1, 3 పాదాలలో మూడేసి గణాలూ..2, 4 పాదాలలో ఐదేసి గణాలు ఉంటాయి.
1, 3, 5, 7 గణాలలో "జగణం" ఉండరాదు.
6 వ గణం లో తప్పనిసరిగా "జగణం" లేక "నలము" ఉండాలి.
8 వ గణం లో చివర తప్పనిసరిగా గురువు ఉండాలి.
మొదటి పాదం గురువు తో మొదలైతే, అన్ని పాదాలూ గురువు తో, మొదటిపాదం లఘువు తో మొదలైతే, అన్ని పాదాలూ లఘువు తో మొదలవ్వాలి.
కవిరా జులుద్భ వించిరి
కవనం బునపే రుపొంది కాలము చేయన్
నవరస మధుర ఇతిహాస
మవనీ తలమె ల్లయల్లె మాలిమి తోడన్
నీలి అక్షరాలన్నీ లఘు నియమం, ఎర్ర అక్షరాలన్నీ ప్రాస నియమం చూపుతున్నాయి. అమ్మయ్య గణాలు, నియమాలు సరిపెట్టేసాం ! ఇంకా ