వేచి చూచిన శుభఘడియల గుదెంచెను. పెండ్లి పంజరమున శుష్క శృంఖల యాంత్రిక జీవితమును గడిపిన అంగ యాఱుకన్నె శృంఖలములు తెగివడ యాంత్రిక జీవితమందు లభించని జీవన మాధుర్యము యాత్రిక జీవితమందు, అప్రతిహత శృంగార యాత్ర లందు క్రమమముగా అవగతముగుచున్నది.
కన్నెకథయంత కళ్ళార చూచిన
వన్నెకాడు నీడల్లె వెనుకనే తిరినాడు
మెరుపల్లె నిత్యమూ మెఱసి వెలసె
నేరుగా వెరచి నేత్రము లర్ధించె
గేహవ ర్ణమున దేహము మెరియుచు
వలచినా డతడు వలపే తెలిపినాడు
ఎర్రని గుఱ్ఱము వలే దేహ కాంతి కలిగి మెరియుచూ వలచి వలపింపజేసిన ఆ సింగళీయుని వలపుల సింజిని ఆనతికాలమునే అంకెకత్తెగా అవతరించి ఆతడి మానస సరోవరమందు రాజీవ (ఎర్ర కలువ) మై నిలిచిపో యెను. ఆమె అందములు అతడి డెందమును పరిగొని తట్ట కన్నె సొగసు అతడి కన్నుల సతతము మెరయుచుండెను.
పసిడి కిన్నెరకు పలుకు తోడు
పసకాఁడు కన్నెకు పొసఁగు ఱేడు
బంగారు వీణకైననూ పలుకు తోడు కావలెను. అట్లే బంగారు కన్నెకు పసకాడు (సమర్ధుడు) తోడు కావలెను. కన్నె అతడిని తనకు పొసఁగు ప్రియుడని గ్రహించి అతడి ప్రేమలో నెమ్ముకొనెను కన్నె మెత్తగిల్లుట చూచి అతడిలోభయము తొలగి పురుష దృష్టి ఏర్పడినది
మాట పొత్తుకొన తనువులే ఒత్తుకొన
మాటు తొలగెను మనసులే కలిసెను
మాటలు కలిసిన పొత్తు కుదరకుండునా , చూపులు తూపులతో మొదలైన ప్రేమ నవ్వుల తేరులపై పువ్వులు కురియగా సాగకుండునా ? పొత్తు కుదిరిన తనువులు కలవకుండునా ?
చిత్ర శాలల చెలతిరిగి చెలరుచు
చిత్ర ములెన్నో చూడప్రే మపొరలె.
గృహము పాఠశాల తప్ప అన్యమెరుగని బేల లజ్జావతి బాహ్యప్రపంచమునడుగిడి జీవిత మాధుర్యమును గ్రహించవలెనన్న షిరోమి కల మొదట కన్నెకు భీతి గొల్పుచుండిననూ, కొద్దికాలంలోనే ఆకల నెరవేరెను. ఆడువారెవ్వరునూ లేకున్ననూ, ఆమె స్నేహితులందరూ అపరిపక్వ ఆషాడభూతులే. కన్నె ప్రియునితో విహరించుచుండ ధర్మద్వజులు (పవిత్రులువలేనటించేవారు) కౌతుకము నెరవేరని పరాజితులు, శృంగార విఫలులు వికల్పమున అసూయాపూరితమగు మాటల ఈటెలతో గుచ్చి వికృతానాదమునొందుచుండిరి అని తెలుసు కొనుటకు, కన్నెకు భ్రాంతులు అణగుటకు ముజ్జగములేకమైనవి. ప్రేమ వ్రతము మహారణము కదా !
పెండ్లియాడెదనని ప్రకటించి కన్నె ఇంటికి వచ్చి ఆమె అత్తగారితో ఈ విషయమును తెలిపెను. మరుసటి వారము లంక కొనిపోవుటకు ఏర్పాట్లు జేసెను విచార గ్రస్తమైన కన్నెను “సంకుచిత దృష్టి మధ్యతరగతి సహజ లక్షణము కావ్య పృష్టి, జ్ఞాన దృష్టి నశించగా కలుగు అనావృష్టి ఇది అని షిరోమి నచ్చజెప్పెగా కన్నె విచారమును లంకపోవు వరకు పాఠశాలకు సెలవు పంపెను.
రవివారము నర్త రమణి రువారము
రవణించు నర్తనమే రాత్రి విలాసము
శనివారము చిత్రశాలకు రవివారము నర్తన శాలకేఁగి రువారము చింద జంట నాట్యములు జేయుచుండిరి మసకవెలుతురులో మత్తకాసిని కొత్త నాట్యము జేసి హత్తుకొనచూ కొల్లాడె చెలువుడు చెలి చందమంతా.
ఈ వారం రోజులూ శృంగార యాత్రలే యని చెప్పుచూ తన వాహనమును కన్నె ఇంటికి గొనిపోవుచూ ఆమె అత్తగారిని యాత్రలకి ఆహ్వానించగా ఆమె తిరస్కరించి వారిద్దరినీ పొమ్మనెను. పొద్దల్లా తిరిగి తిరిగి రాత్రి గూటికి బోవు పిట్టల్లా ఇల్లు జేరుటకు కన్నె షిరోమిలు సాగు చుండిరి. రాత్రి వాహనము వెన్నెలలో టైడల్ పార్క్ వైపు సాగుచున్నది.
సఖునితో చేయగా శృంగార యాత్ర
సఖ్యత పెరిగి సరసల్లా పముహెచ్చె.
పీయూష ముగ్రోలి పాలవె న్నెలలో
తేలి
శోభన తీరము లుజూసిరి.
అమృతమును సేవించి పాల వెన్నెల కెరటాలతో ఈదులాడుచున్న ఆనందము ఈ ప్రేమ మైకము ఎంత మధురమో. ఈ స్త్రీ పురుషుల ఆకర్షణ భూమ్యాకర్షణ కంటే హెచ్చుగా నున్నది యని కన్నె వాహనము నడుపుచున్న ప్రియుని వాటేసుకొనెను.
