Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, November 30, 2020

Bharatavarsha 84

 ముంబై అంధేరి లలిత్ సూపర్ ప్రీమియం హోటల్: సంజయ్ సాబ్  దిస్  ఈజ్ లకుమ, లకుమ దిస్ ఈజ్  సంజయ్ సాబ్ ఫేమస్ ప్రొడ్యూసర్. అరవై ఏళ్ళు దాటిన ఆరడుగుల పొడుగు మనిషి , నెరిసినజుట్టు , ఎర్రని రంగు,  పల్చని చర్మం బాత్ సూట్ లో కొద్దిగా  చాతి కనిపిస్తూ  సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న అతడు లేచి హాయ్ బేబీ అంటూ లకుమని  రెండు చేతులూ జాపి అందుకోబోయాడు  , అనుకోని పరిణామం తో లకుమ  వెనక్కి  రాబోయింది , కశ్యప్ ముందుకి తోసాడు అంటే వెళ్లి అతడి కౌగిలి లో ఇరుక్కుంది. ఒక రెండు నిమిషాలు నలిపి ఒక ముద్దు ఇచ్చి వదిలాడు. కశ్యప్ కి లకుమకి కాఫీలు వచ్చాయి. కాఫి తాగే లోపు సంజయ్ స్నానం చేసి వచ్చాడు.  సోఫాలో ఎదురుగా కూర్చుని

అతడు హిందీలో మాట్లాడుతూ " తుం హిందీమే బాత్ కరోగీ ?" కర్ సక్తీహుం మగర్ జ్యాదా నహీ, " హ హ హ హ  కమ్ హో యా జాదా కోయీ బాత్ నహీ, హమ్ కో తేరీ జిస్మ్స్  సే మతలబు హాయ్, జవానీ సే మతలబు హాయ్ , హామే ఫిగర్ ఛాహీయే ఫిగర్, హమారా ఏక్  ఐటెం సాంగ్ ఇసీ హోటల్ మే షూటింగ్ చల్ రహీ హాయ్. అభీ థోడీ దేర్ మే  హమారా డైరెక్టర్ ఆనేవాలహై మై తుమ్కో  కశ్యప్ కీ కహనే పర్ ఏక్ మోకా దేరహాహుమ్ డైరెక్టర్ సే  మిలో మై ఉంసే బాత్ కారూన్గా. ఔర్ ముఝే కుష్ రఖనా.

అని ఆమె కళ్ళలోకి చూస్తుండగా కశ్యప్ ' జీ హా క్యోన్ నహీ, మై సంఝాతాహుమ్ అని లకుమను  బయటకు తీసు కొచ్చేసాడు. క్రిందన గ్రౌండ్ఫ్లోర్ మయసభ ని తలదన్నే విశాల పాలరాతి  సభామంటపం లో నర్తకిలంతా చిన్న దుస్తులు ధరించి  నిలుచున్నారు ,మంచి ఊపున్న  హిందీ పాట పెట్టి , లైట్లు కెమెరా హడావిడి గా ఉంది  ఒక చిన్న టీ వీ లో వాళ్ళ కదలికలను గమనిస్తున్నాడు ఒక వ్యక్తి , కాస్సేపు షూటింగ్ అయ్యింది తరువాత అక్కడ ఉన్న ఒక అక్వేరియం వద్ద కథా నాయకుడు  ప్రతి నాయకుడు తో  " నీ కూతురిని ఇరవై నాలుగు గంటల్లోగా ఎక్కడున్నా లేవదీసుకు పోతా" నని  ని సవాలుచేసే దృశ్యం తీశారు." అది జరిగిన 24 గంటల్లో నీ చెల్లిని మాన భంగం చేస్తానని ప్రతి నాయకుడు  ప్రతి సవాలు చేస్తాడు" కట్ కట్  అరిచాడు డైరక్టర్. కశ్యప్ లకుమని తీసుకెళ్లి వినోద్ కి పరిచయం చేసాడు.

సర్ ఏ హై లకుమ, ఆప్ కో పతా  హై అరుణాజీ , ఓ  అచ్చి  తరహా నాచ్తీహై. మాయ టెలి ఫిలిం మే కియా , అంటుండ గానే  '  ఓ హొ  హొ హొ హొ అంటూ కుర్చీ నుంచి లేచి షేక్ హ్యాండ్  ఇచ్చేడు " ఏ ఉంకీ భేటీ హై " అని కశ్యపుడు పూర్తి చేసెను. " నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు , మీ మదర్ మంచి డాన్సర్ మీరు డాన్స్ బాగా చేస్తారని కశ్యప్ చెప్పాడు. గత వారం మీ మూవీస్ చూసాను ముఖ్యం గా డాన్స్ బిట్స్ సాంగ్స్ చూసాను. మీ డాన్స్ బాగుంది. అని మెచ్చుకొని మధ్యాన్నం ఐటెం సాంగ్ ఉంది షూటింగ్ ప్రారంభిద్దాం ఇక్కడున్న జూనియర్ ఆర్టిస్టులతో కొంత సేపు ప్రాక్ట్స్ చేయండి.  “సార్ నేను హీరోయిన్ రోల్ కోసం వచ్చాను సార్ , అది లేకపోతె చిన్న కామియో రోల్ అయినా వేస్తాను కానీ మొదటి సినిమా ఐటం గర్ల్ అంటే ఇంకా వచ్చే వన్నె అలాటివే  వస్తాయి.” లేదు వస్తాయి అని వినోద్ నమ్మబలికాడు కానీ లకుమ ఒప్పుకోలేదు. " సరే అయితే ఈ రాత్రి రూమ్ నెంబర్ 205 కి రండి మనం డిస్కస్ చేద్దాం. చూద్దాం నెక్స్ట్ ప్రొడక్షన్ ట్రై చేద్దాం. లకుమ వెళ్ళిపోయింది.         

                                                                   ***

ఆ విశాల మంటపంలో కశ్యప్ వినోద్ తప్ప ఎవ్వరూ లేరు "అరే  ఛ త్  పిట్ట ఎగిరిపోయింది  ఏ క్యా హాయ్  కశ్యప్? "  కశ్యప్ "థోడా దాల్ డాల్నా పడేగా, ఏ బ్యూటీ  క్వీన్ హై ఔర్ సెక్సీ భీ హై! ఏ ఐసే నహీ మానేగీ "               

"అరె భాయ్ శ్యామ్  రైటర్ కో బులావ్ అసిస్టెంట్ కి పురమాయించాడు వినోద్ భాయ్ బులార హే హై  రైటర్ ని తీసుకొచ్చాడు "అభీకీ అభీ ఏక్ స్పెషల్ అపెయర్స్ రోల్ బనావో " అన్నాడు వినోద్ భాయ్ రైటర్ తో 

" కితనే స్పెషల్ అపెయర్స్  రకూం  ఆల్రెడీ దో హమే రక్ దియా"   "అరే భాయ్ ఏ దోనొం కో హాఁ నికాల్ దెంగే" 

నీయబ్బ నీకు మధ్యాహ్నం ఒకర్తి ,  రాత్రి ఒకర్తి  కావాలి , నీ  సినిమాల్లో జనాలకి చెప్పే నీతులు  శీలం , మానం  పవిత్రత ఆడదానికి చాలా ముఖ్యం అని చెప్తావు. ఇవి చూసి పిచ్చిపువ్వులు నిజమే అనుకుంటారు అని మనసులో అనుకుంటు జీ సార్ , స్క్రిప్ట్ రాసుకుని  ఇప్పుడే వస్తాను  అని రైటర్  వెళ్ళిపోయాడు    

మొత్తానికి రైటర్ ని రేప్ చేసి రెండు రోల్స్ పెట్టించి ఇద్దరమ్మాయిలని .. ఆ 

హ  హ హ.. మన ఫీల్డ్ లో ఇవన్నీ తప్పవు కశ్యప్ 

నీకు మధ్యాహ్నం ఒకర్తి ,  రాత్రి ఒకర్తి  కావాలి అని నవ్వుతూ రైటర్ అనలేకపోయిన  మాటనే మిత్రుడు కనుక కశ్యప్  అనేశాడు కానీ సమాధానం చాలా గట్టిగా ఇచ్చాడు  వినోద్ భాయ్ " సినిమా వాళ్ళు దేవుళ్ళు ఒకటే "

తో పూజా కరూన్  హారతి ఉతారూన్ ! పది మంది తో సెక్స్  మళ్లీ దేవుళ్లతో పోలిక అన్నాడు నవ్వుతూ కశ్యప్ 

పురాణాలు సమంగా చదువు. చదివినా ఉపయోగం ఉండదు , కలర్ బ్లైండ్  వాడికి  బ్లూ , గ్రీన్,  రెడ్ కనిపించవు. చదివినా నీకు అర్థమయ్యేది ఏమీ ఉండదు. జామర్ ఉన్న ప్రదేశంలో సెల్ ఫోన్ పనిచేయదు . ఇండియా బైటకు వెళ్లి కొంతకాలం అక్కడ నివసించి  ఆలోచించు.   

 సరే ఇంతకీ నేను తీసుకొచ్చిన అమ్మాయికి కూడా ఒక చిన్న రోల్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత ఆ రోల్ పీకేస్తావ్ అంతేగా?

నో నో నో అలా చెయ్యను నేను తప్పులు చేస్తాను కానీ  అబద్దాలు చెప్పను, చెపితే క్రెడిబిలిటీ పోతుంది ఈ అమ్మాయి నాకు నచ్చింది కొంత కాలం కావాలనిపిస్తోంది అందుకే మంచి రోల్ ఇస్తాను. 

                                                                            *** 

 ఇదంతా ఒక గంటలో జరిగిపోయింది లకుమ తన హోటల్ రూంకి చేరగానే శ్యామ్ నుంచి ఫోన్  ఫోన్ వచ్చింది. లకుమ మళ్ళి లలిత్ సెవెన్ స్టార్ హోటల్ చేరుకొని సెట్ లో ప్రత్యక్షం అయ్యింది.  "నీకు ఈ ఫిలిం లో స్పెషల్ రోల్ సృష్టించి ఇస్తున్నాను , ఇప్పుడు డాన్స్ చేయడానికి అభ్యంతరం లేదుకదా" అన్నాడు వినోద్.  లకుమ సెక్సీ దుస్తులు వేసుకొనిసిద్ధం  అయ్యింది. నిన్న తీసిన పాటే కదా ఇది అన్నాడు కెమెరామెన్. అది తీసేస్తున్నాం ఆ అమ్మాయి రోల్ కట్ చేసేసాను  మరి  డాన్సర్స్  లేరు కదా ఎలా అన్నాడు కెమెరామెన్ . అరే మర్చిపోయాను , ఈ రోజుకి నువ్వు  కూడా వెళ్లొచ్చు కెమెరా  నేను చూసుకుంటాను అని కెమెరామెన్ ని పంపించేశాడు. షీలాకీ జవానీ ని పోలిన సెక్సీ సాంగ్ కి లకుమ లకుమ అత్యద్భుతంగా డాన్స్ చేసింది.   మూడు సార్లు డాన్స్ చేయించాడు. కెమెరా ఆన్ అయినా  చేయలేదు.  ఎక్కడపెడితే అక్కడ తాకుతూ తానూ కూడా డాన్స్ చేసాడు. 

                                                                        ***

“లకుమా ఇదంతా కామన్.” “నేను వీడిని వదలను నన్నెక్కడపెడితే అక్కడ టచ్ చేసేసాడు. నేను కంప్లైంట్ చేస్తాను.” “కంప్లైంట్ చేసి లాభం లేదు, అయినా ఎవరికీ కంప్లైంట్ చేస్తావ్?” “ప్రొడ్యూసర్ తో చెపుతాను!” ఏంటీ ప్రొడ్యూసర్ తో చెపుతావా! నీకో విషయం తెలుసా ప్రొడ్యూసర్ వీడి బాబే! వాడు వీడు కలిసి ఒకే దాన్నితగులుకున్నారు తరువాత కొడుకు దాని పెళ్లి కూడా చేసుకున్నాడు. మన తెలుగు సినిమాల్లో హీరో ధనార్జన తన కొడుకులాగా. ధనార్జన అటు వంటివాడా. కమల వూరుకుందా?  అది బయటకి కనిపించని దొంగ దానికి బాయ్ ఫ్రెండ్స్  ఉన్నారు. హైద్రాబాద్ లో కాస్టింగ్ కౌచ్  గురించి విన్నావా శ్రీరెడ్డి , దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు ముద్దు పెట్టుకున్నాడని కంప్లైంట్ ఇచ్చి బట్టలిప్పుకొని రోడ్డుమీద కూర్చుంది . కవరేజిలిచ్చి చానెల్స్ వాళ్ళ తీ ఆర్ పీలు పెంచుకున్నారు తప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా. రుజువులడిగితే ఫోటోస్ చూపించింది, ఏంజరిగింది , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్ ఆవిడని డిస్మిస్ చేసేసాడు.

నాకు చాలా షాకింగ్గా ఉంది సంజయ్ సాబ్ మంచివాడు అని నువ్వంటే వాడొట్టి వెధవ అన్నాను. వినోద్ తో పోలిస్తే వాడు మంచివాడే. వాడు అడిగి ఊరుకున్నాడు. కానీ వీడు మర్యాదగా మాట్లాడి  రప్పించుకుని అంతా  టచ్ చేసేసి చాలా .... చేసాడు. రూంకి రమ్మన్నాడు. 

నువ్వు వచ్చేసావు , ఊ బెట్టు చేయడం మంచిదే . నువ్వు పెద్ద ఫిలిం ఏక్ట్రెస్ వి చిన్న పిల్లలా బాధ పడకూడదు ! లకుమా నువ్వు యాభై ఫిలిమ్స్ లో నటించేవు కదా మొదటి ఫిలిం లో ఎంత గౌరవం పొందావు? యాభయ్యవ ఫిలిం లో ఎంత గౌరవం పొందావు? నువ్వింకా ఇప్పుడే అడుగు పెడుతున్నావు, అది మర్చిపోకు , మనకి ఒక బ్రేక్ వచ్చేవరకు తప్పవు ఈ సమస్యలు , తెలుగులో నీకు ఎవరైనా వేషాలిస్తున్నారా ? ఇప్పుడేమీ రావటం లేదు కదా, ఊరకనే వెయిట్ చేస్తూ కూర్చుంటానంటే పద హైద్రాబాద్ పోదాం. నాడైరెక్షన్ లో నీకెప్పుడూ ఛాన్స్ ఉంటుంది. "వొద్దొద్దు ఇప్పటికే నీకు నాకు అఫైర్స్ ఉన్నాయి అని పేపర్లు ఛానెల్స్  లో  హోరెత్తిపోయింది నేను వేరే ఎక్కడా అవకాశాలు లేక నీకు ఉంపుడు గత్తెగా మారానని అనుకుంటున్నారు." 

ఈ ఫిలిం లో చెయ్యి నువ్వు తారాపథంలో వెలుగుతావు. థాంక్స్ నువ్వు నాకు ఆ హాప్ ఇస్తున్నావు. చీర్స్ ఫర్ ద హోప్ ఇద్దరూ మొదటి రౌండ్ పూర్తి చేశారు. లకుమ సిగరెట్ వెలిగించింది తమాషాగా పోగొదు లుతోంది . బలే గుందే నీయమ్మ పిట పిట పిట్ట సినిమాకోసం నేర్చుకొన్నావుకదా ఈ సిగరెట్టు , నువ్వు సిగరెట్ తాగుతుంటే చాలా సెక్సీ గా ఉంటావే నిన్ను చూసినోడు ఎవ్వడూ వొదలాలనుకోదు  ఏయ్ అలాఅని నన్ను వాడితో పడుకోమంటావా? రెండవ రౌండ్ పూర్తయ్యి మూడవ రౌండ్ పోసాడు.  షిట్ ఈ హౌస్ వైఫ్ మోరల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకోసం మనలాంటి తారాల కోసం కాదు. ధర్మేంద్ర భార్య ఉంటుండగా ముస్లింగా మతం మారి హేమామాలినిని చేసుకున్నాడు. ఒదులు కున్నాడా? నయనతార కోసమే కదా రెండవ రౌండ్ పూర్తయ్యి మూడవ రౌండ్ పోసాడు.  షిట్ ఈ హౌస్ వైఫ్ మోరల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకోసం మనలాంటి తారాలకోసంకాదు. ధర్మేంద్ర భార్య ఉంటుండగా ముస్లింగా మతం మారి హేమామాలినిని చేసుకున్నాడు. ఒదులు కున్నాడా? నయనతార కోసమే కదా ప్రభుదేవా పెళ్ళానికి విడాకులిచ్చేశాడు. కరీ నా కపూర్ సైఫ్ ఆలీఖాన్ కోసం తన  బాయ్ ఫ్రెండ్ షాహిద్ కపూర్ ని వొదిలేయాలా , సైఫ్ ఆలీఖాన్ కి అమృతా సింగ్ (మొదటి భార్య) తో  పెళ్ళి అయినప్పుడు కరీనా కపూర్ 12 ఏళ్ల   పిల్ల "  హేపీ మేరీడ్ లైఫ్ అంకుల్" అని చెప్పింది. రాజేష్ కన్నకి, దేవానంద్కి ఎన్ని ఖాతాలు ఉన్నాయో లెక్క లేదు. సౌత్ లో  అఫైర్స్ మైంటైన్ చేయడం కమల్ హాసన్ ప్రారంభించాడు అఫైర్స్ మైంటైన్ చేయడంలో కమల్ కి   పీ హెచ్ డి  ఉంది. “ఒరేయ్ నీ కెక్కింది కదా వాగుతున్నావు, నాకు ఎక్కింది, నాకెక్కితే నిద్రొస్తుంది నీకెక్కితే వాగుతావు” అంది లకుమ.

అలా చేస్తే సమాజంలో మనకుండే గౌరవం . షిట్ మన కనిపిస్తే పొంగిపోతారు , మన ఫోటోలు వేసుకుని పత్రికలవాళ్ళు బతుకుతారు, అవి చూసి ప్రజలు మురిసిపోతారు. లక్షలాదిమంది మన అభిమానులని చెప్పుకుంటారు , అవకాశాల్లేనివాడు మన  మీద పడి  ఏడుస్తాడు తప్ప  అవకాశం ఉంటె ఎవ్వడూ వొదులుకోదు . టక్ టక్ టక్ తలుపు చప్పుడు అయ్యింది, లకుమ తలుపు తీసింది. డైరెక్టర్ వినోద్. లకుమ నువ్వు ఒప్పుకున్నదానికంటే ఎక్కువే ఇవ్వాలని నువ్వు కోరినట్టు నీకు హీరోయిన్ రోల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను.   ఆ గుడ్ న్యూస్ నీకు చెపుదామని వచ్చాను.    


Bharatavarsha -83

మధురవాడ క్షేత్ర గృహము బాగుగా రంగు పూసిన బొంగరమువలె నీటియందు తేలుచున్న నౌకావలె మెరియుచుండెను. సందీపుడు ఇచ్చటికి వచ్చుట అరుదు. అందు  మెర్సిడెస్ మహారాణి వసించుచుండును. అప్పుడే వచ్చుచున్న పెంచలయ్య ను చూచి సందీపుడు "నాన్నా నాన్నా దూరవాణికి దొరకక  ఎక్కడ  తిరుగుచున్నావు , రాత్రాంతయూ నీకొరకు ప్రయత్నించుచూ నాకు పిచ్చి పట్టినది, " అయ్యో నీకూ పట్టిందేట్రా  పిచ్చి . అదృట్టం నాకు పట్టిన పిచ్చిఒగ్గేసింది  . అదృష్టం నాకు రేత్రి పట్టిన పిచ్చితో పాటు ఎం ఎల్ ఏ పిచ్చి కూడా ఒగ్గేసింది.  నిన్న  రాత్రి ఈ క్షేత్ర గృహమునకు నీకొరకు వచ్చి చూడగా  అప్పుడే నీవు  బైటికి వెడలినావని ఇచ్చటి కావలి బృందం చెప్పగా నీకొరకు వేచియున్నాను. రాత్రి విహారయాత్రలు చేయుచుంటివా ! అతి ముఖ్యమైన విషయమొకటి చెప్పవలెన" ని కోపముతో రేగుతున్న సందీపునికి రాత్రి జరిగిన సంఘటనను వివరించి,  పోలీసులను ఎట్లు  వేడుకొని పిర్యాదు వెనుకకి తీసుకొనేనో ,  భారతవర్షను విడిపించి ఎట్లు మాలిని గారిని క్షమాపణ వేడుకొనెనో తెలిపి శాంతిపజేసెను. "రేత్రి నిద్రలేదురా నాను  పండుకొంటాను, నువ్వు పడుకోరా ఇంక ఆళ్ళ జోలికెళ్లను. నువ్వు కూడా ఆల్ల గురించి మరిసిపోరా, ఆల్లువద్దు , ఆపిల్ల వద్దు. తొందరలో పాస్టరుగారి అమ్మాయితో నీ  పెళ్లి సేసేస్తాను." అని మంచంపైన వాలుచున్న తండ్రితో  " నాన్నా ఇప్పుడు పెళ్లి మాటపక్కన పెట్టి నేను చెప్పెడిది వినుము చెల్లి గొంతు కోసుకొనుటచే విశాఖపట్నము ఆశుపత్రిలో వేసినాము. " మాట పూర్తి అగుచుండగానే వాహనము విశాఖపట్నము బయలుదేరెను. 


మార్గమంతయూ పెంచలయ్య లబోదిబో మనుచూ వాహనమును నడుపుచుండెనుఆసుపత్రి చేరగానే ఒక్క ఉదుటున లంఘించి వైద్యులని కలిసి నందిని నుంచి న ప్రత్యేక గదికి పోయి ఆమెను చూచి విలపించసాగెను. అక్కడున్న డాక్టరు గారు ఆమె నిద్రించుచున్నదని జెప్పి  నోరు పెట్టరాదని హెచ్చరించి ఆపై అతడిని ఓదార్చి వెడలిరి . అప్పుడు గాని అతడు చేతికి కట్టు కట్టుకొని ప్రక్కనే ఉన్న భారతవర్షను గమనించలేదు. 

మీరు ఈ దెబ్బలతో విశ్రాంతి తీసుకొనక ఇట్లు వచ్చినారేమీ అని అడుగగా చేతియెముక సూక్ష్మముగా బీటవారినది ,గాయములు మందు రాసి  కట్టుకట్టి  నేటికి విశ్రాంతి తీసుకొని రేపు పొమ్మనిరి నేను అమ్మ చెల్లితో క్రింది అంతస్తులో నున్నాము , ఇంటికి  పోవుచూ నందినిని చూచిపోవలెనని వచ్చితిని

 ఏమండీ భారతవర్షగారు   నేను చేసిన పొరపాటుకు నాబిడ్డ బలిఅగుచున్నది అని వర్షునితో అనుచుండగా మందులు కొనుటకు క్రిందకి పోయి న పైడమ్మ సందీపునితో కలిసి వచ్చెను. మంజూష మాలినిగారు కూడా వెంట వచ్చిరి.  

పైడమ్మ:  రేత్రంతా పోనాపీసి  తొంగుండిపోనావు ఇప్పుడు తీరికయ్యిందేటి  ఆబాబుకి కుడి సెయ్యిరిగిపోనాది బుర్ర కి బొక్కడిపోనాది నువ్వు సేసింది పొరపాటు కాదు పాపం, పాపం సేసినోన్నిఆ పెబువు సమించడు అని పైడమ్మ భర్తను తూర్పారబట్టెను .

మారిపోయినోణ్ని అంటే నీకే పాపమే పైడి “అనుచుండగా సందీపుడు విదిష ఉదంతమునెఱిగించి నాన్న మారుట కాదమ్మా ఆ ఆదిపరాశక్తి నేమి చేయజాలక గత్యంతరం లేక పోలీసులవద్దకి పోయి పిర్యాదు వాపసు తీసుకొనెను.  దాసుకి, ఆది మావకి ఆరూపము చూచి జ్వరము వచ్చి నోటిమాట పడిపోయెను. 

పైడి :ఓలమ్మోలమ్మో, ఆ దేవుడమ్మ జోలికెల్ల కురా నల్లని నలిపినట్టు నలిపేత్తాది!

నందిని కళ్ళు తెరచి "ఇంకా నన్ను చూడ్డానికి వచ్చారా అమ్మా నామీద మీకు జాలిగిననూ నాపై నాకే అసహ్యము కలుగుచున్నది. నాకు జీవితమూ పై విరక్తి కలుగుచున్నది కలుగుచున్నది. 

పైడి :అవన్నీ మరిసిపోయే నువ్వు బతకాలి నువ్వేటి తప్పుసెయ్యనేదే 

సందీ : చెల్లి,  నీవట్లనినచో నేను వర్షను కొట్టినాను నేనేమి చేయవలె ? నాకునూ బ్రతుకన్న చీదర పుట్టుచున్నది!

పెంచ :ఎట్రా చిన్న  తప్పు సేసినోళ్లంతా సచ్చిపోతామంటారు పెంచలయ్య తల్లడిల్లిపోయెను 

మాలి: తప్పమ్మా చిన్నపిల్లలు ఏంటో జీవితము మీ ముందున్నది మీరు తల్లిదండ్రులముంద ట్లు మాట్లాడరాదు. మీ కుటుంబము పచ్చగా ఉండవలెను.  

నంది: నాన్న మొదట గురువుగారిపై బురద జల్లించితివి , తరువాత వారి తల్లిని అవమానించితివి , తరువాత ఆయనని జైల్లో వేయించితివి. నేడు వారు మనకుటుంబము చల్లగా ఉండవలెనని దీవించుచున్నారు. క్రీస్తు నీ బోధలోనే తప్ప నీ ఆచరణనందెచ్చటనూ కనిపించుటలేదు 

వర్ష: నందిని నీవెక్కువ మాట్లాడరాదని డాక్టర్లు చెప్పినారుకదా  మాట్లాడవలదు గాయము లోతుగా కానందున కొద్దిగా కుట్లు పడినవి అని పెంచలయ్యవైపు చూచి చెప్పి, నీ అల్లరి ఎక్కువగుచున్నది ఇప్పుడవన్నీ తలచి వగచి పనేమి కలదు ? గతం గతః  నేనవి ఎప్పుడో మరిచితిని.  అని నందినికి చెప్పెను   

మీరుచెప్పినచో తప్పక పాటింతును అని మాటలాపి  సైగతో  సందీపుని పిలిచి   మంజూష చేతిని అతడి చేతులో నుంచెను. పైడమ్మ ఈ బంగారు బొమ్మే  నాకోడలు  అని  మంజూషని దగ్గరకు తీసుకొనగా భారతవర్ష మొఖము ఎర్ర బారెను. అది చూచి  నందిని మొఖమున నిరాశ తొంగి చూచూచెను. పెంచలయ్య లోక్యమెరిగిన వాడగుటచే  క్షణామా లసించక మాలినిగారి పాదములపై బడి క్షమాపణ వేడెను. అప్పుడు మాలినిగారు చిన్నగా నవ్విరి అది చూచి  వర్షుడు నవ్వెను , వర్షుని చూసి నందిని నవ్వెను, నందినిని చూచి పెంచలయ్య నవ్వెను , అది చూచి సందీపుడు తన చేతిలో నున్న  మంజూష చేతిని మెల్లగా  నొక్కెను , మంజూష  సిగ్గిల్లెను. ఆమె బుగ్గలెర్రబారెను.   

                                                                            ***

ఇంతలో డాక్టర్ గారు వచ్చి భారతవర్షను  తన  గదికి పోయి విశ్రాంతి తీసుకొని సాయంత్రము ఇంటికి పంపెదమని తెలిపిరి.   పైడమ్మ , మాలిని రాత్రి నిద్రలేమిన  బడలికతో ఎక్కువసేపు కూర్చొనలేకపోవుటచే వారునూ  సందీపుని మంజూషని తీసుకొని ఇళ్ళకేగిరి.  డాక్టరు గారు పెంచలయ్య మాత్రమే నందిని గదిలో నుండగా 

పెంచలయ్య : డాక్టరుగారు మా అమ్మాయి కేమీ కాదుకదా ! గొప్ప పండితురాలు 

 అని మెచ్చుకొనుచూ అతడికేమీ తెలియదనుకొని ఆ వర్షుడి వల్లే నాకూతురికీ 

గతి పెట్టెనని  అతడిని నిందించుచుండగా డాక్టరు " అయ్యా పెంచలయ్యగారు మీసంగతి మీకుటుంబ సభ్యులు చెప్పుచుండగా  ఇప్పుడే తెలిసినది కానీ భారతవర్ష నాకెప్పుడో తెలియును. అతడి గూర్చి నా ఒక్కడికే కాక జగమంతటికీ  తెలియును. అనుచుండగా 

పెంచలయ్య " మీ యభిమాన మలగుంది , జగమంతా తెలిసిపోయే కత ఎక్కడుంది ?" అని " నా పోగ్రాంలు కూడా టీ వీ లో ఒత్తంతాయి  అండీ. , మీరెప్పుడు సూడనేదేటి ?

అయ్యా మీరు డబ్బు చెల్లించి వారి సమయమును కొనుక్కొని ప్రోగ్రామ్లు ఇచ్చుచున్నారు , దానికి మీరింత బడాయి పోవుచున్నారు. ఆయనకీ సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడెను. ఆయనకీ తెలిసిననూ సందర్భము కాదని మీకు చెప్పలేదు . 

ఎందుకు సెప్పనేదు అవునెందుకు  సెప్పనేదు అని అతడి ప్రాణము తీయుచుండగా " Empty vessels make much noise" అను సామెత కర్దము తెలియునా? అని  అడిగెను  తెలియదని పెంచలయ్య  చెప్పగా మీ అమ్మాయి నడిగి తెలుసుకొనుడని చెప్పి వెడలిపోయెను. నందిని అంతయూ విని ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. ఇంతలో పెంచలయ్య వాహనమును చూసి పసిగట్టిన వర్షుని అభిమానులు పెంచలయ్య నశించాలి అని అతడి కారు వద్ద అరుచు చుండగా రక్షణ అధికారులు వారిని  ఆసుపత్రి బయిటకు పంపివేసిరి . అయిననూ వారు కదలక ఆసుపత్రి ముందు నిలిచి అరుచుచుండిరి. రెండవ అంతస్తునుండి ఇది చూచినా పెంచలయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పది నట్లయ్యెను. అతడాముదము తాగినట్టు మొఖం పెట్టగా నందిని " నాన్న విచారించ పనిలేదు  ఈ ఆసుపత్రికి వెనుక త్రోవ ఎచ్చటున్నదో  తెలుసుకొనుము " అనగా పెంచలయ్య మొఖం వెలిగిపోయెను. 

అతడు వెడలినపిమ్మట నందిని వర్షుని గదిలోకి పోయిఅతడి చెక్కిట ముద్దిడగా వర్షుడు తీవ్ర కలతనొందెను నీవు పడుకొని యుండక ఇచ్చటికేలా వచ్చితివి అని ముద్దుగా కసరగా "ఇప్పుడు పోవుచున్నాను మనమిద్దరమూ ఒక కుటుంబమగుచున్నాము, అప్పుడు అధికారికంగా మీ ఇంటికొచ్చెదను, మరదలినప్పుడెట్లు  పొమ్మందురు బావగారు  అని  కొంటెగా చూచుచూ అభినందనలు తెలిపి తన గదికేగెను. 

   

Sunday, November 29, 2020

Bharatavarsha 82

 నైమిశారణ్యమున గోమతి నది వొడ్డున ఒక చెట్టుక్రింద కూర్చొని ధ్యానమందు  నిమగ్నమైయున్న ఒక కాషాయ ధారి అయిన  యోగి కనులు  తెరచెను. అతడి పెదవుననుండి

అణిమాసిద్దే, లఘిమాసిద్దే, ఈశ్విత్వసిద్దే, ప్రాకామ్య సిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే - ఏక రేఖాయమ్ - ఒకటవ పాదము గృహము దాటెను

బ్రహ్మ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి ద్వితీయ రేఖ యమ్ రెండవ పాదము మధురవాడ నందు పడెను. 

కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి. శబ్దాకర్షిణి, స్సర్శాకర్షిణి¸రూపాకర్షిణి, బీజాకర్షిణి¸ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరకచక్ర స్వామిని, గుప్తయోగిని మూడవ పాదము క్షేత్ర గృహమునందు పడెను. 

“స్వామీ ఎవరి గూర్చి మాట్లాడు చున్నారు.” “ఒక యోగినికి కుండలిని మేల్కొనెను” మీకు నిత్యమూ భోజనము తెచ్చి యుంచుచున్నాము మీరు స్వీకరించుటలేదు. నేడైననూ భోజనము చేయవలెను అనగా “మీరు తెచ్చిన భోజనము నేను ఆరగించుచున్నాను ఆహారం భౌతికంగా స్పృసించ కున్ననూ మీరు నాకు నైవేద్యముగా నర్పించినవి నా ఆకలి తీర్చినవి.” 


                                                                     ***

ఒక ఆరుగురు మనుషుల గుంపునుండి ఒక స్వరము అరేయ్ ఎవర్రా అక్కడ గేటు దగర ఎవరో లోపలకి వస్తున్నారు పెంచలయ్యగారు ఎవ్వరినీ లోపాలకి పంపవద్దుఅనారు. “లేదయ్యా ఎవ్వరినీ పంపలేదయ్యా” గేటువద్దనుండి కావలి వారు కేకపెట్టిరి. 

ఆరుగురు యోధుల ఆ సమూహమందు ఒకడు " నాకెవరూ కనిపించలేదురా!"

రెండవవాడు " ఎవరో వస్తున్నట్టు అనిపించింది "

మూడవవాడు " ఎహ్ ఎవ్వరూ లేరు అంతా  నీ భ్రమ"

నాల్గవవాడు "  అందుకే తక్కువ తాగాలి నాలా,  నాకు ఎవరో వస్తున్నట్టు అనిపించెను" 

ఐదవవాడు " అనిపించడమేటిరా సన్నాసుల్లారా ఎవరో బాబుగారి గదిలోకి కూడా వెళ్ళిపోతేనూ . 

ఆరవవాడు:"ఓరినీ యమ్మోరేయ్,లోపల బాబు తుపాకట్టుకొని కూసున్నడు,లోపలికెవరైనా వత్తే మననేసేస్తాన్నాడు"

 

                                                                   ***


బావా ఎందుకు బావా పోను ఆపీసావు 

పెంచలయ్య గుడ్లు మిటకరించి చూచు చుండెను 

ఎటి బావా మాటాడకుంటన్నావు , మట్టిబుక్కడంనాఅగయిపోనాడు

చేతిలో టుపాకట్టుకొని కూకోని ఎందుకురా జడుత్తన్నావు 

ముందు తుపాకీ పక్కనెట్టి మందేసియాయ్ ఆ వర్సా గాడిని పోలీసులొట్టు కోయారు 

మనోడికి పీజులు కొట్టీసినాయి. ఏట్రా ఆడంటే అంట జడుత్త న్నావు 

ఒర్ ఆదీ , దాసు పల్లకొండ్రా ఆ వరసాగాడ్ని అరట్టు సేసేరని ఎవడో అభిమాని  సూసి  అందరితో సెప్పేసాడట , దాంతో  అని ఆపి వణకసాగెను 

ఆ దాంతో...  ఏటైపోద్ది  ఇనస్పెట్టరు నీ సీటులో ఉన్నదో 

సన్నాసినాకొడకా సెప్పినదినారా , మందు కొంచెం పోయారా .. ఈ రేత్రి కాడ వందలమంది స్టేషను కాడ పోగయ్యారట. వర్ష అక్కడ్నేడు ఎక్కడికటికెల్లిపోనారో సెప్పనేదు గానీ  నన్ను పోనాపేసి తొంగోమన్నాడు. 

రేత్రి కూసింత జాగ్రత్త ఎవుడైన వొచ్చి గుడ్లు ఎక్కనాగే త్తాడు , మాపూసి ఏటినేదని సెప్పాడ్రా! 

ఎవుడై  ఆ సెప్పినోడేవుడ్రా  " జిల్లా ఎస్ పీ రా " 

బావా హాల్లోకి ఎవరో ఆడమనిషి వచ్చింది బావా! 

దాసు పోయి సూసి రారా!  దాసు పోయి చూసి వచ్చాడు 

పెంచ ఆ దేవుడమ్మ సోపాలో కూకోంది , దాని మొఖం సూత్తే భయమేత్తంది!  

మంచిపనయ్యిదిరా దానిగురించి ఈ బాధలన్నీ,సంపి ఈ పొలంలో పాతేత్తే  అసలు గొడవే ఒగ్గిపోద్ది. 


తే.  చంపి  ఇచ్చట పాతిన శని వదులు  

పీను  గవదులు అనుకొని పేల్చె ఒకటి 

రెండు మూడవ గుండుమ  రింత పెరిగె

కాళి రూపము చూడగ కలుగు భయము

         

 తే.  భీష ణవదన  మునుతిప్పె  వెనుక పేల్చ 

ఎఱ్ఱని నిప్పులు కురిపించె ఏనుగు బారు

పెరిగె  పిచ్చిగ  మరిరెండు పేల్చ వక్ర 

హాస  మునుజూప కాలిక  అదిరె  నతడు 


శా. కాళీరూ    పముక   ల్గిభీ ష  మగుచ    క్రాకార   నేత్రంబు లన్        

గోళాలే    తిరుగా  డజ్వాల  లలిమెన్   ఘోరాతి గోరంబు గా  

కాళీయే   కరిప     రిమాణ    మదిఉ   గ్రాతుగ్ర  నిస్వాస మున్

దూళీమా  త్రముగా నశించి  తరుగున్  దూరాకృ  తమ్మంత యూ       

     

పెంచలయ్య తుపాకీ తో  ఒక్కటి కాల్చగా ఆ భీషణాకారం తలత్రిప్పి చూసి నవ్వెను. నివ్వెరపోయిన పెంచలయ్య ముందుకి వెళ్లి మరి   రెండు తూటాలు  కాల్చెను. క్రమేపీ ఆమె  ఆకారం పెరుగుచున్నది,  కళ్ళు అగ్ని గోళ ములవలె  మండుచున్నవి. ఏనుగు ముందు నిలచిన  పిల్లికూన వలే నున్న పెంచలయ్యను ఆమె ఉరిమి చూచెను.  

అంటూ తుపాకీ పట్టుకుని హాల్లోకి ప్రవేశించెను. బ్రిష్…. వెనుకనుంచి ఒక్కటి కాల్చగా ఆ భీషణాకారం తలత్రిప్పి చూసి నవ్వెను. నివ్వెరపోయిన పెంచలయ్య ముందుకి వెళ్లి  బ్రిష్ ... బ్రిష్.. మరి   రెండు తూటాలు  కాల్చెను. క్రమేపీ ఆమె  ఆకారం పెరుగుచున్నది,  కళ్ళు అగ్ని గోళ ములవలె  మండుచున్నవి. ఏనుగు ముందు నిలచిన  పిల్లికూన వలే నున్న పెంచలయ్యను ఆమె ఉరిమి చూచెను.  పెంచలయ్య కాళ్ళు వణికినవి, గొంతు తడారెను, వెన్నులో చలి పుట్టెను జడుసుకుని ఆత్మ రక్షణ కొరకు మిగితా మూడు తూ టాలు దగ్గర నుంచి ఆమె గుండెల్లోకి పేల్చి క్రిందకు వాలెను. లోపలి గదిలో గిలక రుచుకుపోయిన ఆది దాసులు పరుగు పరుగున హాల్లోకి వచ్చి పెంచలయ్యను కదపగా అతడు వెంటనే లేచెను. 

సంపీసానురా, ఆ సోపా యెనక పడిపోనాది

సంపీడమేటి బావా దేవుడమ్మ ఎల్లిపోనాది తలుపు తీసుకొని నాకల్ల తో నాను సూసాను

ఒరేయ్ దాసు ఎట్రా ఆది ఇలాగంటన్నాడు ?!

నిజమేరా నన్ను కూడా సూసాను 

నీ యమ్మ నాకొడకల్లారా మందెక్కువయిపోయి నన్నే పిచ్చోన్ని సేత్తా ర్రా!

ఇద్దరినీ తుపాకి వెనక భాగంతో గుద్దుతూ ఆరు తూటాలు కాలిత్తే ఎవ్వుర్తైనా బతుకుతాదిరా? 

సోపా వెనకాలెవ్వులూ లేర్రా పెంచ 

ముగ్గురూ బైటి కి పరిగెత్తారు ఒరేయ్ రమేసూ ఇటు ఆడ గుంటెళ్లిందా?

లేదయ్యగారూ, మేమంతా ఇక్కడే ఉన్నాము ఎవ్వరు రాలేదయ్యా 

ముగ్గురు లోపాలకి ప్రవేశించారు 

సోఫాపై కరి పరిమాణములో కూర్చొన్న దుర్గ రూపు కనిపించెను

ముగ్గురూ ఆమె కాళ్ళమీద పడ్డారు  పెంచలయ్య " తల్లే తప్పయిపోనాది ఒగ్గేయి 

నాకు ఎం ఎల్ ఏ వొద్దు ఏటొద్దు ఎల్లి వర్ష బాబుని ఇడిపించుకొత్తా, అంతవరకూ ఈళ్ళిద్దరూ నీ కాల్ల కాడే  కూకుంటారు"  ఊ……మ్ హు….. ఊ……మ్ హు…..  అతడు చెప్పుచున్నప్పుడు ఆమె ఊపిరి ధ్వని వాసుకి  బుసవలె  వినిపించుచూ అంతకంతకూ పెరుగుచూ ఆ  గదంతయూ మారుమ్రోగుచుండెను. ఆమె కనులు విస్ఫులింగములు చిమ్ముచుండెను.    కాస్సేపటికి ఆమె ఉగ్రత తగ్గి ఆమె పరిమాణము కూడా తగ్గెను. ఆమె లేచి తలుపు తీసుకొని బైటకు నడిచెను. 

Bharatavarsha 81

 తే.చెంపకు చారెడు కన్నులు, చంద మామ    

మోము,కొటేరుము క్కెఱ్ఱని పెదవు లందు 

కెంపులు, మొఖమున భానుని కాంతి చిందు  

చిరునవ్వు  చూడగ మోహము చెలగు చుండు.

తే.మూసిన కనురెప్ప లవెనుక మార్మి కజగ    2

మవతరిం చగకాంచె కాశ్మీ ర  మందు తానె 

యామిని పూర్ణతి లకము  యాత  డెకవి 

బిల్హణు  డుప్రేమి  కుడతడె  బాసె నసువు


తే. గీర్వాణ  ధీరజ  గన్నాథ ఘనక వనఘ  3

టకాంగవి  న్యాశమా  నసనాథు డొసగ డేల  

సమ్మతి ఇంపుగ కెంపులు చవిగొ నేల 

రాడేల జవరాలి  చెంగట  రంజన  పొంద


తే.సమత్తు డుపవాస మునుగూడ సడలె రక్తి    4

చేరిగం గాతీర మునర్చించి  జాహ్నవి లహరి 

విరచించె దినదిన మొకభక్తి   పద్యము, రెండు 

మాసము లకుభక్తి   కీర్తన   మాల నల్లె   


 తే.పద్దెని   మిదిపసి  మిబ్రియ  పడుచు జూచి  

గూట  గుండె  పాడ   గూడి  పాడి   

రంజిల్లె   ఫ్రీడ్రిక తిశయించి  రాగ మంత     

సాగి  వెలిగె   నొక్క   సాలు వరకు      



తే.రైను తీరము నందుతీ  రైన తార  6

వాలు కన్ను లందు వాడి తూపు 

లున్నప  సిడిబాల  లతికాంత  లున్నకు రంగి       

కూర్మి గోరుచు  చేరెను  గూట డొకడు         

   

 ఆ.కూరిమి కలిగెను మనసులు కూడ కలిసె          7

  వదిలి వెడలె ఇచట వంటరి గానె 

ముగిసెను   అంతయు  ఏడాది ముగియు లోపు            

 కర్మ కాలి  కడకు  గాలి  నయితి


ఆ. సరిగమ  సంగీత   సామ్రాజ్య  మేలు నాథ      8

యూరి డీసు నాథ   ఓర్పీ యాసు  

గానప్ర   తిభతోడి  సురరాజు  గాచి నావు 

గాన కీర్తి  నీది గాంచి చూడ 


ఆ.నాచేయి  పేర్మితొ   నీకివ్వ   నాథు డయ్యి          9

ఆలు మగల  మయ్యి ఆట లాడ 

కాటువే   యగపాము ఆశలు   కాటి  కెళ్లె 

వేచి యుగము లన్ని వేగి  నాను    

 


తే.నిలిచాను అన్నింట ముందింట నేను గెలిచి       10 

బహుమతు  లనునీమ నసుఫల మంది  దాచి 

వ్యోమగా మిగపోయి ఆకాశ బాణ  మందు

తిరిగొచ్చి  సగమిచ్చు  కలకంటి  తలచి నతల   

మధ్యలో పేలగ  భూమిపై   బుగ్గి  రాలె.     

ఒకటి రెండు పద్యములు: 11 వ శతాబ్దమందు కశ్మీరమందు మదనాభిరామ యను  రాజుకు "యామినీపూర్ణతిలక" అనే కుమార్తె వుం డెడిది. ఆ రాజు తన కుమార్తెకు విద్య నేర్పించుటకు "బిల్హణుడు"అనే కవిసత్తముని పిలిపిస్తాడు.ఆ కవి సౌందర్యం చూచిన రాజుకు మనసులో ఒక సందేహం కలిగెను. ఇంత అందమైన వానిని చూచిన  నా కుమార్తె ఈతని ప్రేమలో పడిపోవును. ఏమి చేయవలెను? అని మంత్రిని సలహా అడిగెను. పండితునికి కుష్టు వ్యాధి వున్నవారిని చూడకూడదనే నియమం వుంది. రాకుమారికి గ్రుడ్డివారిని చూడననే నియమంవుంది. దీనిని సాకుగా చేసుకొని కవి గ్రుడ్డివాడని రాకుమర్తెకు, రాకుమారి కుష్ట వ్యాధిగ్రస్తురాలని కవికి చెప్పి ఒకరినొకరు చూడకుండా మధ్యలో ఒక పరదావంటిది పెట్టించి విద్య మొదలు పెట్టించవలెనని మంత్రి జెప్పగా రాజట్లే చేసెను. ఒకనాటి సాయంత్రం చంద్రోదయ సమయమందు ఆకాశమును చూచుచూ కవి అందమైన పద్యాలు చెప్పుచుండగా అది విన్న రాకుమార్తె గ్రుడ్డివాడు చంద్రుని మీద ఇంత అందంగా పద్యాలు ఎలా చెపుతున్నాడు అని కాండపటం తొలగించి పండితునిచూచెను. ఒకరినొకరు చూచుకొని ఇది రాజు ఆడిన నాటకమని తేలిపోయినది. పిదప వారొకరినొకరు గాఢంగా ప్రేమించు కొనిరి.   ఈ సంగతి తెలిసిన రాజు" బిల్హణుని"శిరశ్చేదనం చేయమని ఆదేశించాడు. (మగువలెప్పుడు సురక్షితము శిక్షలన్నీ మగవారికే కదా!)

మూడు నాల్గు పద్యములు: జగన్నాధ రాయలు లేదా జగన్నాథ్ పండిట్ 1590 లో తూర్పు గోదావరి ముంగండ గ్రహంకు  చెందిన ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన పండితుడు. అతడ అనేక ఇతర భాషలలో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి.   అతని తండ్రి పెరు మరియు తల్లి లక్ష్మి ఇద్దరూ సంస్కృత పండితులు. అతని కవితా రచనలో రసా గంగాధర్, గంగా లాహరి, కవితా కామిని, యమునా లాహరి, భామిని విలాస్, విష్ణు లాహరి, ఆసాఫ్-లాహరి మొదలైనవి ఉన్నాయి. 

మొఘల్ చక్రవర్తులైన జహంగీర్ మరియు షాజహాన్ కోర్టులలో పనిచేశారు.  చక్రవర్తి షా జెహాన్ కుమార్తె  యువరాణి లవాంగికా మరియు ప్రిన్స్ దారాషుకోహ్  స్నేహితుడు అతని నుండి సంస్కృతాన్ని నేర్చుకునేవారు. కవిని ఆమె ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావించెను. వారిరువురి మధ్య ప్రేమ మొగ్గతొడిగెను.  చక్రవర్తి జగన్నాథ్ పండిట్ను ఇస్లాంను తన మతంగా అంగీకరించి, తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు జగన్నాథ్కు ఆమోదయోగ్యం కాదని తెలిపెను. 

తరువాత అతను భారతదేశంలోని వారణాసిలో నివసించాడు.  అతను గంగా నది ఒడ్డున ఉపవాసం ప్రారంభించి  ప్రతి రోజు అతను గంగా నది ఒడ్డున కూర్చొని  ప్రార్థించుచు  ఒక శ్లోకను రచించెను. ప్రతి శ్లోకం పూర్తయిన పిదప నది కొంచెము పెరుగు చుండెను. అట్లు 52 రోజులు జలాలు పెరిగి అతని పాదాలను తాకినవి ఈ 52 శ్లోకాల సమూహమే గంగా లాహిరి.

ఐదు ఆరు ఏడూ పద్యములు:  1770 లో తన విద్యార్థి రోజుల్లో, తరువాత కాలమునమహాకవి గా ప్రపంచ కీర్తి నొందిన, గూఠ, పద్దెనిమిదేళ్ల (లూథరన్ పాస్టర్ కుమార్తె)ఫ్రెడెరిక్ బ్రియాను రైన్ నది సమీపమున, స్ట్రాస్బోర్గ్కు ఉత్తరాన నలభై కిలోమీటర్ల దూరాన గల సెసెన్హీమ్ అనే చిన్న గ్రామాన కలుసుకొనెను. అతను ఫ్రీడ్రికను చూసినప్పుడు మొదటి చూపులోనే ప్రేమ లో పడెను.

గూఠను ఫ్రీడ్రిక కుటుంబానికి పరిచయం చేసెను. బైబిల్ విద్యార్థి గా పరిచయము చేసుకొని పాస్టరుగారిని కాకాపట్టి రాత్రిపూట పార్సనేజ్ వద్ద బసచేసి బ్రియా ప్రేమయందొక సంవత్సరము మునిగి తేలేను. ఉద్వేగభరితమైన ఈ ప్రేమ వ్యవహారం కేవలం ఒక సంవత్సరమే సాగెను. జూన్ 1771 లో గోథే తన న్యాయవాద పట్టాను పొందిన తరువాత ఫ్రాంక్ఫర్ట్లోని ఇంటికి తిరిగి పోయెను. బ్రియా ఎదురుచూచు చు మరణించెను.

ఎనిమిది తొమ్మిది పద్యాలూ : ఆర్ఫియస్, ప్రాచీన గ్రీకు పురాణ వీరుడు మానవాతీత సంగీత నైపుణ్యాలను కలిగి ఉన్నాడు. అతను గొప్ప కవీశ్వరుడు కూడా.  తన పవిత్ర రచనల ఆధారంగా ఒక మత ఉద్యమానికి పోషకుడయ్యాడు. అపోలో ఓర్ఫియస్కు తన వీణను బహూకరించెను. ఓర్ఫియస్ పాడటం మరియు ఆడటం చాలా అందంగా యుండెడిది, జంతువులు మరియు చెట్లు మరియు రాళ్ళు కూడా అతని గురించి నృత్య గానములందు కరిగెడివి. 

 దానవులకు అమరులకు సంగీత పోటీ వచ్చినప్పుడు  అమరుల తరుపున గానము చేసి వారి ప్రతిష్టను నిలిపి తిరిగి వచ్చినప్పుడు ఆర్ఫియస్,  యూరిడైస్ను వివాహం చేసుకొనెను, కానీ యూరిడైస్ వివాహమైన కొలది దినములకే  పాము కాటుతో మరణించెను .

పదవ పద్యము: అన్నింటావిజయము కేతనమేగరేసిన మగువ ప్రేమయందు కూడా విజయము సాధించి ప్రేమ కేతన మెగురవేసి, రాకెట్టు నందు రోదసీలోకి పోయి తిరిగి వచ్చి పెళ్లి చేసుకొనవలెనని కన్న కల రాకెట్టు మధ్యలోనే బూడిదగుటచే భూమిపై బూడిదై రాలెను

                                                                       ***.


శేషా :ఇంత  రాత్రి వేళ ఎవరది మన ఇంటివద్దకు వచ్చి నిలచినారు  స్త్రీఎవరో స్త్రీ , మారెమ్మ వలే...

రాజన్న: మారెమ్మ కాదు. దయ్యము వలే నున్నది.. బాబోయ్.. శ్రీ ఆంజనేయం ప్రసన్నఅజనేయం అందులకే ఈక్షుద్ర  విద్యలు వద్దని మొత్తుకొన్నది.  విద్యత్ సరఫరా ఇప్పుడే నిలిచిపోవలెనా!

శేషాచలం గారు ... మీరేనా ?

ఆ ఎవరూ  మాలిని గారా ? అంతా  కటిక చీకటిగా యున్నది .

మాలిని:ఇంట అర్ధరాత్రి ఎచ్చటికి పోయివచ్చుచున్నారు?

స్మశానమునకు .. ఛీ ఛీ బజారుకి .. ఛీ ఛీ నిమ్మకాయలు 

రాజన్న :నిమ్మకాయలు దిష్టి తీసి స్మశానంలో పారవేసి వచ్చుచున్నాము 

శేషా :ఇంత  అర్ధరాత్రి ...  మీరెందుకిచట ...  ఎవరికొరకు  ?

విదిషను మిమ్మల్ని కలిసి విషయమును తెలపవలెనని 

శేషా:కొలది దినముల నుండి మాత మన ధ్యానమందు మునిగి యున్నది , నాకు చెప్పిన ..  

మంజూష సందీపునిచే వంచించబడినది తల్లి కాబోవుచున్నది.పెంచలయ్య నన్ను పరాభవించిన ని తెలుసుకొని వర్షుడు వారి పైకి జగడమునకు పోయి వారిని కొట్టెను.  పెంచలయ్య పిర్యాదు చేయుటవల్ల భారతవర్షను పోలీసులు కొనిపోయినారు, నేను లాయరుగారితో స్టేషనుకి పోయిచూడగా వర్షుడు అచ్చట లేకుండెను. నాకు చాలా భయముగా నున్నది. 

శేషా: ఇటీవల కాలమున పాత్రికేయులను, పౌరులను బంధించిన పిదప ఒక ఠాణా లో ఉంచక రహస్య ప్రదేశమందుచుచున్నారు. ఆ పెంచలయ్యను కలిసి మాట్లాడినచో విషయము బయటపడును కానీ వాడికి సబ్బవరమునే కాక కొమ్మాదియందు స్థావరములున్నవి. 

మారెమ్మ: బాబు మీరు రాజన్న స్మశానమునకు పోయిన పిదప  అని ఎదో చెప్పు చుండగా కోపముతో రాజన్న "మారెమ్మ ఏంటే ఆ చెప్పడం దిష్టి పారవేయుట కని  చెప్పలేవు ,లేకున్నా  ఏ శవభేతాళము చేయుటకో అని విన్నవారుకుందురు."

మారెమ్మ: మరె నండీ.. మీరు దిష్టి పారేయడానికిలా వెళ్ళేరో లేదో అలా వచ్చాడండి సందీపుడు. నందినమ్మ గొంతు కోసుకొని ఆసుపత్రి నందు ఉన్నదట. సందీపుడు పలుమార్లు అతడు తండ్రికి ఫోను చేసెనట , ఆ తండ్రి పోవును ఆపుజేసుకొని కూరొండినని నేరుగా సబ్బవరం వచ్చినాడు తిరిగి పోవుచూ విదిషమ్మ  సాయము కొరకు వచ్చెను , కానీ మాత ధ్యానములో నుండుటచే వెడలిపోయెను. అయ్యో ఏమి అవసరము పడి వచ్చెనో! 

శేషా: మన పిల్ల ని మోసగించిన ఆ సాందీపుని అయ్యో తలుచుచున్నావా ? వాడి ఊసు మనకేల?  పెంచలయ్య తప్పక కొమ్మాది పోయుండును  నా వాహనమున  పోయెదము అని  మాలినిగారిని  కొనిపోయెను.

                                                                     ***

నెత్తురోడుచున్న భారతవర్ష మొఖము మనోఫలకమున పర్వత  పరిమాణము లో కనిపించు చుండగా ఆకాశ మంత అలుముకున్న రుధిర నేత్రములు లొక్క సారిగా తెరుచుకొన్నవి.  మారెమ్మ ఇంకనూ గేటు మూసి వెనుదిరుగు చుండగా ప్రళయ భీకర నిర్వికార ఆకారము అంతకంతకూ పెరుగుచూ గేటువైపు వచ్చు ఆ  చుండగా మారెమ్మ భీతిల్లి  ఓ మూలగా నెక్కెను.  కింకిణి లు ఘల్లు ఘల్లులని మొగుచుండగా ఆ  కరాళ ఆకారము అడుగు అడుగుకూ నాలుగడుగులు ఎత్తు పెరుగుచూ గేటు తీయునంతలో గడపను దాటినట్టు ఆ గేటును దాటి చీకటిలో కలిసిపోయెను. తనకే తెలియని తన విశ్వ రూపమది దాల్చి కదిలేను మాత జగత్తును శాసించగల యోగ జేత.   

Thursday, November 26, 2020

Bharatavarsha 80

 ఆది : ఒలేయ్ పైడి నీల్లో ట్రాయే , వేన్నీలు బేగొట్రాయే

పైడి : కుక్కనాఁగ కయ్ కయ్ మనరుత్తావెందుకు . వేన్నీలు వేన్నీలు అనిరి త్తేతొచ్చేత్తాయేట్రా! టవ్వు మీదెట్టేను కూకో! కాళ్ళు సేతులు అన్నీ సరిగ్గున్నాయా ఇరిగిపడిపోనాయా ఓ పాలి సూసుకో!  ఆ బాబుని సూసి కూడా ఎల్లేర్రా , బుర్రతక్కువెధవల్లారా. 

దాసు : ఓలమ్మ  ఇప్పుడేటనకే ,    ఒళ్ళంతా పచ్చి పుండైపోనాది , ఇరగ్గొ ట్టేసాడు

పైడి : ఆ బుద్దప్పుడే టైపోనాదీ  కడుపుసేసి ఒగ్గేత్తూ రుకుంటార్రా! నాయం ఉండాలిరా రగి డీసెదవల్లాగా !

ఆది : బావ మాటలు వినెల్లి డెబ్బైపోనాం  బావో , ఇంకెప్పుడెల్లము ఆ వర్స గాడి జోలికి 

 పైడి ఆదితో: ఇంతకీ మీబావేడిరా , ఈడు ఎక్కడ దూరేశాడ్రా ?

దాసు : ఇంతవరకు ఆ అరుగుమీద దొల్లేడు   ఇప్పుడే లోపలికెల్లిపోనాడు

పైడి : ఏటి తాగేసి తొంగుండిపోనాడేటి? దెబ్బలు తగిలితే ఆడదే సేత్తాడు. 

పెంచలయ్య చేతిలో తుపాకీ చూసి ఓలమ్మో టుపాకటు కొచ్చాడు పిచ్చెక్కిపో నాదీడికి

ఒక తూటా గాల్లోకి కాల్చాడు పెంచలయ్యదెబ్బకి ఆది , పైడి , దాసు  ముగ్గురూ మంచం కింద దూరేసారు ఒరేయ్ దాసు , ఆది రండ్రా నా యాల్ది , ఒలేయ్ పైడి నువ్వు రాయే 

ముగ్గురూ బయటకొచ్చి గజ గజ వణుకుతున్నారు “దున్నపోతుల్లా గున్నారు ఒక్కణ్ణి కొట్టలేకపోయారు నీ యవ్వా

దాసు : ఆడు ఆరడుగులు , నేను ఐదడుగుల కూడాలేను ఎలకొ ట్టేతానురా, అవుంరా  ఆది మన రోజు బాగుండి ఆడు కొట్టీ సొగ్గీసాడు  గానీ  సెంకలో ఎట్టీసి  నొక్కితే మన గతి ఎట్రా !  ఆది: సెల్లికి నాయం జరగ్గపోతే రేపు మల్లొ తానన్నాడు 

ఓసోస్ నెలతక్కువేదవల్లారా, మనదగ్గిర  టుపాకి ఉంది,  టుపాకి లాంటి కుర్రోడున్నాడు   పెంచ: మనం జడవడమేటి?   ఆ మంజూసాకి మన సందీపు  టమక్ సేసేశాక ఆడేటిసేతాడ్రా?

 ఈసారోత్తే  కాళ్ళట్టుకుంటాడు, ఆడి  సెల్లికి  నాకొడుకుతో  పెళ్లి సెయ్యమంటాడు  ఈ సారి  గొడవకొత్తే ఇదిగో సూత్తన్నావు కదా సేతిలో ఏటుందో  ఆ!

సందీ: నాన్న  బావ నిన్ను కొడుతుంటే అడ్డుకుని తప్పు చేసాననిపిస్తోంది .

బావా , ఎవడ్రా నీకు బావ? ఇంత జరిగాక ఆడి సెల్లిని ఇంకా సేసుకుంటావా? సిగ్గునేదురా? సన్నాసి నాకొడకా ! 

ఓరి  ఓరి ముండమోపిది  సీమంతాకి ఆరతిచ్చిందని  నువ్వు సిగ్గు గురించి సెపుతున్నావా !

ఒలేయ్ పైడి ఏ టేనోరు లెత్తండి , నా సెయ్యి లెక్కుండా  సూసుకో 

నాయెనక కత్తలబడి, మాయయ్య కాళ్ళొట్టు కుంటే నిన్ను సేసుకున్నాను మరిసిపోనావేటి, సేతిలో డబ్బులున్నాయని, టుపాకుందని కొట్టేత్తాను, సంపేత్తా నటన్నావు, ఆరోజు నీమీద సిన్న కోడిపెట్ట లకేసులోంచి  ఒగ్గించుకొనేకపోతే  నానొచ్చి ఇడిపించినాను.   

నాన్నా నిన్ను తలుచుకుంటుంటే నాకు సిగ్గేస్తోంది. నువ్వు చేస్తున్నది చాలా తప్పు  నిన్నుకొడుతుంటే  అడ్డుకోడానికి నేను అనవసరం గా వచ్చాను. ఆతను కొట్టడానికి ఎందుకొచ్చాడో   తర్వాత తెలిసింది, నువ్వు మాలినిగారిని ఎలా అవమానించావో  తలుచుకుంటే నీ కడుపున పుట్టినందుకు సిగ్గేస్తోంది. నేను ప్రేమించిన పిల్లని బిడ్డ పుట్టేదాకా ఆగి ఆబిడ్డకి ఎవరిపోలిక లొచ్చాయో ఆళ్లింటి కెళ్ళి  గొడవాడకోమంటావా ?  

ఓరి పెంచ నాకొడకా ఎందుకలగనీసినావురా ! 

సందీపు: అంతటి తో ఆగలేదు అమ్మా నాన్న " ఆర్మ్ వాళ్ళ పెళ్ళాలని కూడా నమ్మలేము , మొగుళ్ళు బోర్డర్ దగ్గర మేలుకునుంటే  వాళ్ళ పెళ్ళాలిక్కడ ఎవరితో పడుకొని పిల్లలని కంటారు అన్నాడు. అమరవీరుని భార్య న్యాయం కోసం  చర్చి కొచ్చి నిన్ను అర్దిస్తుంటే దేవుడి దగ్గర అలా అవమానిస్తావా, ఆప్రభువు నిన్ను క్షమించడు నాన్నా!  

 అసలు నేను నందినమ్మ మాట విని ఉంటే బాగుండేది.  హృదయం దోచు కోమని  చెప్పింది కానీ శీలం దోచుకోమని చెప్పలేదు. హద్దు దాటొద్దని ఎన్నో సార్లు చెప్పింది.  నీమాటలు విని నేను హద్దు దాటాను. మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని మోసం చేశానని ఇప్పుడనిపిస్తోది. 

ఇదంతా ఇన్నాక నన్ను సెప్పుతున్నాను , ఆ యమ్మే నాకోడలు

నేను ఎం ఎల్ ఏ అవ్వడం నీకిట్టం నేదే ట్రా? ఆ దేవుడమ్మని తప్పుకోమై సెప్పితే సాలూరా!

దాసు: ఆ యమ్మ తప్పుకోపోతే ? ఆ సెసాచలం ఒప్పుతాడేటి!   

 అప్పుడే మరీదు ప్రవేశించి 

అల్లు ఒప్పుకోపోతే ఆ తప్పు  గురువుగారిదా , శిచ్చ ఆల్ల చెల్లికా ?

ఏరోరి మరీదు నువ్వేట్రా యిలగైపోనావు? నీకు ఆడు ఒక్క రోజుకూడెట్ట గానే గురు వైపోనాడు కుక్కనాఁగ తోకూపుతు న్నవు. నాకు విదేశాలనుంచి ఫండ్స్ ఒత్తన్నాయిరా. అవి ఖర్చెట్టి నేను ఎం ఎల్ ఏ అయ్యి  మీ అందరికీ ఉరిసిచ్చే

ఛీ నాన్నా కొడుకుని మోసం, చర్చికి వచ్చే డబ్బుని సొంతానికి వాడుకొని చర్చిని మోసం.  దగా దారుణం. 

దారుణం అంటే ఎటోచూబిస్తాను రా ఇప్పుడే మన స్పెట్టర్ని పంపి బారతవర్ష సంగతి చూస్తాను. నా ఇంటిమీదకి వచ్చి నన్నే కొడతాడా ?   నా సత్తా చూబితాను   

మరీదు : సాటి దొంగ గా చెప్తున్నాను , నాకు దొంగ తనం అంటే అసహ్యం వేస్తోంది.  

                                                                   ***

ఆనందనిలయం: వర్షుని ముఖ వర్ణన 

  . రుధిర  ధారల   వర్షమే    గని యా  అభిజ్ఞు నికన్ను లన్
       అధిక  విభ్రమ   పొందిరా  క్రుధర   క్తసిక్త   ముఖార  విం    
       దధిప  తేజము డాగురిం  చగతాం డవప్రి  యతాళ  సం
       విదిత సంచలి   తోగ్రనే     త్రభవ   త్కరాళ  వికల్ప మున్

       రుధిర  ధారల వర్షమే   గని యా  అభిజ్ఞు  నికన్ను లన్
        రక్తపు ధారాలే చూచి  ఆ పండితుని  కన్నులందు   
        అధిక     విభ్రమ నొందిరా  రక్తసిక్త    ముఖారవింద   
        అధిక భ్రాంతిని పొందిరి  ఆ రక్త సిక్త ముఖమునందు 
        అధిప తేజము  డాగురించగ  తాండవప్రియ  తాళ  సంవిదిత 
        విద్యా తేజము  దాగొనగా శివుని లయని ఒప్పి   
        సంచలి  తోగ్రనేత్ర   భవత్  కరాళ   వికల్పమున్
        చలించు ఉగ్రనేత్ర ములను, క్రోధమైన దుర్గ రూపమును (కని  అధిక భ్రాంతి నొందిరి)

ఆ పండితుని కన్నులందు రక్తపు ధారాలే చూచి   ఆ రక్త సిక్త ముఖమునందు  విద్యా తేజము  దాగొనగా శివుని లయ ని ఒప్పి, చలించు ఉగ్రనేత్రములను, క్రోధమైన దుర్గ రూప మందు అధిక  విభ్రమ నొందిరి.
      
ఆ సందీపునెట్లు వలచితివి , అతడి యందే  సుగుణములు చూచినావు?  నీ మూలమున  నేడానందనిలయము నందిక ఆనందము అడుగంటినది. దుస్వప్న  మందైననూ ఇట్టి దారుణ పరాభవమునూహింపమే, అట్టి దారుణము నీమూలముగా వాటిల్లినది నీ బుద్ధి హీనతకు చిత్త చాంచల్యమునకు హద్దు లేకుండెను. 

మంజూష: సమీరము వలె రేగి  సమీకమును  సృష్టించి ఉగ్ర నరసింహుని వలె ఊగ నేల?  కలము పట్టిన వాడు చేత ఖడ్గము పట్టి అడరి బరి యందు అరిమూహము నదిలించ నేల? నీ ఉద్రేకము చాలింపుము. నీ ఉద్రేకమునకు నా జీవితమును హారతి కర్పూరము చేయవలదు. 

వర్ష: ఓసీ మూర్ఖ శిఖామణీ! మన ముత్తాత తండ్రి రామానుజం 1875 లో పుట్టి   39 సంవత్సరములకు  మొదటి  ప్రపంచ యుద్ధమందు 1914 లో మరణించెను అతని కొడుకు  నరసింహుడు  1898 లో   పుట్టి 1945 లో సెప్టెంబర్ 25 న రెండవ ప్రపంచ యుద్ధమందు మరణించెను. అతని కొడుకు ఆదినారాయణ మన తాత  తండ్రి   1917  నుండి 1985 వరకు జీవించెను. మన తాత నరసింహం 1936 నుంచి 2002, మన తండ్రి ఉగ్ర దీక్షిత 1957 లో పుట్టి 1999 లో కార్గిల్ యుద్ధమందు మరణించెను. వీరందరూ ఎందులకు మరణించినారే అల్పబుద్ధి ? ఆ  అమర వీరుల ఆత్మ  నాయందు లేదా! కేసరి కూన నేను గానా! వారు   మాతృ భూమి కొరకు మరణించినచో నేను మాతృ మూర్తికొరకు మరణించెదను. నీ తెలివిట్ల ఘోరించెను!

 మాలిని: సోమ యజ్ఞాల శోభిల్లు పండిత వంశమున సోమమనుజూపఁ పెంచిన హృదయము తల్లడిల్లె,  . సోమకోర్వలేని సుకుమారుడను కొని రాకుమారుని వలే సాకిన నాకుమారుడు  కావ్య కవితా ఛత్రపతి వలె వెలుగొంద వలె, తలపులందు గేయము లుండ వలె  గానీ తలనిండా గాయములున్నచో  హ్లాదమగునా?!
    
వర్ష : వెరచి వెనుదీసి వెన్ను జూపి మనుటకంటె మరణించుట మిన్నకాదా?

మంజు: వారు నీ తల్లి నవమానించినారు నీవు పోయి వారిని తన్ని పగతీర్చుకొనినావు, చెల్లుకు చెల్లు, బాగున్నది మరి చెల్లి బ్రతుకు? నీ విజ్ఞతిట్లఘోరించెను! ఆ మాటలు వినుచుండగానే వర్షుడు చెల్లి చెంప చెళ్లు మనిపించెను.
అంతవరకూ శయ్యపై నిస్త్రాణ ముగా పడియున్న మాలిని గారు లేచి “వారు అవమానించిన సహింపుము, బాల్యమున దానిని ఎత్తుకొని మోయలేదా? దానివల్ల దెబ్బలు తినలేదా? అన్నవైనచో ఇప్పుడు రెండు తిన్ననూ ఆమె పెండ్లిచేయ వలెను. విజ్ఞత యన్నచో చేయదగ్గపని తెలుసుకొనుము. అది గర్భవతి అనిమరచి  నీ తాతముత్తాలను పేరు పేరున తలిచి  కుటుంబమునకు కళకము తేవలదు.” ఆ సాందీపుని వేడుకొనుట వేరు మార్గమేమియూ లేదు అట్లే చేసెదను అని వర్షుడు అను చుండగా "సి ఐ గారు స్టేషన్కి తీసుకురమ్మన్నార" ని జెప్పుచూ పోలీసులు వర్షను వారి వాహనమందు కొనిపోయిరి.
                                                                ***

ఆది : బావ,  వర్సనట్టుకెల్లి  పోనారట !! టేషన్ నుంచి పోను 
పెంచలయ్య : ఇలగివ్వరా , నాను మాటాడు కోవాలి. ఆది దూరవాణి సాధనమును పెంచలయ్యకందించెను 
సి ఐ గారా, ఒట్టు కెళ్లిపోడంగాదు, ఆడు బైటకి రాకూడదు , మాఇంటి మీదకొచ్చినట్టు సాచ్చాలున్నాయి. ఇంకేటివ్వాలి , ఫిర్యాదివ్వాలా  ఓ ఇత్తాను ఇప్పుడే వత్తాను.  
పెంచలయ్య: ఒరేయ్ దాసు   ప్రభువు దయ వల్ల ఆడు బైటకి రాకుంట ఉంటె ఈ ఆడోల్లే ఆ దేవుడమ్మని ఒప్పిత్తారు.  పదరా టేసన్ కెలదాం  అని దాసును , ఆదిని పిలవగా వారు మొదట నిరాకరించిననూ పిదప మెత్తబడి అతడిని గూడి పెంచలయ్య వాహనమందు  ఠాణాకు పోయిరి. సందీపుడు చింతించుచున్న తల్లినోదార్చు చూ కూర్చోండగా నందిని వచ్చెను, మొత్తము విషయము నెఱిగించగా చేతి గాజు విరగ్గొట్టి  ఖంఠమును కోసుకొనెను. బొటబొట రక్తము కారుచుండగా తల్లి గంగివెఱ్ఱిలెత్తుచూ కేకలు వేసెను. మెడకు గుడ్డ చుట్టి శీఘ్రముగా ఆమెను  అంబులెన్స్ నందు విశాఖపట్నము  ఆసుపత్రికి తరలించిరి.

Tuesday, November 24, 2020

Bharatavarsha 79

విశాఖపట్నము : ఆనందనిలయమందు మాలినిగారు ఇరుగు పొరుగులతో ముచ్చటించుచూ  రెండు దినములు ఎట్లు గడిచెనో చెప్పుచుండిరి. ఇంతలోవలతి వచ్చి "వర్షుడు వచ్చెనా?" అని అడగగా మాలినిగారు  ఆమెను ఆహ్వానించి కూర్చోండ బెట్టి " వర్షుడు కొద్దిసేపటిలో వచ్చి చేరును " అని తెలిపగా ఆమె " మంజూష కలదా?" అని అడిగెను. ఆమె నిద్రించుచున్నది అని చెప్పి  మాలిని గారు "ఈమె ఏ వార్తలు మోసుకువచ్చెనో " అని అనుకొనుచు నీవు బల్లిపాడు వచ్చిన  బాగుండెడిది

"మదనగోపాలుని ఉత్సవ వేడుకలు కడు  రమ్యముగా జరిగినవి.  రధోత్సవము కనుల  విందు గా సాగినది. బంధు మిత్ర సంగమము, కొనేట జలకాలాట,  బసవ పార్వతి ప్రణయము, విడిదింట హాస్యము ,అరుణతార కవిత్వము , బసవని  ఆట పట్టించుట,  పార్వతి వీణావాదనము,  కేశవుని బుర్రకథ,  ఆ ఘట్టములన్నియూ ఒక ఎత్తుకాగా సుందరి విమాన విన్యాసము లొకెత్తు అని ఆ ముచ్చటలు చెప్పి మురిసి  "బల్లిపాడు పేరు తలిచిన ఆ దృశ్యమాలిక ఇంకనూ  మనసుని పులకరింపజేయుచున్నది. ఒక్క మాటలో చెప్పవలెనన్న కైలాసమేగి నటరాజు తాండమును చూచినట్లు న్నది అని  ఆనందాతిశయమున చెప్పి ఉబ్బి తబ్బిబగుచున్న మాలినిగారితో ఇరుగు పొరుగువారు  " పెళ్లి సంబరములకేమీ తీసిపోని విధముగా సాగినవ" నుచూ తమతమ ఇళ్లకు బోయినారు . 

వర్షుడు కొద్దిసేపటిలో  విశాఖపట్నము  చేరబోవుచున్నాడని వలతికి  తెలపగా  వలతి " అందరూ వెడలిన పిదప మీకు ఒక వార్త నెఱిగించవలెనని కాచుకొని కూచున్నా "నని తెలిపి " మీకు తెలపవలెనా  గురువుగారికి తెలపవలెనా యని  కొంచెము సందేహమున్నది , అయిననూ మీరు తల్లి కనుక మీకే తెలిపెదను అని "  వద్దకు పోయి చవిలో  మెల్లగా  " మంజూష  గర్భవతి " అను చెప్పిన ఆ మాటలకు మాలినిగారు  పిడుగు పాటుకు కుప్ప కూలిన వృక్షము వలె  నెలకొరిగిరి. ఆనందమంతయూ ఆవిరైపోయెను ఆనందనిలయము విషాధానిలయము వలే తోచుచుండెను రాధామనోహర  విరులన్నీ  జాలిగా చూచుచున్నట్లగు పించెను. 

నిద్రించుచున్న కూతురి గదిలోకి పోయి ఆమె ప్రశాంతతను చూచి వణికెను.  

పిదప వలతి హాస్యమాడెననిపించెను పిదప మనసు పరిపరి విధముల బోవుచుండ దేవుని మందిరమునకు పరిగెత్తుచు మధ్యలో గోడమీద ఉన్న భర్త ఛాయా చిత్రము వద్ద ఆగబోయి కంగారులో కాలు బెణికి క్రింద పడి తల గడపకు కొట్టుకొనగా మంజూష లేచి తల్లిని లేవదీయబోయెను ,  ఆమె చేతులు కాలయముడి  పాశమువలే తోచగా పెద్ద కేకవేసి మూర్ఛ పోయెను. మంజూష ముఖంపై నీరు జల్లి తల్లిని లేపగా సత్తువడిగిన మాలిని గారు జాలిగా ఆమె ముఖంలోకి చూడగా మంజూషకు విషయమర్ధమయ్యి  అశృనయనాలతో అవునని తలవూపెను. మాలిని గారికి  దెబ్బ  తగిలి  తల బొప్పిగట్టెను. "ఎవరు అతడు ?" అను మాటొక్కటి చిట్టచివరికి ఆమె నోట పెగిలెను అది మాట వలే కాక మూలుగు వలె నున్నది . 

మంజూష సందీపుని చిత్రమును తల్లి చేతులో నుంచి మంజూష తన గదికి పోయెను. రెండు నిమిషములు ఎట్లు గడిచినవో ఆమె  చిత్రము వైపు చూడక  ఏటో సూన్యములోనికి చూచుచూ ఉండిపోయెను. పిమ్మట ఆ చిత్రమును చూచి   పట్టరాని కోపముతో  భగ భగ  మండు  దావానలమువలె  మంజూష గదిలోనికి ప్రవేశించి  ఆమెను రెండు చెంపలు  వాయించిమీద బడి రక్కి కొట్టి  చివరకు నిస్సహాయముగా నేడ్చుచూ కూర్చొండెను.  కొలది సేపటికి మంజూష వచ్చి" మనకేదిదారి  ఇప్పుడేమి  గతి పట్టించితివో కదా    పోయి పోయి ఆ దరిద్రుని పాల బడితివి. 

"చాలాకాలమునుంచి మేమిరువరమూ ప్రేమించుకొంటిమి. నాకతడు కావలెను."  "ఈ పోకడలు మన ఇంట వంట కలవా ?  ఇది ఎట్టి కళంకము !" "నాకు సందీపునకు పెండ్లి జరిపించిన కళంకమెట్లుండును ? "

ఆ పెంచలయ్య పాము వంటి వాడని లోక ప్రతీతి. అతడు ఒప్పనిదే ఈ పెళ్లి ఎట్లు జరుగును  ఇప్పుడు నేను పోయి వాడి కాళ్ళపైబడ వలెను. "నీవు వర్షుడు ఇద్దరు కలిసి అతడి కాళ్ళ పై బడైననూ నా పెండ్లి జరిపించవలెను.  ఆడపిల్లని కన్న తల్లికి అంత  అహంకారము కూడద"ని తల్లికి హితవు పల్కెను. మాలిని కొలది సేపు చేష్టలుడిగి కూర్చున్ననూ లేచి పెంచలయ్య వద్దకు పోవుచుండగా 

మంజూష " సబ్బవరం పోవలసిన అవసరము లేదని తమ ఇంటివద్ద నున్న వారి చర్చిలో ఉండునని చర్చ్ చిరునామా ఇచ్చి పొమ్మని చెప్పెను. మాలిని గారు వెడలిన పిదప సందీపుడు ప్రవేశించెను. "అనురాగవతీ!" యని  ఆమెను ఆలింగనము జేసుకొని " నా తల్లి  నిన్ను ఎల్లప్పుడూ మెచ్చుకొనును నాతండ్రి  కూడా మంచివాడే కానీ వివాహమునకు  ఒక్క షరతు పై అంగీకరించును మీకాబోవు  వదినమ్మను ఆమె తండ్రి శేషాచలం  ఎం ఎల్ ఏ  బరిలో నిలిపినాడు.  ఎం ఎల్ ఏ అవ్వవలెనను మానాన్న చిరకాల కోరిక తీరవలెనన్న విదిష బరినుండి వైదొలగవలెను, 

అనగా పోటీ చేయరాదు . అట్లయినచో ఈ వివాహము తప్పకజరుగునని హామీ ఇచ్చుచున్నాను. మంజు , బెంగుళూరు నందు రాఘవుడు నాకు పదవిచ్చిననూ పోక నిరర్ధకునివలె ఇచ్చట తిరుగుచున్నాను , నీకొరకే కదా ! ఆలోచింపుము అనగా మంజూష సందీపుని గుండెలకు హత్తుకొని " చెల్లి కొరకు వర్షుడు , కూతురికొరకు మాలిని చేయక ఛత్తురా!  ఇప్పడే మా అమ్మను పంపినాను మా అన్న వచ్చు వేళాయెను అనగా  సందీపుడు నిష్క్రమించెను.

 ఘోరపరాభవమును చవిచూచి తల్లి ఇంటికి చేరి తనకు జరిగిన అవమానమును మంజూషకు చెప్పుచుండగా  వర్షుడరుదెంచెను. తల్లి చెప్పుచున్నదంతయూ గడపబయిట నుండి విని మహోన్మత్త వికార రూపుడై దక్షప్రజాపతి పై దండెత్త బోవుచున్న త్రినేత్రుని వలే పెంచలయ్య వద్దకు  సాగుచుండ మాలిని మంజూషలు భయకంపితులైరి. 

సాధారణముగా ధారణము దప్ప రణము దెలియని సూరి బరిలో దూకిన ఓడుటయే కాక నెత్తురోడును. ఇది తధ్యమని తలచి మాలిని వర్షుని వారించి నివారించ లేకున్ననూ  రోదించి నిరోధించుట తక్షణ కర్తవ్యమని, పోరు వలదని పోరుచూ,  కన్నీటి కంట వాటముగ కవాటముకడ నిలిచెను.  వర్షుని లో అధిపుడంతరించి వీరజవాను అవతరించెను

కల్పము సంభవించునని వికల్పము చెందుట వీరపత్నిచేయదగునా!  నీ సంక్రాందనా క్రందనలునను  నను నిలువరించజాలవు విజయము వరించకున్ననూ రణము  అనివార్యము, సూరి రణసూరి కాకున్ననూ , అధిపుడు  అధిపురుషుడు కాకున్ననూ  పురుషుడని గ్రహించుము. అని తల్లిని తొలగించుకొని కదనరంగమునకు సాగిపోయెను.

భగభగ లాడే రేడే గడ బిడ గడ అడుగుల పడ  

జడి వడి వడి వడిగా సుడిలా కదిలెను తల్లే  

తడబడి జగడమాడు వాడటుబడి ఇటుబడి

కుడి ఎడమలగా ఆప జూడగా 


ధగద్ధగ ధగ ధగధగ లాడే కడియం తొడిగెను

కోడె దూడలా కాలు దువ్వుచూ వాడి వాడిగా

సడి జూడక, మడ గడి  దాటెను రగడ మాడగ 

రంకెలు వేయుచు అరినే పిలిచెను బరిలో దూకెను


పట పట పట పట పళ్ళే కొరికెను పెంచలయ్య 

కళ్ళెర్రబారెను గుర్రని చూచుచు అఱ్ఱము

ఓలే ముఖమును జీరి వర్ర పూసిన

గుర్రము ఓలే కరమున కర్రతో బరిలో దూకెను


గిర గిర గిర కర్ర త్రిప్పుచు కొక్కిరిబిక్కిరి

ఆటలాడుచు వర్షుని పైబడి వరాహమల్లె

దడ దడ దడ  దడ బాదసాగెను 

ఆదరబాదర  లేని యోధుఁడు

ఉక్కుమేనితో చక్కగా నిలిచెను


బొటబొట బొటబొట అశ్రుబిందువులు

మాలిని వీడి నేలను తాకునంతలో

తత్తడి రయమున రేగెను వర్షుడు

పక్కటెముకలో జీరి నంతనే


విలవిల విలవిల  విలవిల లాడుచు 

ఒక్క దెబ్బకే కుప్పకూ లెను పెంచలుడే

నేలనంటెను, ఉగ్రరూపమున ఉత్తుంగ 

చెండమున ఆకాశములో వర్షుని చూచెను

 

సల సల రుధిరము మరుగు చుండగా  

అధిపుని కళ్ళే చింత నిప్పులై 

విస్పు లింగములు కురియుచుండగా 

పెంచడి పంచే జారిపోయెను లేచి నిలుచుటకు

 త్రాణము లేక ప్రాణము కొరకు పాదము లంటెను 


జల జల జలమని చమూచరులు 

ఆయుధీయులే దూకిరిగా నిరాయుధ యోధుని 

ముట్టిరిగా ఆయువులే మరి తీతురుగా యని

బిక్కచూపుల చూచు తల్లి కి బిత్తరబోవు ఉత్తరమిచ్చెను


గజ గజ వణికెను  వైరి వర్గము

కాలరుద్రుడై  చెలగెను వర్షుడు

జగడ మడఁగ మై బొగడము

పేల గొడవ నెగడగా రణము రగిలెను


అతడే అతడే వర్షుడురా 

విలక్షణ అక్షర యోధుడురా 

కార్గిల్ పోరున అసువులు బాసిన 

అమర జవానుకి పుత్రుడురా

సాహిత్య ప్రియ ధీరుడు రా 

వీరుడు రా రణ శూరుడు రా 

పట్టిన పట్టును విడవడురా 

అధిపుడురా అజేయుడురా


కొట్టిన కొట్టుడు కొట్టక కొట్టగ 

పక్కటెముకలుపట పట విరిగగ

ప్రత్యర్థుల లో జీవము చచ్చెను 

ఇంతలోని సందీపుడు వచ్చెను.

కర్ర దీసుకొని వెనక మాటుగా 

వర్షుని బుర్రన వేటు వేసెను 


దిగదిగ లాగెను అతిరథుడు 

అనీకస్థుడైన నిరాయుధుడు

గిరగిర  గిరగిర శిరమే తిరిగెను

ఎగుడు దిగుడగుడవ తట్టుకు నిలిచెను


వెనుకకు తిరిగెను దీపుని గాంచెను 

దిక్కులూగ పొలి కేకే పెట్టెను పులిలా 

దూకి ఖంఠము పట్టెను కళ్ళలో మృత్యువు 

కదల  కాళ్ళే వణికె సందీపునకు


వలవల ఏడ్చుచు చెల్లమ్మ 

అన్నను వేడుచు పాదాలంటెను 

నా కడుపులో బిడ్డకు తండ్రితడు 

నీ భగినికి జీవన దాతితడు


అయ్యలేని బిడ్డను రా

అన్నయ్య నీవే అయ్యవురా

అత్తింటికి నను సాగనంపర

నీ బావను కాటికి పంపకురా

Bharatavarsha -78

 షిట్!పిచ్చిపుష్పాలే రాత్రిళ్ళు గుడికెళతాయి. మనలాటోల్లు ఏ బార్కో ఎల్లాలి! 

కశ్యపా ఇంత నీచ భాషణ మెందుకు, నీ  తీరేమి ఇట్లు జారిపోవుచున్నది ?

మన నేర్పిన భాష మనమే మాట్లాడకపో ఎలా?

ఆంగ్ల మిళిత వ్యవహారికమే మా ఇంట చులకన చేసెదరు ఇంక ఇటువంటి భాష ఆడిన మనకేమి విలువ ఉండును?

మీది క్లాసికల్ తెలుగు అంటే గ్రాంధికం , ఒక రకం గా చెప్పాలంటే రాచ భాష ఒకప్పుడు వెర్రి పువ్వులు, వెర్రి పుష్పాలు  ఇలాటి భాష అస్సలు ఉండేది కాదు.నువ్వు అప్డేట్ అవ్వలేదు గానే అందరూ అప్డేట్ అయిపోయారు.  ఇప్పుడు సినిమాలు చూసి ఆడవాళ్లు కూడా ఇలాటి భాష ఫ్రీగా ఎక్కడపెడితే అక్కడ మాట్లాడేస్తున్నారు. మనం ఎన్ని బూతులుమాట్లాడిన ప్రజలు మననే కొలుస్తారు.

హరికథ చూబించవలెనని ఆ అమ్మ కోరిక. గుడికి వెళ్లనిచో మా అమ్మ బాధ పడును.

షిట్! మందేసి నీలాటి అరేబియన్ హార్స్ తో.   రైడ్ చేస్తే అరేబియన్ హార్స్ నే రైడ్ చేయాలి …

ముందుకి పంపించిన ఈ కుర్ర నా కొడుకు ఎంతకీ రాడేం ? అదిగో హోటల్ కుర్రాడు వచ్చేస్తున్నాడు 

ఎరా తెచ్చేవా  ఏంటింత లేటు  అయ్యిం ది? “పెద్ద లైనుందండి ,చాలామందున్నారు.”

ఉంటార్రా , మందు సెక్స్ అందరికి నిత్యావసరాలు కదా!

సినిమా కూడా సార్ , సార్  సార్  నాకొక ఛాన్స్ ఇవ్వండిసార్.

పైకి వస్తావ్ రా ఏదా బాటిల్ ఇలా ఇయ్యి, ఏరా ఆఫిసర్స్ చాయిస్ తెమ్మంటే ఇది తెచ్చావ్? 

“అది లేదు సారూ ఇదే ఉంది.”  లాగి ఒక్కటి కొట్టి  " ఏ బ్రాండ్  పెడితే ఆ బ్రాండ్ నేను తాగను” హోటల్ కుర్రాడు వెళ్ళిపోయాడు. “ఈ రాత్రి సగం దొబ్బింది.” అన్నాడు కశ్యప్. 

అయ్యో కొట్టకుండా ఉండాల్సింది చిన్న కుర్రాడు కదా.. మానవత్వం ఉండవలె కదా ! 

మానవత్వమా మట్టి గడ్డలా! బాలకృష్ణ మేకప్ మెన్నిఎలా కొట్టేడో వీడియోల్లో చూశావుకదా, ఇక్కడ  అందరూ ఇలాగే ఉంటారు. టీవీ సుమ తనముందు జూనియర్ ఆర్టిస్టులు కూర్చోడానికి అవకాశం లేకుండా కుర్చీ లు తీయించేస్తుంది. 

మన భాష ప్రవర్తన  మనం నాగరికంగా ఉండాలికదా!మొన్న బాలుగారు స్టేజి మీద మనతో ఎంత చక్కగా మాట్లాడారు. 

మన చదువు నాగరికతఅంతా నటనే.  సినిమావాళ్లు స్టేజిలమీద మాట్లాడేభాష, వారు ఆయన, మహానుభావుడు ఇలా ఉంటుంది అది చూసి నిజమే అనుకునేవు.  మంచిగా మాట్లాడుతూ వెనకంతా గోతులు తీస్తారు, విషం కక్కుతారు. షిట్! అయినా  వాళ్ళ గోల మనకెందుకు రా సిట్టింగ్ ఏసేద్దాం,  రాను రాను  నీ సైజులు పెరిగి పోతున్నాయి.  అంటూ మందు పోయ సాగాడు.


లకుమ ఉదాసీనంగా ఉండడంతో “ఏంటి బోటిల్ చూసాక కూడా మొహం వెలగలేదు బల్లిపాడొచ్చి మారిపోయావా?నువ్వు గుడి గుడి అంటే మిగితా సగం సంతోషం కూడా దొబ్బుతుంది హైదరాబాదులో బాగానే తాగేదానివికదా! నువ్వు లేక పొతే పడుకోలే కదా ఇక్కడికొచ్చాను అని ఆమె శరీరమును కాంక్ష తో చూస్తూ “లకుమా బాగా పెంచేసావే   మీ అమ్మ నిన్ను చెడగొడుతోంది”

ఇందులో చెడిపోవుటకేమున్నది? మా పూర్వీకుల నేను చరిత్ర తెలుసుకోవలెనని ఆమె తపించుచున్నది.  నాకొరకు ఎదురుచూచు చుండును. 

నీ యమ్మ ఏటా భాష ? నీ యమ్మ వింటుంటే బ్రహ్మనందం కామెడీలాఉంది. ముందు భాష మార్చు. 

నాకు పిచ్చెక్కుతున్నాది.  ఇంతకీ  హరికథలు వినేస్తే  బాగుపడతారానా మీ అమ్మ ఉద్దేశ్యం?

మన సంస్కృతి సనాతనధర్మము గురించి మనం తెలుసుకోవాలని ..

హు.. సనాతన ధర్మం! షిట్! టీవీ కావాలా సనాతనధర్మం కావాలా అంటే విసిరిపారేస్తారు సనాతన ధర్మాన్ని. మాతృభాషే అందించలేక పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో వేసే మన తల్లి తండ్రులు సనాతన ధర్మాన్ని అందిస్తారా?  అవకాశం వస్తే ఎప్పుడు విదేశాలు దొబ్బేదామా అని చూసేవాళ్ళే, గుంట దొరికితే ఎప్పుడు ఎక్కేద్దామా అని చూసేవాళ్ళే అంతా. ఫకింగ్ హిపోక్రసి! నోరిప్పితే నీతులుచెప్పేవాళ్ళే  ఆర్డ నరీ క్లాస్ పూర్ క్లాస్ లో ఇదొక కంపల్షన్. 

సినిమావాళ్ళకి లేదా హిపోక్రసి ? నీకులేదా హిపోక్రసీ ? 

వయసు డబ్బులు దాచుకుంటారు మిగితా అఫైర్స్ అన్నీ ఓపెనే. కమల్ హాసన్ గౌతమితో ఉన్నట్టుగా స్రుతి హాసన్  సిద్ధార్థతో లివిన్ లో ఉంది ఛార్మి పూరి తో సెటిల్ అయిపోయిందని తెలియనివాడు లేడు బ్రహ్మానందం మొగుళ్ళు ఇంట్లో  లేనప్పుడు గోడలు గెంతుతాడని అందరికీ తెలుసు, రోజుగడవనోడు నీతులు చెప్పల్సి వస్తున్నది. మనలాటివాళ్లకి  ఆ అవసరం రాదు.  నేను బీఫ్  తింటాను విస్కీ తాగుతాను. రోజుకొకర్తితో ఎంజాయ్ చేస్తాను. ఓపెన్గా చెప్తాను. 

కశ్యప్ మీ తాత  గారు వేదపండితులు అని చెప్పావుకదా , మీరు బ్రాహ్మణులు కదా?

చంద్రమోహన్ బ్రాహ్మణుడే కానీ నాన్వెజ్  తెగ తింటాడు. అడిగితే ఓపెన్ గా ఎలాతింటాడో ఏక్ట్  చేసి మరీ చూపించాడు . ఇక్కడందరూ ఆంతే. మన ఫీల్డ్ లో సిగ్గు నీతి మానం ఏవీ ఉండవు అందుకే మనది సినీమా ఫీల్డ్ అయ్యింది. ఇక్కడుడేదంతా పగలు ఆర్థిక అవసరాలు, రాత్రి శారీరక అవసరాలు. ఒక్క హీరోని హీరోయిన్ని చూబించు తిన్నగా ఉన్నదాని. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి వయసుని, స్వేచ్చని అనుభవించాలి. స్వేచ్చంటే ఏంటో తెలుసా ? 

"చెప్పు, నన్ను బాగా ఎడ్యుకేట్ చేసేవుగా !"

 షిట్ ఎడ్యుకేట్ కాదు కల్టివేట్  అంటే ఇంకా బావుంటుంది. “ఎందుకో ?” 

 చెప్తాను గానీ ముందు నువ్వు చిన్నదుస్తులు వేసుకుని గ్లాసు అందుకో 

కాస్సేపటిలో మైక్రో మినిలో బ్రా వేసుకొని వచ్చి బల్ల దగ్గర కశ్యపుడి ఎదురుగా 

కూర్చుంది లకుమ ఇప్పుడు నచ్చావే ఆ ఫకింగ్ షిట్.. గుడి, హరికథ లేవుకదా !

అన్నాడు కశ్యప్ " చక్రాల్లా కళ్ళు తిప్పుతూ "ఊ"  అంది లకుమ

చీర్స్ ..  రెండు రౌండ్స్ ఇద్దరూ అయ్యేవరకూ ఏమీ మాట్లాడలేదు 

ఇప్పుడే  కొంచెం కొంచెం  ఎక్కుతోంది రా   కశ్యపుడు మూడో రౌండ్ పోసాడు

మొదట్లో  నువ్వు చెప్పినవి అర్ధం అయ్యేవి కావు కానీ మెల్లమెల్లగా ఈ బూజ్ 

పార్టీలు  ఆ  పార్టీలు ఈ పార్టీలు అన్నీ వంట పట్టాయి . 

నాల్గో రౌండ్ పోసాడు కశ్యపుడికి కూడా కిక్ ఎక్కింది మత్తుగా తూలుతూ 

అన్నాడు " అసలు స్వేచ్చ్ అంటే ఏంటో తెలుసా ? నిజం చెప్పగలగడం !

రాత్రికి నువ్వు లేక పొతే నేను పడుకోలేను. అని చెప్పగల గాలి కదా!

ఇందాక ఎడ్యుకేషన్ అనకూడదు కల్టివేషన్ అనాలి అన్నావు కదా అది చెప్పు

మంచి ప్రశ్న అడిగావు. ఇప్పుడు ఇలావచ్చి నా వొళ్ళో కూర్చో చెప్తాను

లకుమ వచ్చి కశ్యపుడి ఒళ్ళో  కూర్చుంది కశ్యపుడి వొళ్ళు వెచ్చగా ఉంది 

లకుమా. అని మత్తుగా పిలుస్తూ  చేతులు నడుంపైన వేసి చెవిలో ముద్దుపెట్టి,తరువాత చెవిలో నాలిక పెట్టి నాకుతూ మెల్లగా నడుం మీదనుంచి చేతులు క్రిందకి పోనిస్తూ " కల్టివేషన్ అంటే ఇదే సాగు చేయడం" నీ అందం మీ అమ్మలో లేదే నీది కసిరేపే అందం , మీ అమ్మది  ముద్దు గోలిపే అందం.  షిట్!  నాకు నీ భాష అంటుకుంటున్నాది.  యు అర్ సెక్సీ అండ్ యువర్ మదర్ ఐస్ లవ్లీ.  

మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడొద్దు. 

ఒప్పుగానే మాట్లాడుతున్నాను. మీ అమ్మ మహా అయితే ఒక పాతిక సినిమాలు చేసుంటుంది, అప్పట్లో ఎంత సంపాదించిందో నాకు తెలియదు కానీ నువ్వు ఇప్పటికే యాభై అందులో నా డైరక్షన్లో పదిహేను సినిమాలు చేసావు,కోటీశ్వరురాలివయ్యావు.   రేపు నిన్ను ముంబైలో బాలీవుడ్ కి పరిచయం చేస్తే నీ విలువ ఎంత పెరుగుతుందో తెలుసా?   

లకుమ వెనకనుంచి ముందుకి తిరిగింది తరువాత ఊ  ఊ ఊ ఉమ్ అనేశబ్దాలతో హోటల్ గది నిండిపోయింది. అలిసి పోయి చెమటతో తడిసి ఇద్దరూ పక్క పక్కనే పడుకున్నారు.  లకుమ కొద్దిసేపు తరువాత మెల్లగా “గుడిలో రుక్మనీ కళ్యాణం అయిపోయుంటుంది” 

Bharatavarsha 77

"హరికథా భాగవతార్ కి దెబ్బలు తగిలెను అతడు వచ్చుటకు ఆలస్యమగును. ఈ లోగా ఏదైనా ఒక చిన్న కార్యక్రమం పెట్టించిన.... మీ వద్ద కళా కారుల బృందం ఉన్నది కదా" అని ఉత్సవ కమిటీ పెద్ద ఆంజనేయులు గారు అరుణ తారను అడిగిరి  ఆమె ప్రక్కనే ఉన్న భానోజీ గారి వైపు చూడగా భానోజీ గారు " ఆయన వచ్చుటకు ఎంతసేపు పట్టును అది తెలిసిన దానికి తగ్గట్టుగా ఒక సన్నివేసమును ప్రదర్శించెదము. " 

"సుమారు ఒక గంట అనుకోండి" "ఆ గౌడల పనేనమ్మా మీరెరుగుదురు కదా మీరు పాతికేళ్ల వయసులో ఈ వూరు వచ్చినప్పుడు మీరు చూసిన రౌడీలు కొల్లాయి గౌడ, కట్ట గౌడ. ఇది వారి పనే నమ్మా, ఆ భాగవతార్ కి కొద్దిగా  స్థలమున్నది , అతడికి ఎవరితోనో స్థల వివాదమట ఆ శత్రువుతో చేతులు కలిపి భాగవతార్ ను  బెదిరించెను. భాగవతార్ విననందుకు అతడి పై  దౌర్జన్యం చేసినాడు. ఈ వూరిలో అందరికీ వాడి సంగతి తెలిసి ఎవరూ వాడితో గొడవ పడరు."

