Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, February 27, 2021

కొత్త రంగులు

 మీనాక్షి అరుణతార పాత్రలు ఇంత  ఉన్నతమైన పాత్రలవుతాయని మొదట తెలియదు. 1 నుండి 20 ఎపిసోడ్స్ లో మీనాక్షి అరుణ తార పాత్రల ప్రారంభ దశ ఇమిడి ఉంది. మన ఇద్దరికే తెలిసిన విషయాలు ఇక బాహ్య ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాయి.  ఇంత  ఉన్నత పాత్రల ఔచిత్యం  దెబ్బతినకుండా   ఈ 20 ఎపిసోడ్స్ లో పాత్రల కు చిన్నచిన్న మౌలిక మార్పులతో   ఔన్నత్యం  పెంచి భారత వర్షను ముద్రణకు సిద్ధం చేస్తున్నాను. అప్పుడే అది కలకాలం నిలిచే కావ్యం గా నిలిచిపోతుంది 

నిన్నరాత్రి 20 ఎపిసోడ్స్ కి రంగులద్ది 12 పాటలు వ్రాసాను.  మెదడు హ్రదయంలోకి  గళం కలలోకి ఇంకిన రాత్రి,  నిన్నరాత్రి. సహృదయులైన పాఠకులు చదవగానే ఈ ఎపిసోడ్, 20 ఎపిసోడ్స్ లో పేరా గ్రాఫ్స్ కి  ఉన్న  రంగులు మాయమవుతాయి.

భారత వర్ష ఒక వీణ  నీవొక ఒక తీగ నేనొక తీగ 

నీవొక రాగం నేనొక రాగం రెండు తీగల తీయనిరాగం , కుసుమ పరాగం 

భారత వర్ష ఒక తీగ నీవొక కుసుమం  నేనొక భ్రమరం 

తేనెలు చిలికే అమృత కుసుమం అలుపే ఎరగని తుంటరి భ్రమరం 

వంటరి పయనం  ఎగసిన కెరటం ఇరుహృదయాల సాహిత్య మథనం 

అతిథి కిచ్చే ఫలమైనా అంకితమిచ్చే కావ్యమైనా ప్రక్షాళన చేసే కదా ఇస్తాము  - రచయిత   


Thursday, February 25, 2021

Bharatavarsha -135

ఆనందనిలయమునకు చేరువలో నున్న "అపూర్వ" కల్యాణ మండపమందు పుష్పమాలాలంకృతమై ధగధగకాంతులీను ఉన్నత వివాహ మండపముపై  గోపురములవలె నాలుగు చిన్నమంట పములలో నలుగురు పురోహితులు, పదిమంది  వేదపండితుల మధ్య నాలుగు కుటుంబముల వారు నిలిచి యుండిరి. పవిత్ర మాఘ మాసమున మాంగళ్య బంధముతో ఒక్కటైన జంటలు తలంబ్రాలు , అక్షింతలు, మంచి గంధము కర్పూర  సువాసనలు వెదజల్లుచుండగా బంతి చామంతులవలె ప్రక్క ప్రక్కన నిలిచిరి. 

రాత్రి 8.00 గంటలగుసరికి పెళ్లిళ్లు ముగిసినవి. రాత్రి భోజనములు సమయమ గుచుండుటతో  పెక్కు మంది ఆహ్వాని తులు వివాహ విందుకు పోయినారు.  కొలదిమంది ఆహ్వానితులు పెద్దలు మాత్రమే ఉండుటతో మండపం గది అంత యూ ఖాళీగా కనిపించుచుండెను. సంగీత కచేరివారు కూడా తమ తమ సాధనములను తీసుకొని వెడలుచుండిరి కేశవుడు వారిని భోజనములు హాలు లోకి తీసుకు పోవుచుండెను. 

 సందీపుడు మంజూషను తీసుకొని తన తల్లి తండ్రులతో సబ్బవరం పోవలెనని యోచించుచుండగా  మాలినిగారు " పిల్ల ఇంటనే శోభనం వేడుక జరిపించవలెను. అది ఆనవాయితీ"  అని ఎంత చెప్పిననూ సందీపుడు శోభన వేడుకలకు అంగీ కరించకపోవుటచే వర్షుడు కూడా సందీపుని అభ్యర్ధించగా సందీపుడు వర్షునితో " నేను నేరుగా బెంగళూరు పోవలెను నా సంస్థ చూచుకొనుటకు ఇప్పుడు అచ్చట నా అనువారు ఎవ్వరునూ లేరు , నన్నర్ధము చేసుకొనవలెన"ని వర్షుని చేతిలో చేయి వేసి చెప్పెను. 

పెంచలయ్యగారు వర్షునితో "త్వరలో మాఇంట మానందిని కి పెండ్లి చూపులకు వత్తురు ఇప్పటికి పోనివ్వవలెన"ని అనగా నందిని " అవును మానాన్నకు పెండ్లిచూపులు జరుగును మీ రందరూ రావలెన"ని చమత్కరించెను. మాలిని గారు మంజూషను  వియ్యపురాలి చేతిలో పెట్టుచూ  మాటలు కరువయ్యి   ఏమి చెప్పుటకూ తోచక గుండెలు బరువ య్యి  కొద్ది క్షణములు అట్లే  నిలిచి ఎట్టకేలకు మంజూష తో  " నీకు తల్లి గురువు ఈమే , అల్లుడు నీ   అమ్మవలె  వలె నీవాడమన్నట్లు ఆడువాడు కాదు,  అన్న వలె మృదువుగా నుండకున్ననూ ,దెబ్బలాడిననూ అణుకువతో ప్రేమతో నుండవలెను. పుట్టింట సాగినట్లు  అత్తింట  అలకలు సాగవని గుర్తుంచుకొనుము. భర్తవద్ద  బెంగుళూరులో  ఎట్లుందువో అని వ్యాకులతతో సాందీపుని చేయందుకొని మంజూష చేతిని అతడికి అందించుచుండగా మీనాక్షి" బెంగుళూరులో నేను ఉండగా నీవు ఇంత  విచారపడవలదు.” అని మాలినిని  ఓదార్చెను. 

సందీపుడు మంజూషలు మాలినిగారికి ప్రణామము చేసిన పిదప సందీపుడు మంజూషను వర్షునివద్దకు కొనిపోయెను. వర్షుడు  ఆశీర్వదించి సందీపుని గుండెలకు హత్తుకొనెను. పిదప అతడి రెండు చేతులు పట్టుకొని చిన్ననాటి స్నేహితు లమన్న దయ ఉంచుము. అని వర్షుడు అనుచుండగా సందీపుని కన్నులు తడిఅయ్యెను. ఆడపిల్ల నేకపోతే ఇల్లంతా ఎలితి , ఏటి సేత్తాము పల్లకో నాయినా  అని పైడమ్మ గారు  వర్షునికి ఓదార్పుచెప్పుచుండగా "  నందిని " ఓలి పైడి! నువ్వు పల్లకోయే , మంజూస ఎల్లిపోతే , నాను లేనేటి ?! వర్సని నా నొగ్గుతాననుకొంతన్నావేటి !" అని గ్రామీణ భాషలో మాట్లాడుటతో  అందరూ చకితులయ్యి మనసారా నవ్వుకొనిరి. ఆది, దాసు, మరీదు పెంచలయ్య పైడమ్మ లను కూడి నందిని మంజూష సందీపుడు చిన్న బస్సులో సబ్బవరం బయలుదేరినారు. 

చంద్రమతి  పార్వతిని బుచ్చెమ్మగారికి  అప్ప గింతలు పెట్టుచూ  పార్వతి తల్లి చారుమతి  పేరు  తలఁచి కన్నీరు పెట్టి  కేశవుని పై వాలి “నీ డబ్బు నేను  అన్యాయముగా అట్టే బెట్టుకొంటినని” విలపించి రెండు దస్తావేజు కాగితములను తన  సంచిలోనుంచి తీసి ఒకటి కేశవునకి మరొకటి పార్వతికి ఇచ్చి బుచ్చెమ్మ గారితో “కేశవునకు తన తల్లి ఆస్తి  పది ఎకర ముల పొలము అప్పగించితిని. పార్వతికి నాఆస్తిలో నా పిల్లలతో సమముగా వాటా ఇచ్చితిని జాగ్రత్తగా చూడవలెను. అని చీర కొంగుతో కళ్ళు త్తుకొనుచూ అరుణ తారవైపు చూచుచూ “మా కుటుంబమునకు పెద్ద దిక్కు నీవే, అరుణా  అంతా చూచుచున్నావు కదా!” అని సుకన్యను తీసుకొని బయలుదేరెను. “ఈమె  పెండ్లికూతురిని  అప్పగింతలు   పెట్టినదా లేక ఆస్తి అప్పగింతలు  పెట్టినదా?” అని బుచ్చెమ్మ తుచ్చ ప్రశ్నను సంధించగా  అందరూ ఘొల్లుమనిరి. పార్వతి చేయందుకొని బసవడు కేశవుని రంజిని గారిని తీసుకొని  బయలుదేరెను.     

తక్కిన రెండు  జంటలకు శోభనములు మా  ఇంట జరుపవలెనని అనుకొనుచున్నాము అని మాలిని మీనాక్షితో అనుచుండగా యమున మీనాక్షి చెవులో  ఎదో గుసగుసలాడుచుండెను విదిష ఆమెను   జబ్బ పట్టి వెనుకకు లాగి ఏమా గుసగుసలు రహస్యములు అని కసిరి ఏమనుచున్నది ఈ బుడత అని అడుగగా మీనాక్షి నవ్వుచూ “సుందరిని  బెంగుళూరు తీసుకొని పోవలెనని కార్యము అచ్చట  జరపవలెనని అను చున్నది.” అని చెప్పెను. ఈ రాత్రికి ఇచ్చట  నిద్ర చేయవలసినదే  పిల్లలు ఆడి ఆడి అలసినారు. అని మాలిని గారు  అనుచుండగా అగస్త్యుడు తల్లి  చెవి కొరుకు చుండెను. ఏమో నాకేమియో తెలియదు కోడలు ఎట్లు కోరుకొనునో అనుచుండగా అరుణ “ఏమి కావలెనయ్యా కొత్త పెళ్లికొడకా!” అని బుజ్జగించగా అగస్త్యుడు సిగ్గుపడుచుండెను.  “ఫైవ్ స్టార్  హోటల్ లో కావలెనట” అని సుందరి అరుణ చెవిలో చెప్పెను. అరుణ నిట్టూర్చెను. “నీ కోరిక?” అని సుందరి వైపు చూసెను    “అన్నయ్య ఇంటికి పోయెదము” అని మెత్తని స్వరమున తెలిపెను. ఆమె సుందరిని బుగ్గలు నిమిరి మెచ్చుకొనెను. లకుమ కూడా అన్నయ్య ఇంటికి పోవలెనని  చెప్పగా వర్షుడి మనసు సంతోషము తో ఉప్పొంగెను.

 లకుమ  సుందరి ఏక స్వరమున  అన్నయ్య అల్ప సంతోషి, మా సుఖమును చూచి సంతొషించు మనసుగల అన్నయ్య మమ్ము ఆశీర్వదించి పంపువరకు మేము అన్నయ్య ఇంటనే ఉందుము, అని పలుకగా అది విని వర్షుడు ఉబ్బి తబ్బిబ్బయ్యెను. అది చూచి క్రిష్ణన్ “అరుణా నేను ఏమి కోల్పోయినానో ఇప్పుడు తెలిసినది అని కన్నీళ్ళ పర్యంత మయ్యెను. మీనాక్షి అగస్త్యునికి లకుమ సుందరి లను చూపి “ఆడపిల్లల ప్రేమ అట్లుండును అన్నయ్యకు ఎంత అనురాగము పంచుచున్నారో!”  జానకి రఘువరన్ కూడా కళ్ళు వత్తుకొని “మీరెంతకాలమున్ననూ మీ ఇష్టము మేము మాత్రము రేపు కొచ్చిన్ పొవలెను.” అనుచుండగా వివేకుడు “మేడం రేపు నేను కూడా  ఒక  ఇన్వెస్టిగేషన్ పై శ్రీలంక పోవలెను”  అని అరుణతారతో చెప్పగా  ఇంకా అదే పాత పిలుపు ఎందుకు నాయినా అత్త గారు అని పిలువుము, నాకూతురిని సుఖపెట్టి కేసులు తరువాత చూచుకొనుము అని లకుమవైపు ప్రేమ నిండిన కనులతో చూచెను.   

ల్యాండ్  రోవర్  ఆలలపై పడవవలె కదులుచుండెను.  విదిష నడుపుచుండగా మీనాక్షి  ప్రక్కన కూర్చొనెను. సుందరి అగస్త్యుడు  వెనుక కూర్చొనిరి. అరుణ భర్త  అల్లుడు కూతురు ఒక కారులో విదిష కారుని అనుసరించుచుండిరి. అంగ యారు కన్నె, శేషాచలముగారు, తులసి, మాలిని , నరేంద్ర పండిత్ మధుబాల మున్నగు వారిని వర్షుడు వేనెక్కించు కొని తార కారుని అనుసరించుచుండెను.  ముందు మీనాక్షి కొడుకు కోడలు , పిదప అరుణ, కూతురు, అల్లుడు పిదప వర్షుడు, తల్లి ఆనందనిలయము కేసి సాగుచుండిరి. 

సుందరి  సిగ్గుతో మొఖం ప్రక్కకి త్రిప్పుకొని ఎడమవైపు దూరముగా కూర్చొనెను  అగస్త్యుడు ఆమె  చిటికన వేలు అందుకొన ప్రయత్నించుడగా విదిష అద్దమందు చూచి మీనాక్షి చెవిలో వేసెను. మీనాక్షి తన కళ్ళ కొలికిల నుండి వెనుకకు చూచి విదిషవైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుచుండెను. 

లకుమ వివేకులు ఒకరినొకరు చూచుకొని  మైమరచి పరిశరములను మరిచి కొన్నిలిప్తలు ఇనుము సూదంటు రాయి వలె ఒకరినొకరు అతుకుకొని విడిపోవుట చూసి క్రిష్ణ గారు అరుణతార చేతిని గిల్లగా అది వివేకుడి కంట పడెను. వర్షుడు మనసంతయూ  బాల్యజ్ఞాపకాలు చుట్టినవి. అతడు తల్లి వొడిలో తలపెట్టుకొని అమ్మా అని పిలిచెను మాలినిగారు కొడుకు తలలోకి వేళ్ళు పొనిచ్చి నిమురుచూ  “బరువులు భాధలు భాద్యతలు అన్ని బ కారములు ముగిసినవి  అని అనుచుండగా “బాల్యము కూడా ముగిసినదికానీ భవిష్యత్ మాత్రము మిగిలి యున్నది. అనెను. 

                                              ***

హిమకరుడు చంద్రికలను పరచి ఆనందనిలయమును అలరించుచుండెను. తెరచిన భోషాణము వలె  పై కప్పు ఆచ్చాదనలేని మండువా గదిలో నేలంతయూ   వెండిపూత పూసినట్లున్నది. చల్లగాలికి చలించుచున్న చెట్టుకొమ్మ   లుచంద్రికల కవరోధము కలిగించుచూ చాయలు ఏర్పరచు చుండెను. మండువాగదిలో చలించు వాటి ఛాయలు  చూచువారికి చెవుల పిల్లు లాడుచున్నట్లు నయనానందమును కలిగించు చుండెను. గడప గడపకూ వ్రేళ్ళాడు బంతిపూదండల పరిమళములు నాసికలు తాకి మత్తెక్కించుచుండెను. వివాహ మేళతాళములింకనూ  అందరి చెవులయందు మారుమ్రోగుచున్నవి. 

 స్త్నానములు చేసి నూతనవస్త్రములు దాల్చి వచ్చిన నూతన వధూవరులు సైకత శిల్పములవలె నిలచి యుండి ఆనందపారవశ్యమునందుచుండగా, తార మీన తులసి మధుబాలల కళ్ళు మెరియుచుండెను. చుట్టూ ఉన్న ఆరు గదులు ఒక్కొక్క గది ఒక్కొక్క జాతి పుష్పములతో అలంకరించబడెను.  రెండు జంటలే కదా ఆరుగదులకు అలంకరణ ఏలనో అని తార  మీనాక్షిలు భావించిననూ  మాలిని గారు తలుపు తీసి చూపుచుండగా   పుష్ప పరిమళ సొభితమై పానుపులు శృంగారభావములను మోల్కొలుపుచున్నవి. లకుమ వివేకులు సుందరి అగస్త్యులు ఆనందపు అంచులలో విహరించిరి.  కాముడు ఆ రాత్రి పిల్లలనూ పెద్దలనూ ఒక్కవిధముగా అలరించెను. 

Tuesday, February 23, 2021

Bharatavarsha 134

తూరుపు తెల్లవారు చుండెను. తిమిరసంహారము చేయు తిమిరరిపుడు అమర రత్నమై అంబరమును  పాలించుటకు అరుదెంచుచున్నాడు.  జలయత్రము నుండి నీటి ధారలు  ఎగయునట్లు ఆకాశమున కాంతి ధారలు  విరజిమ్ముచున్నవి.  శతకోటి శరముల  వెలుగురేడు కమలాప్తుడు కమలములు కిలకిలా నవుచుండ, ఎల్ల లోకములనూ ప్రకాశింపజేయుచుండెను. 

 చ.  కమల ములన్ని విచ్చగ  జగాలు వికాస మునంది విచ్చెనే    

సమము గసూరి   దిగంత  విచార   ణజేయ   మయూఖ రేఖలే

విమల   విలాస   చరాచ   రమేలె  సుగంధ    ముచిందె  పూలు లే 

చిమల  యమారు తమేగె  విచ్చిన సుమాల   ప్రభాత   సేవలో  


నేడే మంజూష , లకుమ, సుందరి , పార్వతుల  వివాహము. తల్లుల కన్నులు కాయలు కాయ ఎన్నాళ్ళో వేచిన దినము.  మంగళ స్నానమాచరించిన రుచిర, దృఢ దుర్నిరీక్ష్య తేజోమయ దేహములు గల యువకులు ధవళ వస్త్ర ధారులై ఆనందనిలయ ప్రాంగణ మందు మెదులుచుండ   పర్వతము లపై సంచరించెడి శ్వేతపర్జన్య సమూహము నేల వాలినట్లున్నది. ప్రౌఢల అలంకరణలు ముగిసిననూ పడతుల అలంకరణలు ప్రౌఢలే చేయుచుండుటచే కాలయాపన జరుగుచున్నది. మీనాక్షి యమున నిమ్మపండు రంగు చీరలు రవికలు దాల్చి జంట కవులవలె ప్రక్క ప్రక్కనే నిలిచిరి. అరుణ నీలాకాశవర్ణపు పట్టు చీర ధరించి  లకుమకు చీర కట్టుట నేర్పుచుండెను.  ఎంతకీ అది కుదరక పోవుటచే లకుమ విసిగి " అందరివలె నేను లంగా వోణీ ధరింతును రాత్రి వివాహమునకు చీర ధరింతును అని చీర పీకి పక్కన తల్పముపై  పారవేసి   లంగా వోణీ ధరించి పడతుల సమూహమును చేరెను. సుందరి అలంకరణ జరుగుచుండగా అగస్త్యుడు తొంగి చూచి పట్టుబడుటచే అరుణతార యువకులను  బైటకు నెట్టి వేయుటతో  వర్షుడు, కేశవుడు అగస్త్యుడు, బసవడు, వివేకుడు, సందీపుడు చెలిమి చలువము పూసుకొని చెట్టాపట్టాలేసుకొని ప్రాంగణ మందు విహరించుచుండిరి.

వర్షుడు , వివేకుడు ఒకే  ఎత్తు యుండుటచే వారిరువరూ సమూహమందు మద్య నిలచిరి. వివేకుడు పాలతొడుగువలె తెల్లని పల్చని చర్మముతో మెరియుచుండగా వర్షుడు చామన చాయలో దృడదేహముతో వెలుగుచుండెను. వర్షుని ప్రక్కన, మెడలపైకి జాలువారు కేశములతో కేశవుడు చామన చాయ లోనొప్పుచుండగా  తెల్లని వివేకుని ప్రక్కన నల్లని సందీపుడు తెలుపు నలుపు మేఘముల వలెన గుపడుచుండిరి.

 సందీపుని చదరమైన ముఖమును పార్శ్వావ లోకనమున జూడ దట్టమైన దవడ ఎముక, వంపు దేరిన ముక్కు అగుపించుచుండును. కాంతినిండిన కనులతో కళకళ లాడు మొఖము ముచ్చటగొలుపుచుండును.  


వివేకుని కి కంటే గుప్పెడు తక్కువైననూ మితభాషి స్పురద్రూపి యగు సందీపుడు నల్ల చంద్రమే. సందీపుడికంటే గుప్పెడు ఎత్తు తక్కుగా నున్నను బసవడు రంగుయందు సందీపుని మించి ఉంగరముల జుత్తుతో నవ్వుమొముతో తెల్లని పళ్ళని చూపుతూ కలువలదొరవలె నుండును. అగస్త్యుడు వర్ణమున వివేకుని పోలి  గిల్లిన పాలు కారునట్టు  తెల్లగ పల్చని చర్మము తో వెలుగుచుండును.

ఆనందనిలయ మందు రంగు రంగుల గుడారముల తోరణములు గాలికి బిరబిరా కదలాడుచూ నయనానందము కలిగించుచుండెను. ప్రాంగణమంతయూ ఎర్రని తివాచీలు పరువబడినవి. తెల్లని పాదముల జంటలు యెర్రని తివాచీపై నడయాడుచూ ప్రవేశ ద్వారమును చేరినవి. ప్రవేశ ద్వారమువద్ద సువాసన వెదజల్లు మరువపు ద్వారము నిర్మించ బడెను. వివేకుడు కోటేరువంటి ముక్కును మరువపు మాలలకానించి ఆహా ఏమి సువాసన అనెను కేశవవుడు నాసిక ను దట్టమైన సుమమాలల పై నుంచి అబ్బా ఎంత చక్కటి పుష్ప ద్వారము అనెను బసవడు ఆహ ఎంత కమ్మని పెస రట్ల వాసన విడిదింట అల్పాహారము మొదలాయెను.  అందరూ మరువపు సువాసన మూర్కొనగా బసవడు  పెస రట్ల వాసన నాఘ్రాణించుటతో అగస్త్యుడు "తిండి వాసన పసిగట్టు ట యందు పోలీసు జాగిలాములు కూడా వీడి ముందు దిగదుడుపేకదా!" అనగా అందరూ నవ్వుకొనిరి.  

“విడిది భవనమందు అల్పాహారం సిద్దమయినది మనము పోయి ఆరగించవలెను.” అని బసవడు అనుచుండగా వర్షుడు " వరులు ఉపవాసముండవలెను, పలహారములు నాబోటి వారికి మాత్రమే. అమ్మల అలంకరణలు పూర్తి అయిన పిదప వారితో కలసి పోయి వారికి " నేనే స్వయముగా వడ్డించవలెను.” అనెను. బసవడి మొఖము జేగురించెను. అదిచూచి   అగస్త్యుడు “అయ్యూ  ఎంత పని అయినది పెసరట్లు  తినుటకు అదృష్టముండవలెను” అని అగస్త్యుడు బసవని ఆట పట్టించుచుండెను. “అయ్యూ మా బావగారిని ఇట్లు ఆట పట్టించ దగునా!” అని కేశవుడు వ్యంగ్య మును చూపగా అది నిజమని భ్రమసి బసవడు మహానందము నొందుచుండ అలక పానుపు పై అల్పాహారము అడుగు అల్పజీవి వలె తోచి " నిన్ను చూచిన జాలి కలుగుచున్నది” అని వర్షుడనెను.  బసవడు అదియునూ అర్ధము చేసు కొనక “చందనను పిలచి రహస్యముగా రెండు పెసరట్లు తెప్పించుకొందును… అని మాట తడబడగా …అందరికీ తెప్పింతును.”అనెను.  వర్షుడు "ఇట్లు మాటలాడుటకు సిగ్గుండవలెను, అగస్త్యుని కారణముగా బైటకు గెంటివేసినారు అది గ్రహింపుము"అనగా హాస్యము వెల్లి విరిసెను. ద్వారము నుండి అందరూ వెనుకకు మరలినారు. వర్షుడు కబురు చేయుటతో పెద్ద వస్త్ర వ్యాపారులు , నగల వర్తకులుతమ తమ నాణ్యమైన సరుకులను ఆనందానిలయమందు తివాచీలపై పరుచుచుండిరి. కొలది సేపటిలో ఆనందనిలయము పెద్ద అంగడిని తలపించుచుండెను. స్త్రీల అలంకరణ పూర్తి అయినది కానీ వారు బయలుదేరునంతలో ఛాయాచిత్ర గ్రాహకుడు తన బృందంతో ప్రవేశించుటతో స్త్రీలు తమ అలంకరణలను అందాలనుచిత్రములందు స్థిరపరుచుకొనుటకు ఉవ్విళ్ళూరుచుండిరి. యువకులకు లోపల కి  పిలుపు వచ్చెను.

అరుణ తార,  అంగయారు కన్నె,  మీనాక్షి , తులసి , యమున, మాలిని , దామిని మధుబాల, జానకి, చంద్రమతి బుచ్చమ్మ గార్లు ఒక వరుసలో నిలవగా  రంజని , మంజూష , లకుమ , సుందరి, విదిష ,నందిని ,  చందన  పార్వతులు  ఒక వరుసలో నిలిచి యుండిరి.  గ్రాహకుడు వారిని బృంద చిత్రమందు బందించి, పిదప జంటలు జంటలుగా  విభజించి వివిధ భంగిమలందు వారి రూపవిలాసములను స్థిర,చలన భంగిమలందు సంస్థాపన మొనరించు చుండెను . 

మొదట కన్నె మీనాక్షి , పిదప మీనాక్షి సుందరి , పిదప యమున మీనాక్షిలు ఇట్లు ఒకరి  హత్తుకొని అనురాగములను చూపుకొనుచూ చిత్రములందినారు. అనురాగమతిశయించ మీనాక్షి సుందరిని ముద్దాడగా, యమున  మీనాక్షిని ముద్దాడెను. లకుమ తల్లి తండ్రులతో అనురాగము ప్రస్ఫుటమగు చిత్రమొకటి గొనెను.  రంజని కేశవులు చెంతకు చేరి కలసి ఛాయా చిత్రమందుటకు బిడియ పడుచుండగా వారిని అరుణ దగ్గరికి తీసుకొని లకుమ వివేకులతో కలిపి చిత్రములందెను. కేశవుడు అరుణ మొఖములోనికి చూచెను  తల్లి స్థానములో కూర్చొన్న జగన్మాత వలే ఆమె కనిపించెను. ఆమె కనులలో భరోసా , పెదవులపై చిరునవ్వు చూచి కేశవుడి కనులు వాలినవి. కేశవుడి  మొఖము  చిన్నబోయెను “నా కథ నీకు చెప్ప లేక పోతిని” అను అపరాధభావన కేశవుని కళ్ళలో  కనిపించుచుండ అరుణ

“చిత్రములడగవు కథలు చిత్రముగా కదిలించు మనుషులను 

రాగమాలికలై రంజన చేయును మనసులను మాలిమి 

చేయును మూలికలై, ఏలికలై ఏలుచుండు భాషా పేదల 

మనసుల  తేలుచుండును కథలై  కావ్యములై, తరతరముల

 మనుషుల కలుపుచుండు తరగని సిరులై నిలిచి యుండు. 

“అని ముగించినపిద చందన "అమ్మ ఎంత చక్కటి కవిత అల్లినదో" అనెను. తార " నేను నీవలె కవిని కాను ఛందస్సు లేని  పద్యమునెట్లు గణింతురో కదా!" అనగా కేశవుడికి దుఃఖము తన్నుకువచ్చి ఆసువుగా ఒక ఉత్పలమాల పద్యమునల్లి  తల్లి మెడలో అలంకరించెను. 

 ఉ.    చందము   చూడగా      జనని      చందురు      డేతల      వాల్చున  మ్మ నీ      

        బంధము    చూడగా     కొడుకు    బాష్పము    లందును     రాగమొ ల్లయూ             

        కందము     వోలివ       ర్షమయి    కుర్వగ        మాటలు     మంత్రము  లై నా 

         డెందము   తాకగా       వలదు      డాబుగ      చందము     మాటచా    లులే

  

         నీ  చందము( శైలి -style)  చూడగా   జనని  అందగాడని  విర్రవీగు     చంద్రుడే తల          

          వాల్చునమ్మ ,  నీ  బంధము చూడగా  కొడుకు  బాష్పము  లందును  (అను )  

          రాగమొ ల్లయూ కందము ( మేఘము ) వోలి వర్షమయి  కుర్వగ  నీ  మాటలు     

          మంత్రములై నా డెందము  తాకగా  డాబు చందము నాకెందులకు నీ మాటచా లులే


బావగారు ఉత్పలమాల  పద్యమును హృద్యముగా సంధించి స్పందించినారు మనమంతవరకూ పోము వృత్తపద్యములకు మనకూ చుక్కెదురు అనుచూ బసవడు కేశవుని దుఃఖిత వదనమును చూచి అయ్యో బావగారు మీ నేత్రములేల ఆర్ద్రములాయెను ?! అని  అనెను. పార్వతి ఉదుటున పోయి కేశవుని కౌగిలించుకొనబోవఁగా లకుమ వారిద్దరినీ కౌగిలించుకొని ఓదార్చుచుండెను , ఆమె కనుల కొలికి లందు తడి చూచిన మాలిని "అరుణ వారెంత ఎదిగిననూ నీ ముందు ఒదుగు పసిబిడ్డలేనే,  వారిని ఏడిపించవలదే" అని మందలించుచుండగా వర్షుడు " మా చెల్లి కి కూడా వెన్నవంటి మనసున్నదే " అని లకుమలో వచ్చిన మార్పు కు గర్వించుచుండగా " వివేకుడు మందహాసము చేయుచూ  “ చెయ్యి లేవకున్నచో అదియే పదివేలు " అనగా అందరూ  ఘొల్లుమనిరి.   

మాలిని లకుమ, మంజూష సందీపులను, వర్ష విదిషలను వద్దకు తీసుకొని చిత్రములు గ్రహించెను.  చిత్ర మాలిక చివరకు విదిష నందినిలను చేరెను. నందిని విదిషను కొరకొరా చూచెను మాలినిగారి గుండెలలో రైళ్లు పరిగెత్తుచుండగా నందిని కోపము చిరునవ్వు గా మారెను. నందిని విదిషను హత్తుకొని ప్రేమ నిండిన కళ్ళతో ఆమెను చూచుచుండ అందరూ అచ్చెరువంది నోళ్లు నొక్కుకొనుచుండ చిత్రగ్రాహిణి క్లిక్ మనెను. 

మత్తకాసినులగు ప్రౌఢ స్త్రీల పొంకము పూర్ణకుంభమును తలపించుచుండ పడతుల అందము పాల మీగడ చందము చూపుచుండ వారు మండువా గది వీడి ప్రాంగణము లోకి అడుగిడిరి. యువకులు తురగములవలె ప్రాంగణ ములో నడయాడుచుండ వొళ్ళంతా కళ్ళు చేసుకొని వనితలు వారిని చూచుచుం డిరి.  లోకచక్షువు అప్పుడే అంబరమును ఎగబ్రాకుచుండెను. బసవడు పరిసరములను చూచుచూ ఆసు కవితాస్త్రమును సంధించెను. 

వెలుగు ఱేడుకళ్యాణ కాంతులను విరజిమ్ముచుండ

ప్రభంజనుడి శీతల స్పర్శకు మేను పులకించుచుండ, 

చూచుచుండ విరులు మరులు గొల్పు నాట్యమాడుచుండ

పంచవన్నెల చిలకలు కిలకిలా రావములు చేయుచుండ  

సర్వాలంకృత కళ్యాణ గృహము కైలాసమువలె నొప్పుచుండ.  

ఇట్లు అచ్చతెలుగున పాడుచుండ యువతుల సమూహమునుండి ఎవరో  ఒక గులకరాయిని గురిచూసి బసవడిపై  విసరగా అది అతడి మోచేతికి తగిలి క్రింద పడెను “ఎవరది నా  ఆశుకవితా గానమునకవరోధము కలిగించుచూ .. అని బసవడు రంగు రంగుల పట్టు లంగాలలో కొండపల్లి బొమ్మల వలే యవ్వన శోభల కాంతులీను యువతులపై … ఎగిసి పడుచుండగా 

“పండు కొని వండుతుండ కుండ పై బండ పడ నా వొళ్ళు మండ” అని మంజూష వేళాకోళము చేసెను.  బసవడి కవితలనే ఆక్షేపించువారా మీ టుమ్రీలు అని అగస్త్యుడు నందినిని విస్మరించి విమర్శించెను.  ఇంతలో నందిని గానమునందుకొనెను , స్త్రీలందరూ ఆసక్తిగా చూచుచుండిరి.

పురుషా సమూహే సుందర రూపే చలతి వనే సంభూయే

భువనో త్తారే,   సుధా  సమూహే   దివ్య మనోహర జాతే

యశోద తప్తే , కవితా దీప్తే,   యశోధన ఘన వన మాలె. 

అనుచూ ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి చందమున గంభీర గీర్వాణమున నందిని గానము చేయగా చందన “పురుషులందెవరైననూ దీనికి సరియగు గానము చేయగలరా? అని సవాలు విసిరెను. అప్పుడు వర్షుడు అదే  చందములో దేవభాషలో శ్లోకములను గానముచేసి   

రాధా  ప్రభవే  ప్రాతః కాలే  జవతే  ప్రక్రుతి  అధికం 

తరుణీ  విభవే వివాహ ప్రభవే  రజతి వరే సులభం

రాధా  ప్రభవే (అందానికి ఆరంభం అయిన) ప్రాతః కాలే  (వేకువ జామున) జవతే ప్రక్రుతి అధికం (ప్రక్రుతి స్ఫూర్తి నిచ్చును).  తరుణీ  విభవే (యువతి అందము); వివాహ ప్రభవే  (వివాహ సందర్భములో)  రజతి వరే సులభం (పెండ్లి కుమారులు ను రంజింపజేయును)

వివాహ సమయే ఆనందనిలయే కలహే న సంప్రతి  యుజ్యతే

సంవేసన సమయే రాసక్రీడే వర్ధతే తవ శుక వైరే వర్ధతే తవ నిశ్యపినే.

వివాహ సమయే ( వివాహ సమయంలో ) ఆనందనిలయే ( ఆనందనిలయంలో) కలహే న సంప్రతి  యుజ్యతే ( జగడమిప్పుడు ఒప్పదు) సంవేసన సమయే ( శోభనం గదిలో ) రాస క్రీడే ( శృంగార  క్రీడలలో)  వర్ధతే తవ శుక వైరే  (కవితా శక్తి వర్ధిల్లును)  వర్ధతే తవ నిశ్యపినే (నీ శృంగార శక్తి వర్ధిల్లును) కనుక నీ సామర్ధ్యము అచ్చట చూపవలెను.  

వీటికి అర్థము వివరించినచో బంగారు గాజులు  కొనిఇత్తునని ప్రకటించెను  నందినిని యువతులందరూ వత్తిడి చేసిననూ సిగ్గుపడి ముడుచుకు పోవుటయే గానీ పలుకు పైకి రాకుండెను, అప్పుడు మీనాక్షి నందినివద్దకు పోయి నీకు సిగ్గయినచో నా చెవులో చెప్పుము అని చెవి అందించగా నందిని ఆ శ్లోకములకు అర్థమును ఆమె చెవిలో చెప్పెను. మీనాక్షి బుగ్గలు ఎరుపెక్కినవి. పిదప ప్రౌఢలందరూ చెవులుకొరుక్కొని  నవ్వుకొనుచూ అల్పాహారం కొరకు విడిదింటి కేగినారు.  ఆ పిదప ఆనందనిలయము చేరి అరుణతార , మీనాక్షి , రంజిని  రత్నములు , నగలు  విరివిగా కొనుగోలు చేసిరి. మీనాక్షి తులసీగారికి సుందరికి పలు వస్త్రములు నగలు బహూకరించెను.   మాలిని కూడా వారితో సమముగా వస్త్రములు నగలు సందీపునికి పైడమ్మగారికి తీసుకొనెను, దామిని గాజులు కొని మంజూషకు బహూకరించెను. అందరూ బహుమతులతో ఒకరినొకరు సత్కరించుకొనిరి. 

సాయంత్రము వరకూ ఆట పాటలతో సాగిన సమయము వివాహ ముహూర్తమునకు గంభీరంగా మారెను. ఒకే కళ్యాణమండపమున, ఒకే శుభ ముహూర్తానికి  వధువులందరికీ మాంగళ్య ధారణ జరిగెను. మధు పర్కములలో నాలుగు జంటలనూ  తల్లులందరూ తనివి తీరా చూచుకొని ముచ్చటలుచెప్పుకొని , చిత్రములు బహుమతులు  ఇచ్చి పుచ్చుకొనిరి.   


Saturday, February 20, 2021

Bharatavarsha - 133

చిన్న విద్యుత్ దీపపు సన్న కాంతిలో మండువాగదిలో కొలది మంది అతిథులు నేలపై నిద్రించుచుండిరి. పట్టి మంచముపై అగస్త్యుడు, సోఫాలో వర్షుడు పడుకొనియుండిరి. అర్ధరాత్రి దాటుచున్నది. ఎంత ప్రయత్నించుచున్ననూ అగస్త్యునికి నిదుర రాకున్నది. సోఫాలో ఆదమరచి నిదురించుచున్న వర్షుని చూచి అగస్త్యుడు మంచము దిగి సోఫా వద్దకు పోయి మసక కాంతిలో వర్షుని మొఖము చూచెను. అతడి ప్రశాంత వదనముపై చిరునవ్వు విరియుచుండెను. ఏ స్వప్న లోకమున విహరించుచుండెనో కదా!  అగస్త్యునికి సుందరి తలుపుకు వచ్చెను.  ఆహా సుందరి నీ వాలు చూపులు నన్ను వెంటాడుచున్నవి. 

రాత్రి రాతిబండవలె నేలపై  నిదురించుచున్న నలుగురు అతిధులు దుంగలవలె నగుపించగా. జాగ్రత్తగా వారిని దాటుకొని బైటకు పోవుచుండగా తలుపులు మూసి ఉన్న తారగది నుండి అలికిడి వినిపించెను.  విరహము వలన వలపు వృద్ధి పొందును కదా!  అనుకొనుచూ అగస్త్యుడు తలతిప్పి తలుపులు తెరచి యున్న మాలినిగారి గదివైపు చూచెను. మాలినిగారి వద్ద మంజూష లకుమలు చంటి బిడ్డలవలె చలనము లేక నిద్రించు చుండిరి.  అగస్త్యుడు వర్షుని గది వైపు చూచెను. బల్లపై పుస్తకములు, ప్రక్కనే ఒక మూలగా ఉంచిన  వీణ కనిపించినవి. ఛీ! ఈ పుస్తకముల పురుగుతో వదినగారు ఎట్లు కాపురము చేతురో అనుకొంటిని  కానీ వర్షుడు రసికుడని తేలెను.  ఎంత రసికుడయిననూ సమయము కొరకు వేచి చూడక తప్పదుకదా.

అగస్త్యుడు వర్షుని గదిలోకి ప్రవేశించి విద్యుత్ దీపము వెలిగించి కాంతి ఇతరులకు నిద్రాభంగము కలిగించకుండుటకు తలుపు మూసి కుర్చీలో కూర్చొని వర్షుడి కొత్త పుస్తకముల దొంతరనుండి రీ ఇంకార్నేషన్ అఫ్ సూపర్ వుమన్ ఒక పుస్తకమును తీసి “రీ ఇంకార్నేషన్ అనగా పునర్జన్మ , పునర్జన్మలగూర్చి ఇతడికేల , ఎదో కవిత్వము వ్రాసుకొనక” అనుకొనుచూ చదవనారంభించెను.

                                                               ***

 నిద్రించుచున్న వర్షుడి తలపై మెత్తని హస్తమొకటి మెల్లగా తాకెను. వర్షుడి మదిపులకరించెను. వొళ్ళు జల్లన, మెల్లన కళ్ళు తెరిచి చూచెను.  కలువ కన్నుల,  ఘనస్తనముల భామ   ముత్యముల వంటి పళ్ళు మెరియుచుండ మందహాసము చేసెను. మసకవెలుతురునందు ఆమె ముఖము స్పష్టముగా కనిపించకుండెను. ఇంతలో ఆ  గజగామిని మందగమనమున ఆనందానిలయ  ప్రాంగణములోనికి ప్రవేశించెను. సాహితీ వేదిక నధిరోహించి వర్షుని రమ్మనెను, వర్షుడు వేదిక నధిరోహించుటకు ప్రయత్నించుచుండగా కాలు జారి  పడిపోవుచుండగా ఆమె తన చేతినిచ్చి పైకి లాగెను. వర్షుడు చంద్ర బింబము వంటి ఆమె మొఖంలోకి చూచెను. ఆమె చిరునవ్వు నవ్వెను , ఆమె నోటివెంట ముత్యాలు రాలుచుండెను. 

                                                                 ***  

 నాలుగు పుటలు చదివినంతనే నవనాడు లు క్రుంగుచున్నవి 545 పుటల పుస్తకము ఎట్లు రచించినాడో అనుకొనుచూ అగస్త్యుడు తన చేతిలో నున్న పుస్తకమును బల్లపైనుంచి, దీపము తీసివేసి తలుపు తీసుకొని బైటకు పోవుటకు మండువా గదిలోకి వచ్చినిలిచెను. సోఫాలో పడుకొన్న వర్షుడు స్వప్నమందు ఎవరికో మహా నందభరితుడై నమస్కరించుచుండెను. స్వప్నమందు ఏ కవి పుంగవుడో కనిపించి యుండును, విరహమనిన ఇతడికేమితెలియును! ఇతడి పుస్తకము చదవగా సగము మతి పోయెను ఇచ్చట నిలిచి ఈ రాత్రి ఇతడి వాలకం చూచినచో నా మతి పోవుట ఖాయము అని మండువా గది  తలుపు తీసి యుండుట చూసి ఇదెట్లు సాధ్యము " ఇదివరకు మూసియున్నట్లు చూచితినిగదా అని ఆశ్చర్యముతో ప్రాంగణములోకి వెడలెను.   

భవంతి  ముందర ప్రాంగణములో నడచుచూ  గోడలపై వ్రేళ్ళాడు చూ  తారలవలె మెరియుచున్న చిరు విద్యుత్ దీపములను చూచి ముచ్చట పడి  ప్రవేశద్వారమువద్ద తలలూపుచు న్న రాధామనోహరములను చూచెను. అచ్చట వెలుపల రహదారిపై ఆగియున్న కారులోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించగా కారు బయలుదేరెను. ఒక యంత్ర ద్విచక్రిక ఆ కారుని అనుసరించెను.  

ఎవరో స్త్రీ కారుదిగి  వచ్చుట  చూచి అగస్త్యుడు ఆమె వైపు  తేరిపారిచూచెను.  ఈమెను ఎచ్చటచూచితిని అని అనుకొనుచుండగా ఆమె ఆనందానిలయములోనికి ప్రవేశించుచుండెను. ఆమె వద్దకు పోయి మాటలాడుచుండగా స్వప్నము చెదిరిన వర్షుడు లేచి బయటకు వచ్చి అగస్త్యుని చూచెను.

ఆమె అగస్త్యుని బుగ్గలు పిండుచుండ అగస్త్యుడు నవ్వుచూ ఆమె చేతిలో పెట్టె అందుకొని  ఆమెను ఐదు  అంతస్తులు గల విడిది భనము లోనికి కొనిపోయెను. వర్షుడు మెల్లగా అతడిని అనుసరించెను.   అగస్త్యుడు   ఆమెను కొనిపోయి రెండవ అంతస్తు లో జానకి రఘువరన్ ల    గదిప్రక్క నున్న గదిలో నుంచి కొలది సేపు ఏదో మాట్లాడి మాట్లాడు చుండెను. వర్షుడు ఆ కిటికీ వద్ద నిలిచి అతడేమి మాట్లాడుచున్నదో వినుటకు ప్రయత్నించెను కానీ ప్రక్కనే  ఉన్నవేరొక గది  గాజు కిటికీ నుండి దీపపు కాంతి కానవచ్చెను. ఎవరో ఒక ఆడగొంతు గొణ గొణ  వినిపించుచుండెను.   అర్ధరాత్రి ఇంకనూ పడుకొనక లొడ లొడ వాగుచున్నదెవ్వరీమె అని అచ్చెరువందెను ఆమె మాటలు అతడి చెవిన పడుచుండెను.

“ ఆలాంటి బలిసిన బంగినిపల్లి ఇంట్లో పనికిరాని ములంకాడ ఉంటె పరాయి సొరకాయిని కోరుకోవడం సహజం. రంకు కి ప్రాచీన హొదా ఉంది. కొన్ని వెసులుబాటు క్లాజులు కూడా ఉన్నాయండో భర్త అభీష్టం తో పరాయి పురుషుడితో సంపర్కం తప్పు కాదు. కొన్ని గిరిజన తెగలలో స్త్రీ కొన్ని పండుగ దినములలో  నచ్చిన మగాడితో రమించవచ్చు. నాయర్ లలో అతిధి విచేసినపుడు ఆ గృహిణి విందు తో పాటు కోరుకుంటే పొందు కుడా ఇవ్వాలి అని విన్నాను. నా చిన్నపుడు మా ఇంటి పక్కన ఉన్న మా నాన్నగారి స్నేహితుడు వాళ్ళ బార్య అనారోగ్యంతో ఉన్నపుడు కాస్త వాడికి సహాయం చేయ్యు అన్న మా నాన్నగారి మాటని అమ్మ ఆయనకు బార్య అందుబాటులో లెదు అన్న మాటని కుడా మరిపించింది .ఇంట్లో సుఖం లేని ఆడది ఆ సుఖం కోసం చాటు మాటు వ్యవహారాలు నడపడం తప్పు కాదు.” ఆ స్త్రీ ఇంకనూ మాట్లాడు చుండెను. ఇది తెలిసిన గొంతువలె నున్నది అని వర్షుడు మెల్లగా కిటికీ రెక్క తెరచి చూసెను వలతి తన స్నేహితురాండ్రతో పేకాట ఆడుచూ  “ షో ఎట్లున్నది  డాక్టర్ వలతి ఫిలాసఫీ అని  పేకముక్కలు క్రింద పడవేసెను. వర్షుడు కిటికీ తలుపు మూసి ప్రక్కకు చూడగా అగస్త్యుడు చక చక మెట్లు దిగి ఆనందనిలయములోకి వెడలుచుండెను. వర్షుడు అగస్త్యుడు  కొత్తగా తీసుకువచ్చిన స్త్రీ   గదిలోకి పోవలెననుకొన్ననూ, అది సరియైన  సమయము కాదని వెనుకకు మరలుచుండెను అదే సమయములో పండిట్ అతడిని అనుసరించెను  

                                       ***

ఆనందానిలాయ ప్రాంగణమందు అగస్త్యుని ఆపి “అగస్త్యా నిజము చెప్పగలిగినచో నాదొక ప్రశ్న కలదు” ప్రశ్న ముగియకముందే  “సుందరిని చూచుటకు పోయి వచ్చుచున్నాను” అనెను అగస్త్యా వర్షుడు గొంతు రెట్టించెను బావా నీవు నన్ను అనుసరించుట నేను చూచితిని నిన్ను 

 ఆటపట్టించుటకు హాస్యమాడితిని. ఆ వచ్చినది మా అమ్మ  నేస్తము అంగయారు కన్నె చెన్నపట్టణము నుండి వచ్చు రైలు ఆలస్యముగా వచ్చుటచే ఇప్పుడు ఊడిపడినది. విడిది గృహమునందు గది చూపి వచ్చుచున్నాను.” అనెను. అంత వర్షుడు  “పెండ్లి కొడుకువి నీకెలా ఈ తిప్పలు నాకు చెప్పినచో నేను చూచుకొనెడివాడను కదా! అయిననూ బావ అని కొత్తవరస పట్టి తివే!   అగస్త్యుడు నవ్వి  “ఆడ పిల్లలని చెల్లిళ్లవలె చూచుచూ గుండెలపై నడిపించుచున్న నీవు నాకే కాదు పెళ్లికొడుకులందరికీ బావవే  కదా!” అనుచుండగా “మీ బావ - మరుదుల  బంధములు పక్కన పెట్టి ప్రమాదమును గ్రహించవలెను.” అనుచూ పండిట్ వారిని చేరెను. ముగ్గురూ మండువా గది లోపలి పోయి చకితులయ్యిరి.      

ఇచ్చట పడుకొనియుండిన నలుగురు అతిథులు ఏమైనారు ? అని అగస్త్యుడు  అడుగుటతో "మన ఇంట అతిధులు ఎచ్చట  కలరు ? అందరికీ  ప్రక్కనే ఉన్న విడిదింట బసచేయుటకు ఏర్పాట్లు జరుగుట చూచితివి కదా!"  అని వర్షుడు ఆశ్చర్యమును ప్రకటించెను.  వర్షునికి కాళ్ళ క్రింద భూమి కంపించెను. వారు అతిథులు కారు చోరులు. వారు వచ్చినది చౌర్యము కొరకు. నీ వద్ద ఉన్న స్టాక్ సర్టిఫికెట్ ఎచ్చట ఉన్నది ? అని వివేకుడు అడిగెను క్షణ కాలము వర్షుడు నివ్వెరపోయెను. సుడిగాలివలె  తన గదిలో కి పరుగు తీసెను. వివేకుడు అగస్త్యుడు అతడిననుసరించిరి. వారు  తాళము వేయబడిన సొరుగు పగలగొట్టబడి యుండుట చూసిరి.    నేను వాటాలు (షేర్స్ ) కొనుగోలు చేసినట్టు మీ కెట్లు తెలియును అని వివేక్ ను అడుగగా " అదేమీ పిచ్చి ప్రశ్న అని అగస్త్యుడు అనుచుండగా " శ్యామ్   మీకు అమ్మె  నని కూడా తెలియును , మీకు ఆయనకు మధ్య జరిగిన ఒప్పందం కూడా తెలియును." వివేకుడు ముగించగానే వర్షుని కళ్ళు తిరుగుచుండెను.    ఇప్పుడు అర్థమైనది ఇందాక కారు లోవచ్చినది శ్యామ్ అని అగస్త్యుడు గొంతు పెంచుచుండ వర్షుడు " ఉష్ అరచి గోలచేసి ఏమి ప్రయోజనము , అందరూ లేచి కలత చెందెదరు. 

 "ప్రాప్తమున్నచో పోయిన  షేర్స్ తిరిగి వచ్చును.  రేపు పెళ్లిళ్లు సవ్యముగా జరగిన చాలును. ఆ షేర్స్ దొరికినచో అగస్త్యుని సంస్థను అతడి చేతికి అప్పగించు అవకాశము కలుగును." అని వర్షుడు అనెను. షేర్స్ దొంగిలించిన మరల సర్టిఫికెట్ పొందవచ్చు. 1995 నుండి  ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా షేర్స్ అమ్ము పద్దతి ప్రవేశపెట్టబడెను. అని పండిట్ అనుచుండగా  అగస్త్యుడు " డి మేట్ అకౌంట్ ద్వారా ఇప్పటికీ  మామూలు (మాన్యువల్)గా అమ్ము పద్దితి కూడా కలదు. వర్షుడు " షేర్స్ పోయినచో  ముందు మనము చేయవలసినపని ఏమి ?"  అని వర్షుడు అడిగెను " కంపెనీ డైరెక్టర్లకు తెలపవలెను."అని పండిట్ అనగా , అగస్త్యుడు పక పక నవ్వసాగెను .

 వర్షుడు వివేకుడు కోపముగా అతడి వైపు చూడగా మూతికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వు ఆపుకొని అగస్త్యుడు " డైరెక్టర్లే  చోరులయినప్పుడు, వారికి చెప్పి ప్రయోజనమేమి?!" అనెను.  "అయిననూ పద్దతి ననుసరించక తప్పదు. రేపు నేను  న్యాయ నిపుణుడిని సంప్రదించి విషయము తేల్చెదను. ఈ లోగా మన జె షేర్ సర్టిఫికెట్ని, దొంగలను తప్పక పట్టుకొనును." అని వివేకుడు అనుచుండగా  పోలీస్జీప్ వచ్చి  ఆనందనిలయము ముందు నిలిచెను. ఇన్స్పెక్టర్  వివేకునితో   " మీ ఎయిడ్  జె  ని లారీ ఢీ  కొనుటచే మరణించెను, అతడి సెల్ఫోన్ లో ఆఖరి కాల్ మీకే చేసినాడు. అని తెలిపెను. జే మరణ వార్త తో పండితునికి పిడుగుపాటు కలిగెను. వివేకుడు ఇన్స్పెక్టర్తో మాటలాడుచుండగా వర్షుడు "బావగారు ఈ విషయము పెద్దలకు  స్త్రీలకు  తెలిసిన వారు కలత చెందెదరు కావున పెళ్లి ళ్లు జరుగువరకూ ఈ విషయములు చర్చించరాదు." అని వివేకుని అర్ధించగా వివేకుడు అంగీకరించి "నేను తెల్లవారాక మునుపే ఇచ్చట ఉందును." అని వివేకుడు ఇన్స్పెక్టర్ తో కలిసి ప్రమాదస్థలికి బయలుదేరెను.     

Friday, February 19, 2021

Bharatavarsha -132

భోజనములు ముగిసిన పిదప వచ్చిన అతిథులు సెలవు తీసుకొనుచూ  వెనుకకు మరలు చుండగా వర్షుడు “ప్రక్క భవనమందు పెళ్లివారికి విడిది ఏర్పాట్లు గావించబడినవి దూరముగా నున్న  హోటళ్లలో దిగినవారు కూడా ఈ రాత్రికిచ్చటే బసచేయవలెన”ని తెలిపెను. పెళ్లి బాజాలు అందిరి గుండెలలో మ్రోగుచున్నవి. ఎల్లెడలా ఉత్సాహపూరిత వాతావరణము నెలకొని ఆనంద నిలయములో తల్లుల హృదయములందు ఆనందము తాండవం చేయుచుండెను. బుచ్చమ్మగారు సర్రాజుగారు చందన బసవడు బయలుదేరుచూ వారిని సాగనంపుటకు వారిని అనుసరించు చున్న మాలినిగారితో  ప్రవేశద్వారం వద్ద  " రేపు కళ్యాణ మండపము వద్ద కలుసుకొందుము. " అనుచుండగా, బసవడు పార్వతిని క్రీగంట చూచుచూ బుచ్చమ్మగారిని ముద్దాడెను. పార్వతి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కినవి.   ఆమె కనులు బరువెక్కి వాలినవి. కృష్ణన్ గారు "బసవడి తెలివితేటలమోఘము  " అనుచూ అతడిని మెచ్చుకొనిరి. మీనాక్షి " ఈ తెలివి ఎప్పుడు నేర్చినావు? అనగా " ఆసుపత్రిలో నీ కొడుకువద్దే " అని బుచ్చెమ్మగారు అని  బదులు పలికినారు. నవ్వులు వెల్లి విరిసినవి. చంద్రమతి గారు పార్వతిని అక్కున జేర్చుకొనిరి. సర్రాజుగారి కుటుంబము బయలువెడలెను  

తరువాత పెంచలయ్యగారి కుటుంబము బయలుదేరుచుండెను. నందిని జరిగిన రభసకు చింతించుచూ వర్షునికి తన విచారమును తెలియజేయుచుండగా మాలినిగారు ఆమె నోరు మూసి "వివాహ వేడుకలకు నీ అలక వన్నెతెచ్చినది,"  అని నందినిని కౌగిలించుకొనిరి. అరుణ తార " మీ ఇరువురూ ఇట్లు మితముగా పోట్లాడుకొన్నచో హితముగానే యుండును." అని సంతోషముగా వారిని సాగనంపిరి. సందీపుడు మంజూష వైపు చూచి మందహాసము జేసి వర్షుని హత్తుకొనెను. వర్షుడు అతడి ఫాల భాగమున ముద్దిడెను . మంజూష పులకించి తల్లిని హత్తుకొనెను. పైడమ్మగారు కోడలి బుగ్గలు నిమిరుచుండగా విదిష నందిని చెవులో గుసగుసలాడుచుండెను. ఆమె మాటలు వినుచున్న నందిని కళ్ళు విప్పారినవి. 

 తులశమ్మగారు సుందరిని చంద్రమతి సుకన్యలు పార్వతి ని విడిది గృహములోకి కొనిపోయినారు. సుందరి వెడలు చుండగా అగస్త్యుడు తల్లివద్ద నిలిచి సుందరి వైపు  చూచుచుండెను. సుందరి  మీనాక్షి వైపు చూసెను. మనసునందు కూతూహలమున్ననూ  తల్లి వెనుకకుపోయి నిలిచెను. సుందరి వెనుకకు వచ్చి మీనాక్షి ముందు నిలిచెను. మీనాక్షి ఆమె కనులలో భావములు చదువుచూ కొద్దీ క్షణములు అట్లే నిలిచెను. మీనాక్షి పక్కకు తొలగగా  సుందరి  అగస్త్యులు ఎదురు బొదురు అయిపోయినారు. అనూహ్యమైన ఈ పరిణామమునకు సుందరి బెదిరి వెనుకకు తిరిగి  లేడిపిల్ల వలె తన తల్లి వద్దకు పోయి ఆమెను  కూడి  విడిది గృహమునకు పోయెను. 

రఘువరన్ జానకి గారు కూడా వారితో పాటుగా బయలుదేరినారు. లకుమ అత్త వద్దకు పోయెను. జానకి లకుమను ఎంతోగారము చేయగా "అత్తా చిన్నప్పుడు నన్నెప్పుడూ ఎత్తుకొని తిప్పెడిదానవు" అని లకుమగుర్తుచేసెను అప్పు డు  జానకి గారు " భుజములపై ఎత్తుకొని నేను గుండెలలో పెట్టుకొని అరుణ పెంచుకొన్న మీ అమ్మ నీ క్షేమము కొరకు ఎంత తల్లడినదో. నీ క్షేమము చూచుటకు అల్లుడిని అచ్చటకు పంపినది మీ అమ్మ, తల్లి ప్రేమ అర్ధమైనదా ! ఇకపై నిన్నెత్తు కొని తిప్పువాడు అల్లదిగో!"  అని వివేకుని చూపెను. లకుమ అత్తను కౌగిటచేరి కన్నీటి పర్యంతమయ్యెను . మధుబాల , నరేంద్ర  గారు వివేకుని కొనిపోవుచుండగా మధుబాల అరుణ వైపు చూసెను.   అరుణ తార  మధుబాల కలిసి క్రీగంట తమ బిడ్డలను చూచిరి . లకుమ వివేకులు నేత్రములతో సంభాషణ నెరుపుచుండ గా అది తెలుసుకొనుటకు వారు విఫల ప్రయత్నము చేయుచుండిరి.   మాలిని వారిని చేరి " ఇతరుల రహస్యములను ఛేదించు వృత్తి గలవాడి రహస్యములను నీవు ఛేదించ జాలవు, వారిని పోనిమ్ము  అని అరుణతో గుసగుసలాడెను.  నరేంద్ర గారు తన కుటుంబముతో బయలువెడలినారు. లకుమ తల్లి  కౌగిట చేరెను ఆమె నేత్రములార్ద్రము లాయెను. పిదప వర్షుడు లకుమను ఓదార్చెను  

అరుణ మాలిని వద్దకుచేరి ఆమెను కౌగిలించుకొనగా ఆమె కనుల నుండి  ఆనంద భాష్పములు  వర్షిచుచుండెను. మీనాక్షి వచ్చి ఆమె కన్నీరు తుడిచి  ఆమెను హత్తుకొనెను.  " మరి మేము హోటల్ కు పోయి బసచేసి రేపు కళ్యాణ మండపము వద్ద కలిసెదము " అని అరుణ అనుచుండగా మీనాక్షి కూడా అట్లే అనెను మాలిని వారిద్దరినీ రెక్కలు పట్టి మండువా గదిలోకి కొనిపోయి చుటూ ఉన్న ఆరు గదులు చూపుచూ "  ఇంత  ఇల్లు వున్నది ఉండుటకు కదా!”  అని నిగ్గ దీసెను.  మిగిలినవారు కూడా లోనికి ప్రవేశించి నారు.  

విదిష శేషాచలముగారు, మీనాక్షి యమున లు , అరుణ కృష్ణ లులకుమ వర్షులు సోఫాలపై కూర్చొనగామీనాక్షికి  నందిని పాట గుర్తుకువచ్చి ఆలాపన చేయుచుండెను. అరుణకు మీనాక్షి సంగీతము గుర్తుకువచ్చి " నీ పాటలందు అంత పడుచు ఊపు ఎట్లవచ్చె నో  అందరినీ ముంచెత్తి నావు కదా!"  అనెను, వర్షుడు " పాట లయందు ఊపు లతో రాష్టములెల్ల ఊగుచున్నవి." అనెను    యమున " అయ్యో అరుణమ్మ నీవు ఈమె పాటలయందు ఘాటు చూడలేదు నేన్ను చూపెదను అనుచూ కన్నడ ప్రేమ గీతములనుగుర్తు చేసెను. " మండువా గదిలో విద్యుత్ దీపములు నేత్రముల నలరించుచుండగా గాత్రము సంగీతము చెవులనలరించుచుండెను.  మాలిని  "వివాహమైన కొత్తలో నేనునూ వీణవాయించెడి దానను వర్షుడు నావద్ద వీణ నేర్చుకొనెను. మంజూషను గారము చేయుట వల్ల ఏమియూ నేర్చుకొనక లేక పోయెను. “ఏమీ నేర్చు కొనకుండుటేమి పెంకితనము , మంకుతనము  నేర్చినది.” అని విదిష అనగా మంజూష అలక నటించెను.  నావీణ వాదనము గాత్రము వారితోనే అంతరించింది. అని మాలిని వాపోవుచుండగా విదిష " అత్తా నీవు ఇప్పుడు కూడా తలచినచో  వీణ వాయించగలవు అని వాపోవుచున్న మాలినివద్ద వర్షుని వీణను పెట్టగా మాలిని తాకుటకు సయితము జంకుచుండెను . విదిష ఆమె తలపై చేయి వేసి నిమిరి ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూచి పాడమని సైగ చేసెను.  మాలిని వీణా వాదనము ప్రారంభించెను. పిదప అనూహ్యముగా గానము చేయసాగెను     

పుస్తక ధారిణి భాషా వాహినీ  శాంతిరూపిణీ కచ్ఛపి ధారిణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - అతులిత స్వర రాణీ  వీణా పాణి,  

అలసిన మనసును మురిపించు విరిబోణి అమరగాన మును అలరించుగీర్వాణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే  - 

మూలాధారిణి మంజుభాషిణీ  హంసవాహిని సూక్ష్మ రూపిణి –అతులిత  స్వరరాణీ వీణా పాణి

కోరి వేడుచూ కొలిచిన భక్తుని జ్ఞాన మార్గమున నడిపించు యోగిణి

నాదము నీవే,  వేదము నీవే,  వేదన బాపే భామిని నీవే  - 

యశో కారిణి ఆనందదాయిని వేద రూపిణి, కమల లోచని - అతులిత స్వరరాణీ వీణా పాణి

దుర్భోధ పీడిత దుర్లోక మూషిత నిర్దోష పురుషుల ముక్తి ప్రదాయిని

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - 

శుద్ధ స్ఫటిక రూపాయై ముక్తాలంకృత సర్వాంగ్యై నిష్కళాయై                                               

వాగ్మ్యై వరద హస్తాయై వరదాయై నమోనమః

దుర్బల మానస, ఉన్మాద పీడిత ఉన్మార్గ జీవుల కరుణించు మాలిని

నాదము నీవే, వేదము నీవే,  వేదన బాపే  భామిని నీవే - అతులిత  స్వర రాణీ

పాట  పూర్తి ఐన పిదప మాలినిని మగత ఆవరించి ఆమె వీణ పై అట్లే నిద్రించెను. ఆహా ఏమి వీణా వాదనము!  ఏమి గానము!  నందిని గానమును తలదన్నునట్లున్నది కదా ఎవరు రచించ ఈ గీతము నాలపించెనో కదా !! అని అందరూ సంభ్రమాశ్చర్యములను ప్రకటించిరి.  మా మా అమ్మ కేమాయెను ఇట్లేల సోలిపోయెను అని మంజూష అడుగుచుండగా విదిష " ఉదయమునుండి పనిలో తలములకలయిన పెద్దవారు అలసి సోలుటలో వింతయేమున్నది !  

ఆమెను కొలదీసేపు తాకరాదని చెప్పి విదిష శేషాచలము గారి తో విడిది ఇంటికి బయలుదేరెను. వారిని అగస్త్యుడు కేశవుడు సాగనంపి వచ్చుసరికి మాలిని నిద్రలేచి ఏమిజరిగినదని అడిగి తెలుసుకొని అచ్చెరువొందెను.  ఆటు పిమ్మట అరుణతారకు కృష్ణ కు ఒక గది యమునకు మీనాక్షికి ఒక గది ఇచ్చి మాలిని లకుమ మంజూషలను తన గదిలో కి తీసుకొని పోయెను. 


Sunday, February 14, 2021

Bharatavarsha -131

నందిని వాహనమెక్కి వెడలిపోవుటకు ప్రయత్నించుచుండగా మాలినిగారు తలుపు   తీసి  “నీవు వెళ్ళుటకు వీలులేద”ని నందిని క్రిందకు దింపి ఆమెచేయి పుచ్చుకొనెను. “అత్తయ్య నన్ను ఆపు హక్కు నీకు లేదు నన్ను వదులుము” అని నందిని  చేతిని విడిపించుకొనుచుండెను.   పార్వతి "ఆపు హక్కు ఎందుకులేదు? రోజూ అత్తా అని ఆమెన   ల్లుకొని ఆమె వెనుక తిరిగి హాస్యములాడు నీకు నేడిట్లు మాట్లాడు హక్కు కలదా !" అని నిగ్గ దీసెను. ఇందు  పురుషులెవ్వరూ కలుగజేసు కొన కుండుట అదృష్టము మని చెప్పవలెను. 

అరుణ మీనాక్షి, యమునా పార్వతి, మంజూష కారుచుట్టు చేరి చూచుచుండిరి. ఇంకనూ మరికొందరు కారువద్దకు మెల్లగా వచ్చుచుండిరి వర్షుడు చకితుడయ్యి దూరముగా నిలిచిపోయెను. విదిష ప్రక్కనే నిలిచి అతడి మొఖంలోకి చూచుచూ అతడి భావములను గ్రహించుచుండెను.  యమున మీనాక్షితో " మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు ....  మీనాక్షి " ఉష్ నీవు మాట్లాడరాదు"  

బుచ్చెమ్మగారు "వర్షుడు చేతిని వెనుకకు లాక్కొన్నందుకు కాదు అది చూసి విదిష నవ్వినందుకు ఎక్కువబాధ నంది ని  పడుచున్నది. విదిష ఎందుకమ్మా అట్లు నవ్వి కవ్వించితివి” అనిరి.  "అట్లయినచో విదిష వైపు చూచుచూ నందిని వర్షుని చేతిని గ్రహించుట, ముద్దాడుట కవ్వించుటయేకదా “అని తులసీగారు అనగా అరుణతార  ఢిల్లీ లో పాత అనుభవమును గుర్తు చేసిరి “ వీరిద్దరూ కలిసిన  ఇట్లే అగుచున్నది, ఢిల్లీ ఆంద్ర భవన మందు కూడా ఇట్లే జరిగినది.   మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ వలే నుండక ఇట్లు కలిహించుకొని పెద్దల మనసులను గాయ పరుచుచున్నారు. అని విదిష ఇట్లు రావమ్మా అని పిలచి నందిని  చేతిని విదిష చేతిని కలుపుటకు ప్రయత్నించగా విదిష చేతిని వెనుకకు లాక్కొనెను. నందిని మొఖం వివర్ణమాయెను. నందిని తలుపు తీసి వాహనము నధిరోహించెను.

 సందీపుడు కూడా చెల్లి ప్రక్కన కూర్చొనెను. అది చూసి మంజూష వెలవెల బోయెను. ఇంతలో పైడిమ్మ గారు వచ్చి సందీపుని దింపి నీ చెల్లి ఎడిత్తే నువ్వు సూడనేవు, మరి నా కోడలు ఏడిత్తే  నాను సూడగలనేటి బోయినాలకి నడవండి రేపు పెల్లె ట్టుకొని ఏటి ఇకటాలాడతన్నారేటి , కోపమొత్తే నాను మడిసిని కాను.   ఆ  గ్రామీణ భాష వెనుకనున్న ఆమె తియ్యని మనసు అందరినీ పులకరింపజేసినది.  మంజూష వచ్చి పైడమ్మపై వాలి కంట తడి పెట్టుకొనెను. నందిని కళ్ళు అశ్రుధారలు కురిపించుచుండగా చూసి, మంజూష "వదినా నామాట వినవూ !" నందిని "నాకు చెప్పుదానవయినావా !" అని కసురుకొనెను ఇంక ఈ గొడవ ఎట్లు ముగియునో ఎవ్వరికీ బోధపడకున్నది. ఇదిట్లుండగా యమున సలహాపై  బయటకు వెళ్లిన బసవడు అగస్త్యుడు  కీబోర్డు పట్టుకొచ్చినారు. వారు స్పీకర్లను, కీ బోర్డును అమర్చుచుండగా వర్షుడు నందిని వద్దకు పోయెను.  "సంస్కృతాంధ్రములందు పాండిత్యము, అపార సృజనాత్మక శక్తి నీ సొంతము.  నీ కర్దము కానిదేమున్నది. నీ గాన మాధుర్యమున కవి పండితులను ఓలలాడించిన నీవు ఇట్లు కిల్లి కజ్జములుఁ పెట్టుకొని నీ సంస్కృతమునకు, మన సంస్కృతికి కళంకము తెచ్చుచున్నావు నావల్ల తప్పు ఉన్నచో  క్షమించవలెను.   అని వర్షుడు అను చుండగా నందిని మెత్తబడిననూ కారు దిగకుండెను. 

మంజూష   "నేనెవరికీ చెప్పుదానను కాను ఎవ్వరికీ కావలసిన దానను కూడా కాను"  అని కన్నీరు పెట్టుచుండగా. లకుమ జంటగా వచ్చి కారు వద్దనున్న సమూహము లోనికి చొచ్చుకొని వచ్చెను.  పండిట్  మంజూషను చూచి ఇచ్చట ఏమి జరుగుచున్నది? అని అడిగెను. ఇచ్చట  ఆటలాడుచున్నారు అని కేశవుడు చెప్పెను. ఏమి ఆట లాడుచున్నారు ? అని పండిట్ కుతూహలంగా అడుగగా " ఈ ఆటను అలక అందురు , ఎక్కువగా ఈ ఆటను స్త్రీలు ఆడుచుందురు ." అని బసవడు చెప్పెను. వర్షుడివద్దనున్న విదిష చీరకొంగు బొడ్డున దోపి వడివడిగా అడుగులు వేయుచూ వాహనమును చేరి తలుపు తీసి నందినిని లాగి కౌగిట బంధించెను ముద్దులతో మొఖమును నింపు చుండగా పైడమ్మగారు సందీపుని దించి మంజూష వద్దకు కొనిపోయినారు.  


ఒక్కసారిగా  అనూహ్యమైన సంగీత  ఝరి  "టడ  టట్ట టడ.."  మ్రోగుచుండెను , అగస్త్యుని మీనాక్షి అమ్మ వలే కాక ఆకాశములో మెరుపువలె కనిపించుచుండెను. మీనాక్షి వేళ్ళు లయబద్ధముగా  నాట్యమాడుచుండ శబ్దములు సుడి గాలివలె రేగు చున్నవి. అచ్చట యున్న పెద్ద చిన్న అందరూ నాట్యము ప్రారంభించి, సంగీత లయననుసరించి అలలు వలే కదులు చుండిరి. విదిష నందినిలు ఒకరితో ఒకరు నాట్యము చేయుచుండ అరుణ కృష్ణన్ ఒకదరి చేరినారు. ఆనంద నిలయ ప్రాంగణమందు చెట్లు , కొమ్మలు , చిగురు  సైతము మైమరచి నర్తనమాడి అలసినవి. ఆ నాట్యమందు సర్వ శక్తులు హరణమాయి, క్లేదము నశించి స్వేదక్లేద చేలములందందరూ లఘుచిత్తము  నొందిరి. సుందరి అగస్త్యుడు మీనాక్షిని అల్లుకొని నిర్వికార నిర్యాణ మందిరి.  తైలము హరించి దీపము ప్రతిశాంతమయినట్లు సంగీత ప్రభంజనము భాధను హరించి క్రమేణా సమసి పోగా మనసులు ప్రశాంతత నొందినవి.  విదిష నందినులు ఒకరి చేతు లొకరు పట్టుకొని నిలిచినారు.  అందరిని ఆనంద భాష్పములు  ముంచెత్తినవి. భోజనములు మొదలయినవి. 

స్త్రీలందరూ వంటరిగా ఒక వరుస లో కూర్చొనగా వివాహితులు జంటలుగా కూర్చొనిరి, కృష్ణన్ , రఘువరన్ జానకి , బుచ్చెమ్మ సర్రాజుగారు ప్రక్క ప్రక్కనే కూర్చొనిరి  చంద్రమతి , సుకన్య మంజూష ప్రక్కన కూర్చొనగా మీనాక్షి యమున ప్రక్కన ప్రక్కన కూర్చొనిరి. మాలిని, అరుణ మీనాక్షిలు కూడా వడ్డన కు ఉపక్రమించినారు.    విదిష  నందినివర్షులను ప్రక్క  ప్రక్కన కూర్చొండబెట్టి వడ్డించుచూ  తిరుగుచుండ  మాలిని గారు   విదిష ను చూచి ముచ్చట పడి " కోడలన్న మా విదిష ,  బంగారము! " అని అనగా అరుణతార " నీకు ఉండబట్టకున్నది, ఇంతవరకు జరిగినది మరచినావా?” అనగా మాలినిగారు తప్పు  తెలుసుకొని నాలికకరుచుకొనట చూసిన వారికి నవ్వాగినది కాదు. దూరముగా వుండి వారి మాటలు వినిపించకుండుటచే నందిని వారందరితో శృతి కలిపి నవ్వసాగెను. 

బసవడు పార్వతివద్ద కూర్చొని భోజనము చేయవలెనని   ఉవ్విళ్ళూ రుచుండగా అరుణాతార  బసవని " నీవు ప్రాస మాత్రము కలిగిన   అర్థ రహితమగు కవిత చెప్పినచో పార్వతి ప్రక్కన నేను విస్తరి వేసి వడ్డించెదను అని  చెప్పగా బసవడు  కాబూలీవాడిని చూచినట్టు భ్రాంతి నొంది  " ప్రయత్నించెదను అని  మొదలు పెట్టెను.      

బండ గుండెల బలగ   జిలగారిపోవగా 

చెలఁగి రగిలెడి గుండె కొదడు మదడు

విప్ప లగలగ  లాగ చుట్ట చుట్టెది పట్ట,  

అట్టగట్టగ అడుగు  కొట్ట కొట్టగ పట్ట   ఎలుగెత్తి 

పలుగెత్తి పరిగెత్తి వంచి తుంచి పెంచి 

పంచి పోరా, వీరా, సూరా. 

ఇంత అర్థ రహితమగు కవితను మేమెచ్చటనూ వినలేదని అందరూ ద్రువీకరించగా  అందరి నవ్వులమధ్య వారిద్దరినీ  ఒక దరికి చేర్చి  అరుణ వడ్డించుచుండెను. “బసవడి  పక్కన కూర్చొన్న పార్వతి కనులు వాలినవి అని మీనాక్షి అనుచుండగా “నీ కొడుకు మాత్రము నీ కోడలి వంక దొంగ చూపులు  చూచుచుండెను” అని అరుణ మీనాక్షి దెప్పిపొడిచెను. మాలిని " " మీ అమ్మాయి సుందరి కూడా అగస్త్యుని అట్లే  చూచుచున్నది.” అని అగస్త్యుని  పక్షము వహించెను.

"నీ  కొడుకు అగస్త్యుడు కూడా అట్టి కవిత చెప్పినచో మా అమ్మాయి ప్రక్కన కూర్చొండబెట్టి  వడ్డించెదను"   అని అరుణ అని మీనాక్షితో అనుచుండగా, "అందరికీ కవిత్వము ఎట్లు వచ్చును? నీ అల్లుడు ఏమి కవితలు చెప్పినాడు?" అని అరుణను వేళాకోళము చేసెను. "షూటింగ్,  డైవింగ్ అనుచూ ఏమేమో చెప్పి మా మతులు పోగొట్టినాడు" అని మాలిని  గేలి చేయగా అందరూ నవ్వుచూ భోజనములు చేయసారిగి. 

అప్పుడు పండిట్ నేను కవితలు చెప్ప జాలను కానీ మీ అందరి కథలు చెప్పగలను  అని పండిట్ ఫ్రెంచ్ కిస్ ఎట్లున్నది వదినగారూ అని విదిష వైపు చూసెను.  ఫ్రెంచ్ కిస్ గూర్చి నాకేమి తెలియును?” అని విదిష అనగా పండిట్ “కానీ నాకు తెలియును ఇందాక వర్షుని సభ ముగియుచున్నది అని మీరు సభకి పిలిచినప్పుడు షూ అని ఒక  శబ్దము చేసినాడు కదా  అది పెరటిలో కలుసుకొనుటకు సంకేతము అని చెప్పుచుండగా వర్షునకు అలజడి మొదలయినది.  అందరూ ఆశ్చర్యముగా వర్షుని వైపు చూచుచుండగా పండిట్ “ ఆ పిదప వదినగారు  పోవుట బావ గారి పై వాలుట , ఎన్నో వర్షము కురిసిన  రాత్రులు  వదినగారి లేండ్ రోవర్ కారులో  పక్షులవలె విహరించుచూ చంద్రుని చూచుచూ.. వర్షునకు పొలమారినది, "ఇంక తినలేనని" లేచి పోవుచుండ అరుణ " వినలేనని  చెప్పరాదూ " అని చతురాస్త్రము సంధించెను.  విదిష కూడా అచ్చటనుండి జారు కొన్నది.

ఇవన్నియూ మీ కెట్లు తెలియును అని బసవడు  పండితు నడుగగా  అగస్త్యుడు “సూది కొరకు సోదికి పోయినచో పాత రంకు లన్నీ బయటపడును, నోరుమూసుకొనుట ఉత్తమము” అని బసవని మందలించెను.  వివేక్ నవ్వుచూ "నా సహాయకుడు మీలోనే , ఇచ్చటనే యున్నాడు." అనగా అందరూ నమ్మలేనట్లు నలుమూలలా చూచుచుండిరి. పండిత్ వేదిక వైపు చూపగా అందరూ తలతిప్పి అటు చూచినారు. “అచ్చటున్నది ఒక స్త్రీ కదా!” బసవడు అనగా వివేక్ " జే" అని పిలచినాడు. స్త్రీ వేషధారి అయిన జే వచ్చి ముందునిలచి క్షణములొ వేషమును తొలగించగా అందరూ నోళ్ళు తెరచి నారు. 

Friday, February 12, 2021

Bharatavarsha - 130

కళ్యాణ కాంతులను విరజిమ్ము ఆనందనిలయ ప్రాంగణమందు గల వేదిక పైనుండి వేదమంత్రములవలె కవితా ఘోష వినిపించు చుండెను.  వర్షుడు నందిని వేదికనెక్కగా మీనాక్షి , అరుణ , కేశవుడు క్రిందనుండి చూచుచుండిరి. సుమారు నూరుగురు ఆహుతులు వేదికవద్ద దిగువున వేసిన కుర్చీలపై కూర్చుని యుండిరి. వర్షుడు  తల్లికి సైగచేయగా మాలిని గారు  సిగ్గు పడుచున్న వారిని  వేదికపైకి నెట్టినారు.   అరుణతారకు ఆ కవి బృందము  మత్తేభ సమూహము వలె కనిపించ మీనాక్షికి వారి కవితా రవములు సంగీతమువలె వినిపించెను. సుబ్బన్న పంతులుగారు, వెంకటప్పయ్య గారు, శేషాద్రి శర్మగారు,  సీతమ్మగారు, అచ్చమాంబ గారు ఇట్లనేక కవి కవయిత్రుల యొక్క   భావ కవితా  వృష్టి యందు తడిసి  పరవసించిన ఆహూతులందరూ కరతాళ ధ్వనులు చేయుచుండిరి. ఆ హర్ష నాదముల మధ్య వర్షుడు సభకు విచ్చేసిన కవి పండితు లందరికీ ధన్యవాదములర్పించి సుబ్బన్న పంతులుగారికి గండ పెండేరము తొడుగుట కవులందరికీ దక్షిణ తాంబూల సత్కారమును ప్రకటించెను. 

శేషాచలముగారు, పెంచలయ్య పైడమ్మగార్లు సందీపుడు అప్పుడే వచ్చి చేరినారు.  వర్షుడు వ్రాసిన పద్యకావ్యము “మదన గోపాల మహిమ” పుస్తకములను సందీపుడు అచ్చటనున్న ఆహూతులందరికీ పంచ సాగెను. వర్షుడు వ్రాసి ముద్రణ కివ్వక వదిలి వేసిన అనేక చిన్న చిన్న రచనలను నందిని సొంతముగా ముద్రించెను అని పైడమ్మగారు మాలిని చెవిలో చెప్పుచుండగా నందిని తాను వ్రాసిన అనుష్టుబ్ చంద శ్లోకంతో సరస్వతిని కీర్తించి పిదప సుబ్బన్న పంతులుగారికి ప్రణామము లర్పించెను. There is a Youtube video (song) below this line but you can not see if you are in the mobile view mode. Please change it to web view option available under Home button. 


   సనాతనీ   విద్యామాతా సర్వశాస్త్ర   పరంజ్యోతి 

   జ్ఞానప్రదా   యనీదేవీ   వేదాగ్రణి    నమోస్తుతే

    సరస్వతీ పుత్రే కవివరేణ్యే అతులిత జ్ఞాన సంపన్నే

   దినేష సంకాశ ప్రకాశితే  సుబ్బన్నే ప్రణమామ్యహం

ఆమె గానమందు ఆహూతులందరు పారవశ్యమును పొందుచుండ  వేదికపై నున్న వర్షుడు , కేశవ మీనాక్షి , మాలిని తారలు అబ్బురంగా చూచుచుండిరి. పార్వతి, సుందరి రంజని , బుచ్చమ్మగారు వారి ప్రక్కగా మధుబాల నరేంద్ర పండితులు వారి ప్రక్కనే మంజూష నిలిచియుండిరి.  బసవడు కృష్ణన్ తులశమ్మగారు అగస్త్యుడు తదితరులు వేదిక వద్దకు చేరినారు. తల్లిని చూచుచూ అగస్త్యుడు మైమరచుచుండెను.  అకస్మాత్తుగా అతడి దృష్టి సుందరి పై పడెను. ముందునున్న సుందరి కూడా అగస్త్యను చూచినది. కనులు  కనులు కలసినవి.   అగస్త్యుడు మెల్లగా  కదలుచూ తననెవరూ  చూచుటలేదనుకొని సుందరిపక్కకు పోయి "నీ తీయని తలపులు నను నిలువ నీకున్నవి" అని   చేతి నందుకొని చూడగా అతడి చేతిలో  బుచ్చెమ్మగారి చెయ్యి ఉండటతో ముచ్చెమటలు పెట్టినవి.  ఆదృశ్యము  తార కంట పడి  మీనాక్షి చెవిన వేసెను.  వేదిక క్రింద అందరూ నవ్వుచుండిరి .  

చందన అందరికీ పానీయములు పలహారములు అందించుచూ ఇంటిలోనే ఉండెను.  విదిష మరికొందరు ఏర్పాట్లు చూచుచున్న స్త్రీలు,  కొద్దిమంది పేకాట రాయుళ్లగు పురుషులు మాత్రము ఇంటిలోనే ఉండిరి.  లకుమ ప్రియుడు తనకు దొరికిన బహుమతిని విడువక ప్రాంగణమందు ఒక మూల ముచ్చట్లాడుచుండెను. అందరికీ వేదిక పై గానము వినబడుచున్నది. సుందరి ఆసువుగా సంస్కృత శ్లోకములను సులువుగా సంధించు ఆహుతు లందరిపై పూలవాన కురిపించుచుడెను. 

 వేదికపైనున్న ప్రౌఢ కవులగు వర్షుడు, సుబ్బన్న పంతులుగారు కూడా ఆ గానమునకు     చూచి సంభ్రమాశ్చర్యములు పొందిరి.  వర్షుడు సుబ్బన్న పంతులుగారి కి దుశ్శాలువా కప్పి కాలికి గండ పెండేరమును తొడిగెను, కరతాళ ధ్వనులు మిన్నంటినవి.  వేదికపై నున్న కవులందరికీ దుశ్శాలువాలు కప్పి స్వర్ణ బహుమతులనొసగి ఆనందింపజేసెను.

నాటి రోజులలో , రాజులు కవులని ఆదరించెడివారని ప్రజాప్రభుత్వములు వచ్చిన పిదప కవులకు ఆదరణ కరువైనదని చెప్పుచూ  భాషాభిమానం గల వర్తకులు , జమీందారులు వైద్యులు వంటి అనేకులు ప్రభుత్వముకంటె ఎక్కువగా కవులను ఆదరించెడివారని తెలిపి ఒక దశాబ్దము తర్వాత అటువంటి ఆదరణ పొందితిమని కవులందరూ  చెప్పుచుండగా   మాలిని గారు మంజూషను తీసుకువచ్చి అతడి కాళ్లకు నమస్కరింప జేసిరి. పైడమ్మగారు సందీపుని కూడా తీసుకొచ్చి ఆమె  ప్రక్కనే నమస్కరింప జేసిరి.  

సుబ్బన్న పంతులుగారు "సుదినం సుదినం కళ్యాణం తవ సుదినం సుదినం భవతు మంగళం సుదినం సుదినం చిరంజీవి సౌభాగ్యవతి సుదినం సుదినం యశో వర్ణనం విజయీభవ సర్వత్రా సర్వదా , శతమానం భవతి సతాయు హ్  పురుష సతేంద్రియ ఆయుష్యే వేంద్రియ  ప్రతితిష్ఠతి. “  అని ఆశీర్వదించిన పిదప మదన గోపాల మహిమ పుస్తకము చేరగా సంతోషముతో వర్షుని  చూచుచూ

సరస కవిరాజ రసిక సురరాజ ఘనరాజ రాజ రాజ 
దోష  రాహిత్య, నిత్య సాహిత్య భోజ, మహిత సాహితీ మనో వల్లభా 
కీర్తి దుర్లభా, భక్తివిజయ జ్యేష్ఠ, విదిష శృంఖలిత శృంగార శ్రేష్ఠః
కృష్ణ క్రీడల దృష్టి ఘన కృష్టి మదన గోపాల కావ్య సృష్టి 
కలుగు భక్తి పుష్టి కురియు నీదు నీలాల మీద క్రిష్ణనీలాల వృష్టి. 

అని ఆశీర్వ దించినారు  “ప్రక్క భవనంలో భోజనములు ఏర్పాటు చేయబడినవి కవులందరూ భోజనము చేయవలెను.” అని భారత వర్ష వారిని భోజనములవద్దకు కొనిపోయి విడిచి తిరిగి వేదిక వద్దకు వచ్చెను. సందర్శకులు ఆహుతులు కూడా వెడలిన పిదప ఆనందానిలయములో కేవలము కుటుంబ సభ్యులు మిత్రులు మాత్రమే  మిగలగా  వారికి భజనములు ఇంటిలోనే వడ్డించుచున్నారు. 
తార మీనాక్షిలు ఇంకనూ వేదిక దిగక అచ్చటనే ఉండి మాలినిని వేదికపైకి లాగినారు. అరుణ మనసు ఆనందముతో గంతులు వేయుచుండ ఆమె నాట్యము చేయుచుండెను. మీనాక్షి కూడా ఆమెతో నాట్యము చేయుచుండెను.   నందిని రంజని కూడా వేదికపైకి ఎక్కి మాలిని గారిని నాట్యము చేయవలెనని పోరగా మాలిని గారు నాట్యము చేయుచూ చతికిల బడినారు. వర్షుడు విదిష తటాలున వేదిక నెక్కినారు. విదిష “అయ్యో అత్తయ్యా!” అని ఆమెను లేవనెత్తెను.  అరుణ తార మీనాక్షి నాట్యమాపి ఆమెకు ఊతమిచ్చిరి 

నందిని వర్షుని నాట్యము చేయవలెనని కోరగా విదిష వర్షుని ఒక ప్రక్కకు లాగి అతడి దగ్గరగా  నిలిచెను.  అరుణ తార , మీనాక్షి  నందిని సంస్కృత గానము నందు పారవశ్యమంది మరల పాడమని కోరిరి , మాలిని బుచ్చెమ్మగారు మంజూష , బసవ పార్వతులు  కూడా అట్లే  కోరగా  నందిని ప్రారంభించెను   
  
   మితభుద్ది ఏవం పరిమిత శుద్ధి,  ధనం పరితః పరి భ్రమణం నిత్యం                     
   నివసితి ఏవ బహు అల్ప ప్రపంచం కదాపి చేతతి  ప్రత్యక్ష  ప్రపంచం
   లేఖిక భుద్ది లోక ప్రసిద్ధి ఉదారబుద్ధి వాగ్దేవి బద్దం 
    సుశబ్ద శోభిత సుందర కోసం భారత వర్షం అనేకవర్ణం  
   రసిక రంజకం దుఃఖ భంజకం పండిత ప్రభవ కవితా తరంగం  
   పండిత పారంగత గీర్వాణ కావ్యం, కారు కృత కావ్యం వాణి సంభూతం 
   చారు సందేశం అమృత భాండం బహు దుఃఖ వారణం ఆనంద సాగరం
   భువనైక సుందర మాంగళ్య తోరణం భారత వర్షం సర్వతీ పుత్రం 
   సర్వతీ పుత్రం బహుజన మిత్రం సర్వతీ పుత్రం బహుజన మిత్రం

కవి సమ్మేళనమందు ఇంతవరకూ పాడి ఆపివేసిన నందిని.  వర్షుని ఆరాధనా పూర్వకముగా చూచుచూ  మరొక   రెండు శ్లోకములు చేర్చి…పాడుచుండగా అందరూ ఆశ్చర్యముగా చూచుచుండిరి.  

   కష్టాని క్లేశాని  నిర్భర  లోకం,  దుర్హిత దుష్కృత అవరోధక లోకం 
   అమీవ, కైటవ కాళిందివ లోకం తస్మిన్ లోకే సుక తాండవకృష్ణం.   
   భారత వర్షం తాండవ కృష్ణం తాండవ కృష్ణం కవితా తృష్ణం
   గీర్వాణ నిర్వాణ రాగ సంకీర్ణం…     యాస్యతి నందిని 
   నందనందనం నందనందనం మమ అదృష్టం

అని విదిషను చూచుచూ వర్షుని చేతినందుకొని ముద్దాడుచుండగా, లిప్తలో  వర్షుడు తన చేతిని విదిలించుకుని నందిని వైపు కోపముగా చూసేను అదే సమయములో విదిష నందినిని చూసి నవ్వెను. అనుకోని సంఘటనతో  హతాశు రాలయ్యెను. వర్షుడు అక్కడ నిలువ జాలక వేదిక దిగి విసవిసాపోయెను.  నందిని ఏడ్చుచూ కారువద్దకు పోయెను. " మాచెల్లి  మీకొరకు శ్రమించి  పుస్తకములను ముద్రణచేయించగా   ఆమెను కన్నీరు పెట్టించినారు.   నా చెల్లి కన్నీరు  కార్చిన మీ చెల్లి పెళ్లి ఎట్లగును? అని సందీపుడు చెల్లి వద్దకు పోవుచుండగా వర్షుడు శిలా ప్రతిమ వలె నిలిచిపోయెను. అరుణ తార మీనాక్షిలు అవాక్కయ్యిరి. 

Tuesday, February 9, 2021

పాఠకుల తో పెళ్లి సందడి

పాఠకుల తో పెళ్లి సందడి - ఒక డిబేట్  -వచ్చే శుక్రవారం వరకూ చర్చ కొన సాగుతుంది పాత్రల మీద కథ మీద, వారి  పెళ్లిళ్ల మీద మీ భావాలు వ్రాయండి.

Pic taken on 7th Feb Sunday at Kankipadu

మనసులో లోతుల్లో పాతుకుపోయి,  హృదయాన్ని హత్తుకుపోయి, మనిషిని మురిపించేది, మైమరిపించేది సాహిత్యం. మనుషులని కలిపేది పెళ్లి అయితే , మనసులని కలిపేది సాహిత్యం. భౌతికంగా కనిపించే మనిషిని నడిపించేది అభౌతికమైన మనసే. మనసులు కలవని పెళ్లి అభూతకల్పనలా మిగిలి పోతుంది. 

ఆడ మగ శరీరాలు కలయికవల్ల మాత్రమే కుటుంబం  ఏర్పడుతుంది అనుకోకూడదు,  మనసులు కలిసినప్పుడు కూడా  కుటుంబం ఏర్పడుతుంది.  అటువంటి కుటుంబమే ఈ భారతవర్ష  కుటుంబం. అందులో మీరు నేను కూడా ఉన్నాము. ఈ కుటుంబంలో జరుగుతున్న పెళ్లి సందడిలో పాల్గొని మీ ఆనందాన్ని పంచుకోండి. 

ఆడపెళ్ళి వారి తరపున కానీ , మగపెళ్ళివారి తరుపున కానీ మీరు పెళ్ళికి రావచ్చు నేను  ఆడపెళ్ళి వారి తరపున పెళ్ళిలో పాల్గొంటున్నాను . ఇంకా చెప్పాలంటే మా అమ్మాయిలకి పెళ్లి చేస్తున్నాననే భావన లో ఉన్నాను. పిల్లల మంచిచెడల గురించి మాట్లాడితే ఆనందం కలుగుతుంది కదా ? అందుకే ఈ చర్చ. ఇదిగోమనఅమ్మాయిలుకుడివైపు ఉన్నవారు నలుగురూ వధువులు.    

క్రిందన కామెంట్స్లో ఇచ్చిన ప్రశ్నలు, సమాధానాలు చూస్తూ చర్చలో పాల్గొనండి. మీరు ప్రశ్నలు కూడా అడగొచ్చు. సమాధానాలమీద మీ అభిప్రాయం వ్రాయచ్చు.   


Monday, February 8, 2021

Bharatavarsha 129

 వాహనములు ఆనందనిలయము చేరెను. మీనాక్షి అగస్త్య తులసమ్మ సుందరి ఒక వాహనమందు , బుచ్చెమ్మ , బసవ చందన  మరొక వాహనమందు ఆనందనిలయము చేరిరి.  కవి సమ్మేళనము జరుగు చుండెను. కవితా ఘోష్టి ఆహ్లాద కరంగా వినిపించు చుండెను. సుందరికి అగస్త్యునికి జంట కుదిరిన  శుభవార్త  బసవడు వర్షునకు  చరవాణిలో చెప్పగా  అతడి నుండి ఆ వార్త తెలుసుకొన్న అరుణతార మాలిని మహానంద భరితులై  ప్రవేశ ద్వారము వద్దే నిలిచి వారికొరకు ఎదురు చూచుచుండిరి. అరుణ తార మీనాక్షిని చూచి  " మీనాక్షి మొఖం మెరుగు పట్టిన బంగారము వలే కాంతు లీను చుండెను.” అనెను మాలిని “ కగ్గిన ఇత్తడి వలే నుండెడి మీనా మెరుగు పట్టిన పుత్తడి వలె ఎట్లు మెరియుచున్నదో. అని ఆట పట్టించుచుండగా, అప్పుడే వర్షుడు, కేశవ   పార్వతి వచ్చినారు.  నందిని వలతి విదిష కవిసమ్మేళనం లో నిమగ్ను లయ్యిరి.  మీనాక్షికి ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. తులసి గారు " ఆసుపత్రిలో మొదలు పెట్టిన నవ్వు అట్లే మా వియ్యపురాలి మొఖమున నిలచిపోయినది" అని  చెప్పుచుండగా. యమున భయపడి మీనాక్షి జెబ్బపై గిల్లెను. అయిననూ మీనాక్షి నవ్వు ఆగకుండెను . అది గమనించిన మాలిని యమునను ఒక్క మొట్టిక్కాయ వేసినది. ఆమె నవ్వుటకు కూడా వీలులేదా? మొరటు మొగుడి వలే సాధించుచున్నావు" అని కసిరెను. అగస్త్యుడు సుందరి ఒకరికొకరు సైగలు చేసుకొనుచుండిరి.    అది  గమనించిన అరుణతార " ఏ మా సైగలు” అని సుందరిని నిగ్గ దీయగా “లేదమ్మా ఆయన ఎదో మాట్లాడవలెనని...”  సుందరి నసుగు చుండెను.   అరుణతార  “ఈ రాత్రి  సుందరి వైపు చూచుటకు కూడా వీలులేదు. ఇంకనూ సుందరి నీ భార్య కాలేదు " అని కోపము నటించగా,   మాలిని అగస్త్యుని దగ్గరకు తీసుకొని    నీకేమి తెలుసునమ్మ నా బిడ్డ ప్రాణములకు తెగించి ఆ రాత్రి  మోటారు సైకిల్ మీదవందల  మైళ్ళు పోయి, తన ప్రాణమిచ్చి ఈ పిల్లను తెచ్చుకొనెను. ఆ రాత్రి  రెండిళ్లకు  నిద్ర లేకుండెను అని అగస్త్యను  ముద్దాడెను. ఆనాడే ఈ పిల్ల అతడి భార్య అయినది . 


మీనాక్షి మొఖం నందు చిరునవ్వు నిలిచిపోయెను. ఆ చిరునవ్వు పేరే సుందరి.  మీనాక్షి సుందరిని దగ్గరకు తీసుకొని మురియుచుండెను.  వెనుకానిలచిన బుచ్చెమ్మ గారు, “ఇంక లోపలకి పదర్రా వచ్చువారికి దారి వదలక ఏమీ సయ్యాటలు అని అందరినీ అదిలించినారు. అతివలందరు దారివిడిచినారు. అప్పుడే చంద్రమతి, చక్రవంతుడు , సుకన్య వచ్చుచుండిరి. ఆడవారందరూ వారిని తోడ్కొని లోనికి పోయినారు. మగవారు ప్రవేశ ద్వారము వద్ద నిలిచి యుండగా పండిట్, తల్లి తండ్రులతో వచ్చుచుండెను. లకుమ ఎచ్చట కలదు?  వర్షుడు అడిగెను " మండువా గదిలో తండ్రి ని విడువక అంటిపెట్టుకొని యన్నది.” అని కేశవుడనెను.  


 ఆమె ఎంత కోల్పోయెనో కదా అని వర్షుడు విచారము వ్యక్తము చేసి “ ఇతడే లకుమ వరుడు, వీరు ఇతడి తల్లి తండ్రులు   వీరిని లోపలకి తీసుకు పోవుచున్నప్పుడు లకుమ చూడరాదు పోయి అరుణమ్మను , మాఅమ్మను పిలుచుకు రమ్ము, అట్లే ఒక పంచెల చాపు కూడా తీసుకు రమ్ము అని కేశవునకు చెప్పగా కేశవుడు లోపలకు పోయెను.

విశాలమైన మండువా నిండుగా స్త్రీలు కూర్చొని యుండగా వారి సంభాషణల జుమ్ముటీగలవలె ధ్వనించు చూ ఆ పెద్ద గది అంతయూ ముసురు కొనెను. రంగు రంగుల పట్టు చీరలు, కళ్ళు మిరిమిట్లు గొలుపు చుండెను. మీనాక్షి, యమున అరుణ , మాలిని తులసి  ఒకే సోఫా పై కూర్చొని  మేఘములలో తేలాడుచుండిరి. యమున ప్రౌఢ కాకున్ననూ మీనాక్షి శరీరములో అంతర్భాగమగుటచే ఆమెకు కూడా ఆ గౌరవమే దక్కుచున్నది. 

మాలిని మీనాక్షితో  " ఆమ్మో! నీ కొడుకు ఎంత గ్రంథసాంగుడమ్మా! వైద్యము ముగిసిననూ ఆశుపత్రిలో ఉండి ఎంతనాటక మాడినాడు" మీనాక్షి మాలిని వైపు చురుకుగా చూసి "నాకొడుకు నాడిపోసుకొనుచున్నావు కానీ,  నీ కొడుకే గ్రంథసాంగుడమ్మా, ఈ నాటకమంతటికీ రచన దర్శకత్వము నీ కొడుకే. డాక్టరుని వప్పించి,  నాకొడుక్కి మప్పినాడు.   అన్ని చేసిననూ నీ కొడుకు ఎమెరుగని సదాచారివలె కనిపించును.  నా కొడుకు అమాయకుడు కనుక దొరికి పోవును.”అని మీనాక్షి నిట్టూర్చెను. అప్పుడు తులసమ్మ గారు మీనాక్షితో  " అవును నీ కొడుకు ఎంత అమాయకుడో, ఆసుపత్రిలో గదిలోకి పోగానే నాకూతురి పైట లాగినాడు." అట్లు వారు సరస సంభాషణలో ములిగి తేలుచుండగా  కేశవుడు "అరుణమ్మా , బంధువులు వచ్చినారు”  అని అరిచెను. వారికోసమే ఎదురు చూచుచున్న అరుణకు లకుమ అత్తమామలు నరేంద్ర పండిట్ వారి సతీమణి మధుబాల వచ్చినారని అర్ధము చేసుకొనుటకు సమయము పట్టలేదు. అరుణ లేచి లకుమవైపు చూసెను.  ఆమె తండ్రితో కూర్చొని ముచ్చటలాడుట చూసి ఆమె నేత్రములార్ద్ర మాయెను. అరుణ మాలిని మీనాక్షి యమున తరలి వచ్చి పండిట్ను అతడి తల్లి తండ్రులను  సాదరముగా లోనికి తోడ్కొని పోవుచుండిరి. 

ఇంతలో భారత వర్ష అరుణ వద్దకు వచ్చి అరుణమ్మ చెవిలో ఎదో గుసగుసలాడు చుండగా  మాలిని అతడివైపు  చూసి ఇంక చాలింపుము నాయినా అని కోపముగా అనెను. అప్పుడు కేశవుడు చాలింపుము అనుచున్నావా   ఇంకనూ నయము తాలింపు అనలేదు, వంట మొదలు పెట్టనిదే" అని హాస్యమాడెను.  “హాస్యము లేని వివాహమా!  క్రీడలు లేని శృంగారమా! పాపము శమించుగాక!” అని వర్షుడు “పండిట్ వచ్చినట్టు లకుమకు తెలపరాదని అందరికీ తెలిపెను. 

 అరుణ "అది నాన్న తో అచ్చటనే కూర్చొని యున్నది రహస్యముగా ఎట్లు కొనిపోగలము?” అని అడిగెను.  వర్షుడు నవ్వి ఇట్లు అని ఒక పంచెల చాపు ఒక కొస తన చేతిలో పట్టుకొని మరొక కొస కేశవు నకిచ్చి పండిట్ కు అడ్డుగా తెరవలె పట్టుకొని లోపలకు తీసుకుపోవుచుండిరి. ఇది యేమని నరేంద్రుడు ప్రశ్నించగా ఇది దక్షిణాది ఆచారమని వర్షుడు చెప్పెను. మధుబాలగారు “దక్షిణాది వివాహ సంప్రదాయములు చాలా ఆశక్తి కరముగానున్నవి అనిరి” “ఇచ్చట ఆటలు ఇంకనూ ఆశక్తి కరముగా నుండును.” అని వర్షుడను చుండగా “మమ్మందరినీ ఆడించెదరా లేక మా అబ్బాయినే ఆడించెదరా?” అని అడుగుచున్న లకుమ మామగారిని చూచి మాలిని, అరుణకు నవ్వాపుకొనుటకు కష్టమయ్యెను.    అట్లు లకుమ వరుని , అతడి తల్లి దండ్రులను తీసుకుపోయి మగవారి గదిలో కూర్చోండ బెట్టి నారు. అచ్చట పెక్కు మగ వారిమధ్య పచాకో కూడా యుండెను.  అతడు పండిట్ను పలకరించి వద్దకు వచ్చి కరచాలనం చేసెను. వారిరువురూ మాట్లాడుకొనుచుండగా, వర్షుడు అతడి తల్లి తండ్రులతో “మీరు స్నానమాచరించదలచుకొన్న స్నానముల గది అదిగో అని చూపి కొత్త పట్టు బట్టలు కట్టుకొనమ”ని చెప్పెను. ఇంతలో బసవడు అగస్త్యుడు , ఆ గదిలోకి ప్రవేశించగా వర్షుడు వారికి  కూడా తన పథకమును చెవిలో తెలిపెను. బసవడి మొఖం దివిటీ వలే వెలిగెను. అతడు మండువా గదిలోకి పోయి కొలది సేపు ఆగి లకుమను వివాహమాడుటకు వరుడు తల్లి తండ్రులతో వచ్చి యున్నాడని అరుణ తారకు చెప్పవలెను.  

                                                                         ***

బసవడు స్త్రీలు కూర్చొన్న మండువా గదిలోకి పోయెను.  విదిష అప్పుడే అచ్చటికి వచ్చి కవి సమ్మేళనము కొలది సేపటిలో ముగియును పిదప భోజనములు కలవని వర్షుని ఇతరులను రావలెనని ప్రకటించెను.  షూ అని కూసి వర్షుడు పురుషుల గదిలోనుండి “అట్లే” అని సమాధానమిచ్చెను.  సోఫాపై మీనాక్షి సుందరి యమున, అరుణ, మాలిని కూర్చొనగా వారి పాదములవద్ద తివాచి పై చంద్రమతి,సుకన్యా కూర్చొనగా వారి మధ్యలో పార్వతి కూర్చొనెను. కొలది దూరములో కుర్చీ లపై  మంజూష,  వలతి బుచ్చెమ్మ గారు , జానకి గారు , కూర్చొని యుండిరి. చందన అందరికీ పానీయములు పలహారములు అందించుచుండెను. 
పండిట్ తల్లి దండ్రులు తయారగుటకు కొలది సమయము పట్టును కావున కొలది సేపు వేచి యుండి అరుణతారను కుటుంబముతో వచ్చి వరుని చూడవలెనని వారి తల్లి తండ్రులతో మాట్లాడవలెనని పిలచుటకై కాలయాపన చేయుచూ బసవడు పార్వతివైపు చూచు చుండెను.
 
పార్వతిని బసవడికి ఇచ్చి చేసెదనని మాటిచ్చి నిలుపుకొనకుండుటను బుచ్చెమ్మగారు చంద్రమతి ని   తప్పు పెట్టిరి.  చంద్రమతి “ఆ గౌడ సోదరులు మావూరికి పట్టిన దరిద్రము, వారికి జడిసి మేము అట్లు జేసినాము. మా గ్రామమునకు పట్టిన దుష్ట గ్రహ సంహారము జరిగెను. పట్ట పగలే ప్రజలందరూ చూచుచుండగా సింహము ఆ దుష్టులను సంహరించెను. ఆ జగన్మాతే వచ్చి ఆ దుర్మార్గులను సంహరించెనని, సింహము గ్రామము లోనికి వచ్చుట ఏ అందుకు తార్కాణమని ఊరు ఊరంతయూ నమ్ముచున్నది.  ఈ వింత వార్త టీ వీ లలో హోరెత్తుచున్నది” అని చెప్పగా సుకన్య “అచ్చట ఇప్పుడు దుర్గామాత ఆలయ నిర్మాణమునకు సన్నాహాలు జరుగుచున్నవి. మీరు టి వీ చూచుటలేదా?” “టీ వీ చూచు తీరుబాటెక్కడున్నదమ్మా ఈ పెళ్లి ఇంట” అని మాలిని గారు బదులు పలికినారు.  

ఊరి ప్రజలందరికీ సింహమొక్కటే కనిపించెను కానీ నాకు సింహము పై వచ్చిన దుర్గ మొహము కూడా కనిపించెను. విదిష అచ్చటనుండి వెడలు చుండెను సుందరి విదిష వద్దకు పోయి ఆమె పాదములకు ప్రణమిల్లెను. విదిష ఆమెను ఆశీర్వదించి అచ్చటనుండి భోజనములు ఏర్పాట్లు చూచుటకు వెడలెను. 

మాలినిగారు అరుణ తారకు “బసవడు పార్వతిని తదేకముగా చూచుచున్నాడ” ని చెప్పగా అరుణతార పార్వతి మొఖం పై తన పైట చెంగు కప్పి బసవడి వైపు కొంటెగా చూచెను. బసవడు బిక్క మొఖం వేసెను. స్త్రీలందరూ నవ్వు చుండగా   బసవడి వద్దకు కేశవుడు చేరి " మన తంత్రము మనపైనే ప్రయోగించుచున్నారు " అని గట్టిగా చెప్పగా వారిరువురూ నవ్వులపాలు అయ్యినారు .   వలతి పార్వతి వద్దకు చేరి “పిల్లవైపు చూడవలెనన్ననీవు ఒక ఆసుకవిత చెప్పినచో నేను (పార్వతి) ముసుగు తీసెదను” అని బసవని కవ్వించగా “అదెంత పని అనుచూ  సందర్భోచితముగా

వెచ్చగ వచ్చిన విచ్చని మొగ్గను 
మెచ్చని కాంతలు కాంతుడు కాంచిన 
ఓర్చని భామల కొచ్చెను పొచ్చము 
పైయెద మాటున నవ్విన సవ్వడి చేసిన చాలును. 

అని అని బసవడు చెప్పుచుండగా వలతి కొద్ది క్షణములు  పార్వతి ముసుగు తొలగించి మరలా మూసివేసెను. బసవడు మ్రాన్పడెను. చూచితివా స్త్రీల తెలివి అని కేశవునితో అనెను. పార్వతి గలగలా నవ్వుచుండెను. అది విని బసవడు మురియుచుండెను.  అరుణ తార “కవిత ద్వారా సందేశము లివ్వకుండా కవిత చెప్పవలెను, అసలు అర్ధరహితమగు ప్రాస సహితమగు కవిత చెప్పినచో  పార్వతికి నీకు పక్కపక్కన భోజనములు నేను వడ్డించెదను. అని అనగా తప్పక చెప్పెదను, కానీ లకుమ కొరకు పెళ్లి కుమారుడు తల్లి తండ్రులతో విచ్చేసి యున్నాడు, మీరొక సారి పోయి వారితో మాట్లాడి రావలెనని నా వంటి శ్రేయోభిలాషుల కోరిక.   అని చెప్పగా లకుమ నాకు పెళ్లి వద్దు నేను పెళ్లి చేసుకొనను అని చెప్పెను. 
కృష్ణన్" పెళ్లి చేసుకొన్నచో నీ జీవితమునకు శాంతము చేకూరునమ్మా  నామాట విని పెండ్లి చేసికొనుము. అని చెప్పినారు " ఒక్కసారి నీవు పోయి చూసినచో నీకు నచ్చునేమో అని అప్పుడే అచ్చటికి వచ్చిన వర్షుడు, నందిని , కూడా నచ్చచెప్పిరి.  వలతి  కూడా పెళ్లి చేసుకొనుటయే ఉత్తమమని చెప్పెను. లకుమకు కోపమావహించెను. నేను చేసుకోనని ఇదియే ఆఖరు సారి చెప్పుచున్నాను , నన్ను విడువవలెను అనెను. 
నీ మనసులో ఉన్న వ్యక్తి పండిట్ వచ్చినచో చేసుకొందువా అని వర్షుడు అడిగెను . లకుమ మొఖం ఎర్రబారెను. అడిగినది నీవు కానిచో మూతి పై గుద్దెడి దానను.మూతిపై కొట్టుట చెంప కొట్టుట ఇట్లు చేసిన నిన్ను పండిట్ పెళ్ళాడునా ?  పెళ్లాడిననూ ఆ పెళ్లి నిలుచునా ? అని నీ కోపము తగ్గించుకొనుటకైననూ పోయి చూచి రావలెను అని వర్షుడు మరింత ముందుకి పోయెను . ఆ మాటలు లకుమను ఆపివేసినవి " సరే పోయి ఒక్క సారి చూసి ఒక్క నిమిషములో వచ్చెదను , మరల నన్ను పొమ్మని అనరాదు అని లకుమ అనెను . అట్లే నీవునూ ఒక్క నిమిషము మించి గదిలో ఉండరాదు అని నందిని అనెను.  లకుమ సరే అనగా ప్రౌఢలందరూ నవ్వుచుండిరి .  వర్షుడు “ అరుణమ్మ లకుమ ఒక్క నిమిషము మించి గది లో యున్నచో నీదే భాద్యత”  అనెను .  అరుణ " అది నాభాద్యత ఎట్లగును " అని తల్లి అనుచుండగా లకుమ తల్లికి భరోసా ఇచ్చి వెడలెను. మండువా గదిలో అంతా సూది పడిన వినిపించు నిశ్శబ్దము, ఉత్కంఠ నెలకొనెను.

లకుమ తలుపువద్ద నుండి ఒక సారి లోపలకి చూచి వెనుకకు తెరిగెను విశాలమైన కాంతివంతమైన గదిలో ఆది శేషుని పై శ్రీ మహావిష్ణువు వలే ఆజానుబాహుడైన పండిట్ తల క్రింద చేతి నుంచుకొని ధవళ వస్త్రముల కాంతులీనుచూ సోఫాలో పడుకొని యుండెను. లకుమ అతడి భంగిమ చూచి దిగ్భ్రాంతి చెంది ముందుకు పోవలెనో వెనుకకు పోవలెనో తెలియక ముందు కొకడుగు వెనుకకి ఒక అడుగు వేయుచుండగా మండువా గది అంతయూ నవ్వులతో నిడిపోయెను. అరుణతార కన్నుల నుండి  ఆనందభాష్పములు రాలు చుండెను. లకుమ సందేహమునకు తెర దించుచూ పండిట్ లకుమ చేతిని అందుకొని లోపలి లాగి తలుపు వేసెను. లకుమ పండిట్ ను అల్లుకొనెను. లకుమ ఓడిపోయినది, వోడి పోయినది అని  అమ్మలక్కలు అనుచుండిరి.  మాలిని తారకు మిఠాయి తినిపించు చుండగా, యమున మీనాక్షికి మిఠాయి తినిపించుచుండెను.  కేశవుడు బసవడు పోయి తలుపు కొట్టి నారు లకుమ బైటకు వచ్చి తల్లి ఎదపై వాలి అమ్మా. నేను మరల ఓడితిని, " నీవు మరల గెలిచితివి అని అరుణ కూతురిని బుగ్గలు నిమిరి గారం చేసెను . నేను పండిట్ ను పెళ్లి చేసికొందును. అని లకుమ చెప్పుచుండగా బాగున్నావమ్మా నీ కూతురి రాగాలు  నీ  గారాలు , వరుని మేము కూడా చూడవలెను వర్షుడు పరీక్షించవలెను , పిదప ఆ పరీక్ష నందు పండితుడు వివేకముతో నెగ్గినచో  అప్పుడు పెళ్లి. అని బసవడు అనుచుండగా లకుమ మిక్కిలి కలవర పడెను. అది చూచి నా అల్లుడుకి పరీక్షలు వలదు అతడు ఇక్కడివాడు కాదు 
అని అనగా  బసవడికి తిక్కరేగి " బల్లిపాడు నందు నాకు  పరీక్షలు ఎట్లు  పెట్టినావమ్మ అను చుండగా అరుణ తార డంగయ్యెను. ఒప్పుకొనక తప్పలేదు , అంతలో పచాకో వచ్చి  కుర్రవాడు నేరపరిశోధనలో, గుట్లు రట్టు చేయుటలో దిట్ట. రైఫిల్ షూటింగ్ , డ్రైవింగ్ , కంప్యూటర్ హెకింగ్ బాగుగా చేయును , పరీక్షించి చూడవలెను అనుచుండగా " డబల్ బారెల్ సింగల్ బారెల్,  బోల్ట్ రైఫిల్, ఎయిర్ పిస్తోల్ , ఆటోమాటిక్ , సెమి ఆటోమేటిక్ , ఎస్సాల్ట్ రైఫిల్స్ ఎని రేంజ్ ఐ యాం రెడీ.” అను చుండగా మా మున్నా గత సంవత్సరము నేషనల్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ అని మధుబాలగారు చెప్పుచుండగా ఇదెక్కడి మేళమురా బాబు అని అగస్త్యుడు కేశవుడు తలపట్టుకొనిరి. ఆ దృశ్యము చూసి అందరూ ఒకటే నవ్వు  " నీ అల్లుడు చూడుమమ్మా.. ” అని మాలిని పగల బడి నవ్వసాగెను. నందిని " అయ్యా పండిట్ గారు తమకి ఛందస్సు వచ్చా . అనుష్టూప్   ఛందస్సు దానిపై పరీక్ష , అనగా  “ఎస్,  ష్టూపింగ్  , నాకు తెలియును అనగా డైవింగ్ లో వంగుట,   మైనస్ ఫైవ్ డిగ్రీస్ నుండి 10 డిగ్రీస్ వరకు వంగవలెను దీనిని ఆప్టిమల్ యాంగిల్ ఆఫ్ రిలీస్ అందురు దీనివలన… అని చెప్పుకు పోవుచుండగా బుచ్చెమ్మగారు అవాక్కయ్యిరి  “మా బసవడు కంటే నాసిగా నున్నది నీ అల్లుడివరస. పద్యములు వ్రాయుట నేర్చుకొనలేదా మీ పిల్లవాడు అని మధుబాలను అడగగా ఆమె ముఖము తిప్పుకొన్నది. అరుణ మూతి మూడు వంకలు తిప్పినది. 
 బసవడు “ లకుమ గూర్చి ఒక  ఆశుకవిత  చెప్పిన అది చాలును అని చివరి అవకాశమునిచ్చినారు. వర్షుడు పండిట్ను ప్రాంగణము లోకి కొనిపోగా మగవారంతా అతడిని అనుసరించిరి , తరువాత ప్రౌడలు కూడా అతడిననుసరించిరి లకుమ వంగి వంగి కిటికీలోంచి తన లేడికళ్ళను తప తప  లాడించుచూ  పండిట్ను చూచుచుండెను. తన ప్రియుడి కొరకు లకుమ ఎట్లు చూచుచున్నదో అని అందరూ లకుమవైపు చూచుచూ వినోదించుచుండగా, పండిట్ ఆశుకవిత కూడా చెప్పలేకపోవుటచే ఏదైననూ ఒక చిన్న పొడుపు కథ చెప్పమని మీనాక్షి అడిగెను.  అదియునూ చెప్పజాలక పండిట్ అలిగి వెడలిపోవుచుంచుండెను. లకుమ మిక్కిలి ఆందోళన చెంది పండిట్ కొరకు బయటకు వచ్చుచుండగా వర్షుడు పండిట్ వెనుక పరుగు పరుగున పోయి గెడ్డము పట్టుకొని “ రావయ్యా పండితా ఎచ్చటికి పోవుచున్నావు , నీ అంత  ఘనుని పోనిత్తుమా !  అఖిల భారతమందు నీ అంత పరిశోధకుడు లేడని అంతర్జాలమందు , పత్రికలలో చదివి  నీవెంత ఘనుడవో తెలుసుకొంటిమి , నీకు తగిన చిన్నది మా చెల్లాయి, నీ పై తలమునకలగు ప్రేమతో,  తన ప్రాణములన్నీ నీపైనే పెట్టుకొని కళ్ళల్లో వత్తులు వేసుకొని నీకొరకు ఎదురుచూసినది, నీవు లేనిచో జీవితమే నిస్సారమని తలచినది.   ఆమెను వదులు కొందువా!  మీరు ఇరువురూ ప్రక్క ప్రక్కన నిలచినచో మా మనసులలో ఇంద్రధనస్సు వెల్లి విరియను.  మీరు ఇరువురూ మాట్లాడుకొన్నచో మహతి (నారదుని వీణ) నాదము మాహృదయములలో మ్రోగున”ని బ్రతిమాలుచుండగా మరి మమ్మీరువరినీ  మాట్లాడుకోనిత్తురా అని అడిగెను. అలిగిన పిల్లవాడు మిఠాయి అడిగినట్లనిపించి నవ్వు వచ్చిననూ నవ్వినచో ప్రమాదమని “కోపము వీడి అందాలరాశి అయిన తన చెల్లి చేతినందుకొనవలెనని   గానము చేయసాగెను ఆ గాన మాధుర్యమున కు సాహితీ సభ స్థంభించెను. కవులందరూ అతడి గానమునాలకించుచుండిరి. 

నీరంధ్ర కురులతో నిలిచె మా లక్ష్మి
చంద్రికలు మోములో దొరలు మా లక్ష్మి
సూరి సూరుని భవ భావముల రశ్మి
ఇంద్రనీలాల కనుల బులిపించు లక్ష్మి 
పండిత వాసముల నడయాడ లక్ష్మి
అరిపాదములకు మకిల మంటకుండ
నడిపింతురు అన్నలందరు అరచేతలంట.
అటులే నడిపించవయ్యా ఈ శుభాంగి ఇక నీ అర్ధాంగి 

(బసవ కేశవ వర్ష  అగస్త్యులు తమ చేతులు నేలపై నుంచి  బయటకు వచ్చుచున్న లకుమను తమ  చేతులపై నడిపించి పండిట్ వద్దకు తెచ్చినారు. అప్పుడు నందిని ఇట్లు పాడుచుండెను.)

శుభాంగి నయనముల దాగె సారంగి 
నారంగి వయనములో మ్రోగె సారంగి
తొంగి తొంగి సంపంగి వంగి చూడ
అంగాంగమున పలికె నయగారము
చేరింక మురిపంగ దాటించ వారము
చేరికతో కాంతుడు చేయాలి గారము
ఈ కాంత కోరెను ఏకాంత వాసము. 
(అనుచూ లకుమ చేతిని పండిట్ చేతిలో పెట్టెను. అరుణ మాలిని మీనాక్షి కనులు వత్తుకొనుచుండగా కేశవుడు అరుణమ్మను చూచుచూ ఇట్లు గీతమునఆలాపించెను.) 
ఈ శుకవాణి, విరిబోణి నీ అలివేణి  
నీ కనుల కదిలేటి   నీ కళల రాణి 
దిద్ది పెండ్లి పారాణి ఘనతార మంత్రిణి
తెలిపె సమ్మతి ఇచ్చే అనుమతి  
చేకొనవయ్య  బహుమతి  (పండిట్ లకుమ చేతిని చేకొని తోటలోకి నడవసాగెను)

*జాగ్రత్త నాన్న కేంద్ర మంత్రి, తేడా పాడాలోస్తే తోలు తీసేస్తుంది. (కేశవ అగస్త్య బసవ)

అందరూ కవిసమ్మేళనం ముగించుటకు వేదికవైపుకి పోయినారు. వర్షుడు వేదికనెక్కెను. 

Sunday, February 7, 2021

సుందరి కల్యాణం -128

 కిమ్స్ ఆసుపత్రిలో అగస్త్యుడు మంచముపై పడుకొని యుండగా, మీనాక్షి ప్రక్కనే కూర్చొని అతడి తలకి కట్టిన కట్లను చూచుచూ అతడిని ప్రేమతో నిమురుచుండెను. బుచ్చెమ్మగారు  “నలుగురు రౌడీలు కర్రలతో మీద పడిన ఒక్క పసివా డేమి చేయును ? వాళ్ళ చేతులు పడిపోను బసవడు వెంట వెళ్లిన కొంత మేలు జరిగెడిది. ఆ వర్షుడు అగస్త్యుడు ఒక్కడే  వెళ్లవలెనని  చెప్పినాడట.” 

 అన్నయ్య (వర్షుడు) అట్లు చెప్పిననూ అగస్త్య అన్నయ్య ఆలోచన ఏమాయెను? నీ ఆలోచన ఏమాయెను? అని చందన బసవడిని నిగ్గదీసెను. 

బుడంకాయవలె తడుముకొనక మాట్లాడుచున్నావే నీవు కూడా పోయియుండినచో నీకు నూ రెండు కట్లు కట్టి పడుకోబెట్టి యుండెడివారు , మాకీ ప్రశ్నలు యుండెడివి కావు అని బసవడు చెల్లిని కసురుకొనెను

యమున: నీవు పోకుండా చిన్న దానిని పొమ్మనుచున్నావే సిగ్గులేదు? పైగా దానికి దెబ్బలు తగలవలెనని కోరుకొనుచున్నావా ?  ఇట్లు వాదనలు పెరుగుచుండగా 

అగస్త్యుడు : అబ్బబ్బ, జరిగిపోయిన దానిగూర్చి చర్చలు, వాదులాటలతో నా తల వ్రక్కలగుచున్నది.

మీనాక్షి : అయ్యో  తలా నొప్పిగా యున్నదా డాక్టర్ గారిని పిలుచుకుని వచ్చెదను. 

బసవడు : ఆ  పని చేయుటకు నీ వెందుకమ్మా నేనుపోలేనా , వాడికి ఏ తలనొప్పి లేదు

అగస్త్యుని ఉద్దేశ్యమేమనగా జరగవలసింది ఆలోచించమనుచున్నాడు. మీనాక్షి డాక్టర్ కొరకు బయటకు వెడలెను.  

 బుచ్చెమ్మ : జరగ వలసినది వైద్యమేకదా , అది జరుచున్నది కదా 

బసవడు : అది ఎప్పుడో జరిగి పోయినది , జరగ వలసినది   వివాహము, అదికూడా మంజూష వివాహముతో పాటుగా   జరగవలెను. 

మీనాక్షి :  అగస్త్యను చూచుచున్న డాక్టర్ దయాకర్ గారు ఇంకనూ రాలేదట.  ఇట్లు రోగిని వదిలిపెట్టుటయేనా ఇంకేమి దయ ? అని ఏడ్చుచుండెను 

బసవడు : కాదు, కాదు ఆయన సార్థక నామధేయుడే , దయగలవాడే !

అగస్త్యుడు : అబ్బా , అమ్మా !!! 

మీనాక్షి : అయ్యో పిల్లవాడికి వొళ్ళు నొప్పులు గానున్నదేమో 

బసవడు : అది వొళ్ళు నొప్పులు కాదు,  పెళ్లి నొప్పులు. 

బుచ్చెమ్మ : ఇప్పటికిప్పుడు పిల్ల ఎక్కడ దొరుకును  సమ్మందము ఎట్లు  కుదురును?  

బసవడు : పిల్ల సిద్ధముగా నున్నది -  సుందరి  కానీ సమ్మందం కుదర్చవలెను. 

మీనాక్షి : ముందు వైద్యమునకు ఏర్పాట్లు చేయవలెను. ఆ వర్షుడచ్చటికి పోయినాడు. ఆ పిల్లని కాళ్ళో కడుపో పట్టు కొని నేను బ్రతిమాలెదను , ఆమె తల్లిని ఆ తులశమ్మని కూడా వేడు కొందును.   అట్లు మీనాక్షి అనుచుండగా తులసమ్మ , సుందరి ఆ గదిలోకి ప్రవేశించి నారు.  తులసి మీనాక్షి వద్దకు వచ్చి ఆమె కన్నీరు తుడిచి " నీవు నన్ను వేడ వలసిన పనియేమున్నది  మా సుందరిని కోడలుగా చేసుకొందువా నేనే అడుగుచున్నాను " అని తులసి అనుచుండగా మీనాక్షి ఆనందాతిశయముతో " నా బిడ్డకి అది కోరిక , కానీ అది నా కల సుందరి ఉత్తమురాలు , నా బిడ్డ తప్పు చేసినందుకు నేను తలా దించుకొనుచున్నాను." అను చుండగా అగస్త్యుడు " అమ్మా !" అని మూల్గుచుండెను.  సుందరి విసవిసా బైటకి పోయి  నర్సుని కలసి  డాక్టర్ కి ఇంతైననూ భాద్యత లేదా ? అని  అగస్త్యుని  విషయము అడగగా  నర్సు  " ఆ గదిలో పేషేంట్  కి తలకి కుట్లు పడినవి , వైద్యమంతయూ పూర్తి అయినది.  ఇచ్చట ఉండవలసిన పని లేదు పొమ్మని  నిన్ననే చెప్పిననూ ఇంకొక్కరోజు ఉండుటకు బ్రతిమాల గా డాక్టరుగారు సరే అనిరి అని చెప్పగా సుందరి అవాక్కయ్యి  అగస్త్యుని గదిలోకి పోయెను. 

అగస్త్యుడు ఇంకనూ మూల్గు చుండెను, అతడి వైపు సుందరి తీవ్రముగా చూచి పిదప మీనాక్షి కడకు పోయి " అత్తయ్యా, మీ అబ్బాయి ని నేను చూసుకొందును మీరు వెళ్లి విశ్రాంతి తీసికొనవలెను " అని చేతిలో మీనాక్షి  చెయ్యి వేసి చెప్పెను. 

మీనాక్షి ఆశ్చర్యమునకు, ఆనందమునకు అవధులు లేకుండెను, మరొక్కసారి ఆ పిలుపు కొరకు ఎదురు చూచుచున్న ఆమీ మనసు అర్థము చేసుకొని , అత్తయ్యా మీరంతా ఒక్కసారి బైటకు వెళ్ళినచో మీ అబ్బాయికి  కొంచము వైద్యము చేయవలెను అని అందరినీ బైటకు నెట్టి తలుపు వేసెను.  

                                                                             ***

తలుపు మూసిన సుందరి నిశ్చయముగా గంభీరముగా అడుగులు వేయుచూ అగస్త్యుని  వైపు కదులు  చుండెను బైటకు పోయిన వారు తలుపు తట్టిననూ వారికి కిటికీ గుండా చూడవచ్చునని ఉపాయము తట్టుటచే కిటికీ వద్దకు చేరినారు. కిటికీ తెర అడ్డు ఉండుటచే లోపల ఉన్నవారికి వారు కనిపించు అవకాశము లేకుండెను. 

అ: తలుపెందుకు మూసినావు? 

సు: నొప్పి ఎచ్చటున్నది? ఎట్లున్నది ? 

అ: వొళ్ళంతయూ అదొక మాదిరిగా యున్నది

అయ్యో బాధగా యున్నదా ? 

అ: నీకొరకు అగ్గిని ఆలింగనము చేసుకొన్ననూ ఇంతవరకూ  ఆసుపత్రికి వచ్చి పలకరించలేదని  అంత కంటే ఎక్కువ బాధగా యున్నది. 

 సు: రెండు రోజుల కే  ఇంత  విలవిలా లాడుచున్నావే , నీవు చేసిన పనికి ఇంత కాలము నేనెంత విలవిలలాడినాను , మీ అమ్మ ఎంత విలవిలలాడెనో , నటించింది చాలు లెమ్ము!!  రెండురోజులకైననూ వచ్చినాను కదా ! అని అనవసర ముగా కనిపించుచున్న కట్లు  లాగివేసెను . 

అ: అన్ని విషయములు తెలుసుకొనే వచ్చితివన్నమాట 

సు: నీ అంత మొద్దును కాదు , ఆడపిల్ల ఇష్ట పడకున్న గదిలోకి ఎందుకువచ్చెనో తెలుసుకొనలేని మొద్దువు నీవు. అని తలుపు వద్దకు పోవుచున్న సుందరి పైటను పట్టి లాగెను. సుందరి పైట జారెను, అగస్త్యుడు ఆమెను చేయి పట్టి లోపలి లాగి గోడవద్దకి నెట్టెను.  ఆమె బ్రియోధ్వృత్తములెగసి పడుచుండగా అతడి కేసి చూచుచుండెను.  సుందరి " ఇట్లు చేసిన ఏ పిల్లైనా  నిన్ను పెళ్ళాడునా ?  అనగా అగస్త్యుడు వెనుకకు తగ్గెను. సుందరి అతడి చేతినందు కొని  వెనుకకు లాగెను . “మా  అమ్మ కొరకు నన్ను ఒప్పు కొంటివి అనుకున్నాను.” "నీకొరకే నిన్ను వొప్పుకొన్నాను"

తరువాత కారులో  తులసి మీనాక్షి మధ్యన సుందరిని కూర్చొండబెట్టుకొని అగస్త్యుని ముందు భాగములో కూర్చోండ బెట్టి ఇంటికి పోవుచున్నంతసేపూ  సుందరి జాణ తనము తలుచుకొని ముసి ముసి నవ్వులు నవ్వుచుండిరి. కోడలు పై మీనాక్షికి గల ఆపేక్షను చూసి తులసమ్మ మురిసిపోయెను