వలకాని గుండె వలపుల దిండుగా
కలులు కనుచూ కన్నెతి రగసాగె
“రోమి , నిన్ను పలుమార్లు ఆపియున్నాను, నీవు కావలెనన్నచో నీ ఫ్లాట్ కి గొనిపొమ్ము. ఆపై నేను స్వర్గమునకు కొనిపోయెదను” అని కన్నె అనెను. “ఇప్ప టికి రోమి అయినాను రేపు ఏమందువో "గలే వలంబి లంబితా భుజంగ తుంగ మాలికా" యన్నట్టు నన్ను పెనవేసుకుని వదలనిచో " నేరుగా స్వర్గమునకు పోయెదము అని చమత్కరించెను. రేపు మనము లంక పోవుచున్నాము కదా! యని నవ్వెను
దేశాంత రమువాడు దెగువ కలవాడు
గొనిపోయి దేశము గారము జేసి నాడు
బంగారము యని ఆమెను గారము జేయుచూ కొలువగా అతడి ప్రేమ నయగారమందు (మృదుత్వము) కన్నె అనిల ద్రావితమైనది. అతడి తల్లి గండశిలవలె నున్న రోమి చేతిని చేకొని నవనీతము వలెనున్న కన్నె జేతి నందుంచగా ఇరు హృదయములు సంపృక్తమై వారు ప్రేమపాతనము నొందిరి.
బారామతి నగరమందు జలోచి పథమున బహు మహీజ వర్ధిత , సౌరు సాటోప గౌరు గంభీర నక్షత్ర నందనము గలదు. ఆ సువిశాల ఉద్యానవనము సాంద్ర, నీరంధ్ర లతిక పరివృత పుష్ప దములతో, ఘన ద్రుమములతో, పిల్ల పల్లవములతో, వనమూలికలతో, పచ్చని దరువులు తో నొప్పు చుండెను. అందొక తటాకము ఎర్రని తామరలతో మెరియుచూ కసిగాటు గోటు బీటగిల్ల విహర్తలకు గుప్తకేళి మోహము గొల్పుచుండెను. ఆ సుందర ఉద్యానవనమున రవిద్యోత రహిత పూపొదలయందు లకుమ అగస్త్యులు తీగెలలో తీగలవలె మదోత్తేజిత లటపట లాడుచుండిరి.
ప్రేమికులకీ ఉద్యాన వనములు శ్రీరామ రక్షగా నిలచినవి. వారము రోజుల నుండి ఇచ్చట బారామతిలో నుండి ఎదురుచూచిన శుభ ఘడియ రానే వచ్చినవి. కనువిందు జేయునీ అందాలు ఒకనాడు నా చేత చిక్కుననికన్న కల నిజమైనది యనుచూ
తే. నీపరువాలపాలనురువులనుజాచి
నతడి యారుపెదవి,నీజవ్వనప్రణ
యత్రాణముతెలుపు నీజిలిబిలిసొగసు
బిగిమానమురతికేళికేభూరివరము
పాలు పొంగు వంటి పరువపు మెరుపు ను చూసినచో నా పెదవులు తడి యారిపోవును నీ వయసు లో ఉన్న ( ప్రణయ త్రాణము ) శృంగార శక్తి నాకుఆశక్తిని పెంచుచుండును. నీ సొగసు జిగిమానము (బిగుతు) నిరుపమానము. అది రతి కేళికే బహుమానము. యని పొదరింట అగస్త్యుడు పై బడుచుండ
అనువు గాని చోట తమకమేలరా !వేళ చూసి నన్నేలరా !
వయసులో వేడుండనిమ్మురా!! చిన్నది నీదని నమ్మరా!!
అని చెలికాని వారించుచున్నలకుమ ఆందోళనను గాంచి
అగస్త్య: ప్రాణ రక్షణ కొరకు నీవు వాడిని తన్నినావు గానీ చంపవలెనని కాదు కదా.
లకుమ: నాకు ఆశ్చర్యముకల్గుచున్నది, విదిషకీ విషయమెట్లు తెలిసెను. ముందుగా నీకెట్లు దెలిపెను?
అగస్త్య: విదిష అమ్మమ్మ భవిష్యవాణి నెఱిఁగించెడి దైవజ్ఞురాలు. ఈమెకూ ఆశక్తి వంశపారంపర్యముగా వచ్చెనేమో? ఈమెకు తల్లి ఆత్మ కనిపించుచున్నదట .
లకుమ: అది నీవు నమ్ముచున్నావా?
అగస్త్య: ఆ విషయము ప్రక్కన పెట్టి నీవు ఆందోళన జెందక స్తిమితముగా నుండవలెను.
ల: నాకాందోళనేల కల్గును మా యమ్మ ఉండగా. నాకు మా అమ్మపై నమ్మకమున్నది.
అ:కానీ ఆమెకే నీపై నమ్మకము లేదు. ఆ నమ్మకమే యున్నచో నీవు సొంతగా చిత్రనిర్మాణము జేయక ఇట్లగచాట్లు పడవలసిన ఖర్మమేమి?
ల:అది నామనసునెప్పుడూ దొలిచివేయుచుండును, కానీ నీకు నాపై నమ్మకమున్నదా ?
అ: ముంజేతి కంకణమునకు అద్దమేల, నీకు నాకు జత కుదిరిన నాటినుండి నేను విశాఖలో నుండుట మానివేసితిని. నీ చుట్టూ భ్రమరము వలే తిరుగుచూ నన్ను నేను పట్టించు కొనుట మానివేసితిని. అన్నిటికంటే ముఖ్యమైన విషయము మానాన్నకు నాపై నమ్మకంలేదు. అది నాకు లాభించును.
ల:నాకేమీ అర్ధము కానున్నది. అది నీ కెట్లు లాభించును?
అ: నాకే కాక నీకునూ లాభించును అదిచెప్పినచో నాకేమిత్తువు?
ల:నీకు వలసినదిత్తును యని కన్ను గీటుచూ అనెను.
అగస్త్యకి రక్తపోటు పెరిగి తగ్గిన పిదప మానాన్నకి పశ్చాత్తాపము పెచ్చు. మా అమ్మని నిర్లక్ష్యము జేసినందుకు ఎప్పుడూ దుఃఖించు చుండును.
ల:జేయునదేమియునూ లేకున్ననూ మగవారు అట్లు నటింతురేమో. మా నాన్న కూడా ఇట్లే జెప్పుచుడెడివాడు. నేను మా అమ్మ నాన్న విడిపోయిన కొత్తలో ఆతడి వద్దకు పోవుచుడెడిదానను.
అ:అటులనా? మీనాన్న ఎచ్చట ఉండును? ఏమి జేయుచుండును?
ల:ఆయన చిత్ర దర్శకుడు, కేరళవాసి. ఇప్పుడు రంగమునుండి పింగము లోనికి బోవలదు. మీ నాన్న విషయము జెప్పుము.
ల: మా నాన్న పశ్చాత్తాపము నటన కాదు, నిజము. నాకు లక్షలు ఇచ్చుచున్నాడు. ఇందుకు నేను జేయవలసిన దల్లా ...
ల: మీ నాన్న పక్షము వహించవలెను , నిజము జెప్పుము నీవెవరి పక్షము?
అ: నిన్ను మానాన్నకి పరిచయము జేసి చిత్ర నిర్మాణము చేపట్టమందును
ల: అయినచో నీవు హీరో , నేను హీరోయిన్
అ: ఛీ ఛీ నాకు నటిచవలెనని ఆశలేదు , నాకు పైనే ఆశ. అన్ని విషయములు చెప్పితిని కదా , అన్న మాట నిలబెట్టుకొనుము.
ల:ఇది ఉద్యానవనము ఇచ్ఛటెట్లు కుదురును?
అ: అయినచో మీ ఇంటికి పోయెదము , మీ అమ్మ ముంబయి పోయినది కదా రాత్రికి కానీ రాదు. ల:అట్లు నాకెవరు జెప్పినారు. తాను మధ్యాన్నమే వచ్చునేమో ?
అ: మధ్యానమే వచ్చుటకు ఆమె విమానము పై పోయినా? సమయము కావలెను కదా వచ్చుటకు ?
ల: వారము రోజులనుండి ఇచటనే యుండి బారామతి గూర్చి ఏమి దెలుసుకొనినావు?
అ: బారామతి మయూర పండిట్ అను మారాఠీ కవి జన్మ స్థలమని భారతవర్ష జెప్పినాడు.
ల: ఈ వర్షునకు సాహిత్యము తప్ప ఇంకేమియు దెలికున్నది!
అ: అట్లు కొట్టిపారేయవలసిన కవి కాదు. అతడు 108 రామాయణములను వ్రాయ నిశ్చయించి 95 రామాయణములను వ్రాసేనని వినికిడి.
ల: బాగు బాగు, ఇచ్చట విమాన శిక్షణా కేంద్రము ( కర్వేర్ ఏవియేషన్ స్కూల్ ) కలదని వినలేదా? 1996 లో బారామతి నగరానికి 12 కిలోమీటర్ల దూరములో ఈ వైమానిక పేలిక ను నిర్మించినారు. మా అమ్మ అచ్చటనుండి ఛాపర్ కానీ విమానములో కానీ పోయి వచ్చుచుండును. ఇప్పుడు నాపని మీదే వకీలును కలవ ముంబాయిపోయెను. నీవు ఇచ్చట యున్నట్లు ఆమెకు తెలియదు. నీవు ఇంటికి వచ్చిన చో ఆమె చూచును అది బాగుండదు . పైగా సుందరి కూడా ఇచ్చటనే యున్నది, పైలట్ శిక్షణ పొందుచున్నది. దానికొరకు పది లక్షలు ఖర్చు జేసెను. భగవంతుడు మేలు జేసి తన శిక్షణ పూర్తి జేసుకొని పైలట్ గా స్థిరపడిన చో మంచిదే కదా. వారిద్దరూ ఉద్యానవనం నుండి నిష్క్రమించి. రహదారిపై నడుచుచుండగా వారిపక్కన నుండి ఒక కారు దూసుకుపోయెను .
అ: అదిగో ! మన కారు పోవుచున్నది , అందు సుందరి ఎచ్చటికి పోవుచున్నది?
ల: సుందరిని విమానాశ్రయము వద్ద దింపి మా అమ్మను దీసుకు వత్తురు.
మీ
అమ్మ నన్ను అంగీకరించునా ? యని దిగులు చెందుచున్న విదిష తోమంజూష " ఆమె నిన్నెప్పుడో ఆ దృష్టి తో నే చూచుచున్నది.
" అనగా" ఏ దృష్టి తో ?" యని
విదిష అడుగగా " అబ్బా ఏమి జాణమావదిన , మా అమ్మ ఏ దృష్టి తో చూచుచున్నాదో నేను చెప్పవలెనట." యని మంజూష మొఖం త్రిప్పుకొనగా "చెప్పవా .. చెప్పవా..యనుచూ విదిష మంజూష
గెడ్డము పట్టి బతిమాలెను. నిన్నెన్నెటి నుంచో కోడలిగానే చూచుచున్నది. అందుకు కూడా కారణమున్నదికొన్ని వార్తా పత్రికలలో బైరెడ్డి నిన్ను బలాత్కరించెను అని అర్ధము వచ్చునట్లు వ్రాసి , బొమ్మలు ద్వారా సంకేతములిచ్చిరి. విదిషనోట మాటరాలేదు. ఎంత ఉత్తమురాలు నీ తల్లి. ఆమె కోడలగుట
కు నేను పెట్టిపుట్టినాను. విదిషకళ్లుమరలచమర్చినవి .
"పచ్చని చేల మధ్య మట్ట సముగా ఒదిగిన భవనములు, వ్యర్ధములు లేని విశాలమైన వీధులు శుభ్రమైన లోగిళ్ళు, తిన్నని వరుసల్లో తీర్చి దిద్ది నట్లు న్న భిన్న వర్ణముల కాంతులీను ఇళ్ళు , ముఖ్మలు గుడ్డపై పేర్చిన ముత్యముల శ్రేణులే కదా ఈ పల్లెనందున్న ఇళ్ళు! గగన విహారము జేయు గంధర్వులెవరైనను గాంచిన వేల ఎకరాల మధ్యనున్న తెల్లని భవన సముదాయము వెండి పళ్ళె మందు బొండు మెల్లెలు న్నట్లగుపించి ఎత్తుకు పోదురేమో!"యని మృదంగమును గుడ్డయందు మూటకట్టి భుజమున దాల్చి నడుచుచున్న కేశవుడు చేతిసంచి పట్టుకొని వెంట వచ్చుచున్న పార్వతితో అనెను.
మారు మూల గ్రామమైన బల్లిపాడుకు రైలు మార్గములేదు గావున కేశవుడు అచటికి 8 మైళ్ళ దూరములో గల కొవ్వూరుకు బోవబయలుదేరెను. చంద్రమతి గారు కేశవుని విశాఖపట్నము పోవలదని బల్లిపాడు నందుండిపొమ్మని ఎంతపోరిననూ వినక విశాఖ పట్నము బోవు రైలు కొరకు కేశవుడు కొవ్వూరు బోవుచుండగా అక్క తమ్ముడిని రైలెక్కించి వీడ్కోలిచ్చుటకు వెంటబోవుచున్నది.
“అమ్మ(చారుమతిగారి)మరణానంతరము నాకు ఇప్పటివరకు నిన్ను జూచుటకు అవకాశము చిక్కలేదు. పెద్దమ్మ చంద్రమతి పుణ్యమా యని ఈనాటికి నిన్ను స్వగ్రామమునూ చూడగలిగితిని.” యని కేశవు డనెను. “ఇంత మనోహరమగు పల్లెను వీడి బోవనేల ? ఈ మారు మూల దిబ్బ పై యుండుట కష్టమ ని పోవుచున్నావా?” “విశాఖపట్నమువలె పెద్ద పట్నము కాదు కదా అనుచున్న పార్వతితో కేశవుడు “అక్కా పట్టణము పెద్దదైన మనమేమి జేసుకొందుము?” అయిననూ ప్రదేశము నందేమున్నది అంతా మనుషులలోనే యున్నది. నీవు మారు మూల దిబ్బ అనుచున్న ఈ పల్లెను యంత్ర కర్మాగారములతో నింపినచో, వీధులు నదులు చెత్తతో నిండును, ప్రకృతి నాశనమగును కానీ అభివృద్ధి ఆగునా? మనము మారుమూల దిబ్బలనుచున్న పల్లెలెన్నో ప్రపంచ కీర్తిని పొందెను కదా.
జక్కనవల్ల కైదల , క్షేత్రయ్య వల్ల మొవ్వ , సిద్ధేంద్రయోగి వల్ల కూచిపూడి , అన్నమయ్య వల్ల తాళ్ళపాక, ఆదిభట్ల వల్ల అజ్జాడ అటు చరిత్ర లో ఇటు జన హృదయములలో శాశ్వత కీర్తిని పొందలేదా? ఈ పల్లె ఒకనాటికి దివ్యకాంతులీనవలెను. అట్లు బోవుచున్న వారికొక యువకుడు ఎదురు వచ్చుచూ కేశవుని జూచి నవ్వి " మొన్న ఉత్సవ కార్యక్రమములో నీ మృదంగవాదమదిరెను కానీ ఎప్పుడూ ఈ డోలు మేడలో ఉండవలెనా ? ఏమిచేతువోయి నిత్యమీ డోలుతో ? యని వేళాకోళము జేసెను. పార్వతికరికాలి మంట నెత్తికెక్క " దొమ్మీ రేడా , నీవేల అంత పెద్ద చరవాణి చేతపుచ్చుకుని తిరుగుచున్నావు ? అది నిత్యమీ నీ చేతనుండవెలనా ? యని అడిగెను. దిస్ ఈ స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ఫ్రెండ్స్ యు నో యనాంగ్లమున బింకముగా పల్కినాతడికి దిస్ ఈ స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ గాడ్ యు నో యని కేశవుడు చెప్పెను.అట్టి ఘాతమునూహించని ఆ బుడతడి తేజమడికి వత్తి కాలెను. వారు బస్సుకొరకు ముందుకు సాగుచుండిరి. ఎదురుగా ఒక వృద్ధురాలు ఒక నడివయస్కురాలు వచ్చుచూ వీరిని పలకరించిరి.
“నాన్నా కేశవా గాయత్రీ మంత్రం జపిస్తున్నావురా ?” “చేస్తున్నాను మామ్మగారూ” యని కేశవుడు అనగా ఆ వృద్ద్ధురాలు కేశవుని సమీపించి
తలపైచెయ్యిఉంచి మంత్రములు చదువ నారంభించెను. పక్కనే ఉన్న నడివయస్కురాలు
నవ్వు చుండెను.
ఆ
వృద్ధురాలు మంత్రోచ్చారణ ముగించి "పబ్యా
అను నవసంఖ్యాక సూక్తములను జపించిన శత్రునిగ్రహము కలుగును. సువర్ణస్య అనుఏకాదశ సంఖ్యాక
మంత్రములజపించిన సర్వకామ సిద్ధియగును. ఆధ్యాత్మికైఃకః' అను మంత్రముజపించినమోక్షమందును.
''ఆసనోరుద్రమ్'' అని జపించిన దీర్ఘీయుష్కుండగును.''అపనః శోశుచత్'' అను దాని మధ్యాహ్నకాల
సూర్యుని స్తుతించిన ముంజగడ్డి మధ్యనుండు ఇషీక (గడ్డిపరకవలె) సులభముగ పాపము నుండి ముక్తుడగును.ప్రయాణములో శుభమగుటకు ''జాతవేదసే''
అను మంత్రమును జపింపవలెను.” అని చెప్పి ఆశీర్వదించెను.
వారట్లు
ముందుకు పోవుచుండగా వీధిలో అరుగులపైన కూర్చున్న పెద్దలు " కేశవా మరల ఎప్పుడు వత్తువు?"
యని ప్రశ్నించు చుండిరి. త్వరలో తప్పక వచ్చెదనని కేశవుడు వినయముగా సమాధానము జెప్పుచూ
సాగుచుండెను. ఇంతలో చెట్టుకింద మధ్య వయ్కసులైన కొందరు పురుషులు వారిని ఆపిరి. అందొక
ధరకర్వాటుడు (బట్టతల) "ఇట్లు జరుగునని నేనుఎనిమిదేళ్లక్రితం జెప్పితిని, ఎమ్మా పార్వతీ జెప్పితినిగానా?అమ్మ(చారుమతి)చనిపోయిన కొత్తలో జెప్పితిని. కేశవుడికా
చిన్న పిల్లాడు గుర్తుండకపోవచ్చు, నీకు గుర్తుండవలెను.
మీ అమ్మ ఆస్తి అంతా మీ పెద్దమ్మతన ఆస్తిలావాడుకొన్నది. కొడుకుని
కూతురిని అమెరికా పంపించింది. నేనానాడేచెప్పేను, దేవుడనే వాడున్నాడని "ఇప్పుడవన్నీ
ఎందుకులెండి" అనెను పార్వతి."మీ
అమ్మని ఎంత ఇబ్బంది పెట్టింది , ఆస్తంతా లాక్కొంది , ఆఖరికి మీ అమ్మకాలవ గట్టున గుడిసెవేసుకొన్నది"ఈ లోపున ఇంకొకడొచ్చిజేరెను. అతడు ఒత్తుతల కలిగి గిత్తవలె
నున్నాడు." రోజులెల్ల కాలం ఒకేలాగుండునా ? ఎంత పిసినారమ్మ మీ పెద్దమ్మ , ఎంగిలిచేత్తోఆమె కాకిని గొట్ట నేనెన్నడూ చూడలేదు. ఏంచేసుకొనును అంతఆస్తి ? మీపెద్దమ్మ సంగతి నీకు తెలీదుదేవుడి ఉత్సవానికి పైసా రాల్చెడిది కాదు.
ఎంతకష్టాల్లో
ఉన్నా మీ అమ్మ అడగకుండా కొంత తెచ్చి ఇచ్చేది.ధర్మాలు చేసి, నలుగురికీ సేవచేసి పోయిందిపుణ్యాత్మురాలు మీ అమ్మ.ఒత్తు తలాయన
ఆపగానే బట్టతలాయన అందుకున్నాడు "కొడుక్కికూతురికి అంతాదోచిపెట్టి అమెరికా పంపింది , వాళ్ళు కనీసం చూడడానికి కూడారాలేదు. మీరే సేవచేసి
ఆవిడ ప్రాణాలు కాపాడేరు ."బట్టతలాయన
కొంచెం ఆపగానేఒత్తుతలాయన అందుకున్నాడు
" అవునమ్మా మీరు రాక పోతే ఆవిడని పట్టించుకునేవారు ఈ వూర్లో ఎవ్వరూ లేరు . కుక్కచావే
వచ్చిఉండేది. కేశవుడి మనసు కలుక్కు మంది. కానీ ఊరిజనం, పెద్దవారు శ్రేయోభిలాషులు. మాట్లాడలేక " బస్సు వస్తున్నాదిఅన్నాడు
" " ఇంతకీ ఏమైనా ఇచ్చిందా ఆస్తి?"ఇస్తుందండీ , ఇస్తుందిట"
అంది పార్వతి "ఆ ఇస్తుంది ఇస్తుంది వెళ్ళండి వెళ్ళండి ." అన్నారాయిద్దరు
పార్వతి
కేశవులు కొవ్వూరు బోవు బస్సునధిరోహించిరి.
***
బొకారో కొవ్వూరు రైలునిలయమునకు సరైన సమయమునకే వచ్చి ఒక్క నిమిషమాగి 9. 43 నిమిషములకు పెట్టున కూసి పెద్దకుదుపుతో కదిలెను.
ఎండ విస్తారముగా కాయుటచే అంతయూ ప్రకాశవంతముగా నున్నది. మృదంగముతో రైలు పెట్టి లోకి
ప్రవేశించి కిటికీవద్ద కూర్చినిన కేశవునకు పార్వతి కిటికీ నుంచి సంచి నందించి క్షేమముగా జేరినట్లు తెలపవలెనని అనునంతలో రైలు కదిలిపోయెను.
దయమాలిన యంత్ర మొక్కనిమిష మాగినదికాదు అనుకొనుచూ
కిటికీనుండి చూచుచున్నకేశవునకి పార్వతి చేయి ఊపుతూ కానవచ్చెను. కనిపించునంతవరకు కేశవుడు అక్కని చూచుచుండెను. అక్క
చుక్క అయిన పిదప పెట్టిలోకి జూచిన కేశవునకు ఒక్కప్రయాణీకుడూ కానరాలేదు.
కేశవుడు మృదంగము
దీసి రైలు లయ ననుసరించి వాదనము చేయుచుండెను. కొద్దినిమిషములలో రైలు గోదావరి నిలయము జేరెను. అచ్చట ఒక విద్యార్థి బృందము రైలు పెట్టిలోకి ప్రవేశించెను. వారందరూ ఆధునిక వేషధారులై ఆంగ్లమున సంభాషించు చుండిరి అందొక విద్యార్థి చేత గిటారు కలదు. పొడవైన కేశములతో పంచ కట్టుకున్న కేశవుని చూచి కిటికీ వద్ద నుండి తొలగమని ఆ బృందమందు ముఖ్యుడనగా "నేను ఇచ్చట నుండి ప్రకృతి చూచి పరవసించుచున్నాను" అని కేశవుడు సమాధానమిచ్చెను. కేశవుడి మాట తీరు జూసి వీడెవడో వెంగళప్ప వలె నున్నాడు ఆటపట్టించవలెనని సైగలు వారు ఒకరితో నొకరు జేసుకొనిరి.
వెనుకనుండి ఎవడో కేశవుని కేశములను లాగెను. కేశవుడు వెనుకకి తిరిగి చూచినంతలో మరొకడు కేశవుని మృదంగ మెత్తు కొని పోవుచుండెను. కేశవుడతని వెనుక పడగా కేశవుని స్థానమందు గిరాటు పూనిన యువకుడు చతికిలపడెను. కిటికీవద్ద నున్న స్థానములన్నీ ఆ యువకులు ఆక్రమించిరి. “నా స్థానము నాకిమ్ము నేనచ్చట కూర్చిని మృదంగము వాయించుకొనవలెను” అనగా బృందం మొత్తము గొల్లు మనెను. నీ మృదంగ వాదముతో నా గిటారు వాదననోడించినచో నీస్తానము నీకిత్తును లేనిచో నీవు వేరొక చోటు చూసుకొనవలెను అని ఆ యువకుడు తన మిత్రులవంక జూసి కన్ను గీటుచూ చెప్పెను. కేశవుడంగీకరించెను. “గిటారు వాదకుడు పాడుటందు దిట్ట నీవు గాత్రకోవిదుడవైన పాడి గెలవవచ్చు మృదంగము వాదానందే గెలవ వలసిన పనిలేదు” అని ఒకడనగా కేశవుడు మందహాసము జేసి మీకొరకైనచో పాట వరకు బోవలసిన పనిలేదు. అనగా వారికి పుండుమీద కారము జల్లినట్టయినది.
ఈ జుట్టు పోలిగాడు గొప్ప విద్వాన్సుని వలె నీల్గుచున్నాడు వీడి పని పట్టెదనని పల్కి " ఓడినవారు వాద్యపరికరమును వదిలిపోవలెను, ఇది షరతు.” “మీ షరతు నేనంగీకరించుచున్నాను, నాదియూనొక షరతుగలదు పాట పాడువారు తమ సొంతపాటనే పాడవలెను. ఇతరులు వ్రాసిన గీతములు పాడరాదు” అనగా ఖండిత వదనములను జూపలేక మొగము తిప్పుకొనిరి.
చేతకాకున్నచో పాట మాని వాద్య పరి కరములందుకొనవచ్చును. ని కేశవుడనగా సరే యనుచు అతడిని బెదిరించుటకు ర్యాప్ తరహా గానము చేయవలెను అని షరతు పెట్టిరి. కేశవుడు సరే యనెను. "ఎవరు నెగ్గినారో ఎవరు ఓడినారో ఎవరు నిర్ణయింతురు ?" అని ఒకడడుగగా " మీరే నిర్ణయించవలెను " అని కేశవుడనగా బృందం తెల్ల బోయెను. "మీ మీద నాకు నమ్మకముంది అనుచూ ఏ భాషయందు పాడవలెను ఆంగ్లమా? తెలుగా? యని అడుగగా బృందం మూగబో యెను. కేశవుడు మృదంగము తీసుకొని రైలు లయకు అనుగుణముగా రెండు నిమిషములు వాదన సాగించి ఆపెను. గిటార్ వాదకుడు లయతప్పి భిన్నమైన లయను పుట్టించుచుండెను. రైలు లయ విడిగా వినిపించుచుండెను. “ర్యాప్ గానమనిన మద్దెల గొట్టుటకాదు, సత్తా ఉన్నచో చూపుము” కేశవుడు ప్రారంభించెను.
నా తల సూరీడూ .. నా కళ్ళు గోళాలూ .. నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ .. నా లక్ష్యము వింధ్య శిఖరము నా మార్గము కఠినాతి కఠినము నా హృదయము మృదు మధురము నా మాట మందార బృందారము కూబరమూ నీ వరమూ
I am kid crawling at your feet maata vegdeveee.
I found these words at your feet maata vegdeveee.
Quiero un rincón en tu mundo maataa hamsa vaahinee
Quiero el polvo de tu tobillo maata saraswati.
నా తల సూరీడూ ... నా కళ్ళు గోళాలూ ... నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ (2) నా వేగము అరుణ కిరణము చూచి హిరణము పొందు చలనము నే గగన విహగము నా…. పదము మేఘపథమూ ....... నా లోకము కాదొక లోకము, నా లోగిలి నవరస కౌగిలి రుద్రము, క్షుద్రము కరుణము హాస్యము శృంగారము ….
వచనము: భాషాయోష తెఱఁగు మెఱయ వస్త్రములు నా పదములు బిట్టురమెరగక, రయము నెఱయు ధవళ కాంతులు నా పదములు విద్వద్వజ్ర సంజాత శత సంకీర్ణ ఉల్కా సంఘాతములు నా పదములు క్షితిజాన్తరాళ కరాళ రుద్ర విస్ఫోటములు నా పదములు. నా పద ములు తట్టు నీ గుండె తలుపులు, మ్రోగించు మేళ తాళాలు.
నా తల సూరీడూ ..నా కళ్ళు గోళాలూ .. నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ ... 2
బృందమంతయూ ఎంతగా యత్నించిననూ సొంతగా పాడలేక ఓటమిని అంగీకరించవలసి వచ్చెను. బృందము వారొకొక్కరికీ కాంతి ప్రసరించుచుండెను. అయిననూ దింపుడు కళ్లెము ఆశ వలె చివరి ప్రయత్నము చేయదలిచిరి "ఒరేయ్ కైలాష్ నువ్వు బాగా అభ్యసించిన తెలుగు పద్యంఅప్పుడప్పుడు పాడు చుందువుకదా అది పాడుము" అని గిటారుడు మిటారిపల్కులను పల్కెను. కైలాష్ పద్యమును పాడదొడిగెను.
టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో
త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుతా! బసవేశ పాహిమాం!
పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యమొకటి పాడి కేశవునకు సవాలువిసిరెను. కేశవుడా పద్యమును పాడి వినిపించగా ఆ బృందమునకు తేజమడిగెను. రైలు గోదావరి వంతెనను సమీపించెను. వంతెన మీద రైలు వేగము తగ్గి పోవుచుండగా రైలు ధ్వని, లయ రెండునూ మారినవి. కేశవుడు ఆ ధ్వనిని ఆలకించి "షడగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్ గ్ణడగ్డ్ డని ఈడ్చుచు, గ్ణడగ్ణడ గ్డ్ ట్గగ్ణ గ్ణడగ్డ్ ట్గగ్ణగ్డ్ డని లాగుచు ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ డను లోహానిస్వ నమ్మున గిర గిర దిరుగు అరుగు చక్రముల్ క్రిక్చ్కక్ క్రక్చ్కక్ యని పెక్కు స్ఫులింగముల్ క్కుచు షడట్గగ్ణ టడగ్డ్షడగ్డ్ అంచు లంఘించు రాక్షస క్రీంకార శక్తి స్వరూప పృషదంశ మిత్ర షడగ్డ్ ట్గగ్ణగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్ బోకారేశ్వర పాహిమాం"
యని కేశవుడు పాడగాబృందమునందరూ మొహమొహములు చూసుకొనిరి. రైలు రాజమండ్రిదాటి సాగుచుండెను, మృదంగము అంకతలమందు ( వొడి ) బెట్టుకొని
కేశవుడు తన స్థానమందు తాను కూర్చొనెను. ఈ గిటార్ వాదకుని పేరురాకేష్కానీ రాష్ యని జెప్పుకొనును. “రాష్ అనగా కదా కాస్త మంచి పేరు పెట్టుకొనరాదా?”
యని కేశవుడడుగగా “అయ్యోఆంగ్లేయుని వలె కనిపించవలెనుకదా,
రాకేష్ యని జెప్పిన ఆ జుట్టుకట్టు కొరకు వేలాది
రూపాయలు వెచ్చిచుచున్నదంతయూ బూడిదలో పోసిన పనీరేకదా” యని వాడి భీతి. “ఇక వీడి పేరు
డేవిడ్ , వాడిపేరు మహేష్ “ “నీపేరేమి ?”యని చెప్పుచున్నవాడిని
కేశవుడడుగగా “నా పేరు కైలాష్” “వాడి అసలు పేరు
కైలాస శర్మ.” యని డేవిడ్ జెప్పెను“నీ తెలుగు
బాగున్నది.” కేశవుడనెను.
పరిచయములైన పిదప వారు స్నేహభావము కలిగి సన్నిహితముగా మెలిగి
మాటలు ప్రారంభించిరి. నీ హాబీస్ ఏమి? యని రాకేష్ అడుగగా ఏమీ లేవని జెప్పగా డేవిడ్ నీకు అర్థముకాలేదు హాబీస్ అనగా నీవు తీరిక సమయములలో చేయు పని. నీవు బ్రతుకుటకు ఏపని చేయుచుందువు? “మృదంగము వాయింతును.” “అదిగాక తీరిక సమయములలో ఏమీచేయకుందువా? చేసెదవు కదా వాటినే హాబీస్ అందురు. "నాకు జీవితము భగవంతుని జేరుకొను ప్రయాణము. నేను నిత్యమూ అదే మార్గమున ప్రయాణించుచుందును." కేశవుడనెను. “ నీ లక్ష్యమేమి , అనగా నీ గోల్ ఏమి ?” భగవంతుని జేరుట అని వారికి ఎంత జెప్పిననూ అర్ధము జేసుకొనలేక తికమక పడుచుండగా, “సంపాదించి నిన్ను అభివృద్ధి జేసుకొ నవలెనుకదా?” “సంపాదించవలెను కానీ అది అభివృద్ధి ఎట్లగును. అది నా లక్ష్యము కాదు దానిపై మనసు లగ్నము కాలేదు” మీరు ఆంగ్ల అనుకరణలో సంస్కృతినే కాక ఆత్మను కూడా కోల్పోయినారు.
కొంతైననూ భారతీయ పురాణ గ్రంథపఠనము ఉండనిచో నేను చెప్పునది అర్థమగుటకు ఆస్కారం తక్కువ. మీరు ఆరు అందమైన అరుదైన తెలుగు మాటలు చెప్పగలరా? " వారు చెప్పలేక స్తంభించి యుండిరి " మరి మీరు నిత్యమూ తెలుగు మాట్లాడు చుందురు కదా ? యని అడుగగా " అవును కానీ తెలుగు పై మనసు లగ్నము కాలేదు " అని చెప్పిరి. ఇప్పుడు ధనార్జన మీద నా మనసు లగ్నము కాలేదను మాట కొంత అర్ధమైనదా ? అర్థమైనది , కానీ పురాణ పఠనము గ్రంథ పఠనము ఉన్నచో ఇంకనూ బాగుగా అర్ధమగునని ఎందుకు జెప్పితివి? "గోదాదేవి యను కన్య రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. ఆమె తండ్రి విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని వెళ్ళుచుండెడి వారు. వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఒక రోజు ఈ రహస్యం విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి గోదాదేవిని మందలించిరి.
మరుదినమున స్వామివారు మాలాధారణ కావించ కుండుటతో , దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని బాధపడుచుండగా స్వామివారు విష్ణుచిత్తులవారి కలలో కనిపించి తనకు ప్రతిరోజూ గోదాదేవి ధరించిన మాలే కావాలని ఆదేశిస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగును . వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమగును . గోదాదేవి ఎవరు ? నేనెప్పుడో వినలేదే ? యని మోహన్ అనగా "ఇటువంటి పురాణములను నమ్మ జాల"మని డేవిడ్ ఖండించెను." దీనికి ఏదైననూ చారిత్రాత్మక ఆధారమున్నదా ? "యని రాకేష్ అడుగగా "శ్రీవిల్లిపుత్తూర్ నందు ప్రఖ్యాతి గాంచిన వైష్టవాలయము కలదు . ఈ ఆలయమునకు అతి ఎత్తైన పదకొండంచెల గోపురం కలదు. ఈ గోపురమే తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నం.
విష్ణుచిత్తార్ లేదా పెరియాళ్వార్ కు ఈ ఆలయ తులసి తోటలో లభించిన కుమార్తె ఆండాళ్. ఆండాళ్ ను మనము గోదాదేవిగాను, పెరియాళ్వార్ లేదా విష్ణుచిత్తార్ను విష్ణుచిత్తులగాను పిలుచుచున్నాము. గోదాదేవి దక్షిణ భారతదేశంలోని 12 మంది అల్వార్ సాధువులలోఏకైక మహిళా అల్వార్. గోదాదేవి రచించిన తిరుప్పావైచాలా ప్రసిద్ధమైనది.తిరుప్పవాయి, పెరుమాల్, (విష్ణు) స్తుతితోగోదాదేవి (అండల్) తమిళంలో రాసిన ముప్పై చరణాల సమాహారం.దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు ఆలయంలోపఠిస్తారు.
తిరుపతి లోకూడా స్వామివారి
మేడలో బ్రహ్మ్మోత్సవములలో శ్రీవిల్లిపుత్తూర్ ఆలయంలో గోదాదేవి ధరించిన మాలానే వెంక
టేశ్వరునికి ధరింప జేస్తారు . బల్లిపాడు నందు కూడా ఇదే ఆచారము కలదు. బల్లిపాడు మదన
గోపాలస్వామి ( విష్ణువు అవతారము ) ఆలయమందు ప్రతి ఏటా గోదా దేవి కళ్యాణము , రధోత్సవం
జరుగును" అటులనా మేము మాకు ఈవిషయములేవియునూ తేలియదే యని కొద్దిమంది
అనుచుండ " కారణమేమయి యుండును ? " యని శర్మను కేశవడడిగెను .
Let us take a look at the films first then go to books
Films all over the world promote entertainment but films in Andhrapradesh promote wastrels of rich families as heroes and destroy the beauty of art and showcase vulgarity as beauty.
Nepotism and hedonism is the order in the film industry. The same hero from the same family acts in hundreds of films. Criminal minds blackmailers copy cats and perverts shine as directors sick minds who can neither read nor reason quickly accept these buggers for their glamour and caste. Such is the environment in the film industry that hardly any characters or characterization is possible. Leave alone morals even the story is relegated to the background. All characters including the story surrender to the ugly but rich scamp. Care a jat!
What a pity! Films make idiots without any talent celebrities thus turn the people into fools. These heroes when they get old creep into politics . while they sit on important positions like piece of shit their keeps and concubines press on the veins and arteries of the society. Their dastardly acts are glamorized by the castiest fans and paid journalists.
Now let us take a look at the books.
Books mainly promote knowledge rather than entertainment. They have no heroes but subjects. The same hero will never happen again and again in books as in films. Good story and ideal characters are possible because the writers of books are individuals with self respect who work for self satisfaction and recognition unlike the cine writers. Good books and great epics have values as the foundation and humanity and generosity as themes.