ఆ రౌడీ సోదరులింకనూ మారలేదా ?  నెత్తురు త్రాగు రాక్షసులుందురని విని యుంటిని కానీ చూచుట అదే మొదటిసారి.  కొల్లాయి గౌడ, కట్ట గౌడ,   రావణ, మారీచులు ఇద్దరూ కలిసి మాయోపాయంతో సీతను వేటాడినట్లు ఒక కాళ  రాత్రి తననెట్లు వేటాడినారో తారకు మరల  గుర్తుకు వచ్చెను.

ఈలోపు నక్క నాగేశ్వరరావు పిల్లి పాపాయమ్మ ద్రౌపదీ వస్త్రాపహరణం, దుర్యోధన ఏకపాత్రాభినయం వంటి పథకాలు తెలపగా ఆలయ చరిత్రను బుర్రకథ గానము చేసిన మంచిదని మంచి దని కేశవుడు రంజనిగారు  సూచించిరి. భానోజీరావుగారు సరే అనిరి అందరూ మంచిదనిరి. వారు కళా కారులు మాత్రమే కాదు ఎటువంటి అభ్యాసము అవసరంలేని ఆశువుగా కవితలల్లు  పండితులు.

పార్వతి తనయ గజానన.   పార్వతి తనయ గజానన ( బృందం) 

ఈశ్వర పుత్ర గజానన.  ఈశ్వర పుత్ర గజానన.   ( బృందం) 

నీ తల్లి పార్వా తి  గజానన.  నీ తల్లి పార్వా తి  గజానన ( బృందం)

మీ నాన్న శివుడు  గజానన. మీ నాన్న శివుడు గజానన.( బృందం)

శంభో ..................( గజ్జెలు ధ్వనితో  మారుమ్రోగుతూ ) 

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే|| 

"గురు బ్రహ్మ, గురుర్విష్ణు గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"

ఈ రోజు చాలా సుదినం రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాలస్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు.  స్వామివారి ఉత్సవాన్ని తిలకించుటకు వచ్చిన భక్తులందరికీ శ్రీ భానోదయా కళాపరిషత్ తరుపున అభివాదాలు తెలియజేసుకుం టూ మదన గోపాల స్వామి మహిమ ఆలయ చరిత్ర ను తెలియజేయు బుర్రకథ ప్రారంభిస్తున్నాము. 

రంగస్థలం పైనున్న ముగ్గురు బుర్రకథ కళకారులు ప్రేక్షక భక్తులకు అభివాదం చేశారు.

హార్మోనియం , డప్పు,  కంజీర వాద్యకారులు మువ్వురు వేదికపై కూర్చొనిరి.  అగస్త్య కంజీర పట్టగా, ఏనుగు డప్పు, నక్క హార్మోనియం పట్టినవి.  పార్వతి తనయ అను వాద్య సంగీతమును కొద్దీ క్షణములు వినిపించుచుండడిగా పంచ గట్టిన కేశవుడు పక్కనే రంజిని పక్కనే బసవడు మైకుల ముందు నిలిచిరి. హార్మోనియం సంగీతం అంతరించుచుండగానే  

కేశవుడు “తతత్త  తగతగ తడిగిడి జంతరి థా …సకల దేవతలను సంభ్రముగా రజనతప్పక కొనియాడి భవ్యముగా మదనగోపాలుని ఆలయ చరిత చెప్పెదము. రంజని బసవలు"ఆహా !"

చర చర   చర చర చరిత్రలోకి కాలము ప్రాకెను - తందాన తానా  

పదిహేడు వందల డెబ్భై లోని కాలం నిలిచెను - తందాన తానా  

స్వామి చరితము విన్నవారికి పుణ్యము దక్కేను - తందాన తానా  

హై .. వేసవికాలం వచ్చేరా ఎండలు మెండుగా  కాసేరా (పాట వేగం పెరిగెను)

రాళ్లే బ్రద్దలు ఆయెరా, నోళ్లే ఎండీ పోయెరా 

చెరువులు గరువులు ఎండెరా నీటికి ఎద్దడి వచ్చేరా     -  తరికిట  జంతరి థా !    

రంజని: 1770 దశకంలో బల్లిపాడు దగ్గరున్నపెనుమదం గ్రామంలో నీటి ఎద్దడి వచ్చింది. ఆహా! (బృందం) అప్పుడు కూలినాలి చేసు కుంటూ బల్లిపాడు లో నివసించే జనం బల్లిపాడు  నుండి బయలుదేరి   పెనుమదం గ్రామంలో   చెరువులు త్రవ్వడానికి పోతున్నారు.

కేశవుడు : చెరువులు లేక పాట నీళ్లు ఉండవు, నీళ్లు లేక పొతే నోళ్లు ఎండిపోతాయి. 

నోళ్లే కాదు అన్నీఎండి పోతాయి. అని అగస్త్యుడు అనెను.

వేదికకింద ప్రేక్షకులలో: భానోజీగారు అతడివైపు తీక్షణముగా చూసి పక్కనున్నకొత్త సుబ్బారావుతో “కొద్దిపాటి విద్యతో వేదిక ఎక్కిన కళాకారులు ఇటువంటి మొరటు హాస్యమును ప్రదర్శింతురు” 

కొత్త : కానీ పామర జనమును రంజింపజేయుటకు ఇటువంటి వారే కావలెను. 

అరుణ: కానీ మనము పామరజనమును రంజింపజేసి పొట్టపోసుకొనుటకు రాలేదు

వేదికపై : నోళ్లే కాదు అన్నీఎండి పోతాయి. అని అగస్త్యుడు నన్నందుకు బదులుగా

కేశవుడు: ఆవిషయం ప్రత్యేకించి చెప్పక్కరలేదు అందరికీ తెలుసు.  

కేశవుడు: ఒక్కరు కాదు ఇద్దరు కాదు (తక్కువ వేగం తో)

వంద మంది వారు   2

చిన్న చితక ముసలీ ముతకా 

అందరు ఉన్నారూ  2- తందాన తానా 1 


హై .. పలుగుపారా పట్టిరి, నెత్తికి గుడ్డ చుట్టిరి (పాట వేగం పెరిగెను)

తట్ట బుట్ట బట్టి రి బతుకుతెరువుకై కదిలిరి

పొద్దుటేలనే పోయిరి, పొద్దుపోయేదాకా– సాగిరి

పెనుమదమందు చెరువు త్రవ్విరి    తందా.....నా తందానా  దేవానందనాన


అలా చెరువు త్రవ్వుతుండగా అక్కడ ఒకనాడు 

టాన్గ్ టాన్గ్  టాన్గ్  ఠటాన్గ్ ఠటాన్గ్

పైనీ సెగలేమి గునపం దిగేదేమీ పైనీ సెగలేమి గునపం దిగేదేమీ 

ఎంత తవ్వ నేమి గునపం దిగేదేమీ ఎంత తవ్వ నేమి గునపం దిగేదేమీ

టాన్గ్ టాన్గ్  మని చప్పుడాగదేమీ  -  తందానా దేవానందనాన

అప్పుడు ఆ జనం త్రవ్వడం ఆపి చూడగా ఒక విగ్రహం కనిపించింది ఆ విగ్రహాన్ని శుభ్రమైన నీటిలో కడిగి చూడగా ఎలా ఉందయ్యా అంటే 

ఇద్దరు భామల ముద్దుల మదనుని రూపము సుందరమూ 

రుక్మిణి సత్యల మదన  గోపాలుని చూసెద మందరమూ 


హై .. 

దివ్య సుందర రూపము చూచినా కళ్ళ భాగ్యము 

దివ్య సుందర రూపము చూచినా కళ్ళ భాగ్యము  ( బృందం )

మావూరు రావయ్యా మదన గోపాలా

గుడికట్టి నిన్ను పూజింతుమయ్యా  

మావూరు రావయ్యా మదన గోపాలా

గుడికట్టి నిన్ను పూజించమయ్యా  

ఆ ప్రకారంగా ఆ బల్లిపాడు వాసులు తమకు తవ్వకాల్లో దొరికిన  మదన  గోపాల స్వామీ విగ్రహాన్ని బల్లిపాడు తీసుకొచ్చి గ్రామ  పెద్దలకి అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పెనుమదం పెద్దలు బల్లిపాడు వచ్చి  గ్రామ పెద్దతో  ఏమన్నారయ్యా అంటే 


ఏమయ్యా ఓ పెద్దయ్యా ఇదేం బుద్దయ్యా   (లల్లల్ల లా  ...... లల్లల్ల లల్లల్ల లా...)

ఏమయ్యా ఓ పెద్దయ్యా  ఇదేం  బుద్దయ్యా 

ఏమయ్యా ఓ పెద్దయ్యా  ఇదేం  బుద్దయ్యా  ( బృందం )


మావూరి సామిని మాకియ్యి మీ వాడు కాదని ఒట్టేయ్యి 

కాదంటే ఇప్పుడే  చెప్పెయ్యి , ఐసా పైసా తేల్చేయ్యి

కాదంటే ఇప్పుడే  చెప్పెయ్యి , ఐసా పైసా తేల్చేయ్యి  ( బృందం )


ఏమయ్యా కామందూ గొడవెందు కయ్యా - నామాట వినవయ్యా 

లేవయ్యా పెద్దయ్య భోంచేయవయ్యా - నామాట వినవయ్యా 

కాళ్ళు చేతులు  కడగవయ్యా  తువ్వాలు ఇదిగో తుడువయ్యా

గుడికట్టి సామిని పూజింతుమయ్యా  మా మాట  నమ్మయ్యా

అలా విగ్రహం తమకి ఇవ్వాలని గొడవ చేయుచున్న పెనుమదం గ్రామస్థులని బల్లిపాడు గ్రామస్థులు అతిధి మర్యాదలతో సత్కరించి వారితో స్వామి వారికి ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసి , భూములు ఏర్పాటు చేస్తామని చెప్పగా పెనుమదం గ్రామస్థులు సరే అన్నారు.

వొడి కట్టినారు గుడి కట్టినారు మాట నిలిపినారు

గుడి చిన్నదైనా భక్తి పెద్దది మాట నిలిపినారు

నిత్యా పూజలే చేయగా రెండు వందలట్లు సాగేరా  

ఆపై ధ్వజమేనిలిపిరి నిత్యా పూజలే  చేసిరి

చెంతలో వెంకన్న చేరేగా దివ్య క్షేత్రమే ఆయెరా 

తరికిట  జంతరి థా !    

1773 సంవత్సరంలో స్వామి వారికి ఆలయ నిర్మాణం చేశారు. 1901 సంవత్సరంలో గ్రామస్థులు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. తిరిగి 1970 సంవత్సరంలో ఈ ఆలయ సన్నిధి నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమును నిర్మించి స్వామి వారి అలయంను దివ్యస్థలంగా చేసారు.  ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంశ బల్లిపాడు శ్రీ మదన గోపాలస్వామి వారిలోకి ప్రవేశించిందని చెబుతారు. ఆ కారణం చేత స్వామి వారికి నిత్యారాధన చేస్తారు.  ప్రతి సంవత్సరం పాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారి కల్యాణం అంగరంగవైభవంగా చేస్తారు. 

అమ్మా! భాగవతార్ రాలేరు కానీ భాగవతారిణి దొరికాగా పోయి తెచ్చినాము అని ఆంజనేయులు గారు చెప్పి ఆవిడను రంగ స్థలము వద్దకు కొనిపోయినారు. ఇప్పుడైననూ లకుమ వచ్చునేమో అని ఎదురుచూచు ఈ రాత్రికి ఇకరాదని తార నిరాశ చెందెను. రేపు వచ్చునులే  మరి సామాన్యురాలుకాదు కదా పెద్ద సినిమా తార నీబిడ్డ అని మాలిని గారు ఆమెను ఓదార్చిరి. రుక్మిణీ కళ్యాణం హరి కథ  మొదలాయెను.

  

Sunday, November 22, 2020

Bharatavarsha -76

అందరూ విడిది  బాట పట్టిరి. ముందుగా స్త్రీలు - అరుణతార, మాలిని, సుందరి, దామని, రంజిని, చంద్రమతి, మంజూష, పార్వతి నడుచుచుండిరి వారి వెనుక పురుషులు నడుచుచుండిరి. బసవడు అగస్త్య ప్రక్కప్రక్కనే నడుచుచుండగా వారి ముందు పార్వతి నడుచుచుండెను. బసవడు పార్వతివైపు కన్నార్పక చూచుచుండెను. "ఏమిరా బసవా పార్వతినట్లు గుడ్లప్పగించి చూచుచున్నావు నమిలి మింగి  వేసెదవా ? ఇచ్చటందరూ స్త్రీలందరూ ప్రౌఢలే , ఆవులించిన పేగులు లెక్కెట్టగలరు. మాలినిగారు పసిగట్టి నారనిపించుచున్నది చూచుకొనుమ"ని అగస్త్య  బసవనిహెచ్చరించెను “అయిననూ నష్టమేమి కలదు పార్వతికి కూడా నన్నట్లే చూచినద."ని బసవడనెను 

 ఆ ఎర్ర పరికిణీ లో  అందము నన్ను ఊపివేయుచున్నవి అని అగస్త్యను ఊపివేయుచుండగా " ఒరేయ్ బసవా నీవు "నన్ను" ఊపివేయుచున్నావురా" అనగా సిగ్గుపడి బసవడు అగస్త్యను వదిలివేసెను. " సార్ధక నామ ధేయుడివిరా!  ఎరుపుచూచిన బసవడు రేగును కదా !" అనిబసవని దిట్టెను.  పార్వతి కివినిపించి వెనుకకు తిరిగి ఒక లిప్త కాలము చూసి ముందుకు  సాగుచుండెను. బసవడు ఎగిరి గంతేసేను  అప్పుడు అగస్త్యుడు మనసులో "వీడి పిచ్చి తట్టుకొనుట నాకు కష్టము. అసలే ఒక పిచ్చిదానితో వేగుచున్నాన"ని పరుగు పరుగున ముందుకు పోయెను. బసవడు ఆనందాతి శయమున అగస్త్యుడనుకొని హృదయాలజిస్ట్ చెంక నెక్కగా, " ఏయ్ అబ్బాయ్ ఏమీ పైత్యము! మనుషుల పైకి గెంతుట మిక్కిలి వెగటుగానున్నది. మంజూష “పైత్యము న నిన్ను మించువాడెవ్వడు!" అనెను. పురుషులందరూ పకపక నవ్వుకొనిరి అట్లు వారందరూ ఇంటికి చేరిరి.  

పార్వతి పెద్దమ్మ చంద్రమతి అరుణను ఇంటికి రావలసిందిగా పిలిచెను.   పార్వతి  కేశవుడు కూడా "అమ్మా , పెద్దమ్మ పిలుచుచున్నది   రా అమ్మా అని పిలుచుచుండిరి."  మాలిని చొరుకుని " మీకు ఆమె పెద్దమ్మ ఈమె అమ్మ , ఇద్దర మ్మల ముద్దు బిడ్డలు వలే నున్నారు, మీ పెద్దమ్మని కూడా ఇచ్చట ఉండమనిన మంచిది, నేను అరుణను పంపను అని ఆమె చేయి పట్టి లాక్కుపోవుచుండగా పార్వతి కది చూడ వేడుకాయెను. చంద్రమతి కూడా వారితోనే ఆ రాత్రి ఉండుటకు ఒప్పుకొనెను. పురుషులు విడిది గృహములో స్నానమాడుటకు,  స్త్రీలందరు కోనేటిలో జలకాలా డుటకు నిశ్చయించుకొని బట్టలు తీసుకొని బయలుదేరిరి.  

తే.ఇంతు లందరు కూడుచు ఈడు మరచి 

   ఈదు లాడిరి కొనేట ఈప్సి తముగ 

   జలక మాడుచు వేడుక-జగడ మాడి

   మురిసి కులికిరి జట్టుగ ముచ్చ టాడి

 

ఆ. మాలి నియతార ముచ్చట  మాట లాడి

   పావ డాలు కట్టి పడుచు లల్లె  

   కోనే  టినదిగి   బంతాడి  కూడి యాడి    

    జలక మాడ వారి జడలు తడిసె 


  ఆ. తడిసి  పావడా   లందున తపత పమని 

      కాళ్ళు గొట్టి ఘనఝ గనము లదర     

       మధ్య పార్వతి మంజూష  మరచి  దూరి 

      చేప పిల్ల లోలె చెలఁగి నారు.


ఆ. సుంద  రందము  సొంపును   శోభ నుకని 

    ఆట  లాపి అరుణ  అతివ   లాల కించ

    ఆకు   రంగిని కేశవు   డందు   కొనును

    అనుచు చెప్ప   మురిసి  రతివ లంత  


ఆ. మదన గోపాల దయజూడ  వయ్య  వచ్చి      

   నాము  ఉత్స వముల నాడి పాడ  

   అనుచు నందరు స్వామికి మొక్కు కొనగ  

    కోవె లందు శుభ గంట మోగె.

అట్లు మత్తకాశిను లందరు స్నానాలు చేసి,   కొలను వద్ద చెట్ల చాటున,  ఒకొక్కరుగా పోయి బట్టలు మార్చుకొనుచున్నారు. చిట్టచివరగా పార్వతి పోయి పరికిణి వోణీ వేసుకొని రాగా అందరూ మదన గోపాలుని దర్శనమునకు పోయినారు.  ఆహా విడిది వద్దనే కొలను, కొలను వద్దనే దేవళము. పచ్చని  పసిడి పొలాలు, వెండి చేరుల  వంటి వీధులు ముత్యముల వంటి మేడలు. బల్లిపాడందము అద్భుతము అని రంజిని అనగా"నా పదవీకాలం ముగిసిన పిదప ఇచ్చటనే నా మనవలు తో ఆడు కొందును." అని అరుణతార అనెను. వారు కోవెలను సమీపించిరి. ఆకోవెల ప్రాంగణమందు ఒక మంటపమందు స్నానమాచరించి నూతన వస్త్రములు ధరించిన బసవడు కూర్చొని యుండగా  పార్వతి  దొంగ చూపులు చూచుట గమనించి మాలిని గారు  అరుణతార బసవడిని  "ఎవరికొరకు వేచి యున్నావనగా  బసవడు తికమక పడెను పార్వతి జారుకొనెను. మాలిని తారలు    కిలకిలా నవ్వుతూ  వెడలినారు 

.పార్వ తందము బసవని పట్టి లాగ 

ఆమె కళ్ళ లోతు నాట లాడె  

నాల్గు  యనములు జతగూడ నెమ్మి కుదిరె

మదన గోప బాలు మహిమ చూడు.


ఆ.కలువ  చూపుల వేడికి   కలిసి కరిగె        

వీడ లేని  పడుచు  వివశ  మందె    

మరియె  టులుచూపు  జంటకు మార్గ మింక 

మదన గోప బాలు మహిమ చూడు.


ఆ. ఊరు  తెలియదు ఎటులింక ఊసు లాడు 

     పెద్ద  లంత కలసి పోవు చుండ 

       పడుచు పిల్లెట్లు వంటిగ మాట లాడు      

       మదన గోప బాలు మహిమ చూడు.


ఆ.కనులార  చూడగ  మనసంత కరిగె  పోయె  

మొదటి చూపు  లోని  మోహ  మాయె 

జంటక  లపెపుడు  మూర్తము జూచి నాడొ   

మదన గోప బాలు మహిమ చూడు.


ఆ. నాకు   చూపించె  నళినాక్షి నిచట  దొర్లె         

    ముత్తె   మువెదక  కదొరికె    ముద్దు   గుమ్మ  

     ముచ్చ   టగొలుపు  ముత్యపు ముగ్గు పెట్టె  

      మదన గోప బాలు మహిమ చూడు.   

 అతివలందరూ వెనుకకు వచ్చుచుండగా  పార్వతి వారిని కూడి వెనుకకు పోవుచుండెను. బసవడితో నేత్రావధానమందుమునిగి ఉండగా మాలిని గారు  "పార్వతికి దైవ దర్శనముతో పని లేదు " అనిరి అది అర్థము కాని  రంజిని  "సొంతవూరు వారికి మనవలె అభిలాష ఏల కలుగును."  అనెను.  అరుణతార "ఆమెకిచటనే దర్శనము లభించెను." అనెను. అట్లు అందరూ   ఛలోక్తులు విసురుచూ పార్వతిని ఆట పట్టించుచూ విడిదికిపోయిరి. అరుణతార ఒక రహస్య పథకమును స్త్రీల చెవులలో చెప్పెను. ఆరాత్రికి వారు ఆ మంత్రమును అమలుజరుపుటకు నిశ్చయించుకొనిరి 
  
రాత్రి గుడిలో రుక్మిణీ కళ్యాణము హరికథ కలదు. ఈ లోగా   అందరూ పలహారములు లేదా భోజనము తీసుకొన వలసిందిగా విడిది గృహమునందు ప్రకటించ బడెను. ఎక్కువమంది  పలహారమును చేసి సువిశాల చావిడి గదియందు కూర్చొనినారు.   పురుషులు స్త్రీలు పోటీపడి  అంత్యాక్షరి పాటలు పాడిరి. మొదట భక్తి రసముతో ప్రారంభమైన పాటలు శృంగార రసముతో నిండి అందరి చెవులనూ అలరించినవి. తరువాత కళాబృందము వారు నేపధ్యగానము చేసిరి. ఇదంతయూ జరుగు చుండగా బసవడు , పార్వతి సిగ్గిల్లి ఎచ్చటనో నక్కినారు. తరువాత రంజిని ని నాట్యము చేయవలెనని భానోజీ కోరగా మాలినిగారు అరుణతారను నర్తించమనిరి . ఆమె సందేహించుచుండగా భానోజీ  "ఇచ్చట అందరూ కవిపండిత కళాకారులే"   యని ప్రోత్సహించగా ఇరువురి భామల నాట్యము మొదలాయెను.  కేశవుడు మృదంగము వాయించగా అరుణతార నృత్యము చేసెను, ఆమె అంగసౌష్ఠవము , ఆంగికము నందు అందరూ మై మరచిరి.  పిదప అందరూ అతివల  అంచ నడకల పోటీ పెట్టగా ప్రౌఢలందరూ మాలిని చంద్రమతిలతో సహా నడుచుచుండగా ఇంద్రాగ్నిని చూచినట్లు ప్రేక్షకుల కళ్ళు చెదిరినివి. ప్రౌఢాల వంతు ముగిసిన పిదప పిల్లల అంచనడకల పోటీ మొదలయ్యెను. మాలినిగారు పోయి పార్వతిని లాగి తెచ్చిరి. 

అగస్త్య సుందరిని వంపు సొంపులను చూచి మైమరిచి లొట్టలు వేయసాగెను. కేశవుడు మాత్రము రంజిని గారి ప్రక్కన కూర్చొని పట్టించుకొనక ఆమెతో మాటలాడుచుండగా అరుణతార  " కేశవా ఈ అమ్మాయి పేరు సుందరి, తెలియును కదా వైమానికురాలు  ఆమె ను జాగ్రత్తగా గమనించుము " అని చెప్పగా కేశవుడట్లే అని ఆమెను నడకను చూచు చుండెను. సుందరి పార్వతి ఇద్దరూ ఇద్దరే ఎవరికెవరూ తీసిపోరు అందరూ అనగా “మరి మా ముంగీస సంగతేమందురు?” అని రాధాకృష్ణ అనగా. “నాబిడ్డ ఇంకనూ చిన్నది” అని దామిని దగ్గరకు తీసుకొనెను.  అరుణతార స్త్రీలందరినీ దగ్గరకు తీసి  “బసవ పార్వతుల  ప్రణయ నేత్రాభినయము చూచినారు కదా!” అని మొదలిడగా  అవునవుననుచూ స్త్రీలందరూ ఒక నిమిషము   చెవులు  కొరుక్కొని తరువాత అరుణతార తన కవితా గానము మొదలు పెట్టినారు , అతివలందరూ ఆమెతో స్రుతి కలిపినారు. పురుషులవద్ద  బసవడు  స్త్రీల వద్ద పార్వతి ఒక మూల వెనక వరుసలో కూర్చొనిరి , యువకులు  పెద్దలు అందరూ ఆశ్చర్యముగా చూచుచుండ  గానము మొదలయ్యెను. 
  
ముచ్చెపు ముఖమంత చూడ మచ్చెపు కనులున్న దాన     
మచ్చెపు  కనులందు  జూడ  నచ్చిన   సఖుడున్న దాన (పార్వతి  సిగ్గిల్లెను)
మెత్తగ    మనసంత   ఇచ్చి   మొత్తము కనులందు దాచి 
చెక్కిలి   ఎరుపైన    దాన    సిగ్గులు   చిలికేటి   దాన (బసవడికి విషయము భోదపడెను)
అక్కడ   వలపంత   చూపి  ఇక్కడ    సలుపంత   ఓపి 
మోహము తెలిపేటి   వేళ   ఇప్పుడు  మహమాట మేల (స్త్రీలందరూ పార్వతిని చూచుచూ)
దేహము నునుపార   కాంక్ష   వెచ్చగ   దహియించు చుండ 
చప్పుడు  ఇకనైన    జేయి  చిప్పము  సడలించి  చూపు (పురుషులకి విషయము తెలిసెను)
ద్వారము  తెరచింక  జింక    కన్నుల    వరవీణ    మీటు (పార్వతి లేచి  పారిపోయెను)
ఆశుక    వితలెన్నొ   నోట    బల్కెడి   మదరాసు  వాడు
పక్కగదిలోకి దాక్కున్న పార్వతిని తీసుకు రమ్మని కేశవుని మంజూషను పంపగా పార్వతి ఉఁహూహూ అనుచుండగా మగువలందరి నవ్వులతో మండువా నిండి పోయెను. పురుషుల లో కలకలము రేగెను. పార్వతి రాదాయెను. మంచితరుణము మించిన మరల  రాదని  బసవడు పరుగు పరుగున గదిలోకి పోయి పార్వతి చేతిని పట్టుకొని అరుణతారావద్దకు వచ్చి వంగి నమస్కరించెను . పార్వతి కూడా నమస్కరించగా చెవి పట్టుకొని గుంజి " ఎచ్చటికి పారిపోదువే , బసవడు వలదా? వలసినచో  నోరు తెరిచి చెప్పుము ' అనెను. పార్వతి మూగనోము పట్టగా బసవడు మాత్రము "వలయును, వలయును అని నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేయుచుండగా, ఏయ్ మిస్టర్ వాటార్యు డూయింగ్ అమాంగ్ లేడీస్? నీవచ్చట స్త్రీల సమూహమందు ఉండుట  మంచిపని కాదు , ఇటు రమ్ము అని వెనక్కి పురుషుల సమూహములోనికి లాగెను. బసవడు నిస్సహాయుడై చూచుచుండ పార్వతి మౌనముగా నిలిచెను. నీకు ఒక్క నిమిషము సమయము ఇచ్చుచున్నాను అని అరుణ హెచ్చరించెను , ఎట్టకేలకు పార్వతి తార చెవిలో " వలయును"  అని చెప్పగా నవ్వులు చెల రేగినవి.  బసవా పార్వతి పరీక్షనందు గెలుపొందినది, నీకునూ ఒక పరీక్ష కలదు అని చెప్పుచుండగా " పార్వతి కావలెను..  పార్వతి నాకు  కావలెను"  అని అరచుచుండెను. 
అప్పుడు అగస్త్య ఒరేయ్ సాంబారు నీకు వేరే పరీక్ష కలదు ఎందుకట్లు అరిచెదవు  ఆ పరీక్ష ఏమో తెలుసుకొనుము " అనెను. ఒక్క క్షణము నిశ్శబ్దం ఆవరించెను."
రణగొణ ధ్వనులు లేని ఆ పల్లెటూరినందు కీచురాళ్ళ శబ్దము స్పష్టముగా వినిపించుచుండెను.
అరుణతార నోరు తెరచి " బసవా నీవు ఆశు కవితయందు దిట్ట కదూ ! పార్వతి మీద ఒక ఆశు కవిత చెప్పి మమ్ములను మెప్పించవలెను. అని చెప్పగా  మంజూష ఆశుకవితాష్ ఖర్మము వృత్త పద్యములల్లు కవితా ఘనతా జనతా మానస విహారి అతడిని ఏదైననూ వృత్తపద్యము ఆశువుగా చెప్పమనిన బాగుండును అని ఆమెను ఎగదోసెను. కళాబృందంవారు "  లెస్సపలికితివి ,  ఆహా వృత్తపద్యమైన వీనులవిందుగా నుండును !" అని మరింత ఎగదోయగా బసవడు నేను చంపక మాల వరకూ ఎగబ్రాకగలను అనగా " కొత్త సుబ్బారావు " ఊహు శార్దూలమును , పిల్ల దక్కదురా , సాహసము సాయారా డింభకా ! " 

అనగా బసవడు తొలుత  పళ్ళు పటపట కొరికి  పిదప పళ్ళికిలించెను.  సుందరి , రంజని , కేశవుడు ముసిముసి నవ్వులు నవ్వుచుండ  బసవడు " అట్లయిన నాకు మూడు  నిమిషములు సమయము కావలెను అనెను . అందరూ సరే అనిరి  

బసవడు పక్కగదిలోకి పరిగెత్తి తలుపు మూసుకొనెను వీడు తలుపెందుకు మూసుకొనుచున్నాడు అని అగస్త్యడు అనగా అందరూ హాస్యానందమును గ్రోలిరి. 

బసవడు భారతవర్ష కి చరవాణి ని కలిపి విషయమును వివరించగా సంతోషించి పార్వతికి  తన ఆశీస్సులు అందించమని తెలిపి ఒక స్వర సందేశమును పంపెను, అది రెండు సార్లు విని బసవడు బయటకొచ్చి  

   శా. మందార  ద్రుతమే   స్వరమా    ధుర్యమే   పాదాల   తారాడు  నీ 
   కందార      కృతకే      శనిర్ఝ      రిమహా     కాళింది   ప్రవాహ   మే    
   చిందాడు    బృహవీ    ణియాల    యలుచూ  చాకేగ    దాక్షాయ ణీ 
   బంధాలే         బిగిసే      నుపెండ్లి     కొడుకే    ఫాలాక్షుఁ  డేచూడ గన్
 
పద్యము చదివ గానే అందరూ కరతాళ ధ్వనులతో హర్షము వ్యక్తము చేయుచుండగా అగస్త్యుడు " బసవా దీని అర్ధమేమి ? "వివరింపమని కోరగా బసవడు దాట  వేయ జూచెను  కానీ అందరూ పట్టు బట్టగా విఫల ప్రయత్నం చేసెను. కేశవుడు మౌనముగా నుండగా అగస్త్యుడు కేశవా నీకు తెలియును జెప్పుము అనెను.

మందార  ద్రుతమే   స్వరమాధుర్యమే  అనగా  పార్వతి స్వరము మధురము 
పాదాల   తారాడు  నీ కందార కృత  ( నల్లని మేఘములవంటి ) 
కేశనిర్ఝరి  (కురుల ప్రవాహము) 
మహా  కాళింది   ప్రవాహమే   ( యమునానది వలే నుండును) 
చిందాడు    బృహవీణియా   లయలు   ( వీణా వాదనా లయ విన్యాసము)  
చూచాకేగ ( చూచిన తర్వాతే )   దాక్షాయ ణీ  ( పార్వతీ)
బంధాలే    బిగిసేను  పెండ్లి  కొడుకే    ఫాలాక్షుఁడే ( శివుడు లేదా బసవడు)  చూడగన్

భానో: ఈ పద్యము ఎవరో గొప్ప పండితుడు వ్రాసినట్లున్నది.   
మాలిని: పార్వతి వీణ వాయించుట నీవెప్పుడూ చూడలేదే నీ కెట్లు తెలియును?
అగస్త్యుడు: ఇది ఖచ్చితముగావర్షవిరచితమే, నా సందేహము నిజమైన, వీడి చరవాణి నందొక స్వర సందేశముండును.  
పార్వతి : బిక్క మొఖం వేసి తమ్ముడు వైపు చూసెను.
కేశవుడు : ఏమో వ్రాసి ఉండవచ్చుకదా బసవడేమియూ  పాండిత్యమందు తక్కువకాదు.
మాలిని: కేశవా  అక్క కొరకు అట్లు చెప్పుచున్నావు నీవు తగ్గుము  అయ్యో పాపము దీని మొఖం చూడవలెను అని పార్వతి మొఖం చూపెను. పైగా ఈ పద్యము ప్రియుడు వ్రాసినట్లు కాక ఒక అన్న వ్రాసినట్లున్నది. 
 సోదరప్రేమ ద్యోక్త మగుచున్నది అని అందరూ అనిరి 
అరుణ: ఆరోజు సత్య భామ అందమును అంతగా వర్ణించిన బసవడు పార్వతి అందమును పక్కన పెట్టి వీణా వాదనము  స్వర, తాళ గతులను మెచ్చుకొనెను
బసవ: హతవిధీ ఒప్పుకొనుచున్నాను , నేను వ్రాసినది కాదు వర్షుడు ఢిల్లీ నుంచి పంపెను.
నక్క: అతడైననూ ఒక్క నిమిషములో నెట్లు చెప్పును ?
అగస్త్యుడు: అతడు శతావధాని అనగా ఇటువంటివి  వందపద్యములు  అవలీలగా చెప్పును
అరుణ : ఇప్పటినుంచే మోసమా . మాపిల్లనివ్వము పొమ్ము! 
పార్వతి : ఏడ్చుచూ గదిలోకి పోయెను 
ఒట్టు పెట్టి ఆమెను ఓదార్చి , ఆమె చేతిని బసవడి చేతిలో పెట్టి ఈ పిల్ల నీది  కానీ నీ  తల్లి తండ్రులు కూడా వొప్పవలెను  ఇద్దరి మొఖములో కళ కళ లాడినవి  పార్వతి కళ్యాణమట్లు కుదిరినది.  అటుపిమ్మట పార్వతికి కూడా ఒక పరీక్ష పెట్టిరి కానీ ఆమె ఎవరికీ సందేశములు పంపక వీణ తెచ్చి " మదన గోపాలా! యని దేవునికి కృతఙ్ఞతలు తెలుపుతూ గీతమునాల పించగా అందరూ అందరూ ఆ స్వర మాధుర్యమందు కరిగిరి.