నా తులాభారమును దూరదర్శము  నీవెందుకు దుకు చూచితివి?

ఛ  ఛ అతడు నాకు అన్నగారు , అతడిలో కళను చూచితిని.  నీవలె అతడిని ఛాతీని , భుజములను  చూడలేదు.

నందిని : అవును చూచితిని తప్పేముంది , అతడిని ప్రేమించుచున్నాను.  అతడి వద్ద పడుకొనుటకు సిద్దమే.

సుందరి :   ఛీ ఛీ ఆమాటనుటకు సిగ్గులేదూ , ఎవరైనా విన్నచో , ఏమనుకొందురు !

నందిని : అమ్మ పైలట్ సుందరిగారు , ఇరవై వేల అడుగుల ఎత్తున ఆమాటనుటకు  బుద్ధి ఉండవలెను.

సుందరి :   ఆహా! మరి నిన్న రాత్రి ఎందుకు  వార్తాపత్రికల్లో అచ్చయిన  వర్షుడి చిత్రము పై బడి ముద్దులిడినావు అప్పుడెక్కడికిపోయెనే సిగ్గు, బుద్ధి  అప్పుడు ఎంత ఎత్తులో ఉన్నావే  , మంచము పైనే ఉంటివి కదా !  

నందిని : అట్లు చేసితినా ? నిద్రలో చేసుంటినేమో  అర్ధము చేసుకొనవలెనుకదా!

సుందరి :   నేనెట్లర్ధము జేసుకొన్ననూ పెంచలయ్యగారు ఎట్లు అర్ధము జేసుకొందురో ?

నందిని :  ఛీ  ఛీ , మా నాన్న ఊసెత్తవలదు , నేను ఆయన మాట ఇక వినను , ఒకసారి  విని పొరపాటు చేసితిని.

సుందరి :   అదిపొరపాటా , ఒక  గురువుపై అట్టి  అభియోగములు మోపుట నీకే చెల్లెను.

నందిని :  నీకిది తగునా ? ఇంత నిర్దయగా మాటాడుచున్నావు. నేను దుర్భుద్ధితో చేసినది కాదు. మానాన్న నాపేరుతో  ఆడిన నాటకము.  నేను వర్షతో చనువు గా నుండుటతో అందరూ నమ్మినారు.  భారతవర్ష  అంత  భాదపడిననూ నాకు చెప్పలేదు. కళాశాలకు వర్ష ఎందుకురాలేదో  అందరికీ తెలిసిననూ వారు నన్నడుగుటకు సాహసించలేదు. చివరకు కొద్దీ కాలము పిదప నాకు తెలియరాగా చనిపోవలెనని నిర్ణయించుకొని ఆయనను క్షమాపణ వేడుటకు ఒకరాత్రి అతడింటికి ఇంటికి పోయినాను. వర్షడు " ఇందు  ఒక రాజకీయ కోణమున్నది , నాకు జరిగినదంతయూ  తెలియును  ఇందు నీదోషమేమియూ లేదు అని ఆశీర్వదించి పంపెను.

సుందరి : అమ్మ పాతకీ  నావద్ద ఇదంతయూ ఇప్పటివరకూ ఎందుకు దాచితివి. అయిననూ అన్నగారు నీకు గురువు. ఆయను ప్రేమించుటయే కాక, పేరుపెట్టి పిలుచుచున్నావే ? అతడు నీ స్నేహితుడుకాదు మర్యాదగా నడుచుకొనుము నిన్ను ఆశీర్వదించిన వానినెట్లు ప్రేమింతువే ?

నందిని :  ఓసి దుర్మార్గురాలా , నీ స్నేహితురాలి పట్ల తప్పులేకున్ననూ ఇంకనూ నెపములెన్ను చున్నావు.  గురువుని ప్రేమించరాదా ? గోదాదేవి సాక్షాతూ వెంకటేశ్వర స్వామినే ప్రేమించెను కదా!   ఇంక ఆశీర్వదించుట అందువా భర్త భార్యను ఆశీర్వదించుట సహజమే కదా !

సుందరి : భార్య అనుచున్నావు  విదిష యను పేరు వినలేదా.

నందిని :  తెలుసు , అయిననూ నా ఎత్తులు  నాకున్నవి

సుందరి : ఎత్తులతో జిత్తులతో వర్షను సాధిం చుట అసంభవము

నందిని :  నేను తలచుకొన్నచో సంభవమే. నేను చేయవలసిన పని ఒక వారము క్రిందటే జరిగిపోయెను.

సుందరి : మరి ఎందులకే  చదువు మానివేసి ఇంటినుండి పారిపోయి అజ్ఞాతవాసము చేయుచున్నావు.

‘పెంచలయ్యని సాధించుటకు” నందిని అట్లను చుండగా విమానము భూతలమును సమీపించుచుండెను.