Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, April 27, 2024

మన వార్తలెందుకు వంకర పోయాయి ?

 మన వార్తలెందుకు వంకర పోయాయి ?

ఈ హీరో కొడుకును   చూడండి  ఆచొక్కా ఖరీదెంతో  తెలుసా?  తెలిస్తే షాక్ !  ఈ హీరో    బూటు  ఖరీదెంతో తెలుసా ? తెలిస్తే గూండాగిపోతుంది.     ఆ హీరో కూతురు చూడండి , ఆమెకు ఇది ఎన్నో  పెళ్ళో తెలుసా? మొదటి మొగుడు ఏంచేస్తున్నాడో తెలుసా?  రెండోమొగుడు ఎందుకొదిలేశాడో తెలుసా ?  ఇవి మన వార్తల టైటిల్స్.   వార్తలన్నీ సెన్సేషనే   టైటిల్స్ అన్నీ అతిశయోక్తులే.   ఒక నటి లేదా నటుడి కూతురు కొత్త చెడ్డి కొనుక్కున్న, చిరిగిపోయిన,  చెడ్డి జారిపోయిన  లేచిపోయి  పారిపోయినా, పెళ్లి చేసుకున్నా , విడాకులు తీసుకున్నా అంతా సెన్సేషన్. 


ఒకప్పుడు వార్తలు హుందాగా ఉండేవి. ఖచ్చితంగా ఉండేవి. అందుకే వార్తలు  అంటే ఒక గౌరవం  ఒక నమ్మకం  ఉండేవి.   సరైన విషయం ఉంటేనే వార్త  , సరైన టైటిల్ పెట్టేవారు.     అలాగే  మరి ఈరోజు ప్రతి పనికిమాలిన  విషయం వార్తే.   పూర్తి వ్యక్తిగత విషయాలు , చీకటి వ్యవ్యహారాలు  ఊహాగానాలు, సెటైర్లు పైగా వంకర టైటిల్స్ తో వస్తున్నాయి వార్తలు. హెడింగ్ కి వార్తకి సంబంధం ఉండటం లేదు.    వీడియోలు వచ్చిన తరువాత వేళాకోళం పెరిగిపోయింది.  మన వార్తలు  పూర్తిగా మారిపోయాయి.  

దీనికి కారణం జర్నలిజం లో విలువలు పడిపోడమే అంటారు.  కానీ ఇది  నాణేనికి ఒక వైపు మాత్రమే. కుర్రాడిలో విషయంలేదు ఐనా ఐ ఐ టీ లో సీటు కావాలి. అమ్మాయి కి అర్హత లేదు   ఐనా ఎం బి బి ఎస్ లో సీటు కావాలి. కోచింగ్ సెంటర్లలో కూచోబెట్టి వాళ్ళని రుద్దుతూ ఉంటారు. ఏమీ లేనోడు సెలిబ్రిటీ అయిపోవాలి. ఇక్కడా అంతే  రుద్ధుడే. అయితే కోచింగ్ సెంటర్లలో కోచింగ్ కివచ్చిన వాళ్లనే అంటే ప్రతిభ లేనివాళ్లనే  రుద్దుతారు. అది తప్పులేదు.   మీడియా కంపెనీలలో  ప్రతిభాలేనివాడిని కూర్చోబెట్టి ప్రజలమీద రుద్దుతారు.  అర్హత లేనివాళ్లు మీడియా కంపెనీ ల్లో కూర్చుంటే వాళ్ళను ప్రజలపై  రుద్ది రుద్ది సెలిబ్రిటీస్ చేసేస్తున్నారు ఈ క్రమంలో  వార్తలు వంకర పోతున్నాయి    


ఇప్పుడు న్యూస్ అంటూ ఏం  ఉండదు.  

డబ్బు చేసుకున్న ఒక నటుడి కి అతడి వారసులకు,  జబ్బబు చేసిన మీడియా చేసే నిత్య పూజలే మనకి న్యూస్.    వాళ్లు వాళ్ళ కుటుంబం అంతా  హీరోలే  వయసుమళ్లినా  యువకులే ఎక్కడికెళ్లినా ఏం  తిన్నా  ఏం , కొన్నా   అంతా సెన్సేషన్.  అంతా మనం తెలుసుకుతీరాల్సిందే, గుర్తుంచుకు తీరాల్సిందే న్యూస్ పేరుచెప్పి  ప్రతీ చెత్తా  మన బ్రెయిన్స్లో కూరేస్తారు.   ఇప్పుడు ఈ చెత్త న్యూస్ పుణ్యమా అని బుర్రలు చెత్తకుప్పలు అవుతున్నాయి  

మన పిల్లలకి  చదువు  ఏం ఎక్కడం లేదు. పదేళ్లు చదువుకున్నా  ఇంగ్లీషులో ఒక్క వాక్యం తిన్నగా రాయలేరు. వీడియోలు చూడ్డమే తప్ప కాయితం చదవలేరు. చదివి  చరిత్ర తెలుసుకోలేరు    ఒకప్పుడు చరిత్ర పుస్తకాల్లో చదివి తెలుసుకునేవారు ఇప్పుడు సినిమాలు చూసి తెలుసు కుంటున్నారు. మీడియా కంపెనీల పుణ్యామా అని ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు పండితులు  అందరూ పక్కకి పోయి ఈ రుద్దుడు బాబులు (సెలబ్రిటీస్)  రాజ్యమేలుతున్నారు.   విద్య నాణ్యత విద్యాసంస్థల మీద సమాజం నాణ్యత మీడియాకంపెనీలమీద ఆధారపడి ఉంటుంది. 

తనకు మానుకుని .... మనసున్న స్త్రీ

ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథ రచయిత్రి నిమ్మగడ్డ వరలక్ష్మి

 


సాటివాడికి సాయపడడం  లో జీవితానికి అర్థం  ఆనందం వెతుక్కునే వారు ధన్య జీవులు. అలాటివారు చరిత్ర పుటలలోనే కాక సాటివారి హృదయాలలో నిలిచిపోతారు.  ఆకోవకి చెందినవారే శ్రీమతి నిమ్మగడ్డ వరలక్ష్మి.  ఆధ్యాత్మిక ధార్మిక   గ్రంధాలను రచించడం అనువదించడం ఈమె కు హాబీ . ఉమాసహస్రం ,  రామ కృషుని ఆంతరంగిక శిష్యులు , స్వామి జ్ఞానానంద , సంక్షిప్త  వచన సుందరాకాండ  వంటి పెద్ద సంస్కృత  గ్రంథాలను ఈమె తెలుగులోకి అనువదించారు.    దేశవిభజనకు ముందు తరువాత ఆర్ ఎస్ ఎస్ వారు చేసిన సేవను వివరించే  న పూల్ చడే న దీప్ జలే  హిందీ పుస్తకాన్ని  తెలుగు లోకి అనువదించారు.   


60 దాటినా ఒక పక్క  రచనలు చేస్తూ  రహదారులపై గుంతలు  పూడుస్తూ  సామాజిక సేవ చేస్తూ  ఆనందాన్ని పొందుతున్నారు వరలక్ష్మి .   ఈ మధ్య వరలక్ష్మి పూణే సందర్శనకు వెళ్లి నప్పుడు ఒక హోటల్ లో బసచేశారు . ఆ హోటల్ లో భాగ్యశ్రీ  అనే ఒక స్త్రీ సేవకురాలిగా పనిచేస్తున్నారు. భాగ్యశ్రీ బహుభాషి  ఆమె హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మరాఠీ మాట్లాడుతుంది.  భాగ్యశ్రీ  గది  శుభ్రం చేయడానికి  వచ్చినప్పుడు  భాగ్యశ్రీ  ప్రతిభను తెలుసుకుని  సత్కరించి కొంత డబ్బు ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు     అందుకుగాను వరలక్ష్మి గారు తన  పర్యటనలో కొంత భాగాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చింది.గొప్ప  ధార్మిక రచనలు చేయడమే కాక గొప్ప మనసున్న స్త్రీ వరలక్ష్మి. 

Wednesday, April 24, 2024

599 మార్కులవెనుక కథ

కులం గురించి  ఎవ్వరూ మనం పట్టించుకున్నంతగా ఎవ్వరూ పట్టించుకోరు. కులం అంటే మనం పడి చస్తాం. పి.  వి.  సింధు కులం ఏంటని ఇంటెర్నెట్ని వేటాడిన మూర్కులం మనం కాదా ?     మనకి మార్కుల పిచ్చి కూడా కులం పిచ్చిలా పట్టింది 


జర్మనీ లో ఉద్యోగం చేస్తున్న నా విద్యార్థిని  ఇలా అంది. "నేను ఎన్ని ఇంటర్వూస్ కి వెళ్లినా నా  గ్రేడ్ లు మార్కులగురించి ఎవ్వరూ అడగలేదు. "  కానీ ఇక్కడ మాత్రం ఒక విద్యార్థికి 599 మార్కులు వస్తే చెంకలుగుద్దుకునే వాళ్ళు మురిసి ముక్కలైపోయేవాళ్లు  చాలామంది ఉన్నారు. 


ఇన్ని మార్కులు ఏంసూచిస్తున్నాయి?

ఇన్ని మార్కులు వచ్చిన వారు మేథావులని  మన అభిప్రాయమైతే మనంత వెర్రివాళ్ళు , మూర్ఖులు ఎవరూ ఉండరు .ఆలోచన చేయండి    ఇన్ని మార్కులు గుడ్డి  చదువు ను సూచించడంలేదా ?  మనకి బుర్ర మందగించి  ఆలోచన నశించి  ఇలా తయారయ్యాం. మార్కులు మార్కులు అని చచ్చిపోతున్నాం  కానీ ఇన్ని మార్కులు వచ్చిన వాళ్లకి సామాజిక స్పృహ సున్నా ఉంటుంది. 


ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?

విద్యావ్యస్థలో లోపాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇంగ్లీషులో తెలుగులో , సైన్స్ లో వందకి వంద వెయ్యడానికి కుదరదు. ఒక్క స్పెల్లింగ్ తప్పులేకుండా ఒక్క సెంటెన్స్  స్ట్రక్చర్  తప్పులేకుండా రాయడం సాధ్యమేనా ?  కళ్ళుమూసుకుని దిద్దితే ఇలా మార్కులు వస్తాయి 


ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?

విద్యాసంస్థల ఫ్రాడ్ ని కూడా సూచిస్తున్నాయి. 


ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?

మార్కుల రేట్ రేస్ ని సూచిస్తున్నాయి.  

90 మార్కులు వస్తే బాగా చదివేదానుకుంటారు . 99 మార్కులు వస్తే అద్భుతం అనుకుంటారు. వందకి వంద వస్తే ఫ్రాడ్ అనుకుంటారు. సౌదీ అరేబియాలో ఒంటెల వెనుక  పిల్లలని కట్టి ఒంటెల పందెం నిర్వహించే వ్యాపారులు గుర్తుకొస్తున్నారు  

Monday, April 8, 2024

అప్పాజీ ప్రతిభ (Appaji - a great Prodigy)

     Appaji - a great Prodigy



The king of Kalinga had his message sent

for cabbages and carrots to be lent

There grows no legume of that sort

so he sent a message to Vizianagaram fort

 

when it was read out in the royal court

Appaji deliberately accepted to transport

That decision left the king puzzled

even the wise courtiers were dazed

 

 Because the journey is so long

but Appaji commissioned carts strong

They might think that he was crazy

but he is a real prodigy he's a strategy

 

The carriages are with soil filled

when seeds sown all were thrilled 

For the king it was a very little invest

when they reached ready was the harvest

 

Wow! Appaji - what a real prodigy

for every problem he has a strategy

Friday, March 29, 2024

కోట్ల వ్యాపారానికి తెర లేపిన ఫ్రెంచ్ ప్రతిభ

 


ఉన్నత విద్యకోసం, వ్యాపారం కోసం   విదేశీ భాషలు నేర్చుకుని తమ అవసరం తీర్చుకుంటారు  కొంతమంది . ఇంకొక్క మెట్టు ఎక్కి ఆ భాషలను ఇతరులకు బోధిస్తారు కొంతమంది. మరొక్క మెట్టు ఎక్కి విదేశీ కంపెనీలలో దుబాషీలగా  పని చేస్తారు కొంతమంది. ఆ పై మెట్టు  ఎక్కి రచనలు కూడా చేస్తారు కొద్ది మంది.  ఆ  అతికొద్ది మందిలో ఏ ఒక్కరో అత్యున్నత శిఖరం చేరి  ప్రపంచరికార్డు నెలకొపుతారు, ప్రతిభా పురస్కారాలను అందుకుంటారు దేశ విదేశాల్లో వ్యాపార వైజ్ఞానిక రంగాలలో జరిగే చర్చలలో సేవలందించి  ప్రతిభకు ఎల్లలు లేవు అని నిరూపిస్తారు. ఆ ఒక్క వ్యక్తే  వెంకట  పూలబాల. 


 తెలుగు మధ్య తగరతి కుటుంబంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకుని  భాష సోపానాలు ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించిన బహుభాషి  పూలబాల. 

ఫ్రెంచ్‎లో నవల రాసిన తెలుగు రచయత వెంకట్ పూలబాల. ఒక్క ఫ్రెంచ్‎లోనే కాక ఆరు విదేశీభాషలతో అత్యధికంగా పుస్తకాలు రచించిన ఎక్స్ ఫోనిక్ రైటర్‎గా పేరుతెచ్చుకున్నారు. ఈయన సాహిత్య ప్రస్థానం రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పేదాకా సాగింది. పూర్తి తెలుగులో ఒక్క ఇంగ్లిష్ మాట వాడకుండా  రెండు లక్షల యాభై  వేల  పదాలతో 1265 పేజీలు  అతిపెద్ద గ్రంధం  “భారతవర్ష”  ను అతి తక్కువకాలం ఎనిమిది  నెలల్లో రచించి పూలబాల  మొదటి ప్రపంచ రికార్డును సాధించారు.  ఈ టీ వీ పూలబాల “భారతవర్ష”  పై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యాశాఖామంత్రి చేతులమీదుగా రాష్ట్ర అధికార భాషా సంఘం వారి మాతృభాషసేవా శిరోమణి బిరుదు పొందారు.  రెండువందల ఇంగ్లిష్ సోనెట్స్ గల ఇండియన్ సోనెటీర్  అనే ఆంగ్ల పద్యకావ్యాన్ని   అతి తక్కువ కాలం, నాలుగు నెలల్లో రచించి రెండవ ప్రపంచ రికార్డు సాధించారు. అందుకుగాను ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడెమీ పూలబాలకు మీడియా పురస్కారాన్ని అందజేసింది.    జపనీస్ లిపి పై పట్టు సాధించి జాపనీస్ లో పుస్తకం రాయడమే కాకుండా ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో జపనీస్ భాషను బోధిస్తున్నారు. 


ప్రభుత్వ అనువాదకుడిగా    

ఫ్రాన్స్ తునిసియా జింబాబ్వేలతో పాటూ ఇతర దేశాల నుంచి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సహజ వ్యవసాయం ద్వారా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను పరిశీలించేందుకు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ రైతులతో సంభాషిచే సమయంలో అటు ఫ్రెంచ్ వారికి ఇటు తెలుగు వారికి వారధిగా నిలిచారు పూలబాల. ఈయన ఫ్రెంచ్‎ను తెలుగులోకి.. తెలుగును ఫ్రెంచ్‎లోకి అనువదించడానికి ప్రభుత్వ అనువాదకుడిగా తన సేవలు అందించారు. అగ్రి కల్చర్ రీసెర్చ్ మీద సరికొత్త విషయాలను తెలియజేయడానికి బెంగళూరులో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. తన ఫ్రెంచ్ భాషతో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇదంతా పాత కథ 


బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికా లో ఒక చిన్న దేశం. కానీ ప్రపంచంలో అత్యుత్తమ పత్తి ని  పండించే దేశం. ఈ దేశం ఎప్పుడూ ముడి పత్తిని అమ్ముతూ ఉండేది.  ఇప్పుడు వస్త్ర పరిశ్రమకు కావలసిన దారాలు తయారుచేయాలని నిర్ణయించుకుంది. 


బుర్కినా ఫాసోకు భారతదేశంలో పూణేలో  ఉన్న గోద్రాజ్ అనే సంస్థను సలహా సాంకేతిక సహాయం కోసం సంప్రదించింది. ఈ సందర్భంలో ఫ్రెంచ్ అనువాదకుడు అవసరం పడింది  ఫ్రెంచ్  అనువాదం మరియు వాయిస్ ఓవర్ ద్వారా అంతర్జాతీయ వస్త్ర వ్యాపార అనుసంధానంలో పూలబాల ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. ఈ ఒప్పందంవిజయవంతంకావడంతో కొట్లావ్యాపారా నికి తెరలేస్తుందని వ్యాపారం నాది కానప్పటికీ చాలా సంతోషంగా ఉందని "ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి ఆనందించే శాస్త్రవేత్తలా ఎంతో ఆనందం గాఉందని" చెప్పారు. పూలబాల

Wednesday, March 6, 2024

స్త్రీ పురుషులు ఎందుకు సమానం కాదు ?

ప్రస్తుతం మనం పురుషాధిక్య సమాజం అనే మాట ఎక్కువగా వింటుంటాము. అది ఎంతవరకు నిజమో తెలుసా ? అంతకంటే ముందు పురుషాధిక్య సమాజాం ఎలా ఏర్పడిందో తెలుసా ?  

                                          

ఆ తెలియకేం మనుధర్మమే దానికి కారణం అని స్త్రీ వాదులు మానవతావాదులు తయారవుతారు మనదేశాన్ని ఆడిపోసుకోడానికి. బాల్య వివాహాలు అనగానే మనదేశాన్ని  ఆడిపోసుకుంటారు. 

బాల్య వివాహాలు ప్రతి దేశంలో నూ ఉన్నాయి. ఉదాహరణకు  క్వీన్ ఎలిజబెత్ భర్త ఎనిమిదవ  హెన్రి కథ  తెలిస్తే ఇలా మాట్లాడరు. ఏడవ హెన్రి  కి ఇద్దరు కొడుకులు.  పెద్దకొడుకు ఆర్థర్,   చిన్న కొడుకు ఎనిమిదవ   హెన్రి . ఆర్థర్ పెళ్లి కి అతడి వయసు 7 సంవత్సరాలు , ఎనిమిదవ హెన్రి  పెళ్ళికి అతడి వయస్సు 15 ఏళ్ళు. ఎనిమిదవ   హెన్రి  ఆరుగురి భార్యలని వాహం చేసుకుని , ఇద్దరికీ శిరచ్చేదం , ఇద్దరికీ విడాకులు ఇవ్వగా ఒకామె ( జే న్ సెమూర్ ) పురిటిలో చనిపోతుంది.  చివరి కి కేథరీన్  పార్ అనే మరో ఆమెను చనిపోయే ముందు చేసుకుని రాజ్యాన్ని ఆమె హస్తగతం చేస్తాడు.  మగ సంతానాన్ని ఇవ్వ నందుకు శిరచ్చేదం చేయిస్తాడు . బాల్య వివాహాలు వరకట్నాలు మగపిల్లలని కనన్నందుకు మరణ దండన ఇవన్నీ  ఇంగ్లాండ్ రాజకుటుంబాల లో ఉన్నవే.  

పురుషాధిక్య సమాజం కేవలం భారతదేశంలోనే లేదు , ప్రపంచం అంతటా ఉన్నది అదే. గ్రీకు మైథాలజీ  చదివితే దీని మూలాలు పురుషాధిక్యత ఎలావచ్చిందో కొంత తెలుస్తుంది. 

గ్రీకు  మైథాలజీలో  మానవజాతిని  పెని ట్రేటర్ ( పెట్టువాడు ) పెనిట్రేటెడ్ ( పెట్టించుకునేది ) గా విభజించి   పెని ట్రేటర్ కే  విలువ ఇచ్చేవారు.  మన సినిమాల్లో కూడా తన్నే వాడికి విలువ ఎక్కువ  తన్నులు  తినే వాడికి  విలువ ఉండదు. బాగా తన్నే వాడినే హీరోయిన్ కోరుకుంటుంది . 

యుద్ధాలలో స్త్రీల  పాత్ర ఏంటి అనే  ప్రశ్న ఎప్పుడైనా తట్టిందా?

స్రీలు ఆదిశక్తి పరాశక్తి అని అంటాం. కానీప్రపంచ యుద్ధాలు వచ్చిన ప్పుడు స్త్రీలని కాపాడుకులేక పురుషులు చచ్చేవారు. (ఈరోజుకి కూడా స్త్రీకి రక్షణ ఏర్పాటు చేయడానికి పురుషులు చాలా ఇబ్బందులు పడుతుంటా రు.)  స్త్రీలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వాస్తవం చెప్పాలన్నదే నా ఉద్దేశం.   స్త్రీ శరీరం అందం మగాణ్ణి వివశుడిని చేస్తుంది.  స్త్రీ శరీర ఆకర్షణ బెర్ముడా ట్రైయాంగిల్ లాటిది అనిపిస్తుంది.   ఆ ఆకర్షణ    తప్పించుకోలేక  ప్రాచీన కాలం నుండి, మగాడు   స్త్రీని  వేటాడాడు,  అత్యాచారం చేశాడు. స్త్రీ అందం యుద్ధాలని  అత్యాచారాలను ప్రేరేపించింది.  మానవ చరిత్రలో యుద్ధాల ఎంత సాధారణమో  అత్యాచారాలు కూడా అంతే  సాధారణం. యుద్ధంలో సాధారణంగా  పురుషులు  హత్యకు గురైతే  స్త్రీల అత్యాచారానికి గురవుతారు.  ఈ  సంఘటనలు లక్షలాది గా చరిత్రలో ఉన్నాయి. 


బ్రిటీష్ సైనికులు, రష్యన్ సైనికులు లేదా ఎవరైనా, ఏ  సైనికులు అయినా ఏ యుద్ధం జరిగినా ముందుగా బాధితురాలు స్త్రీ. 1944లో, మోంటే కాసినో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలి   అత్యంత క్లిష్టమైన యుద్ధాలలో ఒకటి.   ఇటలీ సైన్యం ఫ్రెంచ్  జనరల్ చార్లెస్ దుగాల్  ఆధ్వర్యంలో    ఉన్నాయి. 