People find it interesting to understand the differences between films and epics. I now take my epic. Every novel is not an epic. "Bharatvarsha" a good example of an epic which throws further light on this discussion and bring clarity on what a good book can offer.
కావ్యం సినిమాకంటే ఎందుకు గొప్పది ?
మొట్ట మొదట మనం భాషను తీసుకుందాం. ఈ రోజుల్లో సినిమా భాష నీచముగా నుండడమే కాకుండా వాల్లు, పెల్లి, వంటి చెడ్డ ఉచ్చారణతో భాషను స్థాయిని దిగజారుస్తున్నాది. మన భాష స్థాయి పడిపోతే మన స్థాయి పడిపోయినట్టే . కావ్య భాష ఛందోబద్ధ పద్య , గద్య శోభితంగా రసరమ్యముగా ఉంటుంది.
సినిమా ఇతివృత్తం హీరో కాళ్ళ చుట్టూ హీరోయిన్ గుడ్డ (clothes) చుట్టూ, బొడ్డు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కావ్యం ఇతివృత్తం ఉదారంగా ఉన్నతంగా ఉంటుంది. మానవీయ గుణాలను ఔన్నత్యాన్ని చూబించే పాత్రల రూప కల్పన ఉంటుంది కానీ సినిమాల్లోలాగ ధనబలం, పొగరులను కావ్యం ఔన్నత్యంగా చూపదు.
ఇంకా హాస్యం విషయానికొస్తే , కావ్యంలో వెకిలి హాస్యం ఉండదు , పెడసరం మాటలు అసలు ఉండవు. వెకిలి మాటలు పెడసరం మాటలే మానవ ప్రవర్తన చెడిపోవటానికి కారణాలు. అందుకనే జీవితం లో ఒక్క కావ్యం చదివిన అనుభవం ఉండాలి. ఇలాంటి వ్యాసం ఒక్కటైనా చదవాలి.
నా మార్గం చాలా సంక్లిష్టమైనది . 1000 పేజీల కావ్యం వ్రాయడానికి నిర్ణయించుకుని దాదాపు సగం పూర్తి చేసాను. అనేక మంది మిత్రులు ఉన్నప్పటికీ ఇంత ప్రయాణంలో నాతో రాగలిగేవారు కేవలం ఒకే ఒక్కరున్నారు. ఈ కావ్యం లో ఒక్క పేజీ చదవడానికి శక్తి, ఏకాగ్రత లేనివాళ్ళని చాలామందిని చూస్తుంటాను. అందుకే ఈ కావ్యం రచన వెనుక ఉన్న శ్రమను కొంచెం వివరించా దలచుకున్నాను.
I would like to explain here the efforts behind writing the 100 page Epic.
1 పేజీ రచనకి కనీసం 10 పేజీలు చదవాల్సినదే. ఒక చిన్న పదం వెనుక ఎంత పెద్ద కథ ఉంటుందో తెలుసా ? ఉదాహరణకి 1. పెరి కార్డియల్ ఎఫ్యూజన్ 2. డ్రెయినింగ్ 3. హైపర్ విస్కాసిటీ 4. న్యూట్రో పెనిక్ ఫీవర్ ఈ నాలుగు పదాలు తెలుసుకోడానికి 20 పేజీలు చదివేను. 1000 పేజీలు వ్రాయాలంటే ఎన్నిపేజీలు చదవాలో ఒక నోటిలెక్కన తెలుసుకోవచ్చు. 1000 X 10. 10,000 పేజీలు
I must read at least 10 pages in order to write 1 page. On an average i must read 10,000 pages minimum to complete this 1000 page novel.
5. తంజావూరు రాజులు ముద్దు పళని కథ , 6. ఆవిడ రచించిన రాధికా స్వాంతనం రచన , 7. బ్రిటిష్ వారు ఆ కావ్యముని నిషేధించుట (నిషేధించుటకు అప్పటి రాజకీయపరిస్థితులు తెలుసుకున్నాను కానీ వ్రాయలేదు ) 8. అడయారు కేన్సర్ ఆసుపత్రి వెనుక ఫౌండర్ డా . ముత్తు లక్షి కథ.
9. అంబులెన్సు లో రోగులను తరలించు విధానం. అంబులెన్స్ వైద్యులు వారి విధులు
10. ఎయిర్ అంబులెన్స్ ఖర్చు సేవలు అందించు సంస్థలు 11. టర్మాక్ ఏక్సస్. యువర్ అంబులెన్స్ కెన్ గో డైరెక్ట్ టు ద ఎయిర్ అంబులెన్సు.
12. కేథలిక్ , ఈస్ట్రన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఆత్మను నమ్ముతాయా ?
13. ప్రపంచ మతాల లో కర్మకాండల పద్ధతులు వాటి వెనుక అర్థాలు, నమ్మకాలు
14. ఆత్మ ప్రయాణం - గరుడపురాణం
100 పాత్రలు గుర్తు పెట్టుకుని కథా గమనము సమయపాలన తో గ్రాంధిక తెలుగు భాషలో వృత్తపద్యాలతో వ్రాస్తున్నాను.
సమయపాలన అంటే కథలో సమయ పాలన. ఎయిర్ అంబులెన్స్ ( విమానం ) విజయవాడ ఎయిర్పోర్ట్ చేరడానికి పట్టే సమయం 1 గంట. పేషంట్ అంబులెన్స్ చేరాడని పట్టేసమయం 30 నిమిషాలు అంటే స్లో గా వెళ్ళాలి. ఇదే అంబులెన్స్ లో పాత్రలు చేత కథలు చెప్పించడానికి వీలు కలిపిస్తుంది. ఇది కథలో సమయ పాలనంటే.
ఒక తరళ పద్యము వ్రాసే శక్తితో రెండు కందపద్యాలు వ్రాయవచ్చు. రెండు కందపద్యాలు వ్రాసే శక్తితో నాలుగు శార్దూల పద్యాలు లేదా ఆరు ఉత్పలమాలలు , లేదా పది ఆటవెలది లు వ్రాయవచ్చు. తరళ పద్యము అత్యంత కఠినమైనది. ఈ భారతవర్ష 39 వ భాగం లో ప్రత్యేక శ్రద్ధతో (మునుపెన్నడూ పద్యములకు టీకా తాత్పర్యము వ్రాయలేదు) తరళ పద్యము వ్రాసాను.
Efforts to write poems is explained in the above paragraph. Each poem is like writing ten essays. Besides the language used is grand old style. It is not ordinary spoken language.