Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, December 29, 2021

After 13 years - 10 sonnets

My Delhi friend Avdhoot is in now in Bombay. He visited Pithapuram near Kakinada. After Darshan his family was going back to Bombay. He boarded Kakinada to Tirupati express train (from Tirupati they fly to Bombay.) with  his family which passes Vijayawada. 

He called me in the evening and asked if I could meet him at the Railway station at 7.30 that evening? I said it was my pleasure and started at 6.00 pm from Vanukuru village and reached Railway station at 6.50. It was too early. I was saddened with the announcement that the train comes late. I reached the platform no.7 and had a big trouble in reaching his box because the number given to his box is not a prominent number.  I ran from one end of the platform to the other end to spot out his carriage.  Finally I met him.  These poems tell how I met him in Delhi and after how long I meet him 

 

How I came to Vijayawada from India's Capital

1. Time chases    

In 2008 I remember I met him in Delhi

He walked silent confining to night's realm

As truth unfolds he appeared so special like lily 

A fate shunted friend who took the life's helm  

leading discussions of skepticism without restraint

nurturing  only the milk fruit diet at night

we chat until night grows old and faint  

the discourse goes on without a fight

Rarely we on the roads of Karolbag  roam 

Often our thoughts and voices blend

making time great as we walked from home

Never we had the occasion to bend or defend

O my my  the time has suddenly farted

 I to Vijayawada abruptly started. 








How I spent my time in Vijayawada

2. The Tussle 

My thirteen years the python  has swallowed 

I  wearing long and solemn face

her ( time) orders meticulously followed 

The rumbling winds of south have no grace 

Leaving the noise on the earth

I flew until I touched the  rainbow

 Tried to seize the silver moon for its worth

I had a thud fall with rainbow wings, don't know how

I fell to the ground.  It is hot afternoon. 

The moon is shining  bright in the sky

One can't  the moon for himself keep but its boon 

I dived into the pool - romancing, don't know why

Lo!  the moon is floating in the water 

I have the moonlight , the moon doesn't matter.


How I met my Friend.

3. In Delhi

Devnagar was not a place so beautiful

 Where we in tiny apartment lived

 He was always preoccupied and dutiful

 As a financial advisor he thrived

His  working  hours are so weird  

He reaches home at the dead of night 

A few seconds on the stairs he appeared 

and passed quickly out of sight

He worked hard to win IAS

Day time he is in American Library

where the world with him can not mess

What a quiet place really a sanctuary

His goal sets him on fire

so usually he after midnight to bed retire.

His words with spiritual fragrance are just like musical notes

4. The Immortal Musical note 

I  trudged in the dank fields 

miles and miles until my wounds healed

I found the diamond that time wields 

my rainbow wings are slowly pealed 

whilst the dissonance an old musical note

came from the west  touched my ears

to which thirteen years ago I my heart devote

the immortal musical note is back, cheers!!

the scathed spirits  that lie scattered 

recuperated and in the warmth of friendship 

the woeful groans that clattered 

vanished, life rejuvenates in spiritual partnership

the truth that time can't destroy  

true friendship is truly an unending joy.

We are flung apart. I to the south and He to the west by time.                                                    We never thought we would meet but we are destined to meet again. 

5. God's design 

 Suddenly my  telephone rang

 My friend Avdhoot is on the line

 My train passes your town he sang

 Thirteen years later, it's God's design

The  Station is from my house  far  

Twenty kilometres from the village

I thought I should go by car

I know I don't get the mileage

There isn't much time left 

these days the traffic is more

In such a moment bike is a gift

Car is difficult and so I abhor 

Before I decided I thought twice 

and made a choice so nice

Certain things happen slowly. Like meeting a good friend.                                                                          Certain things don't happen in my life but allure. 

6. God's Philosophy 

Slow and imperfect God 

though art the mightiest

whatever guilty and odd 

you do you are on the crest

you are beyond human logic

which is the essence of intellect

but you rule the world with magic

your ways are always correct

symbol of love thou art

our deeds you judge and punish

to redeem humans in our court

but the same love us tarnish

you just have all pleasures

oh you have two different measures


My Ride to Railway station

7. Night's air

His train is running on the track

perhaps he reaches in an hour

The thoughts in my mind crack

The traffic was really slow and sour

The  roads were eclipsed with traffic 

I saw traffic eclipses everywhere 

Oh that is the city's graphic

everyone had to stand and stare 8

Road eclipse our patience steal 

Like the jilts who kill our zeal

and punctures that stop our wheel 

but heart of steel should never feel

The traffic was free when it was seven

I moved swiftly feeling it was heaven


My wait in station for the friend.

8.  Long wait 

I dashed into station's east gate

Much before the train arrived

I surely miss him if I am late

to avoid that I so much contrived

Time is  Maker's providence to mend

 the ills of man but  for sure it's hell

when you don' know how to spend 

it, and simply resort to kill

Oh! the train is late by an hour

If I go back home without waiting 

how can I my friend honor 

I started with myself fighting

Time is not providence  but hell 

when you don't know how to kill

  

9. Chaos on the Platform

How can I for the train wait up to eight

My splendour  flew as fast a thunder 

I reached in time. It seems like ill-fate 

The train is late by an  hour, no wonder

The rustic railways me stagger

I walked amid the sleeping people 

I felt like the time is steel dagger

soared long and steady like an eagle

The train came on to the platform nine

He said his box is AE  before I reached town  

I ran like mad for the box that has no sign

A dozen times I ran up and down 

Thirteen years later I'm going to see the friend  

Who has in my mind created a spiritual trend


10. Meeting on platform

Before I spotted his box I spotted his face 

I found it on the body standing on foot board

I remembered my silly Delhi days

of the mechanical life and what I scored

The engine stopped, he from box jumped

under shining lights I saw his full form

we on each other oodles of smiles dumped 

We forgot that we were on the platform

The train stops only a few minutes here

The giant railway clock me terrified

we can not speak much that's clear

naturally the enthusiasm was paralyzed 

Soon the whistle is heard the engine heaved

I realized he had gone and from there moved.


 










 


 












My journey in sonnets

I have a recording task at Bheemavaram. Miss.Srivalli the Padutha teyagaa fame  singer agreed to sing Bharatavarsha keerthanas at Vihnu Bheemavaram.  Since she lives in Bheemavaram I fixed the recodring deal  at Vishnu Radio. They offered me very generously without taking money. I started to Bheemavaram by Honda Splender before dawn. I was cutting  through the veils of fog.  The sonnets reveal my experience. 

   Winter Morning Ride

   I set out to Bheemavaram on  a foggy morning

   It was still dark in the wee hours, I haven't seen crows

   The potholes on the bumpy  road  are a warning 

  Through-out, the rugged landscape a big challenge throws

   Sometimes too thick is the fearsome cloud of mist

   A one eyed truck  sights , comes on to my motorcycle

   Like a  boulder the mist rolls on the road and  hits my chest

   Many a danger in the semi-darkness is likely to kill

     The truck vanish't, schools, temples, churches cheer up mind

     Here and there I saw the  wonderful  quaint villas   

     All run fast, backwards  my childhood remind  

     My heart glows warm with quiet bougainvillas 

    The mist slowly melts,  the temple bell  rings 

    The day grows bright,  the church choir sings


Yahoo! My dream comes true

The weather is bleak and wind blows strong 

The birds shiver on the branches around

The herds on the choppy road I get along

The way side reeds wave heads on marshy ground

The fog was hanging like a white curtain

All along the road stretches  the canal

It looks like black and white movie for certain

But the villas and bougainvillas are never banal    

How hurriedly passes  the willy jeep

At Hundi it raises the dust like a broom

How merrily walks the sheep 

Oh the golden sun rays  my feelings groom

I remember that I am nearing my dream 

Yahoo I what a lovely journey I scream


 


Saturday, December 25, 2021

Unforgettable Decembers

2015 December visited Aruku and Borra Caves   

2016  December visited Matturu where I finished my French Novel.  

2017 December bought a house in Vanukuru 

2018 December visited Delhi JNU

2019 December visited Pamarru School to spend with favorite Friend

2020 December - Corona Lock down

All Decembers are great and unforgettable. 2021 December is the greatest.  

                                       2021 December

                                   Bharatavarsha keertanas being sung by Srivalli

                     

                     
                                 

                                  



                                        2020 December - Corona dread 


 2019 December -Visiting Pamarru



2018 December - Visiting Delhi 
Marriage in Delhi

Friend's marriage in Delhi



2017 December - Grihapravesam

House warming ceremony 




2016 December - Visiting Mattur
French novel climax was written here




2015 December - Visiting Aruku

                                

Monday, December 20, 2021

పూలబాల

నిన్నరాత్రాంతాయూ  పెద్దపులులతో యుద్దము జేసినాను. తెల్లవారినది ఇంకనూ ఒక పులి కనురెప్పలపై కదిలాడుచున్నది. 100 శార్ధూలములుతో ఒక సంపూర్ణ శార్దూల కావ్యమును వ్రాయ సంకల్పించితిని. ఇంతులకు బంతులాట వలె పురుషులకు పులులాట.  

పల్లవములు ధరించి  జాజితీగ వంటి   ఒక  ముగ్ద మనోహర పూబాల  పూలోకమందు  విహరించు చుండును.  యా జలనేత్రి  జింకపిల్ల వలె  వనముల సంచరించుచు.   ఆ వనవిహర్త   పూలభాష   నెఱుగుటచే పూల గుసగులాలకించుచు  తాను  చూచినద్భుత వనాలను వర్ణించుచుండును. పిట్టలతో కూడి పాడుచు, కీరములతో క్రీడించుచు, మయూరములతో నర్తించును. 



తుమ్మెదలామెను చూచి పుష్పమణి భ్రమించి వాలుచుండును. ఆ పద్మాక్షి  తుమ్మెదలతో పోట్లాడు చుండును, ఆ మీనాక్షి సెలయేళ్ళ బడి చేపవలె  ఈదు చుండును, జలపాతములకడ  జలపాతమంటి  తన ద్రాగిష్ఠ  కేశములు సడలించి స్నానమాడుచుండును. పాయలువారిన ఆమె కారు కుంతలములను చూచి జలపాతములు సిగ్గుపడును. 

 ప్రభవ అను ఒక గొప్ప లేఖిక  గాయకుడు - లైర్ ( తీగలుండు వాద్య  పరికరము ) తయారు చేయించుటకు కేశపుష్పవృక్షము కొరకు అతడు అడవిలో వడ్రంగి తో కలిసి వెదుకుచూ జలపాతములకడ స్నానమాడుచున్న పూలబాలను  పొదల మాటు నుండి  చూచును.  దానిమ్మ గింజల వంటి పళ్ళు, నారింజ పళ్లవంటి సొంపైన వక్షము, పూదేనియలొలుకు పెదవులు చూచి  చూచుటకు రతీదేవివలెనున్న దనుకొని  ఆమె  ప్రేమలో పడును.  అతడు తన ప్రేమను నేరుగా చెప్పలేక  అచ్చటనుండి వెడలిపోవును.    

                                                     ***

పూ, పక్షి,  పల్లవ,  భంబురముల మైత్రిని బడసినా  జవ్వని నవ్విన పువ్వులు వికసించును,  శ్వాసించిన పూతావులు గుభాళించును, భాషించిన పూలు మురియును.  ఆమె  దేహము బంగారు కాంతులీను చుండును.  ఆమె అందమునకు ముగుడై ప్రభవ  ఆమెపై పాటలు రచించి పాడును.  అతడు పాడుచున్న ప్పుడు  చిలుకలు తూనీగలు  అతడిని చుట్టుముట్టును.  ఆ చిలకలందు ఒక చిలక  వనదేవత.  తూనీగలన్నీ  సూక్ష్మ రూపములోయున్న అప్సరలు. అతడి గానమునకు కరిగి అవి వాటి రూపములను బైటపెట్టక  అతడి గానమును ఆలకించుచుండును. చిలకలా గానమును  Spring girl కడ  గానముచేయగా చిలకలద్వారా ప్రభవ గొప్పతనమును తెలుసుకొని అతడిని చూసి ఆమె కూడా అతడిని ఆరాధించును. వారిరువురూ ఒకరినొకరు కలుసుకొని ప్రేమను తెలుపుకొందురు. ప్రభవ తన పూలతేరుపై   స్ప్రింగ్ గర్ల్ నెక్కించుకొని పెక్కు విహారములు చేయును మన్మధుడు వారిని చూచి తన పూ శరములను ప్రభవపై గుప్పించును, మూహమును పెంచును. ఆ తేరులో వారు శృంగారము క్రీడలాడుకొనుట చూచి ఓర్వలేని దుష్టశక్తి "దశరూప" వారి విడదీయును. 

స్ప్రింగ్ గర్ల్ వంటరి విరహము లో యుండగా ఆమెను వలచిన ప్రియులు ఆమె చేతి నందుకొనుటకు చూతురు. స్ప్రింగ్ గర్ల్ ని పర్వతరాజు, ఇంద్రుని కొడుకగు మిధుషుడు  కోరుకుందురు.   మిదుషుడు  ప్రభవ ను పిడుగుపడునట్లు చేసి మట్టుపెట్టును.   ప్రభవ  చేసిన పుణ్యముండుటవల్ల ఆత్మ  స్వర్గమునకు బోవును. కొలది కాలము అతడిని స్వర్గప్రాప్తి అభించెనని దేవరాజు చెప్పును. అరణ్యమందు అతడి శరీరము ను  వడ్రంగి లైర్ గా తయారు చేయును. 

మిధుషుని ప్రభవ పూలబాలని పెండ్లి ఆడవలెనని  కోరును.   ప్రభవ పాట  లైర్ యందు  వినిపించి స్ప్రింగ్ గర్ల్ ను సేదతీర్చును. ప్రభవ గాన  ప్రేరణచే  స్ప్రింగ్ గర్ల్ ను ఇంద్రుడు  స్వర్గమునకు కొనిపోయి మిహుషు నికిచ్చి వివాహము చేయును. స్ప్రింగ్ గర్ల్ వివాహము జరుగురోజు ప్రభవకు స్వర్గమునందు ఆఖరిరోజు. ప్రభవ అత్యద్బుతముగా గానము చేసి సభను రంజింపజేయును. వివాహమైన పిదప ప్రభవ అంతర్థాన మగును.    

                                                                     ***    

  

వనసౌందర్యము, వనితా సౌందర్యము, ప్రక్రుతి సౌందర్యము  పూలగుసగుసలు, పూలబాల సంభాషణలు  వెరసి ఇది సంపూర్ణ శార్దూల శతకము.  ఇది అనేక పుష్పముల పేర్లు కలిగిన పూర్తి పద్యకావ్యము.  అర్ధములు తాత్పర్యము ఇవ్వబడును.    

                                                                       ***

The following poems are to be organized into chapters with titles  such as 

1. The Spring girl  2. The forest and its beauty  3. Bumble Bees and her fight  

4. whispering of flowers   5 Spring girl speaking with flowers.   6.  Playing with parrots

7. Dancing with Peacocks. 8. Falling in Love    9. Euphoria 10. Strolling by his cart

10. Cupid's role   12.  Jinx  (evil element)    13. Estrangement  14. waiting  15. Indra's son

16. She drops her lover  17.  Suitors wooing Spring girl.  18. Lover's death.  

19. Lover goes to heaven.  20. Lover  organizes Spring girl's marriage in the heaven. 



  1   శా. పూలల్లో   తిరిగే  టిబాల  వెలిగే   పుష్పాలం  కృతబ్ర స్వజన్            

            చేలల్లో   మెలిగే  టిబంగ  రులతన్   జితక్రో  ధమందా రమున్    

             నీళ్ళల్లో   మెరిసే   టిచేప   లమిరే  నెనేత్ర   ద్వయంబం  దునన్    

              ళ్ళల్లా   మెరిసే టివంపు  లమిరే   రోజా  లచందా లకున్    

              

           అబ్ర =     ఆకాశం ;   స్వజ = కూతురు ; జితక్రోధ  కోపాన్ని జయించిన 


  2 శా. మాయాజా  లముపూ  లుగంధ  మునుచి   మ్మగాలి   శృతేపా  డగా            

          సాయాహ్న   ప్రభవ    సౌరంట    గతోట      రాగా    లనింపా  రదా                      

         ప్రాయాను  న్నలలా   మకళ్ళు   బులిపిం     పగప్రీ    తుడేన   వ్వడా  

          వాయాడి  యైననో    రుమూసి    తనువే     యారం  గఅర్పిం చదా  


 3 శా. అందాలే విరిసే   నుమల్లె   విరబూ తోటం  తనవ్వే  నుగా 

         చిందాడే లతికా  గ్రమల్లి   పెనవే    సిముద్దా   డచామం తులన్    

         చందాలే  వెలిగొం దెచంప కముకాం  నంబ య్యెనేత్రా  లకిన్                   

          బంధాలే  ర్పడిపూ  లబాల  నిలిచే నమె  ల్లశోభి   ల్లగన్


4  శా. పారాణి   ద్యుతిపా     రికెంపు  సిరిశో     తోటం  తవ్యాపిం  చగా                                    

          ధారాళం  బుగగా      లివీయ   కురులే     రంగా  లుగామా  రగా  

         తారాడే   సితపూ      లబాల    నగవం    కాంతుల్   ప్రభవిం  చగా         

         పారాడే   పరిచే         లమేల    తలనే    ప్రమోదం  బుగాన  ల్లగా


5. శా. టాడే   విరిబో  డిచూచె  విరులే   సించ  ప్రమోదం బుగా

        మాటాడే కుసుమా  లుకూడి  మురిపిం  పూబా  లముద్దా డగా 

         వేటాడే   భ్రమరా   లుబాల  నుపుష్పం   బిదేనం  చుకాటే యగా   

         పోటాడే  నలివే   ణిబంభ    రముతో    ముద్దుగా రుభాషా డుచూ 


6 శా. పూలంగి  వ్రతమం   దురేమ   నుజులా   వ్రతాల న్ని దోషం బులే   

        చాలింక    వ్రజవ     రకావ   మనెపూ   చేమం  తిపూవా ర్తిగన్    

        జాలింత   ప్రకటిం     చరేయ   నుచుపూ   సంపం గివాపో వగన్       

         ఆలించు  వ్రతపూ    లబాల    కనులం    నుక్రో   శమేచూ పడెన్ 

 