ఉత్తర ఆఫ్రికాలోని ఫ్రెంచ్ కాలనీల నుండి వస్తున్న ఫ్రెంచ్ సైన్యం. క్రూరమైన హింస  ఉన్మాదం లో వేలాది మంది మహిళలు, యుక్తవయస్సు బాలికలు చిన్నారులపై  రోజుల తరబడి అత్యాచారాలు జరిపారు     వారు ప్రతి పట్టణం మరియు గ్రామంలో 10 నుండి 80 సంవత్సరాల వయస్సు గల ప్రతి మహిళపై అత్యాచారం చేశారు. ఏకకాలంలో ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


ఇలాటి అత్యాచారాలు చేసిన సైనికుల్ని  శిక్షించడం కుదరదని  రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు  ఆ సమయంలో అత్యాచారాలను తగ్గించే లక్ష్యంతో ఇంపీరియల్ జపనీస్ సైన్యం ఆక్రమిత దేశాలు మరియు భూభాగాల్లో  కంఫర్ట్ వుమెన్ లేదా కంఫర్ట్ గర్ల్స్ ని ప్రవేశపెట్టారు. ఇలా  లైంగిక బానిసత్వంలోకి నెట్టబడిన మహిళలు మరియు బాలికలు లక్షల్లో ఉండేవారు . 


1992లో బోస్నియన్ యుద్ధ సమయంలో మహిళల పై   అత్యాచారం అనేది జాతి ప్రక్షాళన లక్ష్యంగా  ఒక యుద్ధ  నీతి  కింద సాగించారు    బోస్నియన్ యుద్ధంలో 50,000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు అని  రిపోర్ట్ కాని కేసుల సంఖ్య ఇంకా  చాలా ఎక్కువ.

రష్యాపైన చైనా పైన   జాపనీస్ సైన్యం చేసిన అరాచకాలు,  ఇన్ని అన్నీ కావు  లక్షల మందిని చంపి లక్షల మందిని రేప్ చేసిపారేశారు.  జపాన్ అరాచకాలు 

జపాన్ పై  అణుబాంబు దాడి జరగడం వల్ల ఆ కేకల్లో జపాన్ చేసిన దురాక్రమణలు,  దాడులు,  ఆ దాడుల్లో  జాపనీస్ సైన్యం చేసిన అరాచకాలు,   పైశాచిక కృత్యాలు  కప్పడిపోయాయి.  తన అమానుషత్వాన్ని  సానుభూతి పరదాలు వెనుక  దాచి  జాపనీస్ అమాయక ముఖాన్ని చూపిస్తుంది లక్షల మందిని చంపి లక్షల మందిని రేప్ చేసిన పెద్దగా పైకి రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు సుమారు కోటిమందిని చంపేసినా పైకి రాకుండా చూసుకుంది.  కొరియా  కోసమని చైనా మీద,  పోర్ట్ ఆర్థర్ కోసమని రష్యా మీద యద్దానికి దిగి గెలిచింది. 

1931 లో మంచురియా ని జపాన్ ఆక్రమించుకుంది, 1937 లో షాంగై ని ఆక్రమంచుకోడానికి యుద్దానికి దిగి ఆక్రమించుకుంది. తరువాత చైనా రాజధాని నాన్జింగ్ ని ఆక్రమించుకోమని ఆజ్ఞ రావడంతో యథేచ్ఛగా మారణకాండ కొనసాగించారు. కనిపించిన వారందరిని చంపుకుంటూ పోయారు. వారం రోజుల్లో అందరూ లొంగిపోవాలని ఆశాకా ప్రకటించాడు. లొంగవద్దని చెప్పి చైనా ప్రభుత్వం తమ సైనికులకు చెప్పి తానూ తప్పుకుంది . లొంగిపోయిన చైనా సైన్యాన్ని వారితోనే గోతులు తీయించి వాటిలో వారిని బ్రతికుండగానే పాతేశారు. ఇద్దరు జాపనీస్ సైనికులు పందెం వేసుకుని మరీ చైనా  సైనికుల తెగగొట్టారు. మొదట వంద తలలు తెగ్గొట్టటం తరువాత నూట యాభై ఇలా పందేలు వేసుకుని నదిలో నీరంతా ఎర్రగా పారాలని పందేలు వేసుకున్నారు. సరదాగా ల్యాండ్ మైన్స్ పెట్టి కొంతమందిని చంపి , మరికొంత మందిని కిరోసిన్ త్రాగించి పరిగెత్తించి చంపారు. ఆడవాళ్ళని రాత్రంతా రేపే చేసి చంపారు. పాలిస్తున్న తల్లిని స్థానాల్లో టొప్పకీ తో పొడిచి చంపారు.  వాటిని ఫోటోలు తీసి పేపర్లలో గొప్పగా రాసుకున్నదేశం జపాన్.  

స్త్రీల  శారీరక  బలహీనత పురుషుల మానసిక బలహీనత ( కోరిక ) వెరసి  పురుశాధిక్య సమాజానికి కారణమైంది. కానీ స్త్రీ పురుషులు సమానమే , మనుషులంతా ఒక్కటే అని చెప్పడానికి బాగుంటుంది. పదవిలో ఉన్నవాడు పదవిలో లేనివాడు ఒక్కటే అని కూడా చెప్పవచ్చు.  స్త్రీ లు ఒక్కరే కాదండీ బలహీను లందరూ పీడించ బడుతున్నారు.  నిజాయతీ పరులు కూడా పీడించబడుతున్నారు.  కానీ స్త్రీవాదులు చేసే ఓవరేక్షన్ ఇంతా అంతా కాదు. 

చరిత్ర చదివితే తెలుస్తుంది.  కానీ చరిత్ర అంటే చిన్న చూపు కలిగించి అటకెక్కించేశారు. టెక్నాల జీ,  ఇంగ్లిష్ వాడు మనకు దేవుళ్ళు . మన బాషా మన చరిత్ర మనకి చిన్నతనం.   మన పిల్లలకి చదువు రాదు సినిమాలు చూడడం తప్ప.  మనపిల్లలు ఎప్పుడూ చదువుతూనే కనిపిస్తారు అనినా ఒక్కడికీ ప్రపంచ జ్ఞానం ఉండదు.  అది చదువు కాదు టెక్స్ట్ బుక్స్ తో కుస్తీ.   ప్రాణాలు అరచేతు ల్లో పెట్టుకుని పరీక్షలకి  బట్టే పట్టడం తప్ప మామూలుగా చదవడం టైం దండగ అనేలా మైండ్  సెట్ చేసేసింది మన విద్యావ్యస్థ.    


Television Channels in France

Television in France was introduced in 1931, when the first experimental broadcasts began. Colour television was introduced in October 1967 on La Deuxième Chaîne. France uses the DVB-T transmission technology. The 13 first digital free channels were launched on 31 March 2005. Pay channels were progressively added until 2006. Regional channels started to launch on the TNT in 2007. On 30 October 2008, the TNT HD was launched with four national channels: TF1, France 2, M6 and Arte.

Four companies dominate the French TV market :

Groupe TF1 (owned by Bouygues)

France Télévisions, state-owned channels 

Groupe M6 (owned by RTL Group), 

Groupe Canal+ (owned by Vivendi).

The popular Television channels in France and their profile.

TF1, TMC, C 8 ,  M6  - General programs

Arte ( culture),   6ster ( family) ,  Guilli,( family children) ,  Chérie 25 ( women movies)

 LCI , C news - 24/7 News

Monday, February 26, 2024

Research on Bharatavarsha

భారతవర్ష విడుదల అయిన నాటి నుంచి నేటిదాకా ఎన్ని కొత్త పుస్తకాలో,  ఎన్ని కార్యక్రమాలో ఎన్ని టీ  వీ  ఇంటర్ వ్యూ లో..  ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన నాకు భారతవర్ష పై రీసెర్చ్ చేస్తున్నానని , నేను వ్రాసిన గ్రంధం గురించి,   నాగురించి తెలుసుకుంటున్నానని తెలియదు.  

భారతవర్ష వ్రాసేటప్పుడు  అది ప్రబంధ కావ్యమని తెలియదు. భారతవర్ష పూరిగా చదివిన వ్యక్తి  మల్లాది అనిల్ గారు  భారతవర్షలొ ప్రబంధ కావ్య లక్షణాలు ఉన్నాయని  2021 లో  టీవీ ఇంటర్వ్యూ లో  చెప్పారు.  అప్పటికీ   ప్రబంధ కావ్యమంటే అష్టాదశవర్ణనలు ఉండాలని తెలియదు. అష్టాదశవర్ణనలు ఏమిటో తెలియదు.  

        శా. పూదోట్ల    న్దిరుగా  డినాత  లపులం  బ్రోచేవు  యేభాగ్య మో                
పూదేనం  తయున ద్దినాప  దములన్ బుట్టేవు తాళంబు గా
  స్వాధీనం  బుగని  మ్ముచంద  మికనే   ౙాల్వార పారాణిగా నీ
పాదాల ద్దెదని  ల్వవమ్మ  నిలునా భావాల వేదంబుగా.     

నవరస పద్యాలు : 

వృత్తపద్యాల తో  అచ్చతెలుగులో  ఒక మంచి కథ వ్రాయాలనుకుని   బారతవర్ష కథ  వ్రాస్తూ ఆస్వాదించడం మాత్రమే తెలుసు  తరళ మత్తేభ శార్ధూల   పద్యాలు వ్రాయడానికి ఛందస్సు నేర్చుకుంటూ   అనేక  ఉపమానాలు ప్రకృతి వర్ణనలు తో మునిగిపోయిన నాకు   నేను వ్రాసిన పద్యాలలో  నవరసాల పద్యాలు  ఉన్నటు తెలియదు. రెండు సంవత్సరాల తరువాత  2022 ఆగస్టు లో  వ్యూస్ టీ వీ ఇంటర్వ్యూ కోసమని హైదరాబాదు  వెళ్ళేటప్పుడు పద్యాలమీద దృష్టి సారించగా నవరసాల పద్యాలు ఉన్నట్టు తెలిసింది.   అప్పుడు నవ రసాలపద్యాలు  అనే పది పేజీల సంపుటి తయారు చేసాను.

పురాణ ఇతిహాసాలు : 

పురాణ ఇతిహాస ప్రస్తావన ఎంత ఉందో తెలియదు.  పురాణ ఇతిహాసాలు  అప్రయత్నంగా వ్రాస్తే శృంగారం మాత్రం ప్రయత్న పూర్వకంగా, ఇంకా చెప్పాలంటే ఇష్ట పూర్వకంగా వ్రాసాను.  

భారతవర్షలో  తెలుగు సంస్కృత గీతాలు కృతులు అన్నీ  గాయకురాలు శ్రీవల్లి  వాట్సాప్ కి 2020 లోనే పంపినా వాటిని ప్రత్యేకంగా  ఒక  డాకుమెంట్ మీదకు చేర్చి దాచడానికి   2022 28 మే న  మార్కాపురంలో  బారతవర్ష సాహిత్య సాంస్కృతిక సమావేశం జరిగే వరకూ  కుదరలేదు. అలా దాచినా అది వందలాది భారతవర్ష అనే పేరుగల  డాక్యుమెంట్స్ లో కలిసిపోయి ఎక్కడో పోయింది.

2022, 2023     మాతృభాష దినోత్సవాలలో  పిలిచి  సత్కరించినా  ఫ్రెంచ్ జర్మన్ , జాపనీస్  పుస్తకాలతో రచన తో  పాటుగా ఇండియన్ సోనెటీ ర్  అనే పుస్తక రచనలో అంతకంటే పెద్దదైన  భారతవర్ష ద్వితీయ ముద్రణలోనూ ,   దాని ఆంగ్ల అనువాదమైన  లవ్ అండ్ పీస్ రచనలోనూ  ఊపిరిసలపక  సతమతమౌతున్న  నాకు  భారతవర్ష  పాటలన్నీ ఒక దారికి చేర్చాలని అనిపించలేదు 

2024 ఫిబ్రవరిలో  లో ఫ్రెంచ్ జాపనీస్ , జర్మన్ కొత్త పుస్తకాలు వెలువరించి ఒక భారం దించుకున్నాక   2024 ఫిబ్రవరి 14 వ తారీఖున లయోలా కాలేజీ వారు మాతృబాష దినోత్సవము సందర్భంగా  భారతవర్ష ని సత్కరించిన రోజున లయోలా కళాశాల  చిత్రాలతో భారతవర్ష గీతాలన్నిటినీ ఒక బ్లాగ్ లోపొందు  పరిచాను.  

  

2024 ఫిబ్రవరి 21 వ తారీఖున  దూరదర్శన్ లో   మాతృబాష దినోత్సవము సందర్భంగా  కార్యక్రమానికి భారతవర్ష లో అష్ఠాదశవర్ణనలు ఉన్నాయని తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు  దూరదర్శన్ వారి ఆహ్వానం భారతవర్ష పై  అన్వేషణ చేసి భారతవర్ష ఒక ప్రబంధం  అని తెలుసుకు నేలా చేసింది     భారతవర్షలొ  అష్ఠాదశవర్ణనలు వెలికి తీసి ఒక పుస్తకం ముద్రిస్తున్నాను.   


భారతవర్ష  -  ప్రాచీన కవితా ధోరణులు 

 ప్రకృతి వర్ణనలతో, ప్రౌఢ బాషా శైలితో  పురాణ ప్రస్తావనలతో  సాగే సంప్రదాయ కవిత్వాన్ని  ప్రాచీన కవిత్వం అంటారు.   ఇతిహాస పురాణ,  ప్రస్తావనలేకాక  అష్టాదశ వర్ణనలతో, వ్యాకరణ బద్ద  ఛందోబద్ధ నియమాలతో, వీర, శృంగార రసాలతో, అలంకారాలతో అలరించే  ఈ రచనా శైలి నన్నయ్య నుంచి చిన్నయ్య దాకా కొనసాగినా   మొఘలు  తురుష్క  పారశీ,  పాశ్చాత్త్య ప్రభావంతో  పూర్తిగా అడుగంటి పోయింది.  ప్రబంధాలు కనుమరుగైపోయాయి. చలనచిత్ర ప్రభావంతో   తెలుగు బాషా మనుగడే ప్రస్నార్ధకమయ్యింది. ఇలాటి గడ్డు పరిస్థితులలో నన్నయ్య చిన్నయ్య రాకపోయినా  నేటితరానికి ప్రబంధ సౌందర్యాన్ని అందించడానికి ఎవరో ఒక వెంకయ్య   వచ్చే ఉంటాడు. సమంగా చూడండి. ధర్మానికి సాహిత్యానికి సంబంధం ఉందంటూ ప్రబంధాల అందాలను, వేదచందాలను,  శృంగార పూగంధాలను పూంచిపట్టి   పూలబాల చేసిన శంఖారావం ఉత్కృష్ట భారతావని  ఆవిష్కారం  భారతవర్ష. 



1. భారతవర్ష గ్రంధం  చంపకమాల  తో ప్రారంభమవుతుంది 
అది ఇష్టదేవతా ( సరస్వతీ) ప్రార్ధన. ఇది ప్రాచీన కవితా ధోరణి  

చ . అనువుగ వేడ భారతి  సత్కృప నొసంగె కవిత్వ శక్తతన్  
కినుకము వీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
 అనితము నీకృప ధన్యముగాదె సనాతని దివ్య బాసటన్  
మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్

సరిగా వేడుకొనగా సరస్వతి దయతో కవిత్వ సామర్ధ్యమును 
కినుకము వీడి  ( దయతో ) కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
(షార్ప్ లిటరరీ మైండ్) ని అనుగ్రహిచెను. అనితము (ఆన్ పేర్లల్డ్) 
 నీకృప ధన్యముగాదె సనాతని( సరస్వతి ) దివ్య బాసటన్ 
మనసులో పుట్టిన పద్యాలను మాలాగట్టి తల్లి పాదములవద్ద ఉంచెదను.  

 2. ఉ.  తూరుపు  రత్న దీప జిగి  తోరణ సోయగ మేలె నాకశ                                 

    మ్మేరవికాంతి తో వెలిగె వేంకట నాథుని సుప్రభా తసం

     కీర్తన జేయు భాస్కరుని  కేళిక  చూడరె  కీరవాణి రా 

     గార్చన చేయుకీరముల గారము చేయరె ముద్దుముద్దుగా


తూరుపున  రత్నదీప  జిగి  తోరణమును గట్టి   ఆకాశము నలకరించి  ఆదిత్యుడు అబ్రదీపమై వెలుగుచుండగా దీపము వెలిగించి  వేంకటే స్వరుని కి  సుప్రభాతసంకీర్తన  జేయుచున్నట్టున్నది.  చలించు వెలుగు రేఖల ను చూడగా  అంశుపతి  కేళిక  (సూర్యుని నృత్యము) చేయుచున్న ట్టున్నది.  కీరముల ( చిలుకల)  కిలకిలారావములు కీరవాణి  రాగార్చన చేయుచున్నట్టున్నది. అట్టి  కీరములను  ముద్దుముద్దుగా గారముచేయ వలెను. ప్రాతఃకాల శోభను ఆస్వాదించవలెను. 

సున్నితమైన ప్రకృతి వర్ణనలలో భారతీయ దేవీ దేవతల ప్రస్తావన ప్రాచీన కవితా ధోరణి. 


4. చ. తెరిచి గవాక్ష   మంతట  యు తే ట  గవెన్నె లకాంచ  నుల్లమే 

విరిసె  సుమాలు ముచ్చట గ వే డు    కజేయ   గనూర్ధ్వ  లోకమే 

మురిసి  వరాల   జల్లుల  ను మూట  గగుగుప్పె నొతాలు  తాపరే      

అరలు  తనూజ లందడి మి  హత్తు  కుభాష్ప ఝరుల్గు ప్పించెనో. 


కిటికీతెరచి తేటగ ( స్పష్టంగా)  వెన్నెలనుచూడగా  ఉల్లము సుమము 

వలే విరిసినది.  విరిసిన సుమాల చూసి ఊర్ధ్వలోకము( స్వర్గము) మురిసి 

వానజల్లు కురిపించెనో లేక తాలుతావిరి  ( బ్రహ్మ) తన  విరిత నూజలను 

(పువ్వులు బ్రహ్మ దేముని కుమార్తెలు) ముద్దాడు చుండెనో! అన్నట్లున్నది. 


మరీదు అతికష్టముపై మండువాలోకి దృష్టి మరల్చెను.

స్వర్గం  పూలను అభినందించి వాన జల్లు  కురిపించడం  

బ్రహ్మ విరులను  ( కూతురులను) ముద్దాడి ఆనంద బాష్పాలను

 రాల్చడం చంపకమాలలో ఇమడ్చడం ప్రాచీన  కవితా ధోరణి.


ప్రాచీనధోరణిలోనే సాగుతూ వస్తున్న కవిత్వంలో కొత్త దృక్పధాలు 1850 తరువాత ప్రారంభమయినాయి. జపాన్‌కు వ్యతిరేకంగా కొరియా స్వాతంత్య్రంకోసం పోరాడిన యోధుడు, కవి హాయోంగ్ (1879) తో ఆధునిక కవిత్వం ఆరంభమయింది.  పాశ్చాత్య దేశాలలో కవిత్వంలో వచ్చిన మార్పులు, ఇంగ్లీషు సాహిత్యంతో పరిచయమున్న కవులలో పెరిగిన ఆసక్తి, రాజకీయ, సామాజిక రంగాలలో వచ్చిన మార్పులు, జీవన శైలిలో వచ్చిన కొత్తదనాలు ఆధునిక కవిత్వానికి మరికొన్నికారణాలు. 

ఆధునిక కవితాధోరణులలో  ముఖ్యమైనది "భావ కవిత్వం." ఇంచుమించు 1930 వరకు భావకవిత్వం రాజ్యమేలింది. 1935 తరువాత రెండో ప్రపంచ యుద్ధం నాటికి భావకవిత్వం స్థానాన్ని అభ్యుదయ కవిత్వం పూర్తిగా ఆక్రమించింది. భావకవిత్వంలో  ఆత్మాశ్రయ వాదం, ఊహా ప్రేయసులు, అమలిమ శృంగారం, ప్రకృతి వర్ణనలు, స్మృతి కవిత్వాలు ముఖ్యమైనవి.  కాటూరి, విశ్వనాధ,  నండూరి వంటి ఎంతోమంది కవులు భావకవితలలో వెలిగారు.. రాయప్రోలు, దేవులపల్లి వంటి వారు  భావకవిత్వాన్ని వెలిగించి  తమదైన ముద్ర వేసారు. పఠాభి  ఫిడేలు రాగాల డజన్' గేయాలు భావకవిత్వం మీద తిరుగుబాటుగా పరిగణించవచ్చు.  శ్రీరంగం శ్రీనివాసరావు కూడా 1930లో శ్రీ శ్రీగా మారకముందు భావకవిత్వం రాసిన వాడే.

1980 ప్రాంతం నుండే కొరియా కవిత్వం ప్రపంచ భాషల్లోకి అనువాదం అవుతున్నది. తమనుతాము కవులుగానే వియత్నామీయులు ఎప్పుడూ భావించుకుంటారు. వియత్నాం మొదటినుండి ఒక యుద్ధ్భూమి. వియత్నాం యుద్ధ కవితలను అక్కడివారే కాదు, ప్రపంచవ్యాప్తంగా కవులు రాశారు.


Wednesday, February 21, 2024

Indian Movie Trends

TALENT :  golkonda school,  paduta tiyyaga,  boys,  nenu inthe,   nenu unnanu 

FAMILY  : ummadi kutumbam, adarsha kutumbam,  sansaram oka chadarangam

LOVE : prema sagaram, tellagulabeelu   Prema,   premapelli,   preminchu pelladu, 

UNEMPLOYMENT :  ee chaduvulu maaku  vaddu,   punaadi   rallu,   alakalirajyam, manishi rodduna

CORRUPTION   sardarpaparayudu ,  gentleman,  shivaji

POLITICAL BRUTALITY ,  pratighatana,  assembly rowdee,  m dharmaraju  operation duryodhana

PARENTS' BRUTALITY ,  premakhaidi,   prema,  premayuddham,  nuvvu nenu,  dil

REVANGE  annadammula anubandham,  pagasaahistaa , AVEKALLU

SECRET AGENT/ DETECTIVE   agent gopi ,  goodachari 116 

SCIENCE MOVIES ; ADITY 369 , NANI 

DESOLATION : sreeranganeethulu, pandanti jeevatham   

SUSPICION : PREMALEKHALU  MUTYALMUGGU , ARTHANGI 

SEPERATION : ILLAU   chirunavvutho

Friday, February 16, 2024

మాతృభాషా దినోత్సవం 2024 దూరదర్శన్ లో భారతవర్ష

మూడురోజులక్రితం  ఒక  ఫోన్ వచ్చింది " తెలుగు మాతృబాష దినోత్సవం నాడు దూరదర్శన్ లో  మాతృభాషపై కార్యక్రమానికి  ఆహ్వానిస్తున్నాము అని. వస్తున్నాను అని నేను సమాధానం చెప్పగానే " తెలుగు అనగానే మీరు గుర్తొచ్చారు అని  చెప్పి ముగించారు.    ప్రతిసంవత్సరం ఇలాటి ఆహ్వానాలు అందుకున్నప్పటికీ  ఇది మరుపురాని ఆనందం కదా. ప్రతిసంవత్సరమే కాదు  ప్రతినిత్యం దివ్య అనుభూతిని కలుగజేస్తున్నది  సరస్వతి మాత, ఆ తెలుగు తల్లి.  

ఫిబ్రవరి 15 దూరదర్శన్ స్థూడియో - విజయవాడ 

భారతవర్షకు సన్మానం . భారతవర్ష గ్రంధం విడుదలైనప్పటినుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడూ భారతవర్షకు  సన్మానం జరుగుతూనే ఉంది.  

2022 ఫిబ్రవరి లో  సిద్ధార్థ మేనేజ్మెంట్ , ఫార్మసీ కళాశాల చాలా ఘనము గా చేశారు. 

 2022 మే లో స్కాట్-స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో భారతవర్ష సాంస్కృతిక కార్యక్రమము, 

2022 లో మార్కాపురం లో భారతవర్ష సాహిత్య పరిచయం సాంస్కృతిక కార్యక్రమం జరిగాయి. 

2023 ఫిబ్రవరి లో ప్రభుత్వ సన్మానం  మాతృబాష సేవా శిరోమణి  బిరుదు కూడా వచ్చింది.

2023 ఫిబ్రవరిలో అదే రోజు ఏలూరు సిఆర్  రెడ్డి కళాశాలలో  లో సన్మానం

2023 మార్చ్ లో   వుయ్యూరు లో సరసభారతివారి  ఉగాది సన్మానం.

2023 మార్చిలో పామఱ్ఱు ఘంటసాలపీఠం  వారి ఉగాది సన్మానం.

2023 ఏప్రిల్ లో అనంతపురం జిల్లా గణిగెర లో నేను లేకున్నా  గ్రంథానికి సన్మానం 

2023  ఆగస్టు 23 న  ఉషోదయ పాఠశాల లో భారతవర్ష సాహిత్య సన్మానం






లయోలా కళాశాల లో భారతవర్ష కి సన్మానం

ఫిబ్రవరి 14వ తారీకున  విజయవాడ లయోలా  కళాశాలలో  మాతృభాషా దినోత్సవం సందర్భంగా భారతవర్ష గ్రంథానికి సన్మానం జరిగింది. భారతవర్ష గ్రంథం  విడుదలై నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడూ అనేక సార్లు భారతవర్షకు  సన్మానం జరిగింది, జరుగుతూనే ఉంది.    


భారతవర్షలో ఉన్న గొప్పతనం ఏంటి ?  ఉపయోగం ఏంటి?

భారతవర్ష సరళ గ్రాంధిక ప్రబంధం వేయి కవితల సమాహారం అచ్చ తెలుగు మాధుర్యం.నేటి కాలంలో తెలుగువ ఉపయోగంలేదని వదిలిపెట్టేసినవారికి కనువిప్పు కలిగిస్తుంది   భారతవర్ష.

  బాషా సంస్కృతిని నాశనం చేసేస్తే ఒక దేశాన్ని  సులభంగా  తమ చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చు అని విదేశీపాలకులు విద్యా వినోద రంగాలను మన బాషా సంస్కృతులను నాశనం చేయడానికి వాడారు. నేటి పాలకులు కూడా వారికి ఏమీ తీసిపోలేదు. ఒక జాతంతా వేషం మార్చుకుని బ్రతుకుతున్నాది. ఆంగ్లవస్త్రధారణ లేకపోతె నాగరీకుడు కానట్టే అని నాటుకుపోఎలా చేసాం.  ఇంగిలీషులేకపోతే బ్రతుకులేదని బెదిరిస్తూ సాగిన విద్యావిధానం వల్ల తెలుగుని వదిలి పెట్టేసి అత్యధికులు ఆంగ్లాన్ని  ఆలింగనం చేసుకున్నారు. సినిమాల ప్రభావంతో ఆంగ్లంలో  మాట్లాడితే  విద్యావంతుడని  ఆంగ్లంలో మాట్లాడితేనే ప్రతిష్ట అని స్థాపించాం.  కడకు మన బాషా సంస్కృతులని భూస్థాపితం చేసేశాం. ఇది మనం సాధించింది. 

చలన చిత్ర ప్రభావంతో యువతీ యువకులు వారి తల్లితండ్రులు అంతా ఆంగ్లమిళితమైన తెలుగునే మాట్లాడుతూ చాలా చాలా తెలుగు పదాలను మర్చిపోయారు.  కొంతమంది  గొప్ప  చూబించుకోడానికి  గుర్తు ఉన్నతెలుగు పదాలకు బదులు ఆంగ్లపదాలను బలవంతంగా వాడుతున్నారు. సినిమాలు చూసేవారి పరిస్థితి ఇలాఉంటే  తీసేవారి మరోలాఉంది.  కథలో వైవిధ్యం పేరుతో  కథని నాశనం చేసి బూతు, హింసలతో రక్తి కట్టించవచ్చని వాటిని గట్టిగా దట్టించి కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి  మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. 

పది సినిమాలు విడుదలౌతుంటే అందులో 9 ఘోర వైఫల్యం చవిచూస్తున్నాయి.  అసలు విషయం ఏంటంటే ప్రజలు అంత  చెత్తను భరించలేకపోతున్నారు.  అది సినిమాలు తీసేవాళ్ళకి అర్థం అవ్వడంలేదు. అందుకే అలాటి సినిమాలు తీస్తున్నారు. శంకరాభరణం లో బూతు, హింస లేవు, కోట్లు పెట్టి తీయలేదు. అయినా  శంకరాభరణంఎందుకు విజయవంతం అయ్యింది? శాస్త్రీయ సాహిత్యం శాస్త్రీయ సంగీతం. ఈ రెండు జనకోటిని ఎంతగా అలరించాయో అంతగా భారతవర్ష కూడా అలరించింది అని చదివిన పాఠకులు  చెపుతున్నారు.   చొమెలూన్గ్మ  సభ్యభాషతోను,  చక్కటి పద్యాలతోనూ,   శాస్త్రీయ గీతాలతో నూ ఆహ్లాదపరుస్తుంది. మన చరిత్ర సంస్కృతిని  సాహిత్యంద్వారా మనని ఆకట్టుకునేలా చెపుతుంది.  



అందుకే సాధించింది ప్రపంచ రికార్డు మాత్రమే కాదు. ప్రజాదరణ కూడా. ఆధ్యాత్మిక భక్తి సాంకేతిక   సంగీత వైమానిక రంగాల లోతులను ఆవిష్కరించి  చందో బద్దపద్య సంసృత గీతాలతో నింపి,  సాహిత్య సరదాలు అద్ది శృంగారంలో మరిగించిన అద్భుత కావ్యం భారతవర్ష. 

                            2023 ఫిబ్రవరి  రాష్ట్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షురాలు సమక్షంలో 

2023 మార్చ్ లో   వుయ్యూరు లో సరసభారతివారి  ఉగాది సన్మానం.

2023 మార్చిలో పామఱ్ఱు ఘంటసాలపీఠం  వారి ఉగాది సన్మానం.

2023 ఏప్రిల్ లో అనంతపురం జిల్లా గణిగెర లో నేను లేకున్నా  గ్రంథానికి సన్మానం 

2023 లో ఆగస్టు 23 న  ఉషోదయ పాఠశాల లో భారతవర్ష సాహిత్య సన్మానం  

2022 ఫిబ్రవరి లో  సిద్ధార్థ మేనేజ్మెంట్ , ఫార్మసీ కళాశాల చాలా ఘనము గా చేశారు. 

 2022 మే లో స్కాట్-స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో భారతవర్ష సాంస్కృతిక కార్యక్రమము, 

2022 లో మార్కాపురం లో భారతవర్ష సాహిత్య పరిచయం సాంస్కృతిక కార్యక్రమం జరిగాయి. 

2023 ఫిబ్రవరి లో ప్రభుత్వ సన్మానం  మాతృబాష సేవా శిరోమణి  బిరుదు కూడా వచ్చింది.


మన  భాష మన శ్వాస , మన సంస్కృతి  మన ఉనికి ఆత్మ నిగ్రహం , ఇంద్రియ నిగ్రహం , సత్యవాకుపాలన, తపోబలం బ్రహ్మచర్యం ఇలాటి మాటలకి నేడు కాలం చెల్లిపోయింది.  ఇంద్రియ నిగ్రహం   బ్రహ్మచర్యం బూతుమాటలు. మంచి ఫిగర్ , కెవ్వు కేక , ఫుల్ ఎంజాయ్  ఆన్ లిమిటెడ్ ఫన్,   ఇలాటిమాటలే సినిమా  వ్యాపార ప్రపంచం  పుట్టిస్తున్నది.  మంచి  మాటలు   మన సంస్కృతిని, విలువలని నిలబెడతాయి,మన బాషా మన సంప్రదాయాలకు నిలువెత్తు రూపం భారతవర్ష. భారత సంస్కృతికి విశ్వరూపం భారతవర్ష .

అందుకే  ప్రతి సంవత్సరం భారతవర్షకి  సన్మానం జరుగుతోనే ఉంది. ఇది నాకు జరిగే సన్మానం కాదు. తెలుగుకి జరిగే సన్మానం. సరస్వతికి జరిగే సన్మానం.  ఈ సందర్భంగా భారతవర్ష పాటలను ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను  

భారతవర్ష ఉద్దేశ్యం తెలుగులో ఉండే మాధుర్యాన్ని చూపుతూ ఇంగ్లిష్  తెలుగు అందాన్ని ఎన్నటికీ అందుకోలేదు అని నేటితరానికి నిరూపించడం.   

"నీ ఆదర రాజీవముల సొంపారు శోణిమ శోభలు నిర్జించును నింగి కెంజాయలనైన, నీ చలచ్చంచ లన  నేత్ర సౌందర్య చాతుర్య  మహిమ అబ్బునే  మేటి పద్మంబు లకైన  గుబ్బారాశుల రాసికెక్కిన  గిబ్బరాశిని గాంచి గుబ్బతిల్లవే రసికడెందంబులెల్ల నీ నీలి జీమూత సంకాశ చారు కేశముల్ నర్తించవే  చంచజఘనాంగి నీ జఘనమెలల, నీముత్తెంపు మేని కాంతులన్ జూచి పాలిపోవే పారిజాత పుష్పంబులైన" 

ఆధునిక వ్యవహారశైలికి  నిత్య జీవిత  సంభాషణలకు తెలుగే మెరుగు అని చూపడం,

టాలీవుడ్నందు సృజనాత్మకత లోపించుటయేగాక, బంధుప్రీతి దురాశ పెచ్చు మీరినది. ఇచ్చట కథలకు కొరత ఉన్నదను వారేగానీ కొత్తకథలను ఆహ్వానించు వారులేరు. సింహభాగము మూసపోత చిత్రములు, ముతక దర్శకులు, వృద్ధ కథానాయకులు. మిగిలిన యువకులు వారి సంతానమే గాని  అన్యులెవ్వరునూ కానరారు. అందుచే దశాబ్దములతరబడి అవే ప్రేమ, ప్రతీకార చిత్రములనటు దిప్పి ఇటు దిప్పి జూపుచున్నారు.  ఎవరైననూ ప్రతిభ గల్గి మంచి దర్శకుడు,  రచయిత  అవ్వవలెనని ఊవ్విళ్లూరుచూ కథలను పట్టుకుని ఫిల్మ్ నగర్ నందడుగిడిన ఆషాఢ భూతులు వాసన  పసిగట్టి  వారిని  కొనిపోయి దర్శకునకు కథ వినిపించెదనని  మోసగించి, బిడ్డలనెత్తుకు బోవు దొమ్మల గుండులవలె  వారియొద్దనుండి ధనమును దోచుకొను చున్నారు.

సాంకేతిక విషయాలకు  ఆంగ్ల పదాలు నప్పుతాయి అవే సరైనవని ఒక అపోహ ఉంది   ఆధునిక సాంకేతిక విషయాలను ఇంగ్లిష్ లో చెప్తేనే  బావుటుందనుకుంటారు.  అచ్చ తెలుగులో వ్రాస్తే ఎలా ఉంటుందో చూడండి. భారతవర్షలో హైద్రాబాదునగర వర్ణన

"బహుళ  అంతస్తుల నగరులుతో మాదాపురమును తలదన్నునట్లుండు మణికొండ కాశ్మీరు  కంబళి పై నుంచిన  గజ దంష్ట్ర నిర్మిత రత్నమయ  కళాఖండమనిన అతిశయోక్తి కాదు. అచ్చట  పది సంవత్సములుకు పైగా నిర్మించిన ద్వాదశ హార్మ్యముల  లాంకోహిల్స్  యను ఒక సుందర పట్టణము మణికొండ శిరమున బంగారు  కిరీటము వలె నొప్పు చుండును. నిశీధిని విద్యుత్ దీపకాంతులీనుచూ ద్వాదశావతారము వలె అగుపించు ఆ ద్వాదశ ఆకాశ హార్మ్యముల నడుమ  సిగ్నేచర్ టవర్స్ యను భూమండ లోత్తుంగ ధామము మహాపర్వతమును పోలి గగనాంతర రాళములోనికి  చొచ్చుకొనిపోయి చూచువారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించినట్లగు పించును."

ప్రకృతిని వర్ణించిన తీరు భాషపై మక్కువ పెంచే లా చేస్తుంది 

అతిధి గృహము చుటూ పచ్చిక కనువిందు జేయుచుండెను ఆ పచ్చిక నందొక  జలయంత్రమమర్చబడి యున్నది, అందుండి పైకి చిమ్ము రెండు నీటి ధారలు    ఈడైన నిగ్గులాడి  తన జోడైన సొగసుకాడిని గూడి సయ్యాటలాడుచూ  ఒయ్యార మొలికించునట్లున్నది.  చిప్పిల్లు ధారల విరజిమ్ము సూక్ష్మ బిందువుల పై  బడిన సూర్యకాంతి పరావర్తనము ఇంద్రధనుస్సును ఆవిష్కరించింది. జలయంత్రము చుట్టూ మిట్ట పల్లముగా నున్న పాలరాతి కట్టడము ముత్యపు చిప్పవలె నుండి ఆ కైవారం వెంబడి గుత్తులు గుత్తులు గా బడి యున్న ఎర్రని పూలు జేగంటలు మ్రోగించు చున్నట్లున్నవి. ఆ మనోహర దృశ్యము కాముకునకు మిధునమును,  తత్త్వజ్ఞునకు ప్రకృతి శ్రీమన్నారాయణునకు జేయు పూలంగిసేవను  ఆవిష్కరించు చున్నది. 

అంబర వర్ణన 

"జాము రాత్రి దాళువాళించిన నక్షత్ర ముక్తావళి క్రమక్రమముగా కరిగిపోగా, జాముచుక్క  యొక్కటి అంబరమున మిగిలియున్నది. బాలభానుడాకాశమున కూర్మము వలె ప్రాకుచుండ కెంజాయ లలుముకొన్న అంబరముదయరాగము పాడుచుండెను. మలయమారుతాము తాకగ  ప్రకృతి యంతయు పులకరించ నల్లంచి గాఁడు(Indian robbin) అల్లన రాగమేదియో పాడుచుండగా, పిగిలి పిట్ట యొకటి బిగ్గరగా కూయుచుండెను. ఆ కూత  ఉదయరాగమందు మేళవించి ఎగయుచున్న  కపిలవర్ణ  తీవ్రతను తెలియజేయుచూ అప్పుడే కళ్ళు తెరిచిన అరుణతారకు మేలుకొలుపు రాగమువలెననిపించెను. ప్రకృతి ఎంత ముచ్చటగా నున్నదోకదా!"


భారతవర్ష సరళ గ్రాంధిక  ప్రబంధ లో గద్యము పద్యంతో పోటీ పడుతూ చదువరులను అలరిస్తూ ఉంటుంది  భారతవర్ష లో 200 వృత్త పద్యాలు ఉన్నాయి.  ఇందులో నవరసాల పద్యాలు వున్నాయి. 

 శృంగారం, వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఇలా తొమ్మిదిని మనం పేర్కొనవచ్చు. అయితే ఈ తొమ్మిదీ ఒకదానికొకటి తీసిపోనివి అందుకే  వీటిని  “నవ రసాలు” గా పిలుస్తారు.  

భారతవర్ష  పద్యాలు  విని పులకరించని వారు లేరు.    అందుకే  ఎక్కడికెళ్లినా ఈ పద్యాలని ఆలపిస్తూ ఉంటాను. అయినా ప్రాచీన కాలంలోనే ప్రముఖ సాహిత్య శాస్త్రజ్ఞులు “శృంగారంరసరాజం” అన్నారు. 



భారతవర్ష రికార్డ్ మాత్రమే కాదు అద్భుతం కూడా.  ప్రతి రికార్డ్ అద్భుతం కాదు. చెవులో వెంట్రుకలు ఎక్కువగా ఉన్నందుకు, చేతి వేళ్ళ గోళ్లు పొడవుగా ఉన్నందుకు, ముఖంపై ఎక్కవ నత్తలను ఎక్కించు కున్నందుకు, ఇలా అనేక కంపరం పుట్టించే విషయాలకు కూడా రికార్డులు ఉన్నాయి అందుకే ప్రతి రికార్డ్ అద్భుతం కాదు అన్నది. భారతవర్ష రికార్డ్ అద్భుతం అపురూపం కూడా.



1. అబలను కాపాడిన అరుణతారకు వర్షుని కృతజ్ఞతాంజలి 

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత మాతా

శుంభ  నిశుంభ హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణ వర్జిత  గంగాజనిత  విచలిత  రసన  మాతా   

అంబకమునకందక  అంబరమున సంబరముగ శోభిల్లు మాతా

సంకటములు బాపుటకు తరలొచ్చిన మాతా

మామనసులె ఆనందనిలయమీ వేళా

ఆనందనిలయమునకు సంబరమీ వేళా

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా  దిగంబర పరంపర సాగించుహేలా

జనయిత్రి ప్రసవిత్రి సావిత్రి మాతా

వరవినుత గుణరహిత తపో జ్వలిత మాతా

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత  మాతా

షుమ్బ  నిషుమ్బ  హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణవర్జిత  గంగా జనిత  విచలిత  రసన  మాతా  

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా  నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా  దిగంబర పరంపర సాగించుహేలా

త్రివేణి సంభవి శాంభవి మహిషాసుర మర్ధిని శాంభవి

కైలాసవాసిని శాంభవి  సింహవాహిని శాంభవి

దుర్గతినాశినీ శాంభవి,  శాంభవి శాంభవి శాంభవి.

 2. అరుణతారను దుర్గగా భావించి  అతిథి సత్కారము    

చేయుచూ విదిష  మంజూషలు పాడిన పాట   

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

ఈ దీనుల లోగిలి లోకి  అడుగిడరావమ్మ 2

నీ అడుగుల సవ్వడి వినగా  చెట్టు చేమ వికసించెనమ్మా  

నీ పాద ముద్రలు పడగా ధర్మం ధరలో  విలసిల్లేనమ్మా 

నీ గజ్జెలు ఘల్ ఘల్ మనగా దుష్టశక్తులు తొలగేనోయమ్మా

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

ఈ దీనుల లోగిలి లోకి  అడుగిడరావమ్మ 

నీ విభుని విభూతి పొందుటే  ఈ జన్మకు గొప్ప అనుభూతోయమ్మా 

నే  చేసిన పుణ్యము కొలది నిను కొలిచెడు  భాగ్యము పొందితి నోయమ్మా  

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా2

ముష్కర మూకల భంజించి  విషమును దీసి విదిషను నిలిపితివి 

ప్రతప్త మానస దీనులకు ధీమా నిచ్చి దీటుగ నిలిపితివి 

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా 

(త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత మాతా 

శుంభ  నిశుంభ హారిణి ద్వాదశరూపిణి మాత 

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణ వర్జిత  గంగాజనిత  విచలిత  రసన  మాతా   

త్రివేణి సంభవి శాంభవి మహిషాసుర మర్ధిని శాంభవి

కైలాసవాసిని శాంభవీ సింహవాహిని శాంభవి 

దుర్గతినాశినీ శాంభవి శాంభవి శాంభవి శాంభవి)

3.అన్వేషణలో అలసిన వర్షుని విషాద గీతము  

 శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా

కాలము  వాలమై రణముకు పిలవ  మిత్రుడు శత్రువై విషమును చిందించ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

ఋణములు వ్రణముమై  బ్రతుకును  పొగిలించ

ఆడు మాటలు వాడి ఈటెలై మనసును గ్రుచ్చ

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

ఈతి బాధలు నష్టము కలిగించ 

నాతి బాధలు  నరకము తలపించ  తుష నే  త్రుంచ రుష నే పెంచ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

న్యాయము చితకగ  సాయము వెతకగ

నిత్య విఘ్నాలు  వేదన మిగిలించ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

కాలము  వాలమై రణముకు పిలవ 

ఋణములు వ్రణములు  బ్రతుకును  రగిలించ 

మిత్రుడు శత్రువై విషమును చిందించ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా

వాసన లే యమ  పాసములయ్యి 

సంచిత కర్మలుఉదంచనమయ్యి  

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా

  4.  పార్వతి పెళ్లి చూపుల  పాట 

 ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం

సస్య కేదారముల  పాఱెడి  సారం భవాబ్దినావిక గీతా సారం

విహసిత సుందర వదనం వంశీధర  వర  మదనగోపాలం 

విహసిత సుందర వదనం వంశీధర వర  మదనగోపాలం  ప్రహసిత II

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం

విలసిత శ్యామల వర్ణం  మదన గోపాలా   నీ సుందరరూపం  

మదన మనోజ్ఞం ముజ్జగములకే మూగ్ధ మొహనం 

విలసిత శ్యామల వర్ణం  మదన గోపాలా   నీ సుందరరూపం  

మదన మనోజ్ఞం ముజ్జగములకే మూగ్ధ మొహనం   

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం

సస్య కేదారముల  పాఱెడి  సారం భవాబ్దినావిక గీతా సారం

ప్రభాత భూషిత శుభదివాకరం మనోరధబంధన  సుధాకరం  

జగత్ప్రాణ  పోషకం  శివంకరం  గోపి  ప్రేరక  జీవదాయకం  

దుఃఖ భంజకం మనోరంజకం  

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం 

హరిహరాదులకు  అత్మానందం   భవబంధహారం 

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

మురళీకృత రవ మాయాజాలం  ప్రహసిత వసంత గీతం


5. మీనాక్షి సూన్యతను  పోగొట్టుచు ఆమె పుట్టినరోజునాడు

ఆమె జన్మ సార్థకమైనదని   తెలియజేయుచు  వర్షుడు పాడిన పాట   

జగదానందకారకం నీ జననం   మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం

జగదానందకారకం నీ జననం,  మధుర సురరాగ  స్వర కల్ప సృజనాత్మకం

నీజీవన తత్వము జీవిత లక్ష్యము సృజనాత్మక సుమధుర సంగీతమూ

నీగానమె నీ గమనము, నీ గమనమె గరిమాగమ నిగమ ప్రయాణము 

నీ గానమున విఱియు నవరాగమూ  అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము  

జగదానందకారకం నీ జననం  సరస స్వర రాగ – యోగ సంయోగ జన రంజకం 

నీ పెదవులు పలుకు పరతత్వము నీ  గానము  విన గలుగు పరవశత్వము

నీ రాగము నొలుకు వాత్సల్యము అదివిన్న మనసుకు  నిశ్చలత్వము

అదె ఆత్మ పరమాత్మ సందర్శనం

జగదానందకారకం నీ జననం మధుర  గీర్వాణ - శరణ  నిశ్శరణ  శివరంజకం  

నీ పదములు వెలుగు పరబ్రహ్మము ఇహపరముల కొసగు నదిమార్గము

నీ గానమున నిండు నవభావము  ఆ భావమున మెండు అభావము

కైవల్యమునకు చూపు నదిమార్గము

జగదానందకారకం నీగానం మధుర సురరాగ బ్రహ్మ పరబ్రహ్మ  జ్ఞానోదయం

నీ గానమున విఱియు నవరాగమూ  అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము 

గుణ గణ ధనము నీరాగమూ, నవనిధులుకు చూపునది మార్గము

వచనము : మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకరకచ్ఛపౌ, ముకుందకుందనీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ.

 జగదానందకారకం నీ జననం,  జగదానందకారకం నీ జననం 2

6.  భారతవర్షచే  మీనాక్షి కి  సాహిత్య సత్కారము 

 సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ

గారాల కూనలమ్మ రాగాలు పూయునమ్మ  

సృష్టించెను బ్రహ్మ ఇది గ్రీష్మ  కోకిలమ్మ,  

రాగాల కూనలమ్మ  గారాలు సేయరమ్మ,  

అమ్మమ్మ చూడరమ్మ  అందాల కోయిలమ్మ, 

అజంత శిల్పమమ్మ  తరగలెత్తు రాగాల తంజావూరు కొమ్మ 

యాగాలు చేయ జేజెమ్మ జెజ్జరిల్లి జేజి, ఈ కొమ్మ నిచ్చెనమ్మ 

ఆ సోమిదమ్మ కొమ్మ  కమ్మ నైన రాగాలకు  పెమ్మి ఈ అమ్మ 

సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ, 

గారాల  కూనలమ్మ రాగాలు పూయునమ్మ 

రాత్రనక పగలనక గుమ్మటిల్లు గుమ్మ  

దీపమై వెలుగునిచ్చు పత్తి వత్తి లెమ్మ 

సంగీతసంద్రమం దీదు రాచమీనమమ్మ 

చిమ్మ చిమ్మ ప్రోది చేసి తరతరాల కిమ్మ 

జాజి కొమ్మ లెమ్మ ఇది  జాతి సంపదమ్మ 

పలుకుకలికి పాదాల మంజీరమమ్మ  

 కంజీర నాదమమ్మ కలకంఠి ఈ కొమ్మ

సుస్వరాలు  మాలగట్టి పాటకూర్చు బ్రహ్మ

సంగీత తిలక మమ్మ  నాదబ్రహ్మ లెమ్మ 

ఇది జాతి సంపదమ్మ.

సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ, 

గారాల  కూనలమ్మ రాగాలు పూయునమ్మ  

సృష్టించెను బ్రహ్మ ఇది గ్రీష్మ  కోకిలమ్మ,  

రాగాల కూనలమ్మ  గారాలు సేయరమ్మ,  

అమ్మమ్మ చూడరమ్మ  అందాల కోయిలమ్మ,

 అజంత శిల్పమమ్మ   దృష్టి తీయరమ్మ


7.  అంగయార్ కన్నె  పశ్చాత్తాపముతో  రాముని పై పాడినపాట  

నీలమేఘ శ్యామా రామా నీ మనసెట్లు తెలుసుకొందు  నన్నెట్లు మలచుకొందు   

రఘుకులతిలకా రామచంద్రమా  సుగుణము లొలకే  రాజచంద్రమా

నీలమేఘ శ్యామా రామా  నిను ఎట్లు  తెలుసుకొందు నామనసెట్లు తెలుపుకొందు

చల్లని చూపుల మెల్లని స్వామి  ఏ వనములలో తిరగను నీ కై, 

నీ పదములకై వేచాను యుగమై   నీ  తలపులలో మిగిలాను  సగమై

జింకను కోరిన సీతతపన కై వంకలు దిరిగి  లంకాపతినే జేరితివి వెరవక పోరు చేసితివి

లంకకు వారధి వేసిన స్వామీ  నాజీవన సారథి నీవేస్వామీ

నీలమేఘ శ్యామా రామా  నిను ఎట్లు తెలుసుకొందు నామనసెట్లు తెలుపుకొందు

కారడవులలో జీవితము    తరగని  కష్టాల కడలి ప్రయాణము ,  

చూపెను కర్తవ్య  పరాయణము   తరతరాలకు ఆదర్శమూ  

 నర నారాయణ సంగమమో  విగ్రహవాన్ ధర్మః రామో, 

నీలమేఘ శ్యామా రామా నీ మనసెట్లు తెలుసుకొందు  నన్నెట్లు మలచుకొందు 

గొప్పమనసుతో తప్పులు గాచి  చప్పున రారా రామచంద్రమా!


7. సరస్వతిని కీర్తించుచూ  మాలిని  వీణపాట 

 పుస్తక ధారిణి భాషా వాహినీ  శాంతిరూపిణీ కచ్ఛపి ధారిణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - అతులిత స్వర రాణీ  వీణా పాణి,  

అలసిన మనసును మురిపించు విరిబోణి అమరగాన మును అలరించుగీర్వాణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే   

మూలాధారిణి మంజుభాషిణీ  హంసవాహిని సూక్ష్మ రూపిణి –అతులిత  స్వరరాణీ వీణా పాణి

కోరి వేడుచూ కొలిచిన భక్తుని జ్ఞాన మార్గమున నడిపించు యోగిణి

నాదము నీవే,  వేదము నీవే,  వేదన బాపే భామిని నీవే  - 

యశో కారిణి ఆనందదాయిని వేద రూపిణి, కమల లోచని - అతులిత స్వరరాణీ వీణా పాణి

దుర్భోధ పీడిత దుర్లోక మూషిత నిర్దోష పురుషుల ముక్తి ప్రదాయిని

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - 

శుద్ధ స్ఫటిక రూపాయై ముక్తాలంకృత సర్వాంగ్యై నిష్కళాయై                                               

వాగ్మ్యై వరద హస్తాయై వరదాయై నమోనమః

దుర్బల మానస, ఉన్మాద పీడిత ఉన్మార్గ జీవుల కరుణించు మాలిని

నాదము నీవే, వేదము నీవే,  వేదన బాపే  భామిని నీవే - అతులిత  స్వర రాణీ


8. పెళ్లివేడుకలలో భారతవర్షను కీర్తిసూ  నందిని  పాడిన పాట 

   సనాతనీ   విద్యామాతే సర్వశాస్త్ర   పరంజ్యోతి 

   జ్ఞానప్రదా   యనీదేవీ   వేదాగ్రణి    నమోస్తుతే

   మితభుద్ది ఏవం పరిమిత శుద్ధి, ధనం పరితః పరి భ్రమణం నిత్యం                     

   నివసితి ఏవ బహు అల్ప ప్రపంచం కదాపి చేతతి ప్రత్యక్ష  ప్రపంచం

   లేఖిక భుద్ది లోక ప్రసిద్ధి ఉదారబుద్ధి వాగ్దేవి బద్దం 

  సుశబ్ద శోభిత సుందర కోసం భారత వర్షం అనేకవర్ణం  

   రసిక రంజకం దుఃఖ భంజకం పండిత ప్రభవ కవితా తరంగం  

   పండిత పారంగత గీర్వాణ కావ్యం, కారు కృత కావ్యం వాణి సంభూతం 

   చారు సందేశం అమృత భాండం బహు దుఃఖ వారణం ఆనంద సాగరం

   భువనైక సుందర మాంగళ్య తోరణం.  భారత వర్షం సర్వతీ పుత్రం 

   సర్వతీ పుత్రం బహుజన మిత్రం సర్వతీ పుత్రం బహుజన మిత్రం

   కష్టాని క్లేశాని  నిర్భర  లోకం,  దుర్హిత దుష్కృత అవరోధక లోకం 

   అమీవ, కైటవ కాళిందివ లోకం తస్మిన్ లోకే సుక తాండవకృష్ణం.  

   భారత వర్షం తాండవ కృష్ణం తాండవ కృష్ణం కవితా తృష్ణం

   గీర్వాణ నిర్వాణ రాగ సంకీర్ణం…     యాస్యతి నందిని 

   నందనందనం నందనందనం మమ అదృష్టం.


9.   సరస్వతి మాతను ఆవిష్కరించుచు  భారతవర్ష పాడిన పాట  











చతురాస్య ముఖజం  చతుశృతీ  కంఠ నిక్షిప్తం,  

 కమల దళ యుగళ నయన పుటం కచ్ఛపీ  కరభూషితం - భారతీ వందనం 


కళకళలాడే  నీ శశివదనం  సనాతనం శుభకరం - భారతీ వందనం 

సుధలను చిలికే నీ శుభ వదనం,  జ్ఞాన సంగీత సాహిత్య సదనం   

 భారతీ వందనం భారతీ వందనం భారతీ వందనం.

 

బ్రహ్మ ముఖమున శ్వేతాంబరివై   

వేదములొకచేత   వీణను ఒకచేత 

పూని  జనించిన   జ్ఞాన రూపిణి 

 భారతీ వందనం.  భారతీ వందనం. 

 

సరసిజనాభుకు, పద్మభవునకు 

విశ్వసృష్టికి బాసటనొసగిన 

పలుకుజెలికి ఆ విద్యల తల్లికి  వందనం. 

భారతీ వందనం.  భారతీ వందనం.  


నీ కన్నులు  రెండు  కవితాంబుధిలు

ఆ అంబుధిఘోషలు నీ శ్వాసలో కదులు 

అవి కవిహృదయంలో ఆగక మెదలు

నీ ఉఛ్వ్వాసాన వేలభాషలు

నీ నిస్వాసాన వేదఘోషలు 

యోగ్యత భాగ్యము గలిగిన  యోషలు 

మార్చరు  తమతమ వేషభాషలు 

తెలిసిన పురుషులు పరుషములాడక 

సరసముగా నవరసములు గ్రోలుచు 

అన్యభాషలకు అర్రులుచాచక 

నీ పదములపై మధుపములైవ్రాలి  

కవితా సుధలే గ్రోలుచుందురు 


కళకళలాడే  నీ శశివదనం  సనాతనం శుభకరం - భారతీ వందనం 

సుధలను చిలికే నీ శుభ వదనం,  జ్ఞాన సంగీత సాహిత్య సదనం   

 భారతీ వందనం భారతీ వందనం భారతీ వందనం.


నీ శుభ వదనం  ప్రతిభకు  నిలయం,  సుందర కళలకు ఆరంభం 

నీ హృదయం కరుణా  సదనం  సనాతనం శుభకరం భారతీ వందనం   


10. పతాక సన్నివేశం  - ముగింపు  గానం

 భారత వర్షం సారంగం పద తారంగం 

భారత వర్షం పద రంగం పద చదరంగం 

వినువీధి కెగసిన వీరతురంగం విశ్వమానవుని వీరంగం 

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

కౌముది లో కమ్మదనం కౌగిలిలో వెచ్చదనం

అనురాగముతో నీ మెడకి  పూసిన శ్రీ గంధం

రాగాలల్లిన ప్రణయ మారుతం , నీ మనసు కట్టిన  మంగళ సూత్రం

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

భారత వర్షం సారంగం పద తారంగం - 

భారత వర్షం పద రంగం పద చదరంగం -

కృతకర్మ కూర్చిన  ద్రుతవిలంబితం  

స్రుతి స్మృతి సంగమ రాగ చోదితం 

శ్రుత్యంత శోభిత కౌస్తుభం 

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం 

భారత వర్షం సారంగం పద తారంగం - 

భారత వర్షం పద రంగం పద చదరంగం -

అంబరమంటిన కవితా సంబరం 

నీలో నాలో కురిసిన వర్షం, ఒకరికి ఒకరు  అంకితం

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం







Friday, January 26, 2024

ముష్టికి బెనారస్ సంచీ

 కాకికి ఎప్పుడూ  ఎండికలమీదే కళ్ళు 

ముష్టివాడికి ఎప్పుడు ముద్దమీదే కళ్ళు 

తెలుగువాడికి  కెప్పుడూ ఉద్యోగం మీదే కళ్ళు 

చదువు ఎందుకురా అంటే జ్ఞానం కోసం అంటాడు పైకి.  

 అంతా అంతా  కపటం.    లోపల ఎలాబతకాలి 

అని మరణ యాతన. జ్ఞానం కోసం చదువుకి ఎవరు వస్తున్నారు ?

బట్టి పట్టయినా,  కాపీ కొట్టినా పైరవీలు చేసైనా ధ్రువీకరణ పత్రాల 

మీదే దృష్టి అంతా.   చదువు రాత రాకపోయినా ఏం బాధ పడటం లేదు. 

పత్రాలు లేకపోతే ఉద్యోగం ఎలాగ ?  ఉద్యోగంలేకపోతే బ్రతుకెలాగ ? ఇదే బాధ.

మరంత లేనప్పుడు పిల్లలని ఎందుకు 

కన్నావు రా  అంటే?  పిల్లలు లేక పొతే సృష్టి ఆగిపోదూ ?

అంటాడు. హు!  ఇంట్లో కుండలు డింకీలు కొడుతుంటే  

వీడు సృష్టి గురించి మాట్లాడతాడు.  


క.  ముష్టికి  వచ్చిన మనిషి 

కిష్టము ఏమ ను  నుముద్ద  కేడ్చును  గానీ        

ఇష్టము లేనిది జ్ఞానము     

స్పష్టము  మార్కుల ఏడ్తురు  చదువరు లిట్లే   

నువ్వు తినడానికి ఉండి చదువుకుంటూ  లేదా కులవృత్తి ఉండి చదువుకుంటుంటే అప్పుడు చెప్పు చదువు  జ్ఞానం కోసం అని, పొట్టతిప్పలని చదువని జ్ఞాన సంపాదనని చెప్పడం ఏంటి ? 

డబ్బులకోసం చెత్త  సినిమాలు తీస్తూ సినిమా కళ అని చెపితే  నమ్ముతారా? డబ్బు కోసం సినిమాలు తీయడం తప్పుకాదు సినిమాలు తీసి జాతిని తప్పు తోవ పట్టిస్తే ? 

కోర్కెల కోసం పెళ్లి చేసుకుంటే తప్పులేదు స్తొమత లేనప్పుడు 

పిల్లలని కనడం ఎందుకు ?  ( కంటే కన్నారు లెండి )  

ఇంగ్లీష్ తెలుగు కంటే గొప్ప బాష అని చెప్పడం ఏంటి ?

ఇంగ్లిష్ చదువుకోకపోతే ఉద్యాగాలు రావని బెదిరింపు ఏంటి ? 

అసలే మిచదువుకున్న ఉద్యాగాలు రాడంలేదంటూ ఏడుస్తూ 

ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలి అని చంపడం ఎందుకు 

ముష్టికి బెనారస్ సంచీ ఎందుకు ?   



Sunday, January 21, 2024

అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసాడా?

అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసాడా దాన్ని రాయడం అంటారా ?

అది రాయడమే ఏరకమైన రాయడం ? ఐతే అంబేద్కర్ ని ఎందుకు అంతగా పొగుడుతున్నారు ?


There are very few people who care to watch to grasp the truth. Watching superficially will seldom lead to truth. A fewer people care to read to grasp the truth. But people promote some videos or post and spread untruth or half truths thniking that they are suffering to educate the people. Actually they don't suffer for truth or atleast they don't think if it is truth or not. They simply share a post or video. Why they share a certain video or a post that it is popular or it benifts their agenda and justifies their group.

Amdedkar is the architect of the Constittion. This is what they say.

ఒక్క బోయ మాత్రమే పల్లకీ మోయగలడా ?

ఒక స్కూల్లో అనేక మంది ఉపాద్యాయులు ఉండగా ఒక్క టీచరు మాత్ర మే స్కూల్ లో అన్ని సబ్ జెక్ట్ లు, అన్ని పాఠాలు చెప్పేస్తు న్నాడు అంటే ఎలా ఉంటుంది ?


అలాగే ఉంటుంది అంబేడ్కర్ ఒక్కడే రాసాడంటే. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసాడు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసాడు. దాని ముందూ వెనక ఏమీ ఉండదు. ఇది అద్భుతమైన విషయంగా నీకు అనిపించింది. నేను భారతవర్ష 1265 పేజీల తెలుగు సరళ గ్రాంధిక ప్రబంధం రాసాను కదా. అది అద్భుతం కాదా. కాదు. ఎందుకంటే భారతవర్ష నవల అది రాజ్యాంగం. ఈ రెండింటిని పోల్చకూడదు. కష్టం ఒక్కటే. కానీ అదేం లెక్కలోకి రాదు.

రాజ్యాంగం రాయడంలో 15 మంది మహిళలు ఉన్నారన్న సంగతి తెలుసా? వాళ్ళు లెక్కలోకి వస్తారా ? అబ్బే వాళ్ళు లెక్కలోకి రారు.

వాళ్ళ గురించి మనం లెక్కలోకి తీసుకోకూడదు. గొప్పతనం అంతా అంబేడ్కర్ కే ఆపాదించేద్దాం. అంబేడ్కర్ ఒక్కడే గొప్పవాడు. మన ప్రయోజనాలు మనం చూసుకుందాం. కానీ రాజ్యాంగం రచనలో పాల్గొన్న 15 మంది మహిళలు కానీ గొప్పతనం తెలుసుకుందాం.

అందులో కమలా చౌదరి ఒకరు.

ఆమె అమెరికా మిచిగన్ యూనివర్సిటీ నుంచి పీ. హెచ్. డీ. చేసి ఐ. ఐ .ఎమ్. ప్రొఫెసర్ గా, రీసెర్చ్ సెంటర్ లకి డైరక్టర్ గా, హార్వర్డ్ విసిటింగ్ ప్రొఫెసర్ గా, ఇంకా అనేక ఉన్నత పదవులలోప్రకాశించిన సంగతి తెలుసా ?

లీలారోయ్

మహిళలకి ప్రవేశం లేని దాకా యూనివర్సిటీలో ప్రత్యేక అనుమతితో చదువుకుని వాళ్ళని ఎంత ప్రభావితం చేశారంటే, ఆ యూనివర్సిటీ లో ఒక భవనానికి ఆమె పేరు పెట్టారు.

సరోజినీ నాయుడు గొప్ప కవయిత్రి కూడా రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు. కవులు అంటే మనకి చిన్న చూపు పీ.హెచ్.డీ. లు ఉండాలి, అవి కూడా సరిపోవు పదవులు ఉండాలి. అది కూడా సరిపోదు వారిని డబ్బు అధికారం ఉపయోగించి ప్రచారం చేయాలి. అలా చేస్తే చేస్తే మనకి ఎక్కుతుంది. మనం చదివి తెలుసుకోము. చదివే శక్తి, ఆసక్తి లేవు. పక్కవాడు ఎవడైనా ఏకీభవించక పోతే తిడతాము. ఎందుకు తిడతాము? ఎందుకంటే మనకి ఒక గ్రూప్ లో చేరి రాళ్లు రువ్వడం అలవాటు కదా.

రాజ్యాంగ ధర్మాసనం కావాలని 1935 లో బ్రిటిష్ వారిని కోరింది రాజాజీ. బ్రిటిష్ వారు దానిని 1940 లో అంగీకరించారు. రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్ రాజాజీ కి ఎందుకు ఇవ్వకూడదు? కీ సి ఆర్ కి తెలంగాణ ఉదయ నాయకత్వాన్ని ఇచ్చాము కదా?

బీ. ఎన్. రావు మొట్టమొదటి రాజ్యాంగ డ్రాఫ్ట్ ను తయారు చేశారు.
రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్
బీ. ఎన్. రావు కి ఎందుకు ఇవ్వకూడదు?

60 రాజ్యాంగాలనుంచి విషయాలను తీసుకొని అనేక మంది అభిప్రాయాలని తీసుకుని సవరిస్తూ పోగా సుమారు 3 సం. (2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు) పట్టింది.

మహాభారత రచయిత వ్యాసుడు అంటాము వినాయకుడు అనం కదా!


***

అంబేద్కరే రాజ్యాంగ నిర్మాత. అని మీరు వాదిస్తే నేను చెప్పేది ఏమీలేదు. నిజం చెప్పగలం తప్ప వాదించి ఒప్పించలేము. ఎవరికో నిజం చెప్పాలి ఎడ్యుకేట్ చేయాలి అనుకోడం ఏంటి. మనవాళ్లు చదువుకోలేరు ? వేరువేరు చోట్ల చదివి తెలుసుకోలేరు. ఇంతా రాసినా ఈ వ్యాసం చదివేవారు ఎందరుంటారు?

ఇలాటివి నేను రాయకుండా ఉండడానికి కారణం నా రచన, నాసమయం పాడవుతాయి. ఎవడైనా గొడవపెట్టుకుంటే మూడు కూడా పాడవుతుంది. నేను భారతవర్ష లో లక్షల అక్షారాలని పదం పదం టైపు చేసుకుంటూ, పదం చెక్ చేసుకుంటూ నిద్రాహారాలు మాని అచ్చతెలుగులో 2 లక్షల 50 వేల పదాలు టైప్ చేసాను. చక్కటి ఛందస్సుతో వందల పద్యాలు రాసాను. కొత్తతరం తెలుగుకి ఆకర్షితులవ్వాలని పెద్ద ప్రయత్నం చేసాను. అయినా చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు చదవకపోయినా మనకు తృప్తి ఆనందం కలుగుతాయి. గుర్తింపు వస్తుంది. అదిచాలు.