Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, January 31, 2021

Bharatavarsha 122

 విశాఖపట్నము - ఆనందనిలయము 

సర్రాజుగారు " రాత్రి చాలా పొద్దు పోయినది ! " అనుచూ కునుకు తీయుచుండగా 

బుచ్చమ్మగారు: ఈ రాత్రి కెట్లు నిద్రింతుము? రాత్రి మహావేగముగా నడుపుచూ  పిల్లవాడిట్లున్నాడో? ఆ ప్రమాదకరమైన ప్రయాణమునూహించిన వణుకు పెట్టుచున్నది ఈయనకు కునుకెట్లు వచ్చుచున్నదో!

మంజూష:   అగస్త్యుడు క్షేమముగా రావలెను 

నందిని : సుందరి ఎట్లున్నదో ? వారేమి చేయుచున్నారో ?

పార్వతి : బసవడు తోడుగా పోయినచోబాగుండెడిది. బసవడికి బల్లిపాడంతయూ కొట్టిన పిండి. 

బుచ్చమ్మగారు : బాగున్నాదమ్మా నీవరస , రెండు రోజులలో మీ పెళ్లిళ్లు జరగబోవుచున్నవి కుదురుగానుండక సాగర తీరమునకు పోయి ప్రాణములమీదకి తెచ్చినారు. ఇప్పుడు ఆ కుర్రవాడు ప్రాణములకు తెగించి అగ్నిగుండమందు దూకినాడు.  నాకొడుకుని కూడా దూకమందువా ? కాబోవువానిని బసవడని  పేరుపెట్టి పిలుచుచున్నావే! 

మాలినిగారు: అయ్యో! అగ్ని గుండమా! ప్రాణాలతో వచ్చునా బిడ్డ , ఈ రాత్రి ఎట్లు తెల్లవారునో ! మీనాక్షి విన్నచో గుండెపగిలి మరణించును. అని మాలినిగారు పెద్ద పెట్టున ఏడుపు లంగించుకొనగా

వర్షుడు : అబ్బబ్బ ! ఆపవమ్మా !! అగస్త్యునికి ఏమియునూ కాదు! పోలీసులు ఉన్నారన్న విషయము మరిచి బెంబే లెత్తిపోవుచున్నారు . 

 బుచ్చమ్మగారు: ఈ పోలీసులను నముకొన్నచో ఏమియునూ జరగదు! పోలీసులు దేముళ్ళలా, నాయినా, పిల్లకు అపకారము జరిగిన పిదప వారిని జైలుకి పంపినచో మనకేమి వొరుగును? 

బసవ : అమ్మా నిశిరాత్రి కీడు మాటలాపవమ్మా తల్లీ! 

మాలినిగారు :  మనసు కీడు శంకించి భాద పడుచున్న తల్లినట్లు కసుర వచ్చునా!

ఆ శివుని, దుర్గ మాతను నమ్మిన వారికి అపకారము జరగదు అనుచూ భారతవర్ష శివ దుర్గలను ప్రార్ధించెను. 

 జయ జయ పురంజయ హర హర నాథహరి నాథ జగన్నాథ 

అతిమతి సతి గతి జూడ వెడలె కావవయ్య నాథ పశుపతి నాథ

రజనీచర, చరాచర అస్త్ర శస్త్రాదుల నుండి నాథ ప్రమథ నాథ    

భవదీయ భజనీయ కమనీయ రమణీయ మంత్ర మహిమ

నొసగునయ్య రక్ష దక్ష మీనాక్షి సుతునకు నొసగవయ్య బిక్ష 

పాహిపాహి వారాహి త్రాహి మహిమాన్విత వాహిని  

రక్షమాం రక్షమాం దక్షజా శిక్షాకర మొరాలకించవమ్మ.

అనుచూ హృద్యముగా పలు గీతములనాలపించెను.

పార్వతి: అగస్త్యుడను పేరు నందే విషాదయోగము కలదో! అగస్త్యుని పేరు కలవారి జీవితమందు గతుకులే కనిపించుచుండును. మాబల్లిపాడు నందు ఇట్లే అగస్త్యుడను పేరు గలవ్యక్తి…

నందిని:  ఆపవమ్మా అగస్త్య అను పేరు శుభప్రదమైనదేకాక పరమ పావనమైనది. సప్త ఋషిలలో ఒకడైన పులస్త్య  కుమారుడగు  అగస్త్యుని పేరు రిగ్వేదమందనేక శ్లోకముల కర్తగా  కనిపించు చుండును. అతడి పునర్జననము వరుణుడు(ఇంద్రుడు), మిత్రుడు( సూర్యుడు)చేయు యజ్ఞమందు అప్సర ఊర్వశి వలన సంభవించెను. ఊర్వశి అసాధారణ  లైంగిక లక్షణము చూచి వరుణ మిత్రులిరువు వరికి  స్ఖలన మాయెను. ఆడిన మాటకు, చేసిన ప్రతిజ్ఞకు నాటి కాలమున విలువ ఉన్నట్లే ఇంద్రియము కూడా అమూల్యము గా భావించెడివారు. కావున వారి వీర్యమునొక మట్టి కుండలో భద్రపరచినారు . ఆ కుండనుండి ఇద్దరు కవల పిల్లలు జన్మించి నారు. వారే అగస్త్య విశ్వామిత్రులు. 

ఉత్తర భారతము నుండి నుండి దక్షిణ భారతమునకు వలసవచ్చి గోదావరి తీరమందు స్థిరపడ్డ అగస్త్యుడు మహా  శక్తివంతుడు.  వింధ్య పర్వతముల ఎత్తు తగ్గించుటలోను, దేవతలను ఇక్కట్ల పాలుచేయుచూ సముద్రమందు నక్కిన దానవులను  సముద్రములలో నీరంతటినీ  ఔపౌసన పట్టుటద్వారా వెలికి తీయుటలోనూ తన శక్తి సామర్ద్యములను చూపిన మహిమాన్వితుడు. తమిళనాట అగస్త్యుని ప్రథమ సిద్ధుని (కార్య సాధకుడు)గా  పిలచి  పూజింతురు. అనుచూ ఋషీశ్వరుడైన సమర్థ అగస్త్యుని కీరించుచూ పరాజితుడైన కలియుగ అగస్త్యుని గెలిపించమని సంస్కృతపద పూరిత ప్రార్ధ నా గీతమునాలపించెను  

అప్సర పుత్ర అగస్త్య కుంభ సంభవ ప్రశస్త్య
ఉత్తరతః దక్షిణగత  పర్వత జిత  అగస్త్య 
దైవ పరిజన పయోధపాన అగస్త్య ప్రశస్త్య
నిష్రష్ట  శ్రేష్ఠ ఔషధ ద్రష్ట అగస్త్య ప్రశస్త్య
అవశ్యక మభిసేన్యతి అగస్త్య పరాస్తః 
కుంభ సంభవ సమర్థ అగస్త్య  ప్రశస్త్య
అవశ్యక మభిసేన్యతి అగస్త్య పరాస్తః
యంత్రగమనమున వాయు వేగమున 
వెడలెను సైనిక సమర కృషి  
కావుము దయతో రిగ్వేద ఋషి 
మహతీ రణ దారుణ నివారణ చేయుము 
పరవశత్వమును కోరెను నాడు
పరాసత్వముకు వెరవక నేడు
అస్త గమనమును మస్తకమందిడి
అస్త్యవ్యస్తమగు బ్రతుకును దిద్ద  
వెడలెను సైనిక సమర కృషి    
కావుము దయతో రిగ్వేద ఋషి 
అప్సర పుత్ర అగస్త్య కుంభ సంభవ ప్రశస్త్య
                                                                      ***
కట్ట: సోదరా కొల్లాయి సింగమా! కత్తి వంటివాడవు మెత్త బడిపోతివి గదా! నిదానముగా నడుపుచున్నావు.  సమయము మూడు గంటలు దాటినది
కొల్లాయి : నేను నిదానముగా నడుచుచుచున్ననూ నాలోచనలు పరిగెత్తు చున్నవి. మనకి నక్కజిత్తులుండవలెను సోదరా  సింగపు చిన్నెలు మనకేల?
కట్ట: లెస్స పలికితివి సోదరా! మనకి జరుగుబాటయినదే నీతి. బల్లి పాడు చేరుసరికి  తెల్లవారునేమో. బల్లిపాడు పోయినచో మన కేమాత్రమూ క్షేమము కాదు. పోలీసులకు మన ఇల్లు వాకిళ్లు తెలుసుకొనుట సులభ సాధ్యమే.  
కొల్లాయి : ఇంకెచ్చట నున్ననూ అంతకంటే ప్రమాదము. బల్లిపాడు చేరుటకు ఇంకొక గంట సమయము కలదు. అప్పటికి  ఇంకనూ చీకటి ముసిరి యుండును. చెరువు గట్టు పై వేను నిలిపి కాలి నడకన ముత్యాలు (చాకలి) ఇంటికి పోయి.. కట్ట నవ్వు చుండెను.  
కొల్లాయి: కట్టా  ఎందుకురా నవ్వుచున్నావు ! 
కట్ట : దాని మొగుడిని  దానికి చెప్పకుండా  నీవు పైకి పంపినావు ఆ కథ గుర్తుకొచ్చినది 
చెప్పితిని  అది ఒప్పుకొనలేదు.  అట్టి కథలు తలుచుకొని నవ్వుకొను చుండగా   
కట్ట: పిల్ల కదులుచున్నది , మత్తుమందు నిండుకొన్నది, ఇప్పుడేమి సాధనము !
కొల్లాయి :   నోట కుక్కిన గుడ్డలు తీసి నీవు వెనుకకు పోయి దానిని పట్టుకొనుము        
 కట్లు కూడా విప్పికొలది సేపు ఉంచవలెను  లేనిచో నడువజాలదు. 
కట్ట : వెనుకకుపోయి  నోటినుండి గుడ్డలు తొలగించి పడుకొన్న సుందరిని లేపి కూర్చొండబెట్టి ,తాకుచుండగా బుర్రతో ఒక్క గుద్దుగుద్దెను. కట్ట బుర్ర ఠంగ్మని మ్రోగి దిమ్మెక్కిపోవుచుండగా వెనుకనే వచ్చు ద్విచక్రిక కాంతి కళ్ళలో పడి  కళ్ళు చెదిరెను. సోదరా ఏనుగు వలే నున్న ఈ అసాధారణ ద్విచక్రికను గంట క్రితమే చూచి నాను. లైటు అప్పు డప్పుడూ వేయుచూ , పిదప ఆర్పివేయుచూ మనని గమనించుచున్నాడు. ఆ యువకుడెవరో మనని అనుస రించుచున్నాడని సందేహము గా యున్నది 
మరొకసారి లైటు వెలిగి ఆరినది క్షణ కాలము  కాంతి పుంజము సుందరిని తాకి ఆరినది. అగస్త్యుడు సుందరి రూపము ను స్పష్టముగా చూచినాడు. కొద్ది క్షణములలో వారికి వ్యతిరేక దశలో పోవుచున్న   ఒక పెద్దవాహన కాంతి లో సుందరి అగస్త్యుని రూపమును కాంచెను. 
బల్లిపాడు సార్వభౌమా చిన్నగౌడరాయ ఆయుధమందుకొనుము , రుణ శేషము శత్రు శేషము ఉంచరాదు , ఈ సారి కనిపించినచో తూటమును పేల్చి అరి భంజనమొనర్చుము అని వాహనమును నడుపుచున్న  కొల్లాయిగౌడ    వెనుక నున్న కట్ట గౌడకు తుపాకీ అందించెను. కానీ ఎంత వెతికిననూ ద్విచక్రిక మరల కానరాకుండెను. బల్లిపాడు వచ్చుచున్నది. 

                                                                 ***
ముత్యాలు ఇదుంచవే అరగంటలో  నా మనుషులర డజను మందిని తీసుకొచ్చేవు అనుచూ ముత్యాలు మెడలో బంగారు గొలుసును అలంకరించెను 
ముత్యాలు :  నాకు గొలుసెందు కండీ, నాకాడే నాలుగున్నాయి.   
కట్ట : నమ్మిన బంటు వలే నున్న నీకు  గొలుసులేల పెంకుటిల్లు ఇచ్చెదను 
ముత్యాలు : ఇల్లివ్వవ్వడమే కాదండి వత్తా పోతా  ఉండాలండీ
కొల్లాయి:  అది మళ్ళీ చెప్పాలటే అని ముత్యాలు నడుం గిల్లి , ఇంతకీ  ఆ పిల్ల కట్లు గట్టిగా ఉన్నవా ?
ముత్యాలు : మంచానికేసి గట్టిగా కట్టీసి నోట్లో గుడ్డలు కూడా కుక్కీసాను. మన మనుషులు చుట్టూ కాపలా ఉన్నారు . వెలుతురొచ్చేసిందంటే మనుసులు మసులుతుంటారు.   ఈ లోగా నువ్వు పని కానిచ్చేయ్ 
కట్ట : పిచ్చిదానా నేనొక్కడినే కాదే , మేమిద్దరమూ 
ముత్యాలు :  అయ్యబాబోయ్ ఇద్దరా , మీరు గేదెలాగున్నారు , పిల్ల సచ్చిపోతాది 
కొల్లాయి : అది బ్రతికి ఉంటె మనకి కష్టమే 
ముత్యాలు : అంటే సంపేత్తారా , నేనొప్పుకోను 
కట్ట : సరే సరే చంపను, నువ్వెళ్ళి దానికి ఈ విష్కి పట్టించు. అని చిన్న తుపాకి వంటగదిలో పెట్టి వారిరువురూ స్నానాలకు పోయినారు. ముత్యాలు సీసా మూత తీయుచుండగా కిటికీవద్ద అలికిడైనది, ఎవరో లోనికి తొంగి చూచుచున్నారు   
ముత్యాలు బైటకు వచ్చి చూడగా ఏదో ఒకా నల్లని ఆకారము కిటికీవద్దనుండి ఆరుబయట ఉన్న స్త్నానాల గదులవద్ద కు పోయి పైన గడియవేసి వచ్చుచుండెను. ముత్యాలు అది గమనించి అరుచునంతలో నోరు మూసి ఇంటిలోపలికి  తీసుకు పోయి వంచి వీపుపై ఒక్క గుద్దు గుద్దగా క్రింద పడి పెద్దగా అరవసాగెను , అగస్త్యుడు ఈలోగా సుందరి కట్లు విప్పుచుండెను. గౌడసోదరులు ఇరువురూ స్నానాలగదుల తలుపులు బాదు  చుండుటతో  
కొలది దూరములో కర్రలతో కాపలా కాయుచున్న యువకు లు పరుగు పరుగున వచ్చి, ఒకడు తలుపులు తీయుచుండెను. అగస్త్యుడు ఇంటి తలుపు గడియ పెట్టుచుండెను. గడియ పెట్టనంతలో  నలుగురు లోనికి దూరినారు. వారి చేతులో కర్రలున్నవి వారు బర్రెను బాదినట్లు బాదుతున్ననూ ఓర్చుకొని అగస్త్యుడు సుందరి కట్లు పిప్పుట యందె ద్యాస కలిగి యుండెను. సుందరి కట్లు వీడినవి. అగస్త్యుడు నేలకొరిగెను. 

అందొక యువకుడు అగస్త్యుని పీకపై కాలు వేసి వీడికి శిరస్త్రాణము ( హెల్మెట్) ఉండుటచే క్షేమముగా తప్పించుకొనుచున్నాడు అనెను , వేరొకడు అగస్త్య శిరస్త్రాణము ను లాగి వేసెను. సుందరి నీవు నా ద్విచక్రిక నెక్కి పొమ్ము అనుచూ తాళమునామెకు ఇచ్చుచుండగా ముత్యాలు లేచి సుందరి కాలు పట్టుకొనెను . సుందరి ఆమెను ఒక్క తాపు  తన్ని తలుపువద్దకు పోయి తలుపు తీసి పక్కకు తప్పుకొనెను ఒక్క సారిగా గౌడసోదరులు లోపలకి గెంతుట, సుందరి ఇంటినుండి  బయటకు  గెంతుట,    అగస్త్యుడు ఉప్పెనవలె లేచి తనని చుట్టుముట్టిన  నలుగురు యువకులను తోసి వంటగదిలోకి దూరుట జరిగి పోయినవి. వంట గది తలుపులు మూసు కొన్నవి.
కొల్లాయి: లోపల తుపాకీ ఉన్నది. అందరూ శిలా ప్రతిమలవలె నిలిచిపోయినారు. అందరికీ ఊపిరి తీసుకొను శబ్దము స్పష్టముగా వినిపించుచుండెను. ముత్యాలు తలుపు తియ్యవే అని కట్ట ముత్యాలు నాజ్ఞాపించెను. 
ముత్యాలు కట్ట మొఖం పై ఉమ్మివేసి దానిని పట్టుకు రమ్మని ఇద్దరిని ఆజ్ఞాపించగా వారు ఆమెను వెంబడించుచుండిరి. 
ఇంతలో  కట్ట " సోదరా , మనమిచ్చట సమయము వృధా చేయక దాని పని పట్టెదము."తుపాకీ ఉన్నవాడికొరకు ఎదురుచూచుట చూచుట మృత్యువు కొరకు ఎదురుచూచుట ఒకటే పద దానిని వదలరాదు అని బయటకు పరుగు తీసి దూరముగా ద్విచక్రిక వద్ద అవస్థ పడుచున్న సుందరిని చూచి " హేర్లి డేవిడ్సన్ , ఇది ప్రారంభించవలెనన్న , నడపవలెనన్న కొంత అనుభవముండవలెను.  అని వికట్టహాసము చేయుచుండెను. సుందరి పరుగు లంఘించుకొనెను. 
                                                                       ***

అగస్త్యుడు మెల్లగా తలుపు కొద్దీ కొద్దిగా తీసి  అచ్చట ఇద్దరే ఉండుట చూసి , తుపాకీ గురిపెట్టి పైకి వచ్చెను , రౌడీ సోదరులిరువురూ వెనుకంజ వేసిరి.  అగస్త్యుడు ఆయుధమును చేతపూని సుందరికొరకు పరిగెత్తుచుండెను.  ముందు సుందరి, ఆమె వెనుక గౌడసోదరులు , వారి వెనుక చొక్కా చిరిగి, గాయములతో  అగస్త్యుడు, అతడి వెనుక రౌడీలు పరిగెత్తుచున్నారు. తెల్లవారినది చీకటి కరిగి వెలుగు వచ్చినది. తుపాకీతో  తూటములున్నచో  ప్రమాదమనితలచి అగస్త్యుడు  “ఆగినచో బ్రతికెదవు అచ్చట నిలువుము “  అని హెచ్చరించి “తుపాకిని గాలిలో కి పేల్చెను. అదివిన్న గౌడసోదరులు ఆగినచో మరింత ప్రమాదమని వేగమును పెంచినారు. తుపాకీ వారిని ఆపలేకున్ననూ గ్రామ జనులను లేపుటకు ఉపయోగపడినది. అగస్త్యుడు వారివెనుక పరిగెడుచూ మిగిలిన ఐదు తూటములను అట్లే గాలిలోకి  పేల్చేను. సుందరి తాను మొదటిసారి బల్లిపాడు వచ్చినప్పుడు విమానమును దింపిన పాఠశాల ఆవరణ చేరుకొనెను. ఆమె వెనుకనే గౌడలు కూడా చేరిరి. సుందరి గొళ్ళెము లేని పాఠశాల గదిలోకి ప్రవేశించెను. గౌడలు ఆగదిలోకి దూరి లోపల తలుపు గడియవేసిరి.
 
అగస్త్యుడు ఆగదివద్దకు  చేరగానే తలుపు మూతపడినవి . ఇద్దరు  రౌడీలు ఒక్కసారిగా అతడిపైపడి కుమ్ముచుండగా అగస్త్యుడు బంతివలె లేచి ఒకడి తలను పాఠశాల గోడకు కొట్టెను. వెనుకకు తిరిగి వెనుకనుండి వచ్చుచున్న వాడిని ఎగసి తన్నెను. ఇంతలో మరి ఇద్దరు రౌడీలు కర్రలతో  వచ్చి చేరినారు . అగస్త్యుడు నిస్సహాయముగా దొరికిపోయెను. 

గదిలో నేలపై పడి  ఆయాసముతో రొప్పుతున్న సుందరి వక్షం ఎగిసి పడుచున్నది. కట్ట మన కష్టము ఫలించినాదిరా మంచి ప్రదేశము లో దొరికినది , విశాలమైన గది అను చుండెను సుందరి లేచి ఎదుర్కొనుటకు సిద్ధమగుచుండగా గౌడ నడుముకి కట్టిన తోలు పట్టాను తీసెను. సుందరి నిలిచిపోయెను.  కట్టా " రెండు తగిలించినచో సులభముగా దారిలోకి వచ్చును మనకు సమయములేదని చెప్పగా కట్టగౌడ సుందరి ని బాదసాగెను . సుందరి గది  అంతయూ పరిగెడుచూ బ్లాక్ బోర్డు వద్దకు పోయి కొట్టవలదని చేతులు ఎత్తి  నమస్కరించెను.  ఆ బ్లాక్ బోర్డు పై  నిద్రించుచున్న పెద్ద సింహము చిత్రము గీయబడి యున్నది.  కట్ట వికట్ట హాసము చేయుచూ నిలిచెను.

గది  బయట అగస్త్య కదలికలు నిలిచిపోయినవి , కర్రలతో తలపై దెబ్బలు పడగానే అగస్త్యకు  రక్తము కారు చుండెను . అగస్త్యుడు వారి కర్రలను  చేతికి చిక్కించుకొని లాగివేసెను. ఇంతలో గ్రామ ప్రజలు గుమ్మిగూడుచుండిరి.  అది చూచి  రౌడీలు  అగస్త్యను త్రోసివేసి పారిపోయినారు. అగస్త్య క్రింద పడెను. రక్త స్రావము హెచ్చుగా జరుగు చుండెను. క్రింద పడిన అగస్త్య కళ్ళు  పడుచుండగా  అనేక మంది  చుట్టూ  చేరినారు.  కట్ట గౌడ , గదిలో సింహము చిత్రము లో చిరు కదలిక చూచెను, పిదప స్వల్ప గర్జన వినిపించెను ఆ ఇదంతయూ చిత్త  భ్రమ  అనుకొనుచుండగా ఒక్కసారిగా ప్రాణమున్న  సింహము చిత్రము నుండి దూకి భీకరముగా గర్జించగా వారిరువురూ తలుపు తీసి బైటకు పరుగు తీయుచుండిరి. పూర్తిగా వెలుగు చున్న ఆకాశము క్రింద వేలజనులు చూచుచుండగా వేట ప్రారంభమయ్యెను. 


రొప్పుచూ గౌడలిరువరూ పరిగెత్తుచుండగా , వారి గుండెలు అలసి మండుచున్నవి , హరిదాసు గారు చంద్రమతి, ముత్యాలు కూడా  కూడా అప్పుడే వచ్చి చేరినారు. సుందరి కూడా బయటకు వచ్చి చూచుచుండెను. ముత్యాలు  అందరూ చూచుచుండగా దండోరా వీరాసామి డప్పును తీసుకొని వాయించు చుండగా సింగము గౌడలను చీల్చి చెండాడెను. పూర్తి వెలుగులో ఆ దుష్ట ద్వయము వెలుగు నశించెను. పిదప ఆ సింగము నిదానముగా పంటచేలలోకి పోయి అంతర్ధానమయ్యెను. 

Saturday, January 30, 2021

Bharatavarsha121

సుందరి అపహరణ నాటి రాత్రి : 

సుందరి అపహరణకు దిగ్భ్రాంతిని పొందిన యవతులు ఏమి చేయవలెనో పాలుపోకుండెను. సాగర తీరమంతయూ జల్లెడ పట్టుట పూర్తి అయిన పిదప సుందరి ఇక దక్కదని నైరాశ్యము పొందిన, పిదప మంజూష "వదిన నీవు అంగీకరించినచో అందరమూ పోయి విదిష ను వేడెదము, కానీ నీవు ఆమెను మాత వలే చూచి  పదములంటినచో .. " అని మంజూష అంచుండగా   ఆమె నాకు మాత ఎట్లగును ?   హు ! నిన్నని ఏమి లాభము ఆ దేవుడే నన్ను ఇట్లు ఆడించుచున్నాడు , అయిననూ నేను దాని కంటే అందముగా ఉన్నానని దానికి ఈర్ష్య , నన్ను తన వద్దకు రప్పించుకొనుటకు ఆ మాయలాడి యే ఇట్లు చేసేనేమో ! అయిననూ  అందరిని విహారమునకు కొనిపోయినది నేను కనుక సుందరి బాధ్యత నాకే ఎక్కువ ఉండవలెను . ఉష్ ఏమిఖర్మము!   ఒక సారి పోయి వచ్చెదము.  

పిదప వారందరూ సబ్బవరం పోయి ఆశ్రమ లోకి ప్రవేశించిరి. కొండల మధ్య నున్న ఆ ఆశ్రమము నిశీధి యందు దీపము వలె, ఒక చిరు ద్వీపము, వలె బిక్కు బిక్కు మనుచున్నది. మొక్కలు పెరిగి చెట్లాయెను. పొదలు రంగ వల్లికలవలె అల్లుకొని ముచ్చట గొల్పుచుండెను. అచ్చటంతయూ నిశ్శబ్దము ఆవరించి యుండెను.  వృక్షములన్నియూ శిశువు తల్లిని కౌగిలించుకొన్నట్టుగా నిశ్శబ్దమును కౌగిలించుకొని నిద్రించుచుండెను. 

వనము గుండా పోవు పార్వతి, నందిని, మంజూష, బసవ   ఆ నిశ్శబ్దమునకు మంత్రం ముగ్దులయ్యిరి.  ఆశ్రమములో నున్న కోవెల వద్ద వారు శేషాచలముగారిని కలిసి విదిషను చూడవలెనని విషయమును శేషాచలముగారికి తెలపగా బసవడితో " విదిష జరిగిన విషయమును తెలుపగా అతడు విచారించి “రెండు దినములనుండి మాత భవనములోనికి రాలేదు, ఆమె సమాధిలో నున్నది ఆమె ఏ చెట్టుక్రిందనున్నదో చూడవలెను. ఈ నాటి వరకు మాత సమాధిలో నుండగా నేను దగ్గరికి కూడా పోయి చూడలేదు. అని సుందరి విషమై పోలీసులను సంప్రదించవలసినదని సలహా చెప్పెను.  ఆమెనెట్లైనా కలవవలెను లేనిచో సుందరిని వారు ఏమి చేసెదరో ఊహించుకొన్నచో వెన్నులో చలి పుట్టుచున్నది. అని నందిని అనెను. సమాధినుండి వారంతట వారు రావలెను గానీ మనము సమాధి స్థితికి భంగము కలిగించరాదు” అని అతడు వెడలిపోయెను.

చేయునది లేక వారు వెనుకకు మరలిరి. ఆ తోట లో కొంత వరకు దీపముల కాంతి కనిపించు  చుండెను. గాలి ఉదృతి పెరిగెను.  నందిని " దీపముల కాంతి చేరని చీకటి  భాగమును చూచిన భీతి  కలుగు చున్నది."  బయటకు పోవుచూ వారు ఆ చీకటి లోకి చూచినారు.  పార్వతి "దూరముగా చిన్న దీపము వెలుతురు కనిపించుచున్నది " అని చెప్పాగా . మంజూష " అది దీపము వలే  లేదు , దీప మయినచో  ఈ  గాలికి   నిలువజాలదు.  బసవడు " పోయి చూచెదము "  మంజూష " అది విదిష వలే అనిపించుచున్నది . మా అన్న వచ్చినచో విదిష తనంతట తానె లేచివచ్చును. 

 నందిని " అయినచో వర్షుడు వచ్చినాడని   గట్టిగా చెప్పుము " సమాధిలో ఉన్నవారికి వినపడు అవకాశము లేదు, వారి ఏకాగ్రత దీనిపై యున్న అది వారికి మనము తెలపకున్ననూ అవగతమగును. " అంత శక్తిమంతురాలయినచో చూచెదము నేనుపోయి తాకి లేపెదను " అని నందిని ముందుకు వడివడిగా పోవుచుండగా అందరూ ఆమెను అనుసరించిరి. కొలది దూరము పోయిన అందరూ అచ్చట చకితులై నిలిచిరి.

విదిష ఒక చెట్టు క్రింద ధ్యానములో కూర్చొనెను . ఆమె నుండి సన్నని వెలుతురు  వచ్చుచున్నది. ఒక జంట ( యువతి యువకులు ) అచ్చట పొదల వెనుక నిలిచి ఆమెను గమనించు చుండిరి. వారు గొడగూచి వలతి.  వలతి " నందిని ఇటురమ్ము అని ప్రక్కకి లాగెను " అప్పుడే   ఒక పెద్ద సర్పము వారిని దాటుకొని విదిష  వైపుకు పోయెను. నందినికి అంత చల్ల గాలిలోకూడా చమటలు పట్టినవి. గొంతు తడారెను, వారు చూచుచుండగానే పాము జరాజరా ప్రాకి విదిషభుజముపై ప్రాకుచుండెను. మంజుషకి ఆ పాము తన పై ప్రాకుచున్నట్టుగా వళ్ళు కంపరము పుట్టెను.

విదిష ఆ పామును తలవద్ద పట్టుకొని చెవికానించుకొని " విమానాశ్రయమునకు పోవుచున్నావా ? నాకొరకు ఏదో కొని దాచుచున్నావు కదా  అది చెప్పవూ ? నాకు తెలిసిననూ నీవుచెప్పినచో ఆనందించెదను. కష్టపడి సంపాదించినది అంతయూ ఇట్లు ఖర్చు చేయుచున్నావే , పాతిక లక్షలా ? మోటార్ సైకిల్ పై నన్ను తిప్పవలెనని నీ కోరిక తీరుటకు సమయము పట్టును  " ఇట్లు మాట్లాడు చుండగా వారు అచ్చట నుండి కదలినారు , ప్రహరీ  బైటకు పోయిన తరువాత  గొడగూచి "ఆమె తన ప్రేమికునితో మాట్లాడుచున్నది , ఇదంతయూ యోగ నిద్రలో నుండి చేయుచున్నది. " వలతి " ఆమె బాహ్య స్మృతిలోకి రాకున్ననూ, చేతిలో చరవాణి లేకున్ననూ  తన ప్రేమికునితో ఇట్లే సంభాషించును. " అని చెప్పెను . గాఢముగా ప్రేమించుకొన్నవారు ఎంత కాలమైననూ  ఇట్లే ఒకరి మనసులో ఒకరుందురు. వారు ఒకే ఆలోచనా తరంగములపై ఉంది ఒకరి భావములనొకరు గ్రహింతురు. " అని ఆమె తన పరిశోధనా జ్ఞానమును వెల్లడించెను. ఎవ్వరికీ నోటా మాట లేకుండెను. మత్తు మందు ఇచ్చిన వారివలె అచేతముగా అందరూ నిష్క్రమించిరి

                                                                  ***

ఆనందనిలయము చేరి సుందరి అపహరించబడిన విషయమును మాలిని గారికి తెలియజేసిరి. మాలినిగారు నిర్ఘాంతపోవుట అరుచుట విలపించుట చేసిన పిదప వగచుచుండిరి. వగచుట వాదనలుగా, వాదనలు రోదనలుగా మారి కడకు నందిని పోలీసులకు విషయము నెఱింగించెను.  అయిననూ  నందినికి కాళ్ళూ చేతులు ఆడ కుండెను. విషయమును మానాన్నకు ఇంకనూ తెలపలేదు, ఆయన  పోలీసు సూపరింటెండెంట్ గార్కి తెలిపినచో ప్రయోజన ముండును. అని నందిని అనుచుండగా మాలినిగారు దూరవాణి యందు  అరుణ తారతో " అరుణా !! ఒక పెద్ద ప్రమాదం జరిగినది , నీ బిడ్డ  సుందరిని అపహరరించుకు పోయినారు. అరుణ శిరమునందు తపంచా ప్రేలినది. 

అరుణ తార ప్రియ పుత్రిక  సుందరి గూర్చి దుర్వార్త విని తల్లడిల్లి " ఎచ్చట, ఎట్లు జరిగెను? ఎవరు చేసి యుండవచ్చు? రేపు తులసీగారు వచ్చిన ఏమి చెప్పవలెను? నేటి కాలమందు దుండగులు తోడేళ్లవలె పొంచి యుండి ఆడపిల్లలను అపహరించుచున్నారు. ఎచ్చట చూచిననూ ఇట్లే యున్నది. ఆడపిల్లలను కంటికి రెప్పలా చూచుకొనవలెను. 

మాలిని: వీరు ఆడ పిల్లలా , ఈ మంజూషను కని  తప్పుచేసినాను , దీనికి పెండ్లి చేసి పంపి భారము దించుకొనవలెనని దినములు లెక్కించుచూ గడుపుచున్న నాకు ఇట్టి కష్టము వచ్చినది. నేనే నుయ్యోగొయ్యో చూచుకొనవలెను.  నన్నీ  నరకమునందు వదిలి ఆయన వీర స్వర్గము పొంది సుఖించుచున్నాడు. కొడుకు ఉండి లాభమేమి? దేశదిమ్మరివలె  దేశములు పట్టి తిరుగుచున్నాడు. అని రోదించుట మొదలు పెట్టెను. 

తార: నేనిప్పుడే ఐ జీ గారికి ఫోను చేసి మాటలాడెదను. 24 గంటలలో సుందరి నీ ఇంట ఉండును. నీకు కంగారు పడి ఫోను చేసేదవేమో తులసిగారి ఆరోగ్య మెట్లున్నదో, నీవు ఆందోళన చెందవలసిన పని లేదు అని ఓదార్చి సంభాషణ ముగించెను. 

కొలది సేపటిలో బుచ్చెమ్మగారు “పోలీసులు బసవని తన ఇంటివద్ద విచారించుచున్నారని”  చెప్పుచూ ప్రవేశించి  “నాకోడలికి తృటిలో ప్రమాదం తప్పినది ఈ రెండు దినములు గడిచిన  వివాహము జరిపించి ఇంటికి కొనిపోదుము.” అని కోడలిని అక్కున చేర్చుకొనెను. బల్లిపాడు నందు ఇట్టి ప్రేమకు నోచుకొనని పార్వతికి చారుమతి (తల్లి) గుర్తుకొచ్చి నయనం లశ్రుపూరితములైనవి. కుటుంబమును భావన ఆమెను కుదుపి వేసి ఆమె బుచ్చమ్మనల్లుకొన్నది.

ఇంతలో బసవడు సర్రాజుగారు ప్రవేశించిరి. వారి వెంటనే పోలీసు సూపరింటెండెంట్ గారు తన సిబ్బందితో ప్రవేశించి నారు.  ఇప్పుడు మమ్మల్ని విచారించుటకు వచ్చినారేమో అని మదన పడుచున్న మాలినిగారికి కొండంత ధైర్యము నిచ్చి "మీ అమ్మాయిని క్షేమముగా తీసుకు వచ్చెదను. ఆ గౌడలిద్దరూ  విశాఖ కేంద్ర కారాగార వాసము చేసి వెడలిన వారే.  వారి గూర్చి నాకు బాగా తెలియును.  బల్లిపాడు నందు వారికి గల అష్ట  గృహములను మా పోలీసులు చుట్ట ముట్టినారు. రేపు మీ అమ్మాయిని తెచ్చి మీకు అప్పగించు భాద్యత నాది.” అని చెప్పి వెడలు చుండగా భారతవర్ష ఆనందనిలయములోనికడు గిడెను.

మాలిని: ఏమి నాయనా ఇప్పుడు వేళయినదా, రేపు ఏ దేశమేగవలెను? పెళ్లి వరకూ ఉందువా ఇంకనూ నీ కార్యక్రమములేమైనా యున్నవా? అని విరుచుకు పడుచుండగా. భారతవర్ష మందహాసముచేయుచూ "పోలీసుల కేల కబురు చేసినారు? ఇంత  సదావకాశమును  మనము జార విడవరాదు." అనెను. ఆ మాటవిని మాలినిగారే కాక బుచ్చెమ్మ సర్రాజుగారు కూడా అవాక్కయ్యిరి. “ఇందు సదావకాశమేమి కలదు నాయినా చదివేసిన ఉన్నమతి పోయినట్టు మాట్లాడుచున్నావు అని బుచ్చమ్మగారు నిష్టూరమాడినారు. ఆడపిల్లలందరికీ అంత బాధ లోనూ నవ్వు వచ్చెను, మాలినిగారికి అరికాలిమంట నెత్తికెక్కి వర్షుని రెండు చెంపలను వాయించెను. ఆపై వర్షుడు నవ్వసాగెను. 


అది చూచి అందరికి పిచ్చి పట్టెను. మా అమ్మ దండనతో  నాకు బాల్యమును గుర్తుకు వచ్చినది. “ఆహా! అమెరికానందు జరగని ఘన సన్మానము ఇదియే కదా” అని రెట్టించిన ఉత్సాహముతో “మీరు లోతుగా ఆలోచించవలెను సుందరిని అపహరించకున్న ఆమెను రక్షించు అవకాశము అగస్త్యునికెట్లు వచ్చును? అగస్త్యుని కథ మీకు తెలియును కదా అతడు తొందరపడుటయే కాక సుందరి దృష్టిలో పాతాళమునకు జారి పడినాడు. జాతీయ కీర్తి సముపార్జించిన సంగీత రాణి, మీనాక్షి సుందరి కాళ్ళు పట్టుకొని అయిననూ సుందరిని తన కోడలిని చేసుకొనవలెనని సిద్దమయినది కానీ ఆమె ఆశ నెరవేరునని నాకు నమ్మకములేదు. పార్వతిని కనుక వారు అపహరించినచో ఇట్టి అవకాశము మనకు వచ్చి యుండెడిది కాదు. అగస్త్యుడు రక్షించి తేకున్నచో సుందరినెటులైననూ పోలీసులు తీసుకువత్తురు. అప్పుడు అగస్త్యుని గుణము గూర్చి  ఎవరైననూ ఏమి చెప్పగలము ?

సర్రాజుగారు : వారు చూచిన ముదిరిన రౌడీలవలె నున్నారు. అగస్త్యుడు అంత  బలవంతుడా?

వర్షుడు " అడవిలో ఏనుగు పెద్ద జంతువు, చిరుత అత్యంత వేగమైన జంతువు  , నక్క తెలివైన జంతువు, జిరాఫి ఎత్తైన జంతువు , ఈ బలములే మియూ లేకున్ననూ ధైర్య గుణ విరాజమానమైన సింగము అడవిరాజుగా వర్ధిల్లును. ప్రమా దములను ఎదుర్కొన వారికి తప్పక జయము కలుగును. వారి జీవితము సుఖమయమగును.  తెగువ లేనివారికి విజయము దక్కదు , దేశము కొరకు నా తండ్రి తెగువ చూపి మరణించెను , తన జీవితము కొరకు తానూ తెగువ చూపకున్న విజయము ఎట్లు దక్కును? అందుచే అగస్త్యుడు సుందరిని రక్షించవలెనని  దేవుని ప్రార్ధించ వలెను.

అందరూ : ప్రార్ధించుటకు  ముందు అతడికి విషయము తెలిపి అచ్చటికి పంపవలెను.

 వర్షుడు వారందరినీ కలియజూసి “నేను, అగస్త్యుని మోటారు సైకిల్ పై బల్లిపాడు పంపి వచ్చుచున్నాను. ఈ పాటికి చేరు చుండును .” అనగా బసవడు "అంతవేగము ఎట్లు పోవును? వాడు పోయినది మోటారు సైకిల్ పైకదా!" అనెను.
వర్షుడు "అది 25 లక్షలు ఖరీదు చేయు ఆరు వేగములు కల హెర్లి డేవిడ్సన్,  ఆ యంత్ర ద్విచక్రికకు గరిష్ఠవేగము గంటకు 220 కిలోమీటర్లు" అని వివరించెను.

Tuesday, January 26, 2021

Bharatavarsha 120

టాటా ఇండికా టాక్సీ ఇండియా గేట్ వద్ద నున్న నార్త్ అవెన్యూ లో ప్రవేశించెను. " అయ్యయ్యో ఈ డొక్కు టేక్సీ దొరికెనే ! " అని కృష్ణన్ మూఁల్గెను. టేక్సీ అరుణతార భవనము ముందు ఆగెను . అది చూచి , "హమ్మయ్య వచ్చి చేరినాము " అని మీనాక్షి సంబరపడెను.  మీనాక్షి దిగి గేటువద్దనున్న రక్షక సిబ్బందిని "మంత్రి గారున్నారా అని అడిగెను?" వారు అరుణతారగారు ఇచ్చట లేరని,  కేంద్రమంత్రుల కు నివాసములు వేరే కలవని అచ్చటకు పోయిన కలవవచ్చునని చెప్పి ఆమె ఎహ్ ఆర్ డీ మినిష్టర్ అని భావించి  తప్పు  చిరునామా  ఇచ్చినారు.  అందువలన సఫ్దర్గంజ్ మార్గమం దున్న మానవ వనరుల శాఖా మంత్రి  భవనమునకు పోయినారు. తప్పు తెలుసుకొన్న మీనాక్షి చరవాణి యందు తారతో మాటలాడుటకు ప్రయత్నించుచుండగా కలువకుండుటచే కంగారు పడుచుండెను. యమున గ్రామీణభివృద్దిశాఖా మంత్రి అని అంతర్జాలమందు ప్రయత్నించగా  3 కృష్ణ మీనన్ మార్గమని చిరునామా దొరికెను. టేక్సీ వెనుకకు మళ్లెను.

ఇప్పుడు మనము ఎచ్చటకు పోవుచున్నాము అని కృష్ణన్ అడుగగా, యమున " సెన్సార్ బోర్డు చైర్మన్ " ఇంటికి పోవుచున్నాము. అని చెప్పగా మీనాక్షి " మీకు భవిష్యత్ లో ఎంతో అవసరముండును కదా ఒక సారి కలిసినచో మీ భవిష్యత్ మారి పోవును ." అని చెప్పగా కృష్ణన్ కి రోమాంచితముఁయ్యెను. ఆనంద భాష్పములు రాలు చుండ "నాకొరకు ఎంత శ్రమ తీసుకొనుచున్నావు మీనా! అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని "ఇక ఈ దర్శకునికి నీవే  మార్గ దర్శకునివి" అని ఆ చేతిపై ముద్దులు పెట్టుచుండెను.  

ఎయిమ్స్ ఆసుపత్రి , సఫ్ దర్ గంజ్ విమానాశ్రయము , లో డి గార్డెన్ , ప్రధానమంత్రి నివాస ప్రదేశమైన, లోక్ కళ్యాణ్ మార్గమును దాటుకొని పోవుచుండగా కృష్ణన్ కు అద్భుత సృజనాత్మక భావనలు మేలుకొనుచుండెను.   "ప్రపంచము బిత్తరపోవు దర్శకత్వము  స్క్రీన్ ప్లే  తో ప్రేక్షకులు కనీ విని ఎరుగని  నూతన చిత్రములను  ఆవిష్కరించి చూపెదను. " అని ఆవేశపూరితముగా అనుచుండగా యమున " అన్నంతపనీ చేతురెమో  అట్లు చేసిన మీరు దర్శకుడే కాక దార్శనికుడు అని కూడా అందురు. " అనెను.  మీనాక్షి చరవాణిలో అరుణకొరకు  ప్రయత్నించుచుండెను, కానీ ఫలితము లేకుండెను.   వాహనము గాంధీ స్మృ తి దాటి  కృష్ణ మీనన్ మార్గ్ నందు ప్రవేశించి  మూడు సంఖ్య గల భవనము ముందు ఆగెను. 


ఒక డజను మంది పోలీసులు బారికేడ్లు వద్ద కాపలా కాయుచున్నారు.  మీనాక్షికి చరవాణి  కలువకున్నది. పోలీసులు ఎంత వేడిననూ లోపలి పోనీయకున్నారు. చేయునది లేక పరిస్థితిని ఒక అధికారికి వివరించెను. అతడు "  గ్రామీణ అభివృద్ధి, భూవనరుల శాఖ సెక్రటరీలతో , రహదార్లు , వ్యవసాయము , సాంకేతిక  శాఖల ఉన్నత సిబ్బంది తో జాతీయ కార్యాచరణ పై సమావేశము జరుగుచున్నది. మీరు వేచి యుండక తప్పదు అని చెప్పగా మీనాక్షికి దుఃఖము ముంచుకొచ్చెను. వర్షుడు ఇచ్చిన పాత చిరునామా పట్టుకొని కృష్ణన్ ను వెంట పెట్టుకొని వచ్చి నందుకు తనను తాను నిందించుకొనెను. యమున టేక్సీకి డబ్బిచ్చి పంపుచుండగా కృష్ణన్ "అరుణతార, గ్రామీణశాఖా మాత్యులు" అను నామఫలకమును చూచి ఖంగు తినెను.   టేక్సీ వెడలెను. మీనాక్షి రహదారిపై మిగిలెను.  

రహదారిపై నిలచిన మీనాక్షి "దైవమే దిక్కని భావించి మనసులో ప్రార్ధించుచుండెను."  కృష్ణన్ వడివడిగా అడుగులు వేయుచూ మందికి సాగుచుండెను.అరుణతార  మెరుపువలె  గేటువద్ద ప్రత్యక్షమయ్యెను. పోలీసుబారికేడ్లు దాటుకొని పరుగు పరుగున వచ్చుచుండగా, ఉన్నత స్థాయి అధికారులు ఆమె వెంట రక్షక కవచమువలె వెంట పడుచుండిరి. అందిరినీ కనుసైగతో వెనుకకు పంపించిననూ నల్లదుస్తులు ధరించి ఆయుధములు ధరించిన పఠాలము మాత్రము వెనుదిరగక ఆమె చుట్టూ యుండిరి.    మీనాక్షి కళ్ళు వర్షించుచుండెను.  ఆమెకు  అరుణతార ఆకాశము నుండి ఊడిపడ్డ ఉల్కవలె తోచెను. అరుణతార మీనాక్షి యమునల చేతులను రెండు చేతులతో పట్టుకొని,  ముందుకి  సాగుతున్న వ్యక్తిని  తేరిపార చూచుచుండ , కనుసైగ చేయకున్ననూ , కమాండోస్ పరుగు పరుగున పోయి కృష్ణను అటకాయించిరి.  కృష్ణన్ వెనుతిరిగి చూచెను, అరుణతార బిత్తర పోయెను.

                                  

యమున పరుగు పరుగున పోయి మామయ్యగారు రండి అని చేతిని పట్టి లాగుచుండెను. 

"అది మినిస్టర్ అయిన నీకు గొప్ప కావచ్చు నాకు వరుగునదేమియునూ లేదు" అని అనుచుండగా అక్కడ ఒక తెలుగు అధికారి " ఏమది ?" అని గద్దించుటతో స్వరము మార్చి  "చూడమ్మా మినిస్టర్ గారి వద్దకు  వద్దకు తీసుకుపోవుచున్నట్టుగా నాకు చెప్పలేదు, నేను పోవుచున్నాను" అని అనుచుండగా మీనాక్షి తారతో  "నాశక్తి అంతయూ ఉడిగిపోయినది నీవు స్వీకరింతునన్న బహుమతి ఇదిగో !" అని (మీనాక్షి) అక్కడే  కూలబడెను.  అరుణ తార పోయి కృష్ణన్ చేతిని అందుకొనెను. 

 యమున మదిలోఅవ్యక్త మధురరాగమెదో ఉదయించి వెచ్చని ప్రవాహమై మేనంతయూ మేఘమై అలుముకొనెను.  పలురాగములు పలికించుస్వరాణి నేడు నిశ్శబ్ద రాగమును పలికించుచున్నది, అది ప్రేమ వర్షమై కురియుచుండ  యమున కనులముందు నిలచిన  మీనాక్షి క్రక్రమముగా పెరుగుచూ మేరు పర్వతపరిమాణము చేరుకొనగాయమున ఆ పర్వతము ముందు యమున పిపీలకము వలె అనుభూతిచెందుచూ  " ప్రేమతో నిండారు రాగము రాగము...నిస్వార్థ నిర్యాణమున జనియించు వెలుగు వెలుగు. నిండు మనసుతో జీవించు జీవి జీవి."  అని తలంచుచూ దేవతామూర్తివలే వెలుగుచున్న మీనాక్షిని చేష్టలుడిగి చూచుచుండెను. 

 


                                                      ***

మీనాక్షి కళ్ళు తెరచి చూడగా  మెత్తటి పరుపు పై శీతల వాయువులు తాకుచుండ. మీనాక్షి చుట్టూ కలియజూసెను .  అరుణ తార పళ్ల రసము అందించుచూ " ఇప్పుడెట్లున్నది ?" అని అడిగెను , మీనాక్షి ఎదో చెప్పబోవుచుండగా  అరుణ "గతవారం నుండి విశ్రాంతి మరచి  నీవు  పడుశ్రమంతయూ నాకు తెలిసినది " అనగా మీనాక్షి యమున వైపు కృతజ్ఞగా చూసేను. " “సమావేశము ముగిసెనా ? బావగారు ఎక్కడ ?"  అని అడిగెను. 

" అవన్నీ ఇప్పుడెందుకు విశ్రాన్తి తీసుకొనుము " అని అరుణతార అనగా మీనాక్షి మొఖంలో యాతన స్పష్టముగా కనిపించెను. "ఆయన వెళ్లి పోయినాడా ?" అని భాదాతప్త హృదయముతో అడుగు చుండగా " ప్రక్కగదిలో నున్నారు " అని తార బదులు పలికెను .

ఇంతలో ప్రక్కగది తలుపు తెరుచుకొనెను. కృష్ణన్ ప్రవేశించెను . "భర్త అంటే గౌరవం లేని వ్యక్తి , నా పని మీద నమ్మకం లేని వ్యక్తి , కన్నకూతురిని గాలికొదిలేసిన వ్యక్తి ఈ రోజు పదవిలో ఉందని తన ముందు చేతులు కట్టుకొని నిలబడనా?  ఇలా చూడు మీనా , ఆ యాం సారీ మీనాక్షిగారు మీకు మాట ఇచ్చినందుకు కాదు మీరు పడ్డ శ్రమ కి విలువ ఇచ్చి లోపలి వచ్చాను !" అని మీనాక్షి తో ఉద్విగ్నముగా బ్రద్దలగుచున్న కృష్ణన్ ని చూసి మీనాక్షి మందహాసము చేసెను. 

యమున " భర్త అంటే గౌరవం లేదని రంకెలు వేయుచున్నావే , గౌరవముండబట్టే నీ చేతినందుకొని లోపలకి తీసుకొ చ్చెను, మీనాక్షి అమ్మ శ్రమకి విలువ ఇచ్చి తాను ఇప్పుడు కూడా మాట్లాడక మౌనముగా నున్నది , మాట్లాడుట చేతకాక అనుకొనుచున్నావా ? కూతురిని గాలికొదిలేసినదని ఆక్షేపించువాడవు నీవా?  కూతురి గురించి నాకు అన్ని విషయములు చెప్పినది. అన్ని ఏర్పాట్లు చేయుచూ నీడవలె ఆమెను అనుసరించుచున్నది.  ఏమి మగవాడి వయ్యా!   పెళ్ళాము మనసు అర్ధము చేసుకోలేని వాడివి ప్రేక్షకుల మనసు అర్ధము చేసుకొని చిత్రములు నిర్మించ బయలు దేరు చున్నావు.  నీలాటి భర్తలవల్లే భార్యలు జీవత్సవముల వలే బ్రతుకుచున్నారు, వయసొచ్చినది ఎందుకూ! " అని ఉతికి ఆరేసిన పిదప ప్రక్క గదిలోకి పోయి తలుపు వేసుకొనెను.  

మీనాక్షి అయ్యో యమున అనుచూ తలుపు దగ్గరకు పోయెను,  తార తలుపు తట్టగా స్పందన లేకుండెను.   కృష్ణన్ "అమ్మ యమునా నీకొక నిజము తెలపవలెను తలుపు తియ్యమ్మా"  అని పిలవగా తలుపు తెరుచుకొనెను.  తప్పు నాదేయని ఎప్పుడో తెలిసిననూ, అరుణను చూడవలెనని అనిపించిననూ , ప్రేమను తెలపవలెనని అనిపించిననూ ,  అహంకారము వలే కనిపించు సిగ్గుతో  నా అంతట  నేను అరుణను కలవలేకపోతిని. మీరు ఇరువురూ మా సఖ్యత కొరకు సిగ్గు విడిచి,  ఎంత పరితపించి  మమ్మల్ని ఒకటి  జేసినారు. అని మీనాక్షికి తప్పులు క్షమించమని నమ స్కరించెను . 

నాకించ్చిన మాట నిలబెట్టుకుని  దంపతులు ఇరువురు నేనిచ్చిన బహుమతులు శ్వీకరించుట చాలా ఆనందముగా యున్నది  అరుణ చేతిని వీడనని నాకు మాట ఇవ్వవలెనని  కృష్ణన్ ని  మీనాక్షి అడుగుచుండగా యమున  "అత్తయ్య  చేయి పట్టుకున్నప్పుడు  మామయ్యగారి కళ్ళలో మెరుపు చూసినాను.  అత్తయ్య అందము చూచి మామయ్యగారు అప్పుడే పడిపోయినారు. నిజము ఒప్పుకొనవలెనని   ఉడికించసాగెను.  కొంత సేపు తప్పించు కొనుటకు చూసిననూ, మొఖమునందు సిగ్గు స్పష్టముగా కనిపించుటతో తప్పించుకొనుట కుదిరినది కాదు. మీనాక్షి "ఏది బావగారి చేతిని ఎట్లు గ్రహించితివి ? నేను చూడనే లేదు మరొకసారి పాణిగ్రహణము చేయమని మీనాక్షి కోరగా ,యమున పొరగా తార భర్త చేతిని మరల అందుకొనెను. అతడు తారను రెప్పవేయక చూచుచుండ తార సిగ్గు పడు చుండెను. అతడు మెల్లగా దరిచేరి ఆమెను ఘాడ పరిష్వంగమందు ముంచెత్తెను.  ఇచ్చట మనముండరాదనుచు యమున మీనాక్షి ని పక్క గదిలోనికి కొనిపోయెను.       


 

Monday, January 25, 2021

Bharatavarsha 119

 మధ్యాన్నాము 3. 00 గంటలు అందరూ మండువా గదిలో కూర్చొని విశ్రాన్తి తీసుకోను చుండిరి. వలదు మొర్రో అని మొత్తుకొనుచున్ననూ వినక జానకిగారు మాటి మాటికీ ఏదో ఒకటి పళ్లెములలో పెట్టి నోటికి అందించుచున్నారు. ఆమె పళ్లెములతో వచ్చుట చూసి యమునకు చమటలు పట్టుచున్నవి. మధ్యానమునకు ఇదే ఆఖరు అనుచూ జానకిగారు కేరళ పిండివంటలు ఉన్ని అప్పము, చట్టి పతిరి, ముత్తమాల లతో అతిధులను సత్కరించిరి. ఇంకా రాత్రి కేమి చేయు చున్నదో తల్లి అని మీనాక్షికి గుండె కొట్టుకొనుచుండగా “కేరళ ప్రత్యకతలెట్లున్నవి అని జానకి గారు అడిగిరి.  "కేరళ కుత్తుకలో ఉన్నది అని మీనాకి బదులు పలికెను. 

మీనాక్షి చుట్టూ గోడలు చూచుచుడెను. “కేరళ వంటలవలె కేరళ గృహ అలంకరణలు కూడా మనమును ఆహ్లాద పరుచున్నవి.” అని యమునతో మెల్లగా అనెను.  ఆమె పక్కకు చూచు చుండగా జానకి గారు మరిన్ని ఉన్ని అప్పములు వడ్డించిరి. 

నీటితో నిండిన ఉత్తురిలి కుండిక నేలపై ఒక మూలగా అమర్చబడెను, గుమ్మానికి కట్టిన వస్త్ర తోరణములు గాలికి వూగుచుండెను, వ్రేలాడుచున్న ఇత్తడి పంచములు, టేకు ధీరఘోత్పీఠిక పై (rectangular desk) నుంచబడిన ముచ్చట గొలుపు లలితాంబిక రాతి విగ్రహము, రఘువరన్ గారి గది ప్రవేశ ద్వారము వద్ద చెరువైపులా నెత్తి పట్టములను మీనాక్షి ఆసక్తిగా తిలకిచుచుండెను.  

వాటిగురించి వివరించుచూ జానకి గారు పిండి వంటలు రెండు విడతలు వడ్డించినారు. మూడవ విడత వడ్డించుచుండగా మీనాక్షి గ్రహించి "ఏవమ్మా పక్కకి చూచుచుండగా ఇట్లు వడ్డించి తినమనుచున్నావే అని గయ్ మనెను. యమున మీనాక్షి కోపమును చూచి కిసుక్కున నవ్వెను. అయినచో తినును అనుచూ మీనాక్షి తన పళ్ళెములో అప్పచ్చిలను యమున పళ్ళెములో వేయగా యమున ముఖము కళ తప్పినది. 

ఆ ప్రక్కనే ఉన్న ప్రఫుల్ల గది ప్రవేశద్వారం పై మోహినియట్టం కిరీటము ధరించిన ముఖము ఒక వంక గోడకు వేల్లాడు చుండెను. అప్పచ్చిలు తిన్న పిదప ప్రఫుల్ల మోహినీ యట్టం ముఖము ధరించి ఆ నాట్యమును ప్రదర్శించుచుండెను. “ఆంధ్రాలో కూచిపూడివలె ఈ నాట్యము జనాదరణ పొందినది.” అని జానకిగారు అనగా, “ఎవరు కనిపెట్టినారో గానీ ఈ నాట్యము అద్భుతముగా నున్నది అని యమున అనెను.

 మహారాజ రామవర్మ 18 వ శతాబ్దం లో  ట్రావెన్కోర్ రాజ్యాన్ని పరిపాలించిన  రాజు. అతను అద్భుతమైన సంగీత స్వరకర్త   కర్ణాటక మరియు హిందూస్థానీ శైలిలో 400 కి పైగా శాస్త్రీయ స్వర కల్పనలు చేసి ఘనత కెక్కిన పండితుడు  అతని కాలమందు ఈ మోహినీయాట్టం సృజించబడినది. అని జానకి గారు చెప్పగా. ఈ విషయములన్నీ మీ కెట్లు తెలియును అని యమున అడిగెను. మాతాత ముత్తాతలు ఆ కొలువులో నాట్యాచార్యులుగా నుండి రాచ కన్యలకు అంతఃపురకాంతలకు నాట్యమును నేర్పెడివారు. అదే కాలమందు మీనాక్షి పూర్వీకులు కూడా ట్రావంకోరు రాజులవద్ద నున్న పండితులు అగుటచే యమున  మీనాక్షి ఆమె వైపు విడ్డూరంగా చూచిరి. కానీ ఆమె మరొక విధముగా అర్ధము చేసుకొనిఆమె ఎదో చెప్పుచుండగా ప్రఫుల్ల తన నాట్యమును మీనాక్షి చూచుటలేదని వగచు చుండుటతోమీనాక్షి ప్రఫుల్లను సముదాయించి నాట్యము చేయమనెను. 

అప్పుడు ప్రఫుల్ల చక్కటి భంగిమలతో కదలికలతో లాస్యముపై దృష్టి నిలిపి నృత్త సౌదర్యమును చూపెను. ఆ నాట్యమును చూచిన అందరి హృదయములు గెంతులువేయుచున్నవి. ఇంతలో రఘువరన్ గారికి ఫోను వచ్చెను. 

ఎల్లుండి కొత్తచిత్రము ఆడియో విడుదలకు ఆహ్వానించుచున్న దర్శకుడు రాజేంద్రన్ కు మీనాక్షి గూర్చి తెలిపి ఆమె స్వరములు నీ చిత్రమునకు మెరుగులు దిదునని చెప్పి ముగించెను. కొలది సేపు తరువాత రాజేంద్రన్ జానకి నిలయం నందుండెను.

ఎల్లుండి విడుదల అనగా నేడు కొత్త గీతము పెట్టుట కష్టమేమో అని మీనాక్షి అనుచుండగా రాజేంద్రన్ "ఒక్కటేమి మీరు సంగీతము సమకూర్చిన దానికి తగ్గ పాట వ్రాయించి పెట్టుకొందును, ఒక్కటని పరిమితేమియునూ లేదు, మీరు నాలుగు ఇచ్చిననూ, పది ఇచ్చిననూ పదిలంగా దాచుకొని తదుపరి చిత్రములో వాడుకొందును అని వత్తిడి చేయుచుండగా మీనాక్షి ఇంకనూ అంగీకరించ కుండెను.

ఇంతలో కృష్ణన్ తప్పదు మీనా అని తన ప్రేమికవలె ఊహించుకొని " మా కేరళకు కూడా నే స్వరములు రుచి చూపవలెను, తప్పదు, నీ మాట నేను నామాట నీవు విన్నచో అద్భుతములు జరుగును అని చెప్పుచుండగా మీనాక్షి " నేనిచ్చిన బహుమతి జీవిత కాలము ." అను చుండగా " ఎంద గురువాయూరప్పనే !  అని పొంగిపోవుచూ యు నాటీ గర్ల్ అని ఆమె చేతినందుకొని బయలుదేరెను . మీనాక్షి నవ్వుతూ అతడితో సాగు చుండెను.    భుజము భుజము రాసుకొనుచూ సాగుచున్న వారి జంటను చూసిన ప్రపుల్లకు తలలో మెరుపులు మెరిసినవి. మామయ్య కంసుని వలే కీచకుని వలే రావణుని వలే వికట్టహాసము చేయుచున్నట్టు అనిపించెను. మీనాక్షి చేతిని అతడు తన చేత పట్టుకొన్న దృశ్యమును చూసి ప్రఫుల్ల కూలబడెను. మీనాక్షి కృష్ణన్ కారులో కూర్చొనెను, యమున క్షణము ఆలస్యము చేయక వారి వెనుక కూర్చొనెను. కారు బయలుదేరెను.   

“మీ మేనల్లుడు నేను చిత్రరంగము నందు ప్రవేశించుట పెద్ద తప్పిదమనుచున్నాడు” మీరిప్పుడు అంతకంటే మంచి పని చేయుచున్నారు మ్యూజిక్ బ్యాండ్ ద్వారా వేల మంది, ప్రజలకు చేరువయ్యిన మీరు నేడు చిత్ర సంగీతము ద్వారా కోట్ల మంది ప్రజల హృదయములలో గూడు కట్టుకొనుచున్నారు.

90 ల చివరి వరకు, చిత్రనిర్మాతలు ప్రధానంగా చెన్నై స్టూడియోలపై ఆధారపడి యుండిరి   చిత్ర నిర్మాతలను చెన్నై నుండి కేరళకు మార్చుటకు సహాయపడిన ఉదయ వంటి స్టూడియోల పేర్లను ప్రస్తావించకున్నచో  మలయాళ చలన చిత్ర చరిత్ర అసంపూర్ణముగా మిగిలి పోవును. లాల్ మీడియా మరియు విస్మయల ఏర్పాటుతో మళయాళ చిత్రపరిశ్రమ సొంత కాళ్లపై నిలిచెను.   ఈమధ్య కాలంలో ప్రారంభమైన వి వి ఎం స్టూడియో మీరు తప్పక చూచి తీరవలెను.  అని కృష్ణన్ చెప్పు చుండగా “రఘువరన్ కి మీరు ఏమాత్రము తీసిపోరు” అని మీనాక్షి కృష్ణను మెచ్చుకొనెను. 

గ్రీన్ మాట్-ఎనేబుల్డ్ షూటింగ్ నిర్వహించడానికి భారీ అంతస్తుల తో విశాలమైన  మల్టీ-లెవల్ స్టూడియో మరియు క్రోమా కీ కంపోజింగ్ సదుపాయాలతో  కొత్తగా   కొచ్చిలో ప్రారంభించబడిన  వివిఎం స్టూడియో నిర్మాణము 14000 అడుగులలో  గల కొచ్చిలో అతిపెద్ద స్టూడియోఅని రాజేంద్రన్ మీనాక్షిని తీసుకొని పోయి. ఆర్కెస్ట్రా గదిలోకి తీసుకు పోయెను యమునా, కృష్ణన్ అద్దముగుండా విశాలమైన ఆర్కెస్ట్రా గదిలో కూర్చొన్న మీనాక్షిని చూచుచుండిరి. కృష్ణన్ అద్దము వద్దకు పోయి విజయ సంకేతముగా బొటన వేలు చూపి చిరునవ్వు నవ్వి మరల వచ్చి యమునా ప్రక్కన సోఫాలో కూరోనెను. 

ప్రేమ గీతము ఒకటి అనుకొనుచున్నాము అని పక్కనున్న ఆర్కెస్ట్రేటర్  మీనాక్షితో అనెను. కొలది నిమిషములు నిశ్శబ్దము రాజ్యమేలెను. మీనాక్షి వేళ్ళు పియానోపై మందగమనమున అటుఇటు నడయాడినవి. ఒక్కసారిగా ఊపందుకొని చెలరేగుచున్నవి ఆర్కెస్ట్రేటర్ మొఖం వెలిగిపోవుచున్నది. పదినిమిషముల తరువాత   మీనాక్షి సంగీత సంకేత లిపి వ్రాసి ఇచ్చెను. ఈ సారి సంగీతకారులు కూడా తోడయ్యిరి. కచేరి మొదలయ్యెను. పది నిమిషముల తరువాత ధ్వనిగ్రహణము  (రికార్డింగ్) పూర్తి అయ్యెను మీనాక్షి వెలుపలికి వచ్చెను. రాజేంద్రన్ ఆమె ప్రక్కనే నిలుచొని యుండగా గ్రహించిన శబ్దధారను వెలువరించిరి.   సంగీతము వెల్లువవలె శబ్ధకారిణు  (స్పీకర్)ల ద్వారా వచ్చుచున్నది.  మధ్య మధ్యలో టడ  ..  టడ అని మ్రోగుచుండగా అందరూ టడ  ..  టడ యని  కాళ్ళు ఊపుచూ వినుచుండిరి. పంప  రంప ... పమ్పటకట  పంపరంప పమ్ప... టకట..  ట్రోమ్బోన్ లు జాజ్ మద్దెల దరువులు జతపడినవి, సంగీతము ఇంకనూ వేగము పెరిగెను, శ్రోతలు చేతులు వూపుచుండిరి. తరువాత ట్రంపెట్, ఫ్రెంచ్ హార్న్ , ట్యూబా ఇట్లు  మొత్తం బ్రాస్ కుటుంబమంతటినీ మీనాక్షి రంగములోనికి దింపెను. రెండు నిమిషములు ఉదృతం స్థాయికి చేసరిన బ్రాస్ కుటుంబము ఒక్కసారిగా మూగబోయి బాస్ డ్రమ్స్ మాత్రము మ్రోగుచుండెను మద్యమద్యలో టడ  టడ అని మీనాక్షి సంగీత ఫలకము  (కీబోర్డు) పలుకుచుండెను.

 సునామీ కెరటం వలే పైకెగసి క్రింద పడుచూ  సభామందిరమును వెల్లువవలె ముంచెత్తి నవి    పోటెత్తిన ప్రవాహమందు చిరు నావల వలే,    సుడిగాలికి చిక్కిన చిరు కాగితపు ముక్కలు  సుళ్ళు తిరుగుచూ సంగీత  తరంగములుర్రూతలూపుచుండగా  నాట్యమాడుచుండిరి.   రాజేంద్రన్ , కృష్ణన్ నిలువరింప జాలక లయాజ్ఞానుసారులై  చెలరేగుచుండ  వారిని చూచి చిరునవ్వులు చిందించుచున్న  ఆ లయజ్ఞానికి యమున మనసులో వందనమొనర్చెను.  మరొక్క నిమిషము తరువాత  యమున కూడా   వివశమంది నాట్యమునందు వారితో చేరెను. అదే సంగీతమును మరల మరల విని నర్తించుచుండిరి.   జేను స్వరరాగిణి, మీనాక్షి సోఫాలో కూర్చొని చిద్విలాసముగా చూచుచుండెను. కాలు బెణికి మీనాక్షి పై తూలిపడిన యమున ప్రక్కన కూర్చొని “ఎట్లు కల్పింతువే ఇట్టి సంగీతమును అని యమున ఆమె మెడలో వ్రేల్లాడుచుండగా ఒక వ్యక్తి వచ్చి పాదములకు నమస్కరించి పాటగాడినని పరిచయము చేసుకొని " మీ బృందమందు పాడవలెనని మిక్కిలి కోరికతో యున్నాను, నాగొంతు విని బాగున్నచో నాకు ఒక అవకాశమిమ్మని ఒక టేప్ రికార్డర్ ఆమె చేతిలో పెట్టి ఇందు నేను పాడిన పాట  కలదు అని వేడుచుండగా అక్కడి వారు అతడిని క్షణములలో బైటకు తరిమి వేసినారు, యమున  టేప్ రికార్డర్ ను మీనాక్షి నుండి తీసుకొనెను. యమున కాలు నొప్పిచే అచ్చటనే కూర్చొని యుండగా కృష్ణన్ మీనాక్షిని కొనిపోయి స్టూడియో చూపి తీసుకువచ్చెను.  పిదప వారు ఇంటికి బయలుదేరిరి.   

“క్రిష్ట్నుని సులభముగా లైనులో పెట్టితివే.” “ఇట్లు మాట్లాడిన నేను నీతో మాట్లాడను.”అతడిని దారిలో పెట్టుటకే కదా నీవు వచ్చినది. అని యమున తన మాటలను మార్చి చెప్పగా మీనాక్షి కి ఆనందమాయెను. హి హి హి  అని యమున పళ్ళికిలించి మీనాక్షిని వెక్కిరించెను.   అరుణ తారను  ఇంటివద్దనే ఉండవలసినదిగా కోరితిని ఆమె అంగీకరించెను.   రేపు అనుకున్న లక్ష్యము నెరవేరుచున్నది. 

మనము రేపు ఉదయాన్నే ఢిల్లీ బయలు దేరుచున్నాము. ఇతడిని ఆమె చేతిలో పెట్టినచో నాకు ఇంకొక్క భాద్యత మిగిలి యుండును.  అది ఇంత  సులభము కాదు అందము చూచి కరుగుటకు సుందరి పురుషుడు కాదు. వర్షుడే చెప్పుటకు సాహసించనిచో, దేవుడిపై భారము వేయవలెనంతే" అని మీనాక్షి నిట్టూర్చి ఆ టేప్ రికార్డ్ లో పాటగాడి గొంతు వినవలెను పాపము ఎంత దీనంగా వేడినాడు అని   టేప్ రికార్డ్ నొక్కుచుండగా యమున విసురుగా దానిని లాక్కొని " ఇటువంటి విషయములందు జాగ్రత్తగా నుండవలెను” అని టేప్ రికార్డ్ను దూరముగా నుంచి పైట చుట్టిన చేతిని ముఖమునకు అడ్డు పెట్టుకుని మీట నొక్కుచుండగా మీనాక్షి ఆమె భయమును చూచి నవ్వు చుండెను. యమున మీట నొక్కగానే ఒక్క సారిగా పేలుడు సంభవించెను. టేప్ రికార్డ్ తునాతునకలయ్యెను. యమున ఫైట కాలి  పోయెను. మీనాక్షి అవాక్కయ్యెను.

ఇట్లు  చేయనిచో  రేపటి ప్రయాణము రద్దగును నీవు పడిన శ్రమ అంతా  వృధా అగును. శంకర్ గణేష్ అని సంగీత ద్వయం పేరు వింటివి కదా!  1986 లో   పోస్ట్ ద్వారా గణేష్   ఒక అనామక పార్శిల్ అందుకొనెను. అతడికి ఇదే సంఘటన జరిగెను అతని ముఖంలో టేప్ రికార్డర్ పేలి అతని చేతులకు, కళ్ళకు గాయాలయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ చేసి అతని చేతులను పునరుద్ధరించగా. కీబోర్డును వాయించుటకు చేతులు సహకరించెను , కాని అతను దృష్టిని కోల్పోయెను. యమున చెప్పుట ఆపగానే  మీనాక్షి కి  కన్నీరు పెల్లుబుకుచుడెను.  యమున “నీ కంటికి రెప్పను.” అన్న మాటలు గుర్తుకువచ్చి మీనాక్షి బాధ మరింత హెచ్చెను.  “అనేక మంది గాయక గాయనీ మణులను , నర్తకులను , నటులను  కూలదోసిన వారి గూర్చి విని యుంటిని.  చీకటిలో నున్న నీ శత్రువులపట్ల జాగ్రత్త  వహించవలెను.  జేను స్వరరాగిణి! నీవు ఇప్పుడు మామూలు వనితవు కాదు అర్ధమయినదా!” అని యమున  గుండెలకు హత్తుకొనగా మీనాక్షి మొఖంలో చేమంతులు వికసించినవి. క్రమముగా మీనాక్షి భాద కరిగి మనసున  సంతోషము నిండుకొనగా  యమునను  ప్రేమతో ముద్దాడెను.        

Sunday, January 24, 2021

Bharatavarsha 118

ముంబాయ్ అంధేరి వెస్ట్ వర్మ నివాసం : వర్మ తలుపు తీసి లకుమను చూసి “కమాన్ బేబీ కూర్చో” అని సోఫాలో కూర్చోబెట్టి ,“నీకీ మోడన్ డ్రెస్సులు బాగా నప్పుతాయి,  బికినిలో  ఇంకా బాగుంటావు ,  కమాన్ ఒక స్మాల్ పుచ్చుకో! 

లకుమ "ఇంత ఉదయాన్నే..." "ఏ ఉదయం తాగకూడదా ?! నాకు ఆ పట్టింపులేవీలేవు ఉదయానే పూజ , తీర్థం" 



  

పూజ చేస్తారా మీరు! అని లకుమ నమ్మ లేనట్టు చూడగానే వర్మ కిసుక్కున నవ్వి మహిమా అని పిలిచాడు పడక గది లోంచి ఓ పాతికేళ్ల చిన్నది చిన్న దుస్తులలో వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో అతడి ప్రక్కన కూర్చుంటుం డగా వర్మ ఆమెను తన ఒళ్ళో కి లాక్కొని ముద్దాడుతూ లకుమ పెదాలను చూపుటి వేలితో తాకాడు " పూజ చేసిం ది దీనితోనే " అని వెకిలిగా నవ్వాడు. “సరే నేను మళ్ళీవస్తాను ఇది సరైన సమయం కాదనుకుంటాను”  

అదేంటి రాక రాక వచ్చి వెళ్లి పోతానంటావేంటి, నువ్వెప్పుడొచ్చినా నేను ఇలాగే ఉంటాను

ఈలోగా టీవీ వాళ్ళు వచ్చారు ఛాయా గ్రాహకుడు అతడి సహాయకుడు, ఒక జర్నలిస్ట్. 

 జర్నలిస్ట్ “ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ అనుకున్నాం కదా సార్ ఇంటికి రమ్మన్నారు” 

వర్మ “గుర్తుంది , ఎందుకు కంగారు పడుతున్నారు!” 

జర్నలిస్ట్ “ఏంలేదు సార్ , మీరు ప్రయివేట్ గా ఉన్నారు కదా, కాస్సేపు పైన వైట్ చేస్తాము” 

వర్మ “ఇదే నా పర్సనల్ లైఫ్  అభ్యంతరము లేక పొతే నువ్వు షూట్ చేసుకోవచ్చు” , మహిమ " నన్ను కెమెరాలో చూపవద్దు” అని కెమెరా వెనుకకు పోయికూర్చొనెను. 

లకుమా, మహిమ చిన్న దుస్తులతో ఉన్నది కాబట్టి మహిమ కెమెరా వెనుకకు పోయింది, నీకు ఆ అవసరం లేదు , నువ్వు నా కొత్త హీరోయిన్ అని పరిచయం చేస్తాను, కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకొని , వియార్ రెడీ అన్నాడు. 

ఛాయాగ్రాహకుడు కెమెరా ప్రారంభించాడు జర్నలిస్ట్ మైక్ పట్టుకుని " తెలుగు చిత్ర రంగంలో పెను మలుపు, సెక్స్  వైలెన్స్ల కలగలుపు;   శవం , పంతం, పిశాచం, నీ పెళ్ళాన్నిలేపేయ్.  వంటి  సంచలన చిత్రాల  దర్శకుడు వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పక తప్పదు , ఈ రోజు వర్మ గారి లైఫ్ కెరీర్ కొత్తసినిమాలు గురించి మాట్లాడుకుందాం,  నమస్తే వర్మగారు సినిమాపిచ్చి ఛానల్ కి స్వాగతం 

మీ సినిమాపిచ్చి ఛానల్ నాకు పేరు బాగా నచ్చింది, మొన్న ఎవరో మదపిచ్చి ఛానల్ అని వచ్చారు  అది  కూడా బాగా నచ్చింది . ఎందువలన అన్న   ఆంధ్రప్రదేశ్ ని కమ్ముకొని కుమ్ముచున్నవి  ఈ రెండు పిచ్చి లే!  

థాంక్ యూ, మీ డైలీ రొటీన్  ఏంటి? ఎన్ని గంటలకు లేస్తారు ? అంటే లేవగానే ఏంచేస్తారు? 

లేవడానికి ఒక  టైమేమీ ఉండదు. పడుకోడం బట్టి ఉంటుంది . 

సరే ఎన్ని  గంటలకు పడుకుంటారు, అది పక్క న ఉండే అమ్మాయిని బట్టి ఉంటుంది. 

మరీ ఇంత  ఓపెన్ గా చెప్తారని అనుకోలేదు. ఇంతకీ లేవగానే ఏంచేస్తారు ?

ఒక బ్లు ఫిలిం చూస్తాను. “ఈ రోజు కూడా చూసారా?” 

ఇంకా లేదు, ఇప్పుడే లేచాను, నాకు లేచింది , ఇప్పుడు నాకొకర్తి కావాలి 

ఛాయా గ్రాహకుడు టీవీరిపోర్టర్  ఖంగు తిన్నారు. లకుమ అతడి పక్కనుంచి లేచిపోయింది “ఏంటిదంతా!” ఆవేశంగా అరిచింది. “టెన్షన్ పడకండి మేడమ్ ఇది లైవ్ కాదుకదా ఎడిట్ చేసేయవచ్చు. "నో డిలీట్ చేయండి నేను కూడా ఇంటర్వ్యూ లో ఉండను." అని  వెనక్కి పోయి కూర్చుంది” కానీ ఇంటర్వ్యూ అదే విధంగా  కొనసాగింది. 

చెప్పండి వర్మగారు ఎప్పుడూ కొత్త హీరోయిన్స్ను పరిచయం చేస్తుంటారు కదా, లకుమగారితో కొత్తచిత్రం తీస్తు న్నారా?  వర్మ మాట్లాడలేదు లకుమవైపే చూస్తున్నాడు.ప్లాన్  చేస్తున్నాము, చూడాలి.  అన్నాడు ఎట్టకేలకు నవ్వుతూ

లకుమ గారిని సినిమా పిచ్చి ఛానల్ ప్రేక్షకులు కొత్త హీరోయిన్ అనుకోవచ్చా!

ముందే నేననుకోవాలికదా అన్నాడు వర్మ " మీరేమనుకుంటున్నారు అన్నాడు జర్నలిస్ట్

కొత్త గర్ల్ ఫ్రెండ్  -  అను కుంటున్నాను. ఇలాగే తెంపరి తనంతో అసభ్యంగా మాట్లాడుతూ వర్మ సమాధానాలు ఇస్తు న్నాడు. ఇంటర్వ్యూ అరగంట కొనసాగిన తరువాత ముగిసే సమయానికి “పోర్నోగ్రఫీ చూడడం మంచిది కాదని అంటారు పోర్నోగ్రఫీ మీద మీ అభిప్రాయం?” అని అడిగాడు జర్నలిస్ట్   

పోర్నోగ్రఫీ యువతీ యువకు లందరికీ నిత్య జీవితంలో భాగంకావాలి. పోర్న్ స్టార్ అనే వృత్తిని మనం గౌరవించగలగాలి. నేటి తరం అమ్మాయిలు ఫోర్నస్టార్స్ అవ్వాలని లక్ష్యం ఏర్పరుచుకుంటారు.

హీరోయిన్ గా ఈ మధ్యనే హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి గ్యాప్ వచ్చి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న  లకుమ గారికి మంచి బ్రేక్ రావాలని, ఆంధ్ర ప్రేక్షకులు వర్మగార్ని మదపిచ్చి , సినిమాపిచ్చిని (చానెల్స్) మరింత ఆదరించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్  
                                             ***
ముంబయ్ జుహు బీచ్ స్టార్ ప్లాజా: లకుమ పడక గది తలుపు మూసి ఉంది. గదిలోంచి జాజ్ సంగీతం వినవస్తోంది.  లకుమ చిన్న మినీ వేసుకొని పైన చిన్న టాప్ వేసుకొని నాట్యం చేస్తున్నది. రోహిత్ తలుపు కొట్టాడు సమాధానం లేకపోవుటచే  తలుపు తెరచి లోదుస్తుల్లో ఉన్న లకుమను చూసి గుటకలు వేసెను . లకుమ పక్కన మంచం మీద ఉన్న తువ్వాలు కప్పుకొని "మానెర్లెస్ ఫెల్లో తలుపు తీసేవరకు ఆగలేవా  అని విరుచుకు పడెను  " రోహిత్ వెంటనే గదిబైటకు వెళ్లి మొఖం చాటేసెను . లకుమ మొహం మాత్రం బైట పెట్టి, క్యా హై ? క్యా చాహియే? అని అడిగెను . “చాయ్ వాయ్ కుచ్” అని రోహిత్ అంటుండగానే “ఆగలే ఐసా నహి హోనాచాహీయే” దబ్ మని రోహిత్ ముఖంమీద తలుపు మూసుకొన్నది .
పండిట్ పక్కనే కనిపించగానే రోహిత్ మొహం ఎర్రబారేను. పండిట్ జి ఆప్ సీదా అందర్  చలీయేనా ఇద్దరు క్యోన్ ఇంతిజార్ కరతే హో అంటున్న రోహిత్ మనసు గ్రహించిన పండిట్ ఐసా భర్తమీజీ మై కభీ నహీ కారూన్గా   అని పండిట్ లకుమ బెడ్ రూమ్ తలుపు దగ్గర ఆగి తలుపు కొట్టి    "నిన్న ఒక ఆర్ట్ ఫిలిం డైరెక్టర్ గారిని కలిసాను, మీ అభ్యాసం పూర్తి చేసుకొన్న పిదప మాట్లాడవలెను. నేను బయట వేచియుందును. పండిట్ గొంతు వినగానే తలుపు తెరుచుకొనెను. చెయ్యి పట్టి పండిట్ ని లోపలికి లాగెను.

పరుపు పై   కూర్చోండ బెట్టి నా నాట్యము ఎట్లున్నది  అనిలకుమ అడుగగా ,  నాట్యము గూర్చి   నేను అంత బాగా చెప్పజాలను కానీ మీరు వర్మ కలిసినారని అర్థమైనది , నేను నిన్నరాజశ్రీ ప్రొడక్షన్స్ డైరెక్టర్ గారినిని కలిసాను. రాజశ్రీ అనగా కళా చిత్రములు నిర్మించు సంస్థ , ప్రపంచ ప్రఖ్యాతి కెక్కిన తారాచంద్ బారజాత్య కదూ? అని లకుమ అడుగగా నిజమే కానీ ఆయన కాలము చేయుటచే ఆ సంస్థను అతడి మనవడు సూరజ్ చూచుచున్నారు. ఆయన అధ్యక్షుడే కాక , రచయితా  మరియు సంస్థ అధిపతి కూడా. అతడు తీయబోవు చిత్రమందు హీరోయిన్ చెల్లి పాత్ర మీకు ఇవ్వవలెనని చూచుచున్నాడు, వర్మవంటి వాడు కాదు. వర్మకు అతడికి హస్తి మశకాంతరము కలదు. “ఈ చెల్లి పాత్రలు నేను చేయజాలను, అయిననూ నేను వర్మను కలసినట్లు నీకెట్లు తెలియును?” పండిట్ మందహాసము చేసెను.
లకుమ: అమానుషముగా అవమానకరముగా  నున్న అతని ప్రవర్తనా సరళి మరియు అచ్చట జరిగిన దంతయూ చెప్పిన పిదప  "ఒక గొప్ప దర్శకుడు అట్లుండునని చెప్పినచో ఎవ్వరూ నమ్మ జాలరు."  

అతడు గొప్పదర్శకుడని ఎవరు చెప్పినారు ఒక కొకారి, అనాకారి.  యూట్యూబ్ వీడియోలతో చెండాలమును విక్రయించు వ్యర్ధ జీవి,  అతడు ఇప్పుడు అసలు దర్శకుడేకాదు, మానసిక రోగి.  ఒక్కరోజులోనే అతడి వీడియోలు లక్షలాది మంది చూచుచున్నంత కాలము అతడి సంపాదనకు డోకా లేదు.  ప్రజల వెర్రితనంతో ఆడుకొనుట అతడికి వెన్నతో పెట్టిన విద్య.  అతడు తీయు చెత్త సినిమాలు ప్రజలు చూచుట ఎన్నడో మానివేసినారు, వరుస నష్టములు చవి చూచిననూ తన నక్క జిత్తులతో ప్రజలను రెచ్చగొట్టి  చెత్త చిత్రములకు కూడా ఉచిత ప్రచారముచు  కల్పిం  కొనును.   తీసిన కథలే అటూ ఇటూ తీయుచూ.అడిగినచో ఏదో చిన్నతత్వ మీమాంస ల న డ్డుపెట్టుకొని తప్పించుకొను చుండును. గట్టిగా అడిగినచో చూచినచో చూడవలెను లేకున్నచో లేదు నేనూ నా నిర్మాతా చల్లగా ఉండగా మధ్యలో మీకేల బాధ అని ఎదురు  దిగును. 

మీరు నమ్మని నిజమేమనగా ఆడవారి శరీరము కొరకు మాత్రమే చిత్ర రంగమందు న్నవారిలో ప్రముఖులు   సంజయ్ భాయ్, వినోద్, వర్మ.  మీరు ఆ వర్మ చిత్రమందు చేయుటకు వీలు లేదు, “కానీ నేను ఒప్పందములపై సంతకం చేసి చెక్కు కూడా తీసు కొంటిని మాట ఇచ్చి వెనుకకు పోవుట వల్లని పని, వర్మ చిత్రములలో చేసిన మంచి భవిష్యత్ ఉండునని అనేకులు చెప్పినారు, కానీ వామ్ప్ రోల్ ఇచ్చుటచే నామనసుకు కూడా కష్టముగా నున్నది. మిమల్ని అటువంటి పాత్రలలో చూడలేను. "ఆ పాత్ర చేయవలదు  వర్మ చిత్రములలో వామప్ రోల్ అనినా దిగజారుటే."
పండిట్ చెంప చెళ్లు మనెను.  పండిట్మౌనముగా నిష్క్రమించెను.

Saturday, January 23, 2021

Bharatavarsha 117

 ప్రాతః సప్తవాదనే భవతి: బెంగళూరు నగరే  కెంపేగౌడ  రోహణాగ్రే అనేకే యాత్రికాః  బహుకాలతః  కొచ్చి గచ్ఛన్తం వాయుయానార్ధం ప్రతిక్షా కుర్వన్తి.  మీనాక్షి, యమునా చ  తత్ వాయుయానార్ధం ప్రతిక్షా కురుతః.  తద్ప్రదేశే మూకత్వ రాజ్యతి. యమునా సంతుష్ట ఇతి భాతి. కింతూ మీనాక్షి,    ఏవం నిశ్చయేన కుప్యతి. 

సమయం ఉదయం ఏడు గంటలయ్యింది  ఫిబ్రవరి మాసం పొగమంచు  తెరలు వాతావర్ణములో తేలాడు చున్నవి. మీనాక్షి యమునలు విమానాశ్రయంలో కొచ్చి పోవు విమానము కొరకు వేచియున్నారు. యమునను కొచ్చి తీసుకు పోవుట మీనాక్షికి సుతరామూ ఇష్టము లేకున్ననూ, యమున వెంట బడుచుండుటచే కూడా తీసుకుపోవుట తప్పినది కాదు. అందుచే, చిత్ర సంగీత కూర్పు, అంకణ ( recording)  కార్యక్రమములు విజయవంతముగా పూర్తి చేసుకొని ప్రయాణ మగుచున్ననూ ఆమె వదనము కుప్యము(కోపము)గానున్నది. యమున ఆమెను రంజింపజేయుటకు యత్నించుచున్నది. 

“బెంగళూరు నుండి రహదారిమార్గమున 549 కిలోమీటర్లు దూరము నున్న కొచ్చి, వాయు మార్గమున 366 కిలోమీటర్లు మాత్రమే. భూమార్గమున పోవుటకు 10 గంటలు వలయును గానీ వాయుమార్గమున బోవువారికది యొక గంట మాత్రమే” అనుచూ యమున సోఫా నుండి లేచి ఆ ప్రాంగణములో జింకపిల్ల వలే తిరుగుచూ కన్నడ చిత్ర గీతము " నాద నాద ప్రేమద  నాద జీవన వీణా తంతియల్లి " ప్రేమ లో  నడవమని అర్ధము వచ్చు పాటను పాడి “నాద బ్రహ్మ హంసలేఖ స్వరపరిచిన అండమాన్ చిత్రం నుండి ఒక గీతము విన్నారు.  అని మీనాక్షి వైపు కొంటెగా చూచుచుండెను. మీనాక్షి కోపము తో కుతకుత ఉడుకు చుండెను. ఇప్పుడు “జేను-స్వర-రాగిణి” (తేనె-స్వరాల-రాణి) మీనాక్షి స్వరపరిచిన హనీమూన్  చిత్రం నుండి ఒక గీతము “ప్రీతియల్లి.. ప్రీతియల్లి..  ఈజికొల్లి.. ఈజికొల్లి.. కయ్ కయ్ జోడిసి” ప్రేమ లో ఈదమని ప్రేమించిన వాని చెయ్యి చేకొని వదల రాదని చెప్పు గీతము. 

ఆహా! ఏమి ప్రేమ గీతములు,   ఏమి యుగళ గీతములు, నీ స్వరకల్పనే తల్లీ లోకమును ఉర్రూ తలూపుచున్నావు.  వళ్ళు కాలిపోవుచున్నదే మలబారు తీరమంతయూ మంటలు రేగునేమో, అచ్చటికి పోయి వారినెట్లు  కవ్వింతువో.

మీనాక్షి : నీవు వచ్చునది  కాదమ్మ , నీవు చూడవలసినది   కాదమ్మ  అని చెప్పిననూ, వెంట పడవద్దని బ్రతిమాలిననూ వినక  వచ్చు  ఇట్టి మొండి ఘటమును ఏమి చేయ వలెను! పైగా వర్షుని వలె గణాంకములను చెప్పుచున్నది!  అని  కొర కొరా చూచుచున్ననూ యమునికి కోపము రాకున్నది. 
యమున: ఆహా! వ్యోమ యానమా లఘు లోహ విహంగామా! సుదీర్ఘ ప్రయాణములను సయితము సులభము జేయుచూ భూగోళమునెంత కురచ జేసినావు.
 మీనాక్షికి దుఃఖం పొంగుచుండెను ఇంటివద్దనుండి విశ్రాంతి తీసుకొనము. మంచి వేదికలపై  కి నిన్ను కొనిపోవలెను కానీ..  నిస్సహాహాయముగా యమున వైపు చూసెను. 
నీకంటే నేను ఉన్నతురాలి వలే చెప్పుచున్నావే. తార భర్తను వలలో వేసుకొనుటకు పోవుచున్నావా? అతడి బుద్ధి మార్చి, అతడిని తన ఇల్లాలికి అప్పగించుచున్నావు., నేను నీ సంరక్షురాలిని, నీ కంటి రెప్పను. నీ పెట్టె మోయుటయందు నా కానందము కలదు, ఇటిమ్ము అని మీనాక్షి చేతినుండి పెట్టెను లాక్కుని విమానము వైపు పోవుచుండెను.  మీనాక్షి యమునను అనుసరించుచుండెను. యమున ముందుగా పోయి కూర్చొని మీనాక్షిని పిలువగా ఆమె వచ్చి పక్కన కూర్చొనెను. పరిచారిక వచ్చి యమున వద్దనుండి ప్రయాణ పేటి కను తీసుకొని నిమంత్రిత ప్రదేశమందు పెట్టుచుండగా మీనాక్షి " అమ్మాయి , నీకు పైలట్ సుందరి తెలుయునా ?" అని అడిగెను ఆమె వెనుకనే వచ్చిన మరొక యువతి " నాకు తెలియును ఆమె రాజీ నామా చేసినదని , కానీ అది ఆమోదించబడలేద"ని చెప్పెను
ఆమె వెడలిన పిదప ఇండిగో విమానమును మీనాక్షి ప్రేమగా తాకుచుండెను. “కోడలు ఈ విమానములనే ఎగుర వేయును.” అప్రయత్నముగా ఆమాటలు మీనాక్షి నోట వెలువడినవి. ఎప్పుడూ కోడలి ద్యాసేనా నీ ప్రియుడి గూర్చి కూడా కొంచెము ఆలోచించరాదా అని యమునా హాస్యమాడుచుండగా వ్యోమయానము కదులుట ప్రారంభించెను, కొలది క్షణములలో వేగము హెచ్చి , సుడిగాలివలె విమానపథమున పరిగెత్తి అమాంతము గాలిలోకి లేచెను. సమయము 7. 30. మీనాక్షి యమున భుజముపై వాలి నిద్రించుచుండెను.

                                                                              ***



సమయము 8.30 నిమిషములయ్యెను మీనాక్షికి తెలివి వచ్చి కనులు తెరిచెను. విమానమునందు ఆంగ్ల  ప్రకటన వినిపించుచుండెను. ఆ స్వరము ఎంత కమ్మగా యున్నదో " సుందరి అట్లే మాట్లాడునెమో  "   యమునకు ఒక చెంప  మరొక చెంప కోపము  కలిగి " ఈ విమానము చూచిన కూడా అట్లే అనిపించుచున్నది కదా విమానమును కూడా ఇంటికి పట్టుకుపొమ్ము " అనెను. మీనాక్షి గతుక్కుమని కిటికీనుండి క్రిందకు చూడగా కొచ్చి విమానాశ్రయము కోనేటిలో తేలుచున్న తామర పుష్పముమువలె సముద్రము వలె విశాల హరిత పచ్చికలో మనోజ్ఞముగా కనిపించెను. నీలి గగనమందు పాలపొంగులు వంటి మేఘములు , వాటిగుండా క్రిందకు జారుతున్న విమానము అప్సర వలె , విమానాశ్రయము తపమాచరించు ఋషివలె నగుపించెను.

                                                                ***

ప్రఫుల్ల విమానాశ్రయమువద్ద  మీనాక్షి కొరకు కొరకు ఎదురుచూచుచూ యమునను చూచి గతుక్కుమనెను. వారిరువురూ సమీపించిన పిదప " పెళ్లిని పోతూ పిల్లిని చెంక లో పెట్టుకొని వెళ్ళువారుందురా అని వాహనము తలుపు తీసి మీనాక్షినాహ్వానించెను. యమున " నన్ను  పిల్లి అన్నవారి వాహనము నేనెక్కన"ని అనుటతో గొడవ ప్రారంభమయ్యెను. అబ్బబ్బ మీరిద్దరూ పిల్లి కుక్కలవలె పోట్లాడుకొనుచున్నచో నేను బెంగళూరు  పోయెదను  అని మీనాక్షి వాహనము దిగి పోవుచుండగా ప్రఫుల్ల "  మీనాక్షిని బ్రతిమాలి వాహనమెక్కించెను. పిదప యమునను వాహనమెక్కమని వేడి ఆమె వచ్చుచుండగా రెండు చేతుల వేళ్ళను అనుసంధానించి సన్నాయి వూదుచూ "రావమ్మా మహాలక్షి రావమ్మా అని పాట పాడుచూ వాహనమెక్కించెను. వాహనము ముందుకు కదిలెను. కొలది సేపు తరువాత జానకి  నిలయము అను భవనము ముందు వాహనము నిలిచెను. ప్రఫుల్ల సాదరముగా వారిని లోపలి కొనిపోయి సోఫాలలో కూర్చొండబెట్టెను.   

                                                                            *** 
                                
1950 లో తొలినాళ్లలో మళయాళ చిత్రపరిశ్రమ త్రివేంద్రమందుండెడిది , మెర్రీ ల్యాండ్ చిత్రాంజలి వంటి పెద్ద స్టూడియోలు అచ్చట నుండుటచే 2000 వరకు చిత్ర రంగమంతయూ త్రివేంద్రమునందే ఉండెడిది.  క్రమక్రమముగా పెక్కు దర్శకులు , నిర్మాతలు , కళాకారులు కొచ్చి తరలి వచ్చినారు ఈ మధ్యకాలమందు ముఖ్యముగా 90 నుండి 2000 మధ్య కాలమందు దిలీప్, అశోకన్, బిందు , పనికర్ వంటి   మిమిక్రి కళాకారులు చిత్ర రంగమందు అడుగిడుటచే ..  ప్రఫుల్ల తండ్రి రఘువరన్ అట్లు చెప్పుకు పోవుచుండగా , ప్రఫుల్ల తల్లి జానికి వైపు చూచుచూ తల బాదుకొనుచుండెను
జానకి: ఎవరైననూ ఇంటికి వచ్చిన ఈయనతో నాకిది యే  భయము  ఆ వచ్చినవారు ఏ పని పై వచ్చినారు , వారితో మనమేమి మాట్లాడవలెను అది ఏమియూ లేదు , పుస్తకము చదివి నట్లు , మాట్లాడుటయే అని గొంతు పెంచెను.  
అటువంటి వ్యవహారములు నాకేమి తెలియును నీవు చూచుకొనవలెను అని రఘువరన్  లేచి బయటకు పోయెను. యమున , మీనాక్షిలు మొఖం మొఖములు చూచుకొనిరి.
రఘువరన్ అను పేరు విని యుంటిని మంచి దర్శకుడని ఆయనకు పేరు కలదు అని మీనాక్షి మాట కలుపుచుండగా “ ఆయనకొక స్టూడియో ఇచ్చట ఉండబట్టి  మా రోజులు సాగుచున్నవి”  అని చెప్పున్న తల్లి వైపు మీనాక్షి వెనుకనే నిలబడి యున్న ప్రఫుల్ల తన గురించి చెప్పమని సైగ చేయుచుండెను “ఓహ్ మీకు స్టూడియో కలదా!” అని యమున అనుచుండగా
స్టూడియో దేమున్నదమ్మ  రత్నమువంటి బిడ్డ ఉండగా నాకేమి లోటు అని జానకి మాట మార్చెను . వాడికి ఒక కోరిక కలిగినది , అనుచూ జానకి ప్రపుల్లకి సైగ చేసెను.జానకి  సైగతో ప్రఫుల్ల యమునను తీసుకొని పోయి  ఇల్లు చూపసాగెను. మీనాక్షి గోడపైనున్న అరుణ భర్త చిత్రమును చూపి ఆయన కూడా దర్శకునివలె నున్నారే? ఇంటి ఇంటివద్దలేరా? అని అడిగెను 
వాడు నా తమ్ముడు, ఈ ఇంట అందరూ చిత్ర పరిశ్రమనందు దర్శకులే కాక నిర్మాతలు కూడా. వారందరూ చిత్రములు తీసి చేతులు కాల్చుకొనగా నా తమ్ముడు చిత్రములను తీసి చేతులు కాల్చుకొనుటయే కాక ఆస్తులు కూడా కాల్చు కొనెను.
అతడి భార్య పిల్లలు ?
ఏ భార్య కాపురము చేయునమ్మ అతడికి అహంకారము, మొండితనము జాస్తి. మరదలు కూడా చిత్ర రంగమందే నటిగా యుండెడిది. ఆమె సంపాదనంతాయూ ఇతగాడు హారతి కర్పూరము వలే వెలిగించినాడు. అనుచూ జానికి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టెను. మీనాక్షి కూడా ఆమెకు సాయ పడుచూ మాట్లాడు చుండెను. 
 మరి అరుణ ఊరుకొన్నదా? అని మీనాక్షి అడిగెను  
అరుణ అనుచున్నారు మా మరదలు పేరు అరుణ అని మీకెట్లు తెలియును?
ఆబ్బె నేను అరుణ అనలేదండీ దారుణము అంటిని  
నిజమే నమ్మ దారుణమే మా మరదలు కూతురు కూడా చలన చిత్ర పరిశ్రమయందు నటించుచుండెను, ఇదిగో మామరదలు, పిల్ల అని శీతల యంత్రము పై లకుమ నెత్తుకొని యున్నఅరుణ చిత్రమును చూపెను. 
లకుమ చిన్నపిల్ల!  అని మీనాక్షి అని నాలిక కరుచుకొనెను 
ఆ పిల్ల పేరు లకుమ అని మీకెవరు చెప్పినారు? 
లకుమా! నేను లాకుమా అనలేదండి , ఇదే చిత్రం చెప్మా అంటిని  ఇంత అందమైన భార్యని వదులు కొని అతడెట్లుండెనో కదా!   
పిల్లది తల్లిని తల్లిని మించిన అందము అని చెప్పుచూ ఏదో గుర్తుకు వచ్చిన దానివలె అట్లే నిలిచిపోయి నీ అందమును చూచి నాకొడుకు నిన్నే పెళ్లాడెదనని మొండి పట్టు పట్టినాడు. అని మిక్కిలి వగచి  కొలది సమయము తరువాత  మీనాక్షి ని నేరుగా నిందించసాగెను   
జానికి  కళ్ళు ఎర్రబడెను ఛీ నీవు చిన్న పిల్లవాడిని వలలో వేసుకొంటివి నీతో కష్ట సుఖములు చెప్పుకొనుట సిగ్గుచేటు అని కన్నీరు పెట్టుకొనుచుండెను.   మీనాక్షి తాను ప్రఫుల్లను కొడుకు వలె చూచుచున్నానని ఎంత చెప్పిననూ వినక ప్రఫుల్ల బలవంతము చేయుటచే అతడి నూరడించుటకు ఇచ్చటికి వచ్చితిని  అని చెప్పగా  జానకి మొఖం విప్పారెను. " నాకొడుకు నాకు దక్కు చున్నాడు, నాకొడుకు నాకు దక్కు చున్నాడు  "  అని ఆమె సంతోషముతో పొంగిపోవుచుండగా మీనాక్షి నీవు సహకరించిన మరొక మేలు కూడా జరుగును అని ఆమె వచ్చితిన రెండవపని గూర్చి చెవిలో చెప్పుచుండెను .  అదే సమయములో ప్రఫుల్ల యమున వంటగదిలోకి ప్రవేశించిరి.  మీనాక్షి చెప్పుట ముగించగానే జానకి ఆనందాతిశయముతో " ఎంత  శుభవార్త చెప్పినావు”  ప్రఫుల్ల పెద్ద కేక పెట్టి ఎగిరి గంతేసేను. ఇంతలో కృష్ణన్ ప్రవేశించెను. 
  


Friday, January 22, 2021

Bharatavarsha 116

 ముంబయ్ : జుహుబీచ్  స్టార్ ప్లాజా. సమయము ఉదయము 9. 00 గంటలు 

రోహిత్ : ఆషా ! ఎన్ని సార్లు చెప్పాలే మేడంకి సోడా తెమ్మని    

ఆషా : ఎన్ని సార్లు చెప్పేవు, ఒక్కసారే కదా  చెప్పేవు, టిఫిన్లు రెడీ చెయ్యద్దా? మళ్లి గెస్టులు వస్తే అన్నీ రెడీగాఉండాలని అరుస్తావు. ఒసేయ్ అంటున్నావేంటి, మాటలు తిన్నగా రాని!

రోహిత్ : నోరు బాగానే లేస్తోందే !  నిన్ను ఇంకా ఆడదానివని జాలి తలచి ఉండనిచ్చాను ఆ మాగ్బూల్ గాడిని పంపించి నప్పుడే నిన్ను కూడా పంపించి వలసింది. 

సోడా ఇచ్చి వస్తూ ఆషా : వంటకి నీకు సులభంగా మరొకత్తి దొరకలేదు అందుకు ఉంచేవు, నామీద జాలితో కాదు. నీ కాకలి తప్ప జాలెక్కడుంది?   

రోహిత్ : కరక్ట్ గా కేచ్ చేసేవే. మరి అదిగూడ తీర్చేయవే, నీ జీతం పెంచేలాచేస్తాను 

ఆషా : థు ! దరిద్రుడా  రోహిత్ : ఏయ్ 

ఆషా: ఒరేయ్ రోహిత్ నీకు పుణ్యముంటాది లకుమమ్మని నాశనం చేయకురా. 

ఉదయాన్నే పెట్టించేసేవు దుకాణం. నేను పెట్టించడమేంటి నాన్సెన్స్, మొన్న బోటిల్ లేటయితే నన్నే కొట్టింది, అప్పటి నుంచి ఫుల్ బొట్టిల్స్ ఇంటి నిండా పెడుతున్నాను. అయినా ఎప్పటికప్పుడు నీచేతులో ఎంతో కొంత పెడుతోంది కదా ఇంకా ఎందుకే  ఏడుస్తావు ?  క్రెడిట్ కార్డు నాకే ఇచ్చేసింది. గోకడం , స్టాక్ తేడం , మేడం గొంతు తడపడం.

ఆషా: గొంతు తడపడం కాదు గొంతు కొయ్యడం , నువ్వు ఆ కాశ్యప్ కలిసి ముంచేస్తున్నారు. తనకి సినిమాలు వచ్చినా రాకపోయినా మనకి అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తోంది. ఆమె  ఆమె బాగు కోరాలి కదా మనం. ఈలోపున  కొత్తగా పని లో చేరిన అబ్బాయి వచ్చాడు. 

ఆషా: రా రా చిన్న రాజా ఏంటి ఇంత ఆలీసం? 

చి. రా : బస్సు దొరకలేదక్కా!

రోహిత్: బస్సు దొరకక పోతే టేక్సీ కట్టించుకు రావలసింది, రాస్కెల్ ఇంకొకసారి ఆలస్యంగా వస్తే జీతం కత్తిరిస్తాను.  (ఆశా కిసుక్కున నవ్వింది.)  తెలుసే నువ్వెందుకు నవ్వేవో. నేను జీతం కత్తిరించినా మేడం ఒప్పుకోదు, అన్నీ తెలిసి నప్పుడు తిన్నగా టైంకి వచ్చి తెగలడండి. పైగా వీడిని చిన్న రాజా అని పిలవాలట.  చిన్న అని పిలిస్తే సరిపోదట.

చి. రా : నాపేరు చిన్నరాజా కొప్పం పూర్తి పేరుతో పిలవలేనన్నారు సరే. కనీసం చిన్నరాజా అనైనా పిలవండి.      రోహిత్ : నీయబ్బ చిన్నాయే నీకెక్కువరా.  లకుమ "రోహిత్ , రోహిత్ శుభే శుభే క్యా జగడా హో రహా హాయ్  ముఝే శాంతీ ఛాహీయే శాంతీ!"     రోహిత్ "హాఁ మేడం మై లాతా హుమ్" 

" మేడం కి శాంతి  కావాలంటే తెస్తున్నాను అని వెళుతున్నాడు " చి.రా  ఆషా నవ్వుకొనిరి

రోహిత్ కశ్యప్ వచ్చుచుండగా చూసి “ఇంకే శాంతి!  వీడొచ్చాడంటే బుర్ర తినేస్తాడు!”

                                                              ***

కశ్యప్:  మార్నింగ్ బేబీ.  లకుమ: ఏంటి ఇలా వచ్చావు?
కశ్యప్: హైదరాబాదులో ఉండేటప్పుడు నేను ఎక్కడికైనా వెళితే ఎప్పుడొస్తావు అని అడిగేదానివి ఇప్పుడు “ఏంటి ఇలా వచ్చావు” అంటున్నావు. "అది హైద్రాబాద్ ఇది ముంబయ్ , అయినా నేను ముంబై వచ్చినప్పటినుంచి మనం కలిసి ఉండటం లేదు కదా నీకు తీరికున్నపుడు వస్తున్నావు."  "ఆ పండిత్ గాడు నిన్ను బాగా ట్రైన్ చేసాడు." 
"విషయం ఏంటో చెప్పు"  “కన్నా ప్రొడక్షన్స్ కొత్త ఫిలిం స్టార్ట్ చేస్తున్నారు.  అందులో కొత్త పిట్ట కోసం చూస్తున్నారు.”  “అయితే,” “నువ్వు ఆరోల్ చేస్తే బాగుంటాదని” నీకు ఖన్నా ప్రొడక్షన్స్కి సమ్మందం ఏంటి? నువ్వు అందులో డైరెక్టరా, అసిస్టెంట్ డైరెక్టరా?  కనీసం మేనేజర్ వి కూడా కాదు. 
నాది పూరి జగన్నాద్, రాజమౌళి రేంజ్ తెలుగులో పెద్ద డైరెక్టర్ని నన్ను మేనేజర్ తో పోలుస్తావా?

లకుమ: థౌజండ్ వర్డ్స్ ను “అత్తారింటికి దారేది” గా, సహారా ను “కలేజా” గా,  రైజ్  ను “జులాయి” గా వన్స్ అపానే టైం ఇన్ మెక్సికో ను “అతడు” గా  టెన్ థింగ్స్ ఐ హెట్ అబౌట్ యు  ను “నువ్వే నువ్వే” గా తీసిన రాజ మౌళి ప్రతిభ ను నువ్వే చాటవలె. ఇంక పూరి జగన్నాద్ అన్నచో..    పవనుడి భజజతో పైకొచ్చినాడు. అతడి గురించా నాకు చెప్పుచున్నావు మొన్ననే అతడు ఆంగ్ల చిత్రము ఐ బాయ్ ని కాపీ చేసి దొరికినాడు.

కశ్యప్: నీకు తెలుగులో అవకాశములు అడుగంటినవి అది తెలుసుకొనుము.
లకుమ: నాకంటే ముందే నీకు అడుగంటినివి, నీవొక పరాన్నజీవివి, నాకవకాశములు లేకున్ననూ ఎన్నడూ ఇతరుల పై ఆదారపడి జీవించలేదు. నీ కాలం ముగిసి చాలా కాలమయినది , పోవోయీ బడాయి, అది నీవు డైరెక్టరు అనునది నాటి మాట. తెలుగు చిత్ర పరిశ్రమ నందు నీకంటే అద్భుత చిత్రములు తెరకెక్కించి  కీర్తి కెక్కిన  మేటి దర్శకులు నేడెందరో కలరు. వారెవ్వరూ నిన్ను చూచుటకైననూ ఇష్టపడరు.  నీవు దర్శకుడివా నన్ను తార్చి బ్రతుకు కుంటెనకాడివా? 
కశ్యప్: ఆ పండిట్ గాడు నిన్ను చెడ దొబ్బేడు? నీ భాషనీ చెడ దొబ్బేడు , షిట్ షిట్  ఏంటీ తెలుగు?
లకుమ: పండిత్ ను పల్లెత్తు మాటన్నచో సహించునది లేదు. అపురూప గుణ నిధి అతడు. నౌ గెట్ అవుట్ విత్ యువర్ షిట్ అండ్ నెవర్ షో యువర్ పేస్ అగైన్. 

                                                                     ***

నీలఖంటుడు విషమును గొంతులో నిలిపినట్టు మీనాక్షి దుఃఖమును కడుపులో దాచుకొని పియానో వద్ద కూర్చొని ఫిలిం స్కోర్ వ్రాయుచుండెను. పక్కనే అనేక సంగీత పరికరములు కలవు  వాటిమధ్య ఆర్కెస్ట్రేటరు కూర్చొని యు న్నారు . పక్క గదిలో సోఫాలో నిద్రించు చున్నయమునకు ప్రఫుల్ల ఫోన్ చేయుటతో మెలుకువ వచ్చెను.   అమ్మా ఒంటి గంట దాటినది. నేడు రెండు విడతలు ( సెషన్స్ ) రికార్డింగు చేసిన పిమ్మట విమానాశ్రయమునకు పోవుటతో ఎంత అలసినావు, ... యమున మీనాక్షిని సమీపించెను. ఇంకనూ నీవెందుకు మేలుకొని యుంటివి  ఇంటికి పొమ్మని చెప్పిన వినవు కదా , ఇట్లు స్టూడియో లో దేకుచున్న నీ ఆరోగ్యమేమగును. అని వ్రాయుచున్న పెన్సిల్ , స్టాఫ్ ( అడ్డగా గీతలు కొట్టిన కాగితము ) ను పక్కన పడవేసి యమునను పక్క గదిలోకి తీసుకుపోయి , ఈ సారి లేచి వచ్చినచో చూడుము అని గద్దించి మరల పియానో వద్దకు పోయెను. 

 యమున సోఫా పై పడుకొని ఫోను కంపించిన ప్రతి సారి నిలిపి వేయుచున్నది, మూడు సార్లు కంపించిన పిదప చరవాణి నిలిచి పోయెను. రాఘవుని తలచినచో    మగవారి పై  అసహ్యము  కలుగును , ప్రఫుల్లను తలచినచో ఏవగింపు కలుగును  అగస్త్యను తల చినచో  మీనాక్షి గుర్తుకు వచ్చుటచే మెదడు స్తంభించును. ఏ భావము కలుగునో చెప్పుట కష్టము. అతడిని. ఛీ అనుటకు నోరు రాకున్నది. తల్లి  మంచితనము తనయుని కాపాడు చున్నది. పురుషుల చేయి తాకినా చిద్రమానసమందు రుధిర మోడుచున్నది. పెద్దామె అమ్మ పనిచేయుచుండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును అని మరల తలుపు వద్దకు పోయి, కొద్దిగా తలుపు తీసి తొంగి చూచెను.  మీనాక్షి ఫిలిం స్టూడియోలో ఆర్కెస్ట్రేటర్ తో కలసి ఇంకనూ పనిచేయుచున్నది
ఆర్కెస్ట్రేటర్ సీతారాం : సంగీతకారులున్న ఇంకనూ బాగుండెడిది
మీనాక్షి : ఈ సమయమందు మీరుండుటయే గొప్ప , సంగీతకారులను  రేపు పది గంటలకు రప్పించెదము. రేపు రెండు సెషన్స్ చేయవలెను. కో ఆర్డినేటర్ కి చెప్పిన అతడు సంగీత కారులను చూసుకొనును .
సీతారాం : ఇంకనూ పెన్సిల్ తో  స్టాఫ్ పై వ్రాయుచున్నారు మీరు డిజిటల్ కంపోజి షన్ సాఫ్ట్వేర్ వాడినచో మరింత సులభముగా పని చేయగలరు 
అతడట్లు ముగించిన కొద్దీ సేపటికి మీనాక్షి "  ఫిలిం స్కోర్  రచన   అంతయూ పూర్తి అయినది, ఫిలిం డైరెక్టర్ గారు ఇచ్చిన టెంప్ ట్రాక్స్ , కూడా ఫిలిం స్కోర్  రచన లో  జతపరిచినాను.” 
స్పాటింగ్ ఈ సాయకాలమే చేసి, ఈ రాత్రి మూడు గంటల వ్యవధిలో స్కోర్ పూర్తి చేయుటా!!! అని అతడు అచ్చట మూర్ఛగిల్లెను. కొలది సేపటికి తేరుకొని “అమ్మ సెలవు  రేపు కలుసు కొందుము” అనుచూ బయలు దేరెను.  
యమున పిల్లివలె వచ్చి మీనాక్షి పక్కనే నిలిచి ఫ్లాస్క్ నందు తేనీరు  గ్లాసులో పోసి మీనాక్షి కిచ్చెను. మీనాక్షి యమునను కోప్పడ ప్రయత్నించిననూ  కోపము రాకుండెను అది చూచి యమునా నవ్వేను , మీనాక్షి కూడా నవ్వెను. ఇద్దరూ తేనీరు త్రాగుచుండిరి
అమ్మా స్వరకర్తకు ఫిలిం స్కోర్ వ్రాయుటకు పట్టు సమయము ఎంత?   
రెండు వారాలు నుండి మూడు నెలల దాకా సమయము పట్టును.  
నీవు మూడు గంటల్లో ఫిలిం స్కోర్ వ్రాసినచో గిన్నిస్ నందు ఎక్కించవలెను అని అరిచెను. 
ఉష్ మెల్లగా , అట్లు అరచిన అమర్యాదగా యుండును. అని అ నుచున్న మీనాక్షి 
హఠాత్తుగా ఆగిపోయెను , యమున కి విషయము అర్ధమయినది " ఈమెకు  అగస్త్యుడు గుర్తుకువచ్చిన మరల మనసు చెడును " అని తలచి స్కోర్ కాగితములు తన చేతిలోకి తీసుకొనెను. “అమ్మ ఈ సంకేతములకు అర్ధమేమి , వీటినెట్లు అర్ధము చేసుకొనవలెను?”  ఈ ఐదు గీతాల కాగితమును స్టాఫ్ అందురు వీటి మధ్య నాలుగు ఖాళీలు కలవు. ట్రెబల్  క్లెఫ్ , బాస్ క్లెఫ్   అని రెండు ముఖ్యమైన క్లెఫ్ లు కలవు, పియానో , కీ బోర్డు , సెక్సా ఫోన్ , వైలన్ , ఫ్లూట్ వంటి అన్ని ఎక్కువ పిచ్చ్ గల పరికరములు కు సంకేతములను ఇచ్చట వ్రాయుదురు.   ఈ లైన్ల మధ్య ఖాళీలకు పేర్లు కలవు అవి ఈ జీ బీ డీ ఎఫ్.   స్పేస్( లైన్ల మధ్య ఖాళీ )సూచించుటకు  ఈ ఖాళీలలో పేస్ FACE అను అక్షరములు వాడవలెను.

పావు నోటు, అర నోటు పూర్తి నోటు నో ట్ వాల్యూస్ సిగ్నేచర్.  మీనాక్షి అట్లు చెప్పుకు పోవు చుండ గా మీనాక్షి నిత్యమూ చూచు మీనాక్షి వలే కాక  కొత్తగా కనిపించెను. కొలది సమయము  తరువాత “అమ్మ ఇంటికి పోయెదము చాలకు ని పిలవనా ?”

మీనాక్షి “విమానాశ్రయము నుండి వచ్చుచూ మననిచ్చట వదిలి అతడింటికి పోయినాడు, అతడిని ఇప్పుడు పిలిచి ఇబ్బంది పెట్టుట పాపము. నా కింకనూ సౌండ్ ట్రాక్ స్వర కల్పన పని కలదు.” అనె ను.  “ఇప్పుడే కదా పూర్తయినదని చెప్పితివి!” అని యమున తెల్ల బోయెను. 

“పూర్తి అయినది ఫిలిం స్కోర్ మాత్రమే, పూర్తి చేయవలసినది ఫిలిం సౌండ్ ట్రాక్ అనగా పాటలకు సంగీతము. ఈ రాత్రి నాకు శివరాత్రే” అనుచున్న మీనాక్షిని యమున గుండెలకు హత్తుకొనెను. “నిత్యమూ నీ ఇంట నుండుటచే  ఒక అసాధారణ సంగీతరాణి వన్న విషయము మరిచి ప్రవ ర్తించు చుందును. రోజుకొక సినిమా సంగీతము కూర్చుట అనిన అబ్బురమే.  ఇట్టి సంఘటనలు నీ స్తాయిని స్ఫురణకు తెచ్చును. నీ ఇంట ఉండుట ఎంత అదృష్టముమో కదా !
“ఇంటనుండుటయా , చంక నెక్కి ! ముందు చంక దిగుము.” 

“ఊహు .. నాకు ఇప్పుడిప్పుడే  చిత్ర సంగీతము పై అవగాహనా కలుగు చున్నది.  నాకు కూడా నీ అడుగు జాడలలో నడవవలెనని కోరిక కలుగుచున్నది. మొదట సంగీతకారిణి  అవ్వవలెనని హాస్య మునకు అన్న మాటలే నేడు బలమైన కోరికగా రూపుదిద్దుకొనుచున్నవి.   నాకు సంగీత ము నేర్పుటకు వప్పుకొన్నచో చంక దిగెదను.” 

ఎవరైనా గురువుని ఇట్లు… అని మీనాక్షి అనుచుండగానే యమునా ఆమె కౌగిలి వీడి కాళ్లకు నమ స్కరించెను. మీ నాక్షి ఆమెను లేవనెత్తి గుండెలకు హత్తు కొని " నీ స్థానమిచ్చట " అనెను. “ఇట్లు చిటికలో సంగీతము సమకూర్చుచున్నయెడల బాలీవుడ్ ఏమి హాలీ వుడ్ కూడా నిన్ను వీడదు”   

నీ నమ్మకము దర్శక నిర్మాతలకు కలిగిన నాడు ఇంతకంటే వేగముగా సంగీతము (ఫిల్మ్ స్కోర్) సమకూరును.  ఇంత కంటే వేగముగానా? యమునకు అయోమయముగా నున్నది.

మీనాక్షి పెదవులు విచ్చినవి, పిచ్చిపిల్ల అను మాటలు వినిపించినవి. పియానో వద్ద  కూర్చొన్న మీనాక్షి  వేళ్ళు పియానో మెట్లపై  నర్తించుచుండెను " అభం శుభం తెలియని పిచ్చి పిల్ల .. అది చెరువులో ఈదుతున్న చేపపిల్ల అను స్వరాలు పలికించుచుండగా     యమున ఆమె ప్రక్కన మరొ క చిన్న బల్లపై కూర్చొని ఆమె మెత్తని భుజముపై చుబుకమునుంచి  చెంపకు చెంప నానించి ఆస్వరములందు కరుగు చుండగా 

మీనాక్షి “స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క E.T. ఎక్స్ట్రా-టెరెస్ట్రియల్, జాన్ విలియమ్స్ సంగీతానికి సరిపోయేలా సవరించబడింది. స్పీల్బర్గ్ విలియమ్స్కు సంగీతంతో పూర్తి స్వేచ్ఛను ఇచ్చెను. చిత్రం లేకనే క్యూ ను రికార్డ్ చేయమని కోరాడు; సంగీతానికి సరిపోయేలా స్పీల్బర్గ్ ఆ సన్నివేశాన్ని తిరిగి సవరించెను.

నిజమా సంగీతమును బట్టి చిత్రమును కత్తిరించుటా నమ్మలేకున్నాను! 

“నమ్మలేని నిజాలే అద్భుతాలు”

“రేపు కేరళ పోవుటకు వీలు లేకుండుటచే ఎల్లుండి వచ్చుచున్నానని నా గొంతుపై కూర్చొన్నమళయాళ మాంత్రికునకు తెలుపుము” ఇద్దరూ చాలా సేపు నవ్వుకొనిరి. పిదప యమునా నిద్రలోకి జారుట , మీనాక్షి పాటలకు స్వరములల్లుట తో తెల్లవారినది.

                                                           ***

నీ బతుకు బల్లిపాడులో తెల్లారిపోతాదే. నా పార్వతిని ఎత్తుకెళ్ళి నా పెళ్లి చెడగొడతావే.  ఈ రాత్రంతా నీకు శివ రాత్రే. 
అన్నవెనక్కి చూడకున్న  రోడ్డు చూసి నడుపన్నా. విశాఖపట్నంలో నే పనిపూర్తి చేద్దామంటే వినకుండా ఈ మారుతీ వేన్  లో అంతదూరం తీసికెళుతున్నావ్. 

ఓరి పిచ్చివాడా! లాడ్జీలు క్షేమము కాదు, నేడు ఆధాకార్డులు , ఫోటోలు కూడా అడుగు చున్నారు, మనకెంతమాత్రమూ కుదరదు. పిల్ల అందము చూచినా నోరూరుచున్నచో వేనులోనే పని కానిమ్ము . 
వద్దన్నా దీని కాళ్లకు చేతులకు కట్లు నోటిలో గుడ్డ ఉన్నంతవరకే మనకు క్షేమము , విప్పినచో  ఏమగునో మరచితివా?
ఆమ్మో! గుర్తు కు వచ్చిన వణుకు పుట్టుచున్నది,  ఇద్దరిపై పడి తుని లో ఎట్లు కొట్టిన్దిరా. దీన్నిఏట్లో మరల బంధించి తిమి. మన వారు నలుగురు ఉండగా, బల్లిపాడునందే  దీని పని పట్టవలెను.


దీనికి కొంచము నోట్లో విష్కీ  పోసినచో  మేలు కదా , అట్లే చేసెదము కానీ బల్లిపాడు పోయిన తరువాత మాత్రమే. మార్గ మధ్యమున దీనిని తాకుట క్షేమము కాదు. 

Wednesday, January 20, 2021

Bharatavarsha 115

 బెంగుళూరు, ఇందిరానగరు, సమయము రాత్రి 8.00 గంటలు.  ఇన్నోవా మీనాక్షి విలాసము నుండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు బయలు దేరు చుండెను. వర్షుడు తెల్లని సంప్రదాయ వస్త్రములను ధరించగా, మీనాక్షి చెంగావి చేలమునందు మెరియుచుండెను. లేతాకుపచ్చ పరికిణీ పై నారింజవర్ణ వోణీ ధరించి వర్షుని చక్ర సంకల్పిత ప్రయాణ పేటికను యమున త్రోయుచుండెను. వారు ముగ్గురు ప్రాంగణములో నున్నవాహనమును సమీపించిరి.  చాలకుడు పేటికను అందుకొని వాహనమందుంచెను. 

“నన్ను సాగనంపవలసిన పని ఏమి కలదు? నీ బిడ్డను  ఇట్లు అతిథి వలె చూచుచున్నావే!” అనుచున్ననూ మీనాక్షి మౌనముగా వాహనము నధిరోహించెను. వర్షుడు వాహనమునెక్కగా యమున కూడా అన్నయ్య ప్రక్కనే కూర్చొనెను. అప్పుడు వర్షుడు యమున వైపు తిరిగి   “యమునమ్మ విశ్రాంతి తీసుకొనుమని నీవైనా ఈ మీనాక్షికి చెప్పవమ్మా” అనగా యమున , “ఎంతమాట, అన్నయ్యని చెప్పి ఆదరణ , సత్కారము మరిచెదమా!” అని సాగదీయుచూ చెప్పెను.  అట్లు ఎంతచెప్పిననూ వినక వర్షుని సాగనంపుటకు మీనాక్షి యమునలు సిద్దపడిరి.  వాహనము వెనుకవరసలో వారు మువ్వురూ కూర్చొనిరి , తలుపులు మోసుకొన్నవి. శ్వేత వస్త్రములు ధరించిన చోదకుడు వాహన వేగవర్ధనిని (vehicle accelerator)  ఒత్తగా నల్లని చక్రములు పరిభ్రమించుచూ వాహనము కదిలెను.


వర్షుడు వెడచుండగా  ఇంతులిరువురికీ రెండు రోజులనుండి పొందిన ఆనందామృతమును కోల్పోవుచున్న ట్లుండుటచే వాహనమందు నిస్సంకుడు (మౌనము) రాజ్యమేలు చుండెను.  ఎన్ని చక్కని విషయములను తెలియజేసినాడు,ఎన్ని సాహిత్య సుధలను చిలికినాడు. ఇతిహాస, తత్వ, సాంకేతిక, కవితా, సాహిత్యములను గ్రోలిన మధుపమితడు. అయిననూ ఏమి లాభము ఈ రాత్రికుండి రేపు పొమ్మన్ననూ మాటవినని మొండివాడని యమున  తలచుచుండెను. ఇంతలో వర్షుని  చరవాణి మ్రోగగా  విదిష తో  ఒక్క నిమిషము మాటలాడి నవ్వుచూ ముగించెను.  “అన్నయ్యా ! ఒక్కసారి నేను మాటలాడెదను" అని యమున చరవాణిని చేగొనబోయెను.  వర్షుడు" అయ్యో ముందుగా చెప్పవలసినది, మరి ముగించితినే! మరల చేయమందువా?” అని అడగగా యమున మూతి మూడు వంకరలు తిప్పెను. 

మ.  వనవా  సాన  

మనసా  రాపిలి

అనురా   గాలను 

అనుకో  నాథిధ్య   

“ఆహా! చూడుము తడిసిన దేహముపై సబ్బుబిళ్ళ జారుచున్నట్టు రహదారిపై  వాహనమెట్లు  ఎట్లు జారుచున్నదో!” అనుచూ వర్షుడు యమున దృష్టి మరల్చ ప్రయత్నించు చుండగా మీనాక్షి ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. “ఎంత తుంటరివయ్యా మారాము చేయుచున్న చిన్నపిల్లకి, గిలక్కాయ చూపి ఆడించినట్టు, రహదారులు, కారులు చూపి నన్ను ఏమార్చుచున్నావు. నేనిచ్చిటిపిల్లనే, బెంగుళూరు నందు రహదారులన్నీ ఇట్లే చక్కగా ఉండును." అనెను.   

 “విశాఖనందు మువ్వవాని పాలెము, డాబాగార్డెన్స్ వలె;  హైదరాబాద్ నందు ఫిలింనగర్ , మణికొండ వలె;   బొంబాయి నందు జుహు బీచ్,  బాంద్రా వలె ;   ఢిల్లీ నందు గ్రేటర్ కైలాష్ , నార్త్ అవెన్యూ వలె బెంగుళూరు నందు సదాశివనగరు, ఇందిరానగరు అత్యంత శ్రేష్టమైన విలాస ప్రదేశములు. అత్యంత ధనిక రాచ, బుధ వాణిజ్య వర్గముల కాలవాలమీ రెండు ప్రదేశములు. రాయలకు చెన్నమదేవి, తిరుమలదేవి అను ఇరువురు రాణుల వలె,  బెంగుళూరుకు  సదాశివనగరు, ఇందిరానగరు రాణులు. అని చెప్పుచుండగా మీనాక్షి మనసులో "ఈ పిల్లవాడు మాటల మాంత్రికుడివలె నున్నాడే." అనుకొనెను.   


మీనాక్షి  ముఖమున విషాదమలుముకొనుటకు కారణము యమునకు అవగతమయ్యెను. అందుచే ఆమె  మాట మార్చుటకు మీనాక్షి తో  "నాకొక ధర్మ సందేహమున్నది నీ జ్ఞాననిధిని అడుగమందువా ? అనెను

మీనాక్షి యమున వైపు కొరడా ఝుళిపించినట్లు చూపు రువ్వి ఏమి అడిగిననూ అడగవచ్చు అని కరవాలము తో వేటు వేసినట్టు జెప్పెను. “శ్రీ కృష్ణ దేవరాయలు కెంతమంది భార్యలని నేను అంతర్జాలమందు ఒక గంట సేపు వెతకవలసి వచ్చినది.  ఆరుగురు, భార్యలని కొంతమంది, పన్నెడు మంది భార్యలని కొంతమంది వ్రాసినారు. తీవ్ర ముగా వెదకులాడిన పిమ్మట రాయలుకిరువరు భార్యలని  వారి పేర్లు తిరుమల దేవి , చిన్నమ  దేవి అని తెలిసినది.  ఏ రాజు చరిత్ర చూసుకున్ననూ ఇట్లే ఎందుకు  ఉన్నది ?”

మీనాక్షి  మరల మౌనముద్ర లో కూర్చొని మరల ఆలోచనలో ములిగిపోయెను

వర్షుడు:  ఇదా నీ  ధర్మ సందేహము?!     

యమున: నాసందేహమదికాదు రాయలు హైందవరాజు కదా అతదికిద్దరు భార్యలైట్లుండిరి? 

వర్షుడు:  చాలా చరిత్ర చదివినదే చెల్లమ్మ! 1960 లో భారత పార్లమెంట్ నందు ముస్లింలకు  తప్ప  హిందువులకు రెండు వివాహములు చెల్లవని చట్టము చేయువరకు, సామాన్య హిందువులు కూడా బాహాటంగా రెండు మూడు వివాహములు చేసుకొనెడివారు. ఇంక రాజుల సంగతి అడుగపని ఏమున్నది? ఏ రాజుకు చూచిననూ పది మంది  భార్యలుండుట సామాన్యముగా కనిపించును , ఏ కాల మందైననూ  ఏ దేశమందైననూ అట్లు లేనివారే అరుదు.  

యమున మీనాక్షి వైపు చూచెను ఆమె మనసింకనూ విషాదరాగమునఆలాపించుచున్నది.

యమున : నాకింకొక సందేహము, మన చరిత పురాణములందు ఎచ్చట చూచిననూ పురుషుల వలే ఎక్కువ వివాహములు చేసుకున్న, (ఎక్కువ భర్తలు గల  స్త్రీలు)  ఎందుకులేరు?

"ద్రౌపది కలదు కదా"   అనుచు మీనాక్షి బాహ్య ప్రపంచములోకి వచ్చెను

యమున : ఎంత సేపు చెప్పిననూ ఒక్క స్త్రీ గూర్చి చెప్పుచుందురు.

విలువిద్యలో అర్జునునకు సాటియగు నితంతు మహారాజు ఐదుగురు కుమారులగు  సాల్వేయ , శ్రుతసేన, సురసేన, తిందుసరస, అతిసరసులను  శిబి  చక్రవర్తి  కుమార్తె బౌమస్వి  స్వయంవరమున వివాహమాడెను. యయాతి కుమార్తె మాధవి వివాహమాడ కనే ఐదుగురు భర్తలతో బిడ్డలను కన్నది. కుంతీ, మాద్రి, అంబిక అంబాలిక ఇట్లు అనేక మంది  అని వర్షుడు  చెప్పుచుండగా

యమున :  పిల్లలను కనిపెట్టుట  గూర్చి కాక జీవితము కొరకు  వివాహము చేసుకొన్న స్త్రీలు ఎందుకు కానరారు? 

వర్షుడు: నాడు సార్వభౌములైననూ , సామాన్యులైననూ సంతాన చింత ఎక్కువగా యుండెడిది , స్త్రీ పురుష సంగమము భోగము కొరకు అనెడి భావన పిదపకాలమందు ప్రభలిపోయినది. అప్పుడు రాజుల పాలనే తప్ప ప్రజా ప్రభుత్వములు లేవు , రాజుకు వారసులుండుట తప్పని సరి కావున వారు పుత్ర సంతానము కొరకు పడరాని పాట్లు  పడుచుండెడివారు. మహాభారతంలో కుంతి మరియు పాండురాజు మధ్య   "స్త్రీ   బిడ్డల  కొరకు  గర్భం ధరించే అనేక మార్గాల గూర్చి"  చర్చకలదు.  తన భర్త ద్వారా, పండితుని ద్వారా, డబ్బు కొరకు మరొక వ్యక్తి నుండి గర్భము ధరించుట, భర్త మరణానంతరము  కుటుంబాన్ని విస్తరించుట కొరకు గర్భం ధరించుట , పెళ్ళికి ముందే భార్య ద్వారా పుట్టిన బిడ్డను శ్వీకరించుట, దత్తతచేసుకొనుట , డబ్బు ద్వారా పిల్లవాడిని కొనుట, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఇతరుల కుమారుడిగా ఇచ్చుట, గర్భిణీ స్త్రీని వివాహం చేసుకొనుట  పిల్లలను పొందు మార్గములు. ఒక్కొక్క వంశమందు మహాపురుషులుండెడివారు. అందుచే వంశమునకు , గుణ గణములకు అంతటి ప్రాముఖ్యత యుండెడిది.  

మీనాక్షి పూర్తి గా నిమగ్న మయ్యి వినుచుండెను ఆమె ముఖమున విషాద ఛాయాలంతరించినవి. “చాలా సేపటివరకూ నీ మనసిచ్చటలేదు. అనుచుండగా " మరి ఎచ్చటికి పోయెను?" అని యమున అడుగుచుండగా, వర్షుడు ఆమె వైపు తిరిగి " ఉష్... హాస్యమాడరాదు అమ్మ మౌనరాగమందు భైరవరాగము దాగి యున్నది " 

యమున: నా స్థాయికి రావయ్యా స్వామీ అట్లు చెప్పిన నాకేమి అర్ధమగును? " 

మార్జా లము అనిన బిడాలమనినట్టు  

వర్షుడు " భైరవరాగమనగా విషాదము   అమ్మ బాధను గమనించితివా ?"  అని అడిగెను. ఆమె మౌనముగా ఉన్నదనిన ఎప్పుడూ కొడుకు గూర్చి చింతించు చుండును. నేనెంత చెప్పిననూ ఆమె అట్లే ఉందును , నేను ఓదార్చి న యెడల దుఃఖము పెరిగి కన్నీరు పెట్టుకొనును.  అందుచే నేను కూడా కొలది సేపు మౌనము వహించి యుందును. 


అమ్మని ఊరడించు  వయసు జ్ఞానము అనుభవము లేకున్ననూ, మనసున్నది , అది అమ్మ ఎప్పుడూ అర్ధము చేసుకొనును !" అని యమున ఏడ్వ సాగెను. మీనాక్షి భోరున విలపించుచూ యమునను గుండెలకు హత్తుకొనెను.  చాలకుడు కంగారుపడి వాహనమును  నిలి పివేసెను. వర్షుడు వాహనము కిటికీ నుండి బయటకు చూచెను. వాహనము యెలహంక చేరెను. “సమయము 8.30. గంటలయ్యెను, పోనిమ్ము నాయినా” అనగానే వాహనము మరల బయలుదేరెను. 

“మోహనము తొలగగా, లకుమ కొరకు పాడిన మోహన రాగమువీడి   తండ్రి సేవలో   దివ్యమైన తోడి రాగమునఆలాపించుచున్నాడు.  ఇప్పుడు నీకొడుకు వాస్తవ ప్రపంచములోకి అడుగిడినాడు.  అగ్నియందు కాలిన కుప్యము. బాధ్యతల దాగలి పై  బాధల  సమ్మెట దెబ్బలు అతడిని తీర్చిదిద్దుచున్నవి. ఇకపై నీకొడుకు తప్పులు చేయడు , కానీ అతడు  ముందు చేసిన తప్పులకు ఇతరుల జీవితములు బలి అగుచున్నవి. ఆ తప్పు దిద్దుకొన వలెను. అందుకు నీవే భాద్యత తీసుకొనవలెను.  ఆ నష్టమునకు ఎంత డబ్బయిననూ నేను భరించెదను. అని మీనాక్షి అనుచుండగా, వర్షుడు " డబ్బు ఆ సమస్యను పరిష్కరించ జాలదు" అని చెప్పుచుండగా మీనాక్షి చరవాణి మ్రోగెను. 

ఓ! తారా , ఎచ్చటనుండి , .. మేము విమానాశ్రయమునకు పోవుచున్నాము , వర్షుడు పది గంటలకు విశాఖ కెగురుచున్నాడు.  తరువాత కొలది సేపు మీనాక్షి బదులైననూ పలక విను చుండెను. శుభవార్తే చెప్పినావు. నీకు కూడా నేనొక శుభవార్త తెలిపెదను. ఇప్పుడు చెప్పజాలను. నీ ఇంటికి వచ్చి నీ చెవిలో చెప్పెదను. నీకు కొక  బహుమతినిచ్చిన శ్వీకరింతువు కదా?  ఇచ్చిన మాట మరువరాదు. మనమిద్దరమూ కలసి విశాఖ పోయెదము. అట్లు అరుణతారతో కొలది సేపు మాట్లాడి వర్షుని వైపు కొరకొరా చూచెను.

నీవు మధ్యానము ఇండియా గేటువద్ద కనిపించినావని అరుణతార చెప్పెను.  నీవు పెద్దలతో చెప్పకూడని పనులు కూడా చేయుచున్నావా? ఏ ఇంగ్లీషు తారామణి తో తిరుగుచున్నావయ్యా ?  ఢిల్లీ ఎందుకు పోయినావయ్యా ? వర్షుడి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యెను. నీళ్లు నములుచూ అయోమయముగా చూచుచూ   “నామీద నమ్మకము లేదా?” అనుచున్న అతడి మొఖం చూచి మీనాక్షి "నాయనా నీమీద నమ్మకమున్నది  నీవు వెళ్లిన పని విజయవంతమగును అని కూడా నమ్మకమున్నది. నీవు చెప్పవలదని అనుకొన్నచో నేనీవిషయము ఎవ్వరికి చెప్పుదానను కాదు కదా నాకైననూ చెప్పి ఉండవచ్చు కదా ? "అని మీనాక్షి అనగా వర్షుడు “పని పూర్తి అయిన పిదప తెలపవలెనని  " అని  నీళ్లు నములుచుండెను .

అరుణ తార చూచెను , నీకు తెలిపెను , మీ ఇద్దరికీ తెలిసెను. నాకు చెప్పుటకు మీకిష్టము లేకున్నచో చెప్పవలదు అని యమున ముఖం తిప్పుకొనెను, “నాచిట్టి చెల్లి” అని వర్షుడు చుబుకమును పట్టి త్రిప్పుచుండగా " నీ ముద్దులు ఏమీ వలదు ఫో , మీ ఇద్దరూ తోడు దొంగలు " అని యమున ముఖము దాచుకొనెను. 

అన్నయ్యది  ఎదో ప్రేమ వ్యవహారమమ్మా అని మీనాక్షి సర్ది చెప్పబోగా యమున " హి హి హి , నీ కట్టు కథలు  నాకేమీ వలదులే” అని తన చేతిలో పుస్తకమును చూపుచూ "అట్లేమైననూ చేసిన చో మావదిన   తాటతీసి తాంబూలమిచ్చును ఆమె కళ్ళు కప్పుట మీ తరము కాదు , సరే, మీరు చెప్పనిచో  నేను ఆమెతో మాట్లాడి విషయమును తెలుసు కొందును." అని తెగేసి చెప్పెను. వర్షుడు “ ద్రోహీ ఎంతకు తెగింతివే , అన్నా వదినల మధ్య అంటించుచున్నావు" 

మీనాక్షి “వర్షుడు  ఢిల్లీలో   ధోల్పూర్ హౌస్కు పోయి అచ్చట జరుగు ఐ ఏ ఎస్ అంతిమ పరీక్ష,  (ఇంటర్వ్యూ) కు హాజర య్యెనని  తెలిపెను. 

యమున "నీవు నీ స్థాయికి తగ్గ పని చేసినావు, నావంటి వారు ప్రయత్నించిన అది అత్యాశ అగును గానీ నీవంటి వారు ప్రయత్నించకున్న అది తప్పే అగును.”  

ఈమె రెండు సార్లు పోయి తప్పినది అని మీనాక్షి అనగా యమున పరీక్ష కఠినముగా నుండునని ప్రత్యేకించి చెప్పపని లేదు. రెండు సంవత్సరముల క్రితము నేను పరీక్ష వ్రాయుచున్నప్పుడు   రెండు లక్షలమంది ప్రాధిమిక పరీక్షకు హాజరు కాగా ముఖ్య పరీక్షకు పది వేల మంది చేరగలిగిరి. చివరి మౌఖకిక పరీక్షులకు రెండు వేల మంది మాత్రమే చేరుకొనిరి. “ఇప్పుడూ అట్లే యున్నది అని వర్షుడనెను.” మీనాక్షి “ఈ మౌఖిక పరీక్ష ఫలితములు ఎప్పుడు వెలువరించెదరు ?”  వర్షుడు “ఒక వారము లో, ఆపై 15 వారములు డెహ్రాడూన్ లో శిక్షణ ఉండును.”

                                                                    ***

ఇన్నోవా కెంపెగౌడ విమానాశ్రయము చేరెను. గడియారం సమయము 9.00 గంటలు చూపుచుండెను.  విమానాశ్రయములో నున్న మాల్గుడి పలహార శాల యందు ప్రవేశించి  అల్పాహారం తీసుకొనుచుండిరి.  మీనాక్షి , యమున ప్రక్క ప్రక్కన కూర్చొనగా  వారికెదురుగా వర్షుడు కూర్చొనెను. పలహారసాలంతయూ  ఖాళీగా యున్నది  "60 నిముషముల ముందు బోర్డింగ్ పాస్ తీసుకొనవలెను కదా?" అని యమున అడిగెను. "30 నిమిషముల ముందు కూడా తీసికొన వచ్చునని వర్షుడనెను." తినుట ముగిసిన పిదప నీవు రక్షణ తనికీ ( సెక్యూరిటీ చెక్) పూర్తి చేసుకొని ప్రవేశించవలెను. అని మీనాక్షి అనెను.


ముగ్గురు మౌనముగా తినుట ముగించి ఫలహారశాల బయట విశాల ప్రదేశములో నిలుచుని యుండిరి   "నా పుట్టినరోజు ఇంత ఆనందముగా జరుగునని కలనైనా ఊహించలేదు. వర్షుని వీణాగానము నా మదిలో ఇంకనూ మ్రోగుచున్నది." అను చుండగా యమున"నందికొండలలో మేఘమండలములో పాడిన పాట విని నామనసు పులకరించింది.  పూర్తిగా అర్ధము కాకున్ననూ వినుటకు ఎంతో బాగున్నది
మీనాక్షి: అర్ధము కాకపోవుటకు ఏమున్నది మా తాతగారు సోమయాజులు ,అమ్మమ్మ సోమిదమ్మ 
వర్షుడు: యమునా  ఆపదములకు అర్థము తెలియునా? 
యమున: అవి వారి పేర్లనుకొనునుచున్నాను.
వర్షుడు: యజ్ఞము చేసిన పురుషుని సోమయాజులు అని, స్త్రీని  సోమిదమ్మ అని పిలుతురు. ఈమె ముత్తాత తండ్రి కేరళ రాచకుటుంబమునకు సంస్కృతము, ఆంగ్లము భోదించుచుచూ పద్మనాభస్వామి దేవాలయమందు అరుచుకునిగా నుండెడివారు. ఆంగ్లేయులు వచ్చినపుడు ఆంగ్లము వచ్చుటచే రాజుకు దుబాషీగా పనిచేయుచుండెడి వారు. ఈమె ముత్తాతగారు  గొప్ప సంస్కృతాంధ్రములందు గొప్ప పండితుడే కాక నైఘంటికుడు.  ఒక ఆంగ్ల దొరవద్ద దుబాషీగా పనిచేయుచుండెడివారు. మొట్టమొదటి తెలుగు ఆంగ్ల నిఘంటువు వీరు వ్రాసినదే. 

యమున: అమ్మ ఏమియూ చెప్పదు.  యెచ్చటైనా కష్టము కలిగిన చో నిశ్శబ్దముగా మాయమగును, లేదని, పొమ్మని చెప్పుటరాదు.
వర్షుడు: ఈమె సున్నిత మనస్కురాలని చెప్పుటకు కొంత జాగు చేసితిని. కానీ నేడిక చెప్పక తప్పదు అని అగస్త్యు సుందరిని ఏమిచేసెనో చెప్పెను.
యమున: ఈమె కడుపున అటు వంటి బిడ్డ పుట్టుట  విడ్డూరము గానున్నది. అను చుండగా మీనాక్షి కాళ్లక్రింద భూమి కంపించుచుండెను
మీది గొప్ప వంశము అను భావన నీకున్నచో, ఆ వంశ కీర్తిని నిలుపు భారము స్వీకరింపుము. నేటి వారికి వంశ పూర్వజులతో వారి కీర్తి ప్రతిష్టలతో పని లేదు, వారికి కావలసినది శారీరక సుఖము మాత్రమే. దానికొరకే కల్లా కపటమెరుగని గుణవతి అయిన సుందరిని లొంగదీసుకొనెను. కృతజ్ఞత అనెడి  బలహీనత తో తనను అర్పించుకొనిన సాధ్వి సుందరి.  
పైకి నవ్వుచున్ననూ ఆపిల్లని కనిపించని వైరాగ్యము అలుము కొన్నది.  పైకి ఆమె ఆటలే కనిపించుచున్ననూ ఆమె ఉద్యోగమునకు రాజీనామా చేసెను. భారత వైమానిక దళములో చేరి యుద్ధమునందు మరణించవలెనని చావును లక్ష్యముగా చేసుకొని బ్రతుకుచున్నది.  అంత గుణవతి ఉత్తమురాలిని కోడలు గాపొందవలెనన్న నీవు నీవు ఆమెను ఒప్పించుటకు ఏ మైననూ చేయవలెను. నీ వంశము నిలుపు కొను అవకాశము, తప్పుదిద్దు కొను అవకాశము ఇంకనూ కలవు. మంజూషవివాహము లో ఆమెను ఒప్పించి వివాహము చేయవలెను. అని వెడలు చుండగా , మీనాక్షి గుండె బ్రద్దలైనది, మానసము అగ్ని గుండమయి దహించు చుండగా పట్టుతప్పి నే లకొరుగు చుండెను.  యమున ఆమెను పట్టుకొని పక్కనే ఉన్న పొడవాటి కూర్చొను బల్లపై  వాల్చెను  

                                                             ***
వర్షుడు విమానమందు ప్రవేశిం చెను.  చరవాణిని విమాన శైలి ( మోడ్)  లో నుంచుచుండగా వచ్చిన సందేశమును చూసి నమ్మలేక పోయెను. మరల నిదానముగా చదివి నివ్వెరపోయెను. కళ్ళుతిరుగుచుండగా మరొకసారి సందేశమును చదివెను " సుందరిని గౌడ సోదరులు బీచ్ వద్ద నుండి అపహరించుకు పోయినారు" వర్షుని శరీరమును నిస్త్రాణ కమ్ముకొను చుండగా విమానము గాలిలోకి లేచెను. అప్పుడే స్పృహలోకి వచ్చిన మీనాక్షి ఎగురు చున్న విమానమును చేష్ట  లుడిగి చూచు చుండెను.