7 శా.  కొండల్లో  తిరిగా  డిపాడు   తరుణీ  కురంగా  క్షిపూభా సలన్               

         గుండెల్లో నిలబె  ట్టిపారు  తురవా     గులందా   డిచర్లా  డగన్       

         ఎండల్లో తిరిగే  టిఘండ  ములుచూ  చెసంగే    నుసయ్యా  టకున్  

         పండల్లే  మెరిసే  లతాంగి   పరితా     మందీ    దులాడ ల్లనన్

              

 8 శా. వాలాద్రీ  అలవే  ణిమీద  భవధా  కేశి  ప్రకాశిం చగా 

         వేలాడే  విరజా  జితీగ  మురిసే  విశాలా  క్షిముద్దా డగన్

         మాలాదీ  పకసో యగాలు  కనియా దాలా పికూకూ యనెన్  

          లాజా  లముక  ల్గికీర  ములుతీ  గ క్రీ   క్రియంచా డగన్  

 

   9. శారాగాలా  పనజే   సెబుల్బు  లుమయూ  మేనా  ట్యమేచే యగా      

            భోగాలే  వియుసా  టిరావ  నుచుసో  ముడేఈ  లలేవే  యగా

            గ్గా లే  విడిచా    డిబాల    నుపరా   త్ప రాయం  చుముద్దా డగా    

            భోగతృ  ష్ణపరా యణీయ గుచుపూ వులందా కిరత్నా లబాలా డెనే   


    10  శా.  సీవ  న్నెలరా  సిబంతి   కనవే   ష్ణాంశు  ప్రభాతం  బునన్    

              బాసిల్లం బరమం   తఅల్లె   నువిభా  భక్తి  ప్రభోద  మ్ముగన్

              రాసక్రీ   డకుబో  యినాను మరిధీ  ర్గరాత్రం  తవాసిం చుచూ

              సీమ   ల్లి సరా   గమాడి  అలిసే   నుదాత్త  ప్రమోద  మ్మునన్ 


      11 శా. మోదంబే  కలిగే  నుపూల మధుపం బులక్రీ   డలంచూ డగా 

               వాదంబే వలదిం  కచూడ   నరజ    న్మకాదిం కపూలా రిటన్

               పాదంబై ననులే దుగామ  నకుజీ   వముంజూ  డ మూణ్ణా ళ్ళ కున్

               హ్లాదంబే  కదర   క్తి ముక్తి   ఫలాలే   సిం చే  గపొందాలికన్ 


     12   శా.  నిత్యానం   దముగా  దెపచ్చ   వనరా      ణిసౌంద   ర్యమేచూ చినన్       

                 అత్యానం    దముని    చ్చుచెట్లు    నదులే   అముక్త   మైపారా    డగన్

                ముత్యాలెం  దుకులే   జలాలు    సిరిడా    బుచింద    భ్రమేకు  ర్వగన్                     

                 సత్యమే    అడవం    తఆకు     లలిమే   సరాగా    లుపూయిం చగన్   



Monday, December 13, 2021

Michelle's story

  దినమణి  నడినెత్తికి చేరి తెల్లని కాంతి రేఖలు  విరజిమ్ముచుండెను. ఆ కాంతి పుంజములు రహదారికిరువైపులా  యున్న దుకాణముల నున్నని రేకు,  గాజు పలకలపై పడి పరావర్తనం చెంది    కనులు మిరుమిట్లు గొలుపుచుండెను. నెత్తిపై కండువా కప్పుకున్న వ్యక్తి చేతులో నల్ల సంచితో వడివడిగా నడుచుచుండెను. అతడు ఊరిమధ్యలోనున్న ఎం ఎల్ ఏ సింహాచలం ఇంటివద్ద ఆగెను. ఆ ఇంటి ముంగిటనున్న విశాల ప్రాంగణమంతయూ వాహనములతో నిండి యుండెను. అందు ఇన్స్పెక్టర్ గారి వాహనము కూడా ఉన్నది.  ఆ ప్రదేశమంతయూ పార్టీ కార్యకర్తలతో సందర్శకులతో  కోలాహలంగా యున్నది. ఆ కండువా కప్పుకున్న వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించెను. అతడి వాలకం చూసి అక్కడి వారతనిని అడ్డుకొనిరి.  ఇంతలో ఇన్స్పెక్టర్ బయటకువచ్చి అతడి వాహనమెక్కి వెడలిపోయెను. పిదప ఒక బృందం లోపలకు ప్రవేశించుచుండగా వారిని తోసుకుని లోపలి పోయి ఆ నల్లని సంచిని సింహాచలం చేతిలో నుంచెను. సింహాచలం “పెంచ లయ్యా! ఏమి ముసుగేసుకొచ్చినావు? నల్ల సంచిలో తెచ్చితివా?” అని నవ్వగా పెంచలయ్య “తెల్లడబ్బే తెచ్చితిన”నెను. సింహాచలం అతడిని ప్రక్క గదిలోకి పంపివేసెను. అప్పుడే ఒక సమూహము చొచ్చుకొని వచ్చెను. వారు ఒక భూవివాదపు గొడవ పరిష్కారనిమిత్తము వచ్చినవారు.

సింహాచలం తన అనుంగుడు చిక్కణకి వారి తోమాట్లాడమని సైగచేసి “రత్నా!” అని పిలుచుచూ సంచితో లోపలి పోయెను. ఆ సంచిని రత్నకుమారి చేతిలో పెట్టి కాఫీ త్రాగుచుండెను. చిక్కణ వారిని కూర్చొండబెట్టి  ఎం ఎల్ ఏ గారు మీ ఇవరితో విడివిడిగా మాట్లాడినారు కదా మీరు అయన చెప్పిన షరతులకు లోబడి పరిష్కారము మీ కిష్టమేనా అని ఇరువర్గాలవారిని అడిగెను. అందొకవర్గము వారికి ఆ షరతులు నచ్చలేదు వారు అదే చిక్కణ కు చెప్పగా “ఎం ఎల్ ఏ గారు చెప్పినది న్యాయమార్గమే అవతల వర్గమువారు కూడా ఇవే షరతులకు ఒప్పుకొని వచ్చినారు మీకు నచ్చనిచో ఇంక మీరు భూమిపై ఆశ వదులుకొనుడు. మీ సంగతి  మండలాధికారి చూచుకొందురు” అనెను “మండలాధికారి మమ్మల్ని భూఆక్రమణ దారులనుచున్నాడు. ఏబది ఏళ్ళనుండి మాసాగుబడిలో నున్నదా భూమి. మావద్ద పట్టా కూడాఉన్నదని మా నాన్న రైతు కానీ నేను చదువుకొంటినని అందొకడు గొంతుపెంచెను. ఈ లోగా  డబ్బులెక్క పెట్టుకొని సింహాచలం మరలివచ్చి భూ ఆక్రమణ చట్టం క్రింద ప్రత్యేకన్యాయస్తానానికి  సర్వే నెంబరు 27 ఆక్రమణ భూమి అని స్వాధీనపరుచుకొనవలసినదని అభ్యర్ధన చేయును. అప్పుడు నీ పాతికెకరములకు నీళ్ళొదులుకొన వలసివచ్చును. అంతర్జాలమందు గొండ మల్లయ్య కేసును చరవాణిలో చూపి చదువు వచ్చినచో గొండమల్లయ్య కేసు చదువుకొనమని వారిని బెదిరించగా కడకు వారునూ సరే అనిరి.

 రాతకోతలు పూర్తయ్యి భూతగాదా బృందములు నిష్క్రమించినవి  “ఒకరి పైకి మరొకరిని ఎగదోసి ఇరుపక్షాలనుండి భూములను గుంజుకొను నక్కజిత్తుల మారి మనము కలహించుకొని వీడి కంట పడి చెరొక ఐదు ఎకరములు వీడి పెళ్ళాం పేర రిజిస్ట్రేషను చేయవలసి వచ్చినదని రక్తము మరిగిపోవుచుండగా నిస్సహాయముగా “వీడి పెళ్ళాం ముండమొయ్య”   అని సింహాచలమును కసిదీరా తిట్టుకొని వెడలిపోయిరి. 

అట్లు వారు వెడలిన మరుక్షణము మరొక చిన్న సమూహము ప్రవేశించెను “వుయ్ ఆర్ ఫ్రొమ్ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్” అని వారిని వారు పరిచయము చేసుకొని సింహాచలముతో “దేవాలయ స్థలములో పెంచలయ్య చర్చ్ నిర్మించుచున్నాడు. మేము అతడిపై కేసు పెట్టవలెనని చూచుచుండగా ఇన్స్పక్టర్ మమ్మల్ని నిరుత్సాహ పరుచుచున్నాడు. మేము న్యాయస్థానమునాశ్రయించెడి వారమే కానీ గోటితో పోయేడి  దానికి గొడ్డలెందుకని మీ వద్దకు వచ్చినాము.” అనెను. “అవి ప్రభుత్వ స్థలములు పెట్టినచో మేము కేసుపెట్టవలెను. మీ కేమి సంబంధమని సింహాచలము అనుచుండగా నరసింహ దేవస్థాన అర్చకులు మరియు కమిటీ పెద్దలు ప్రవేశించిరి. వారు చేతిలో పత్రములను చూపుచూ ఇవి  దేవాలయ స్థలములు. మీ ప్రభుత్వ స్థలములను ఆక్రమించు కొని  చర్చ్ లు కట్టి వేయుచున్ననూ మీరు మిన్నకున్నారు. అది మీ ఇష్టము. మా దేవాలయ స్థలములను ఆక్రమించినచో  గొడవ చాలా దూరం పోవునని హెచ్చరించిరి.

చివరిగా నరసింహ ఉపాసకులైన దేవాలయ అర్చకులు రమణాచార్యులు “హిందువులనిన  ఎందుకండీ అంత చులకన?  మీరు ఎప్పుడూ ఆ మతము మారిన పెంచలయ్య నాగిరెడ్డితో అంటకాగుచూ వారిని వెనకేసుకు వచ్చెదరు. మీరు కూడాకిరస్తానం పుచ్చుకొనినారా? అంతమాత్రముచేత దైవమాన్యములను కూడా కైంకర్యము చేయవలెనా?  ఆ నాగిరెడ్డి తమ్ముడు జేసిన పనికి మహిళా సంఘములన్నియూ అతని ఇంటివద్ద ధర్నా చేయుచున్నారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు ధర్మమును  కాపాడినచో దేముడు మిమ్మల్ని కాపాడును. లేనిచో... మీ ఇష్టము”

   “ఆ సింహాచలేసునిపై ఆన నేను కిరస్తానము తీసుకొనలేదు!  అతడి సంగతి నేను చూచెదన”ని నచ్చజెప్పి సింహాచలం వారిని పంపివేసెను. వారు పోయిన పిమ్మట పెంచలయ్య ముందరి గదిలోకి వచ్చెను. రత్న కూడా వచ్చి నిలిచెను. కళాహీనమైన సింహాచలం ముఖమును చూచి “ఏటి ఆ ధర్మోపన్యాసం వినేసి తెగ ఆలోచించేత్తన్నావు? రచ్చకుడు మా పెబువుంటుండగా నీకేటి బయం”అనెను. రత్న“అర్చకులు నరసింహో పాసకులు ఆయన దీవెనెంత చల్లనో ఆయన కోపమంత ఎర్రన.  ఆయన శాపము యమపాశమ”ని దేవుని మాన్యముల విషయములో తల దూర్చ వలదని జెప్పెను. అటులనేనని ఆమెను లోపలి పొమ్మని సైగచేసి నేను పెంచలయ్య తో “నాగిరెడ్డి నెట్లు రక్షించవలెనని ఆలోచించుచున్నాన”నెను.

“నాగిరెడ్డి ఇక వలదని ఆ స్థానము నాకిచ్చినారు కదయ్యా మరల అతడిని రక్షించుటా!” అని చిక్కణ సింహాచలం వైపు అయోమయముగా చూచు చుండెను సింహాచలం   “హ హ్హ హ్హ హ వాడినుంచి నన్ను నేను ఎట్లు రక్షించుకొనవలెనని ఆలోచించుచున్నాను.” వాడి తమ్ముణ్ణి ఊబినుండి లాగుటకు ప్రయత్నించిన నేను ఊబిలో కూరుకుపోవుట ఖాయము.  కానీ ఇంత కాలము నా ఇంట కాలము గడిపినాడు కావున ఏంతో  కొంత ప్రయత్నము చేసెదను." పెంచలయ్య "అంటే మరేటి నేదు ఆడవసరము ఇంకొద్దిగున్నాది" సింహాచలం "హ హ్హ హ్హ హ నీవు రాజకీయాల్లో ఉండవలసిన వాడివి సుమీ! “హ హ్హ హ్హ హ”  పెంచలయ్య కూడా  సింహాచలంతో శృతి కలిపెను. చిక్కణ కు వారిరువురు బేతాళ మాంత్రికుల వలె నగుపించిరి.

 అంతలో నాగిరెడ్డి వచ్చెను సింహాచలం “నాగిరెడ్డి నేను బైటకి పోవుచు న్నాను నీవు పోయిరమ్ము. ఆగాగు నీవు.. నీవు ఇచ్చటకు రావలదు కొద్దిరోజులు ఎచ్చటికైననూ పోయి తలదాచుకొనుము.”  “మరి నా తమ్ముడి  సంగతి?” నాగిరెడ్డి అడిగెను. సింహాచలం మాట్లాడకముందే చిక్కణ "అయ్యగారినడుగుచున్నావేమి? అయ్యగారు గోశాలకు  నిప్పు పెట్టమని చెప్పినారా?” నాగిరెడ్డి “అయ్యగారి కుడిభుజము నేను.  నేను  చేయుపనులను నీవు చేయుచూ నాకే చెప్పుచున్నావా?” చిక్కణ “అయ్యగారు భుజము మార్చుకొనినారు. ఇకపొమ్ము.” నాగిరెడ్డి సింహాచలంతో  "మీరు జెప్పిన పిదప నేను  నా తమ్ముడు    మీ ప్రత్యర్థుల కాళ్ళు విరగ్గొట్టినాము, తెగులబెట్టమన్నప్పుడు కొంపలు తెగులబెట్టినాము. ఇప్పుడు నా తమ్ముడు ప్రేమలో మైకంలో గోశాలకు నిప్పుపెట్టినాడు కానీ తలవని తలంపుగా  ఆ మంటలలో  ఆ దేవుడమ్మ ( అహల్య)  చిక్కుకొని మరణించెను. ఇప్పుడు నేనెచ్చటికిపోవలెను.” వెంటనే సింహాచలం పెదవులపై తళుక్కుమని నవ్వు మెరిసెను అతడు పెంచలయ్య తో "పెంచాలా కొమ్మాదిలో నీ క్షేత్ర గృహమునందు కొంత కాలము.."  పెంచలయ్య "నాకే పెట్టావూ, నువ్వు సెప్పేక తప్పుద్దేటి. అలాగే" సింహాచలం “నేను ప్రజాసేవ చేసుకొనుటకు పోవుచున్నాన"ని బయలుదేరెను. పెంచలయ్య “సాయంకాలమయిందంతే  మనసు నిలవదు ఆ ఇంగిలీసు గుంటకాడ కెల్లిపోవాల…హ్హి హ్హి హ్హి” అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుచుండెను.                

                                                                            *** 


భారతవర్ష తరుపున న్యాయవాది బైర్రెడ్డి ఇచ్చటున్నట్టు సాక్ష్యము కలదని  వాదించుటతో న్యాయమూర్తి కేసును మరుసటి  నెలకు వాయిదా వేసినారు. వ్యవహారము కకపికలగుచుండగా మహిళా  సంఘములు  దిగులుకొను చుండెను.  అందుచే భారతవర్ష స్వయముగా సాక్ష్యములను సేకరించ వలెనని రంగములోకి దిగెను. 

అతడు ఒక ఉదయమునే సబ్బవరం పోయి స్థానికులను  విచారించి కూపీలాగుచుండగా మరీదు కనిపించెను. “ఇచ్చటేలయుంటివోయి? ఏదైనా పనిచేయుచున్నావా?"యనడుగగా  “పని చేయకున్న నాకు గడుచుటెట్లు, సహకార రంగమున చేయుచున్నాన”ని మరీదు జెప్పెను. 

ఒక క్షణమాలోచించి నేరుగా అడుగుటకు నిర్ణయించుకొని “మరీదు నీ మంచి గుణము నాకు దెలియును అతివృష్టి ఎంతకురిసిననూ తాత్కాలి కమే. నీవంటి మంచివానికి కష్టములు తాత్కాలికమే యని బైరెడ్డి ఛాయా చిత్రమును చూపి అతడు చేసిన ఘోరమును దెలిపి  "యితడు నీకు తెలియునా?" యనడిగెను. అతడి గూర్చి పోలీసులడిగి ననూ నేనేమీ చెప్పజాలను అని మరీదు తప్పించుకొనజూచెను. 

“కానీ ఒక తెలుగు ప్రేమికుడింకొక  తెలుగు ప్రేమికునివద్ద అసత్యము పల్కినచో తెలుగు చిన్న బుచ్చుకొనున”ని వర్షుడనెను. “ఆరోజు అబ్దుల్కలాం గారికి మ్రొక్కినది కపటము కాదని నిజము జెప్పి నేడు నిరూపించుకొననిచో నీవు కూడా కపట భాషా ప్రేమికుడీవే”  అని భారతవర్ష అనగా మరీదు ఉలిక్కి పడి   

 “నా తెలుగు ప్రేమను శంకించవలదు కలాంగారిపై  మీ మత్తేభము నామనసు నందింకనూ మెదులుచున్నది. కోటిగాడి గురించి వివరములు పోలీసులకు జెప్పకున్ననూ మీకు చెప్పెదను. ఒక్కసారి ఆ మత్తేభ పద్యమును పాడమని మరీదు అడుగుచుండ వర్షుడు చదువు, పదవులతో నిమిత్తమేమున్నది నిజాయతీ పరులెవ్వరైనూ గొప్పవారే అని మా మంచి మరీదు పైనే   మత్తేభమును సంధితునని

మ. సహకా రక్రమ విక్రమా మరల  నీసాకా  రమీనా టికిన్       

అహరా రంభము నందునే కలిగె నే ఆహాఏ మినాభా గ్యమో     

మహదా నందము మాయెనే నినుగ  నమ్రాగ న్నుశోభి ల్లెనే            

విహగేం  ద్రుడైన  మామరీ దునెటు రప్పింపం గసాద్య మౌనే  

సహకార క్రమమున(రంగములో ) విక్రమా మరల  నీ సాకార మీనాటికి (చాలా కాలం తరువాత చూచుట)  అహరా రంభము నందునే   ( ఉదయాన్నే) కలిగెనే.  ఆహా  ఏమి నాభాగ్యమో!!    మహదానందము మాయెనే నినుగన  మ్రాగన్ను  ( వెతికి వెతికి అలసిన కన్నులు) శోభిల్లెనే (కాంతి నొందెనే). విహగేంద్రుడైన  (గరుడడైన)నిను  రప్పింపంగ సాద్యమౌనే!  

వర్షుడు భావమును తెలుపగా రోమాంచితమయ్యి మరీదు జరిగిన కథంతయూ, (బైరెడ్డి కోటిగాడిని కలుసుట చలన చిత్రమును చూచుట) చెప్పెను.  నాడు వారు చూచినది విడుదల చిత్రము మగుటతో పాత్రికేయులను సంప్రదిం చినచిత్ర ప్రదర్శనశాల  వద్ద వారు తీసిన  ఛాయాచిత్రములేమైననూ దొరకవచ్చని భావించి వర్షుడు పాత్రికేయుడు మారయ్య గారిని సంప్రదించగా మారయ్యగారొక గంటాగి “నాలుగు ఛాయా చిత్రములున్న”వని తెలిపిరి వర్షుడు పోయి  నేత్రములు గుడ్లగూబలవలె విశాలమొనర్చి ఆ ఛాయాచిత్రములను పరిశీలించెను. అందు బైరెడ్డి కానరాకుండెను.  

సూర్యుడు పడమట క్రుంగుచుండ చీకటిలలుముచుండెను.  నైరాశ్యమ మనసునలుము చుండ  వర్షుడు కూడా క్రుంగి ఇంటి ముఖం పట్టెను.

                                                                                 ***

నింగి సంధ్యారాగమాలపించుచుండెను సింహాచలం వాహనమును ఒక చెట్టు క్రింద నిలిపి దూరముగా నున్న సెయింట్ మేరీ స్కూల్ కు మెల్లగా కాలినడకన సాగుచుండెను. దూరమునుండి విద్యుత దీప కాంతులీను చున్న ఆ భవనమును చూచి కాంతులీను మిషేల్ ముఖము  గుర్తుకు రాగా భావోద్వేగమును పొందెను. జవరాలి పొందెంత తీయనో అనుకొనుచున్న అతడికి రత్న గుర్తుకువచ్చి ముఖము ముకుళిత మాయెను.  “సాయంకాలం అయితే ఆ ఇంగిలీసు గుంట కాడకెల్లక పొతే మనసు లాగేస్తాది.  అనే పెంచలయ్య మాటలు గుర్తొచ్చినవి. 
“ఇంగిలీసు గుంట” అబ్బా ఆమాట ఎంత తియ్యగా నున్నదో కదా ఎంతైననూ సీమ సరుకు సీమ సరుకే అందుకే ఆమెను పొందుటకు పెంచలయ్యచే ఈ పాఠశాల  స్థలము నాదని పేచీ పెట్టించినది. మధ్యలో దూరి పెంచలయ్యను ఆపి వారిని కాచినట్టు చూపినది. ఇట్లాలోచించుచూ సింహాచలం ఎఱుకలేక పాఠశాల భవనమును సమీపించెను. సింహాచలం ఆకాశములోకి చూచెను. చంద్రోదయమగుచుండెను. అతడికి శ్రీనాధుని భీమఖండంలో చంద్రోదయ వర్ణన గుర్తుకువచ్చెను. 
’కాదు కాడుదయాద్రి కనక కూటంబిది –డంబైన పాన వట్టంబు గాని
కాదు కాదిది సుధాకర పూర్ణ బింబంబు –కాశ్మీర శంభు లింగంబు గాని
కాదు కాదుదయ రాగ ప్రకాశం బిది –నవ కుంకుమా లేపనంబు గాని
కాదు కాదిది కలంక చ్చటా రించోళి-పూజ చేసిన కల్వ పువ్వు గాని..
తూర్పుకొండ బంగారు శిఖరం కాదు, కాశ్మీర శివలింగం కాని, చంద్రుని తెల్ల బింబం కాదు, కొత్త కుంకుమ పూత కాని ఎరుపు పూత కాదు, శివుడికి పూజ చేసిన కలువ పూలే కాని చంద్రుని మచ్చ కాదు. సింహాచలం పాఠశాలను చూచి అదే విధముగా కవితను తలపోసెను.
కావు కావు రవికిరణముల స్నానమాడు  తూర్పు కనుమలివి 
విద్యుత్ కాంతుల స్నానమాడు  పాఠశాల భవంతులవి 
కాదు కాదు బృందావనమిది   కూనలు ఆడుకొను నందనమిది 
కాదు కాదు పచ్చల హారమిది - పచ్చని పొదలు అల్లుకున్న విహారమిది.
సింహాచలం పాఠశాల ముందరనున్న తోట దాటి  కార్యాలయ భవనమును దాటి వెనుకనున్న మిషేల్ గృహము వైపు నడుచుచుండెను.  అతడు మరల చంద్రబింబమును చూచెను. మునుపటికంటే స్పష్టంగా వెలిగిపోవుచున్నది. అతడికి మిషేల్ పాలుకారు యవ్వనము స్ఫురణకు వచ్చెను. నాకేల శివలింగము స్ఫురణకు రాకున్నదని ప్రశ్నించుకొనెను.
సమాధానముగా అతడి అంతరంగము నుండి హాసము వెలువడెను.

 శ్రీనాధుడు మహా శివభక్తుడు కనుక చంద్రబింబం సాక్షాత్తు శివ స్వరూపంగా దర్శనమిచ్చెను. నేను కాముకుడిని కనుక చంద్రబింబము నాకు మిషేల్ స్తనములను గుర్తుకు తెచ్చుచున్నది. ఇట్లు ఆలోచనలలో మైమరచి నిద్రలో నడుచుచున్నట్లు నడుచుచూ అతడు మిషేల్  ఇంటి ద్వారమును చేరి అప్రయత్నముగా తలుపు తట్టుచుండెను. తలుపు తెరుచుకొనెను. సింహాచలం  చంద్రబింబమును ఎట్ట ఎదుట చూసినట్టు ఉలిక్కి పడెను. ఎదురుగా చంద్రబింబమువలె వెలిగిపోవుచున్న మిషేల్. 
మిషేల్ : మై  పేరెంట్స్ అర్ హియర్.
 సింహా : ఐ టోల్డ్ థెం లాస్ట్ వీక్ దట్ ఐ యాం లెర్నింగ్ ఇంగ్లిష్ ఫ్రొం యు. 
మిషేల్ : థెయ్ అర్ నాట్ ఫూల్స్ టు  బిలీవ్. 
సింహా : నమ్మినాఁ నమ్ముకున్న ఏదో ఒకటి చెప్పవలెను కదా. 
మిషేల్ : సరే ఎంతకాలమిట్లు, ఆ చర్చ్ పెద్ద ( పెంచలయ్య)తో మాట్లాడి ఈ పాఠశాల స్థలంపై అతడు పెట్టినకేసును తొలగించుము. అతడి మనుషులు పాఠశాల సమయములో వచ్చి రభస చేయుచున్నారు. నాకు త్వరలో వివాహము చేయదలచినారు. నీవు ఇచ్చటికి వచ్చుట మానుకొనుము. 
సింహా : అంతపని చేయుచున్నాడా ఆ పెంచలయ్య!  నీవు నన్ను పెళ్లి  చేసుకొన్నచో నీవంక ఎవ్వరూ కన్నెత్తిచూడరు, కదా! నేను నా భవనమును కూడా నీకిచ్చివేతును. నేను కొత్త భవనము కట్టుకొంటిని. నీకు కొత్తభవనము కావలెనా? పాత భవనము కావలెనా ? 
మిషేల్ : నీవు ఇచ్చటనుండి వెడలుట కావలెను. 
సింహా : అది నీచేతులోనే ఉన్నదని ఆమెను ఎత్తుకొని పడకగదిలోకి తీసుకుపోయి మంచము మీద పడవేసెను. ఆమె మంచముదిగి అతడికి చిక్కకుండా పరిగెడుచున్నది. నేను సింహాచలము అనగా సింహము. నీవు లేడివి పరిగెత్తుము. కొలది సేపు ఇట్లు ఆడుకొందుము. ఆమె అతడిని ఏవగించుకొనుచూ కొలది సేపు మంచము చుట్టూ పరిగెత్తి కడకు అతడి చేతికి చిక్కెను.

                                                                          ***
  
అదే సాయంత్రం పొద్దుగ్రుంకిన పిదప భారతవర్ష ఇల్లు చేరెను.  రాధామనోహరం కళాహీనంగా కనిపించెను. రాలిపోయిన రాధామనోహ రాలు వర్షుని వైపు జాలిగా చూచుచున్నవి. యింటనెవ్వరూ లేక ఇల్లు వంటరిదైనది. 
మాలినిగారు, మంజూష, కేశవుడు కానరాక  మనసు బోరుమనుచుండగా బాల్య స్నేహితురాలు విదిష విషణ్ణ వదనము స్మృతి పథమున మెదులుచుండ మానిపుక్కిటిపులుఁగు హృదయమును గొట్టుచున్నట్లుం డగా  బాధాతప్తడెందమునకు వీణా వాదనము జేయుచూ  సంగీత లేపనమును పూసి ఉపసమనము కలిగించుచూ అట్లే  వీణపై పడి నిద్రించెను. 
కొంతసేపటికి ఎవ్వరో తట్టి లేపుచున్నట్లనిపించి కనులు తెరచి చూచెను అన్నము తినమని తల్లిగారు చెప్పుచున్నట్లనిపించి లేచి చుట్టూ   చూసిననూ ఎవ్వరూ కానరాకుండిరి. బైటకు పోయి చూడగా తల్లి చెల్లి వచ్చుచు కనిపించిరి  " కేశవుడేడి ఎచ్చటకు బోయినాడని వారినడిగెను.  కేశవుడి అక్క (చారుమతిగారి కూతురు) మంచము  పట్టెనని కబురు తెలిసెనని కేశవుని బస్సెక్కించి వచ్చుచున్నామని చెప్పిరి. హతవిధీ కష్టములన్నియూ కట్టకట్టుకొని రావలెనా. అని భారతవర్ష అనగా "ఇదంతయూ  ఏ అరిష్టమునకు దారితీయునో?" యని మాలినిగారు వాపోయినారు. భోజనములు చేయుచూ  "మనముఁబోయినచో పోలీసులు హడావిడి చేయుచున్నారు తప్ప బైరెడ్డి వ్యవహారము  ఎచ్చట వేసిన గొంగళి అచ్చటనే యున్న"దని మంజూష అనెను. బలమైన సాక్ష్యమున్నాకానీ  పోలీసులేమియునూ చేయజాలరు.అని మాలినిగారు అనుచుండగా "
 సాక్ష్యములను తారుమారు చేయగల సమర్థులు వారు సాక్ష్యమున్న ప్రయోజనమేమి యని మంజూష అనెను. వారట్లు మాట్లాడుకొనుచుండగా వర్షుడి మనసున ఒక ఆలోచన తళుక్కు మనెను. అతడు ముఖపుస్తకము న విడుదలైన చిత్రపు  కథానాయకుని అభిమాన సంఘములవారి కొరకు వెతుకులాడెను. నిశరాత్రి....ఒక అభిమాని తన మిత్రులతో గూడి ఆ సబ్బవరం చిత్రమందిరము ముంగిట గ్రహించిన ఛాయాచిత్రమును ముఖపుస్తకమునందుంచెను. అందు బైరెడ్డి సుస్పష్టముగా కనిపించు చుండగా అది చూచిన వర్షుడు మేఘమండల మదురునట్టు  ఆత్మధన్య నాదము (యురేకా) జేసి పిమ్మట అది రాత్రని గుర్తుకు వచ్చి నాలుక కరుచుకొనెను. 
***
 అదే  రాత్రి  విదిషకు కాళ రాత్రిగా పరిణమించినది. దుస్వప్నము లెన్నియో చిత్తవికారము కలిగించినవి. తన తల్లి చావుకు కారకుడైన  దుష్టత్రయం బైరెడ్డి వాడి అన్న నాగిరెడ్డి మరియు  ఎం. ఎల్. ఏ సింహాచలం దివిటీలు చేబూని భూతప్రేత పిశాచములవలె ఆమెను చుట్టుముట్టి వలయాకృతిన రాక్షసతాండవము చేయు  దృశ్యము చాక్షుషప్రత్యక్షమైనది. ఆమె అంతర్జ్వలన కీలలందు ఎంతకాలిననూ గుండెబాధ  గండశిలవలె కరుగ కుండెను. రాత్రంతా అట్లు యాతన పడిన ఆమె ఒక తెల్లవారు జామున అలసి సొలసి నిద్రించెను.

                                                                  ***

 అదే  రాత్రి రత్నకు సింహాచలం మధ్య మంటలు రగులుచుండెను. “నీకెవరు జెప్పినారో చెప్పుము. నేనా పెంచలయ్యనడ్డుపెట్టుకొని ఆ ఇంగిలీషు పిల్లను వశపరుచుకొంటినని ఎవరుచెప్పినారు? నీకేమైనా కర్ణ పిశాచమున్నదా?” “పిశాచములతో తిరుగువాడివి నువ్వు.  పిశాచములు  పలికిన నీకు పలుకును నాకెట్లు పలుకును? నాకు తెలిపిన దేముడు తెలుపును.”       దేముడు కలలో కనిపించిచెప్పెనా? “అహ్హహ్హహ్హ నీవు అంత  పతివ్రతావా?” అని సింహాచలం ఎద్దేవా చేసెను. 
 "నువ్వు తిరుగుబోతువని  ఇతరులు కూడా తిరుగుతున్నారని అను కొనవలదు." రత్న అట్టు తిరగేసినంత సులభముగా విషయమును  తిరగేసేను.   ఆమె మాట కొరడా దెబ్బవలె తగలగా సింహాచలం విలవిలా లాడి  "అర్ధరాత్రి మద్దెలదరువను సామెతవలె నున్నది. నీ అనుమానంతో నన్ను వేపుకొని తినుచున్నావు, నీకెవరో తప్పుడు సమాచారమిచ్చు చున్నారు. తాళి కట్టిన భర్తని నామాట నమ్ముము” అని బ్రతిమాలెను. “నమ్మితిని కావున నీతో కాపురము చేయుచుంటిని. నీవు స్త్రీ  లోలిడివైననూ నేను  సరిపెట్టుకొందును.  దేవుడి జోలికి పోయిన దేవుడు సరిపెట్టుకొనడ”ని చుబుకమును పట్టి అనునయముగా చెప్పెను. 

                                                                   ***
 
తెల్లవారినది భానుని వెలుగు రేఖలు జగతిని తట్టిలేపుచున్నవి. కొండగాలి తెరలు తెరలుగా వీచుచూ పూల గంధమును మోసుకు వచ్చుచున్నది. విస్తారమైన ఎత్తైన ప్రదేశములో గాలి సంగీతమును పాడుచున్నది. దూరంగా నరసింహస్వామివారి ఆలయం బొమ్మరిల్లు వలే కనిపించుచున్నది. మండలాధికారి  సిబ్బందితో  ఒక ప్రక్క నడుచు చుండగా, జాయంట్ కలెక్టర్ తన సహాయకులతో నడుచుచుండెను. నరసింహ స్వామిగుడి అర్చకులు మరియు సిబ్బంది వారిననుసరించు చుండిరి. ఒక పక్కగా సింహాచలం, పెంచలయ్య, చిక్కణ నడుచుచుండిరి. వారందరు ఒక ఎత్తైన ప్రదేశం చేరి నిలిచిరి.  ఆ ఎత్తైన ప్రదేశములో ఒక ఇరువది అడుగుల సిలువ పాతబడి యుండెను.

మండలాధికారి,  సబ్ కలెక్టర్ గారికి కాగితములపై భూమి లెక్కలు కొలతలు చూపించు చుండిరి కొండగాలి  పూల  మొగలి పరిమళము మోసుకొనచ్చుచున్నది. ఆ పరిమళము తాకిన  జనహృదయములు పులకరించుచున్నవి.   “ఎచ్చట నుండి వచ్చుచున్నదీ తీయని పరిమళము”  సింహాచలం పెంచలయ్యను అడిగెను.“ఏం మిషేల్ గుర్తుకొత్తన్నాదా? గతరాత్రి తియ్యగా…కమ్మగా?”  అని పెంచలయ్య అనుచుండగా  ఇంటికెళ్ళిన తరువాత రత్నతో పెద్ద పేచీ వచ్చిపడినది. ఆమెకెవరో  ఈ మధ్య విషయములను చేరవేయుచున్నారు. ఆ నాగిరెడ్డి కొమ్మాదిలోనే యున్నాడు కదా! “నాకేటి తెలుత్తాది నేనెల్లడం నేదు. ఈ స్థలం గొడవొచ్చిన కాంచి సబ్బవరంలోనే తొంగొతన్నాను. సూడాల్లు కొలతలు లెక్కలు సూత్తన్నారు ఆల్లతో మాట్లాడు సింవాసలమా.”  “చేయనిమ్ము. వారి పని వారు జేసిన నాపని నేను చేసెదను మనకి ప్రభుత్వములో  పలుకుబడున్నద”ని సింహాచలం అనెను. 

                                                                         ***

 సింహాచలం సబ్బవరం గృహమందు ముందటిగదిలో సోఫాలో  కూర్చొనుండెను. అతడు తల వెనుకకు వాల్చి కళ్ళు మూసుకొని దీర్ఘాలోచనలో ములిగి యుండెను. రత్న కుమారి తేనీరు తెచ్చి ఇచ్చెను సింహాచలం త్రాగుచుండగా ఆమె అతడి ప్రక్కన కూర్చొనెను. నాగరాజు సింహాచలమును కలిసి తన కోర్టు వాయిదా తేదీ దగ్గర పడుచున్నదని కేసువిషయమై సహాయము కోరుటకు వచ్చెను. కిటికీనుండి సింహాచలం రత్నకుమారి లను చూసిన నాగరాజు కిటికీవద్ద నక్కి వారి మాటలు వినుటకు నిర్ణయించుకొనెను.  

రత్న: దేవాలయ భూములను చూచుటకు మండలాధికారి వచ్చినారట కదా?  మీరు పెంచలయ్యతో పోయినారట కదా? నాకు దేవాలయ భూములలో తలదూర్చనని మాట ఇచ్చినారు మరచినారా

సింహాచలం : ఎవరు చెప్పినారు నీకీ మాటలు… చిక్కణ అని ఉరిమెను. చిక్కణ గజగజ వణికెను. “అయ్యా మీ ఉప్పుతిని మీకే… ద్రోహము చేయగలనా?”

సింహాచలం : చేయగలవు కానీ చేయకున్నచో బ్రతికెదవు. అట్లు చేసిన ఆ నాగిరెడ్డికి పట్టిన గతేనీకునూ  పట్టును.  వాడు పలుకుబడి పెంచుకొనుచూ నాకే రాజకీయప్రత్యర్థిగా మారుటకు చూచుచున్నాడని అనుమానము కలుగుచున్నది. పోలీసులకు నాగిరెడ్డి బైరెడ్డిలను ఖైదు చేసినచో నా ప్రమేయముండదని చెప్పివేసినాను. నాగిరెడ్డి చేసిన నేరములకు నావద్ద రుజువులున్నవి. అవి కూడా పోలీసులకిచ్చెదను. ఇదంతయూ అనుమానము వచ్చినందుకు మాత్రమే”అని చెప్పి చిక్కణను హెచ్చరించెను. ఆ మాటలు విన్న నాగిరెడ్డి కడుపు రగిలెను. సింహాచలం తేనీరు త్రాగి కోపను భార్యకి ఇచ్చివేసెను. ఆమె లోపలి వెడలెను. దూరవాణి మ్రోగెను. సింహాచలం సాధనము చేకొని దూరవాణిలో సంభాషించుచుండెను. భార్య తో మాట్లాడుచున్నప్పుడున్న  చిరాకు పోయి అతడి ముఖము ప్రసన్నముగానున్నది.

అతడు మెలికలు తిరుగుచూ తేనెపలుకులు పలుకుచుండెను. "చందమామకంటే అందమైనదాన, పుట్టతేనె కంటే తీయనైనదానా  నీకు సరి జోడి నేను కానా" అతడి మాటలను బట్టి అతడు మిషెల్ తో మాట్లాడుచున్నాడని నాగిరెడ్డికి అర్థమయ్యెను. "నేనిప్పుడే పెంచలయ్యను పాఠశాలవైపు కన్నెత్తయిననూ చూడవలదని హెచ్చరించితిని. అతడు వచ్చి నిన్ను క్షమాపణ కోరును. నేను ఈ ఒక్కరాత్రి వచ్చెదను. ఇదే ఆఖరి  రాత్రి” అని బ్రతిమాలుచుండెను. నాగిరెడ్డి ఒక నిర్ణయమునకొచ్చినట్లు పిడికిలి బిగించెను.  సంభాషణ ముగించిన సింహాచలం ముఖములో కళహెచ్చెను. అతడి పెదవులపై చిరునవ్వు వెలసెను. అతడు బైటకు వెడలిపోయెను.

అతడు బయలుదేరుచున్నప్పుడు నాగిరెడ్డి ఒక వాహనము వెనుక నక్కి పిదప లోపలి ప్రవేశించెను. అప్పటికి రత్నకుమారి చిక్కణ తో నిజము జెప్పరా చిక్కణ అయ్యగారు చెప్పుచున్న మాటలు ఒకటీ నమ్ముటకు వీలులేదని చిక్కణను  నిగ్గు దీయుచుండెను. చిక్కణ బిక్క చచ్చిపోయెను. వాడి మొఖంలో ప్రేతకళ చూచి నాగిరెడ్డి పగలబడి నవ్వెను "పిరికి సచ్చినోడు వాడేమి చెప్తాడు అమ్మగారు అని మొదలు పెట్టి  అయ్యగారు పెంచలయ్య పక్షము వహించి అతడికి దేవాలయ భూములను కట్టబెట్టుటకు మంత్రాంగం చేయుచున్నారు.  కానీ దేవస్థానము వారు  హైకోర్టుకు పోయినారు. అంతే కాక మిషేల్ అను ఇంగ్లీషు పిల్లను ఇబ్బందులలోకి నెట్టి వశపరుచుకొన్నార”ని అతడు పొంచివిన్న దూరవాణి సంభాషణను కూడా వివరించెను. రత్నకుమారిని  కోపము ఆశ్చర్యము దుఃఖము ముప్పిరిగొన్నవి. ఆమె నేలపై పడి మూర్చరోగి వలే  గిలగిలా తన్నుకొనుచుండెను. నాగిరెడ్డి వెడలిపోయెను.      

***

నాటి సాయంత్రము రత్నకుమారి కొండపై నృసింహస్వామి దేవాలయ మును సందర్శించుకొనుటకు పోవుచుండగా సింహాచలం కొత్త పెళ్లి కొడుకువలె సింగారించుకుని మిషెల్ వద్దకు బయలుదేరెను. స్వామివారి దర్శనము చేసుకొని మండపములో కూర్చొన్న రత్నకు ఏదో తెలియని ఆందోళన మొదలాయెను. అర్చకులు ఆమెను ఓదార్చి ఇప్పుడు హరికథా గానము జరుగును విని ప్రశాంతతను పొందవమని చెప్పిరి. రత్న కుమారి మంటపములో కూర్చొనెను. కొద్దిసమయములో మంటపము భక్తులతో నిండెను. దేవాలయపై నమర్చిన బాకానందు “హిరణ్యకశిప వధ” అను హరికథా గానము జరుగునని ప్రకటించబడెను.

భారతవర్ష కాలికి గజ్జలు మెడలో మాల నుదుటిన నామాలతో వేదికపై కనిపించెను. రత్న కుమారిఈ యువకుణ్ణి ఎచ్చటో చూచినట్టున్నదే!” అని పక్కనే కూర్చొన్న భక్తురాలితో అనెను.

“శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం  ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. “అతడి  అవధాన కార్యక్రమముల  వార్తాపత్రిక లందు దూరదర్శన మాద్యమములందు వచ్చుచుండును. మీరతడిని పత్రికలలో లేదా దూరదర్సన కార్యక్రమములందు చూచి యుండవచ్చు”   “అవును గుర్తుకువచ్చినది” అనుచున్న రత్న ముఖము వెలిగెను.  “యితడిచ్చటివాడు కాదు కదా!” అనెను. ఆమె “యితడు మువ్వవానిపాలె మందుండును. కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసెడివాడు. విదిష నల్లరి జేసినందుకు బైర్రెడ్డి పై కేసు పెట్టుటచే నాగిరెడ్డి అతడిని ఉద్యోగము నుండి తొలగింపజేసెను.”  “ఇవన్నీ మీకెట్లు తెలియును?” పక్కనున్న భక్తురాలు నవ్వి “నాపేరు నళిని. నేనతడి స్థానమందు పనిచేయుచున్న ఉపాధ్యాయురాలిన”నెను రత్నకుమారి మౌనముగా వెనుకనున్న స్తంభమునకు జారపడెను.  

 భారతవర్ష “గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర  గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన మహా!”మరికొంత మంది భక్తులు వచ్చుచు న్నారు. సిబ్బంది వారికి స్థలము చూపి కూర్చొనమని చెప్పుచున్నారు.

 నాగిరెడ్డి పాఠశాల ఉద్యానవనంలో మిషేల్ తో ఎదో చెప్పుచున్నాడు. మిషేల్, నాగిరెడ్డికి నరసింహాలయము నుండి గానము వినవచ్చుచున్నది.

భారతవర్ష “ మహా గణపతిమ్ మనసా స్మరామి|  మహా గణపతిమ్ మనసా స్మరామి| వశిష్ట వామ దేవాది వందిత|| మహా దేవ సుతం గురుగుహ నుతం|మార కోటి ప్రకాశం శాంతం||   మహా కావ్య నాటకాది ప్రియం| మూషిక వాహన మోదక ప్రియం||” నాగిరెడ్డి చెప్పుట ముగించెను. మిషేల్ ఒక నిర్ణయమునకు వచ్చి మేడ  మెట్లు ఎక్కుచుండెను.   నాగిరెడ్డి    కూడా మిషేల్ ననుసరించుచుండెను.

భారతవర్ష “ శ్రీ నారసింహుని  భక్తులందరికీ వందనం ఈనాటి  సత్కథ హిరణ్యకశిప వధ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషుల రక్షించుట కొరకు దుష్టు లనంత మొందించుటకు కొరకు ధర్మాన్ని స్థాపించుటకు ప్రతి యుగంలోనూ అవతరించునని భగవానుడు చెప్పినాడు. ఐతే భగవంతుడు ఒకే  రూపములో కాక వివిధ రూపములలో దుష్ట సంహారమొనర్చును.

నరసింహ, నృసింహ, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. దుష్టశిక్షణ కొఱకు శ్రీమహావిష్ణువు ధరించు 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములందురు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారములందురు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడందురు. తెలుగునాట  యాదగిరిగుట్ట, మంగళగిరి, ధర్మపురి  సింహాచలం, అహోబిలం వంటి నృసింహాలయాలు ప్రసిద్ధం. తెలుగువారికి కులదైవం   నృసింహావతారం.”

రత్నకుమారి “కథకుని స్వరము ఎంతో మధురముగానున్నది ఇతడు అంతదూరమునుండి ఇచ్చటికి వచ్చి ఈ కొండపై హరికథా గానము చేయుట అబ్బురముగానున్నది.” భక్తురాలు “వీరి తాతముత్తాతలందరూ నరసింహ అను నామమును కలిగి యుండి మాతృభూమికొరకు ప్రాణములిచ్చినారు. నారసింహుడు వీరి కులదైవము. ఈ ఆలయ అర్చకులు వీరికి దూరపు బంధువులే.” భారతవర్ష పాడుచుండెను….

నృసింహ నరసింహ నారసింహ,  నృసింహ నరసింహ నారసింహ 

నరమూర్తివి గావు నారాయ ణువిగావు అవతారమూర్తివి నారసింహ

ఏకవింశతి రూప నారసింహ!!   ఏకవింశతి రూప నారసింహ!!!

చతుర్దావతారము చండప్రచండము బహు ఉగ్రరూపము నారసింహ!!

మిషేల్కు నిజము దెలిసిపోయినది.   పాఠశాల భూవివాద మంతయూ   బూటకమని ఆదంతయూ  ఎం ఎల్ తనని వశపరుచుకొనుటకు పన్నిన జాలమని తెలిసి ఆమె ముఖము రైలు యంత్రమందు మండుతున్న రాచబొగ్గు వలెనున్నది.  తనకు జేసిన మోసముతోపాటు తన ఇంటనే తనతో కామక్రీడలాడుచున్న కామ పిశాచమును తలుచుకొని హృదయము రగులుచుండ తల్లితండ్రులకు కలిగిన క్షోభకు తుదిపలుకు చెప్పుటకు నిర్ణయించుకొని  ఎం. ఎల్. రాకకొరకు ఎదురు చూచుచుండెను.

 హిరణ్యాక్ష హిరణ్యకశిపులు దితి కశ్యపులకు జనియించినారు

 ఆకృతి వికృతి రాక్షస ప్రక్రుతి లోక కంటకులు ధర్మ భంజకులు

 హిరణ్యాక్షుడు బలగర్వితుడు విష్ణువు పైనే దండెత్తినాడు

 చండ వేదండ శుండాదండ మండిత భుజాదండబున గదాదండంబు   

 కొని విష్ణువు పైనే దండెత్తినాడు భీకర పోరున మరణించాడు. 

"ప్రతిరోజూ నేను సింహం నువ్వు  జింక"యనుచు ఇచ్చము వచ్చిన రీతిన  ఆటలాడెడివాడవు కానీ నేడు నేను సింహం నీవు జింక"యని గట్టిగా జెప్పు కొనెను. ఆమెకు కొండపైనుండి గానము వినిపించుచున్నది.

అతని కంటె ఘనుడు హిరణ్యకశిపుడు

ఘోరతపముచే వరములు పొంది తపోశక్తిచే ధుర్బేధ్యుడైనాడు.

 గాలిలోన గంగలోన, ఇంటిలోన  పైనగాని

 రాత్రిగాని పగలుగాని నింగిలోని నేలనైనా

 మనిషి కాని మృగము కాని చంపకుండునట్లు వరముపొందినాడు

ఆనాటి రాక్షసులు  దేవతలను ప్రార్ధించి వరాలు పొంది సజ్జనులను పీడిస్తే  నేటి రాజకీయ నాయకులు ప్రజలను ప్రార్ధించి పదవులు పొంది సజ్జనులను పీడిస్తున్నారు. ఆనాటి  శక్తివంతులైన రాక్షసులు విష్ణులోకంపై దండెత్తితే  నేడు శక్తి వంతులైన రాజకీయనాయకులు దేవుని మాన్యాలపై దండెత్తుతు న్నారు. అచ్యుతపద శరణాగతుడు ప్రహ్లాదుని క్రోధంతో హిరణ్య కశిపుడు  పిలిపించి నేనంటే సకల భూతాలు వణుకును. దిక్పాలకులు నా సేవకులు. ఇక నీకు దిక్కెవరు? అని గద్దించెనుచక్రే నాకు దిక్కు”   “ఎచ్చటున్నాడు నీ చక్రి?” "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిననందందే గలడు" "అయితే స్తంభమునవా జూపగల చక్రిన్ గిక్రిన్?"

ప్రహ్లాదుడు"బ్రహ్మనుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండే వాడు స్తంభమునందెందు కుండడు? స్తంభాంతర్గతుడై ఉండును.” "సరేఅని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచెను. బ్రహ్మాండం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించి ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణవిశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, మహాప్రభావుండునైన  నృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించెను.

                                                                                                                                                                                                                                                     


 

సింహం వచ్చెను జింక ఎక్కడ?" యనుచు లోపలి కడుగిడుచున్న ఆ మానవ మృగమును నాగిరెడ్డి వెనుకనుండి రెక్కలు విరిచి పట్టుకొనెను. మిషేల్ ఛాతిలోనొక్క పోటుతో అంత మొందించెను. పూర్తిగా శ్వాస నిలుచువరకూ వేచియుండి శవమును ఠాణాకు ఈడ్చుకొని పోయి నేరమునఁగీకరించి  మిషేల్  లొంగిపోయెను

ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు

హరి కథ ముగిసెను సింహాచలం కథ కూడా ముగిసెను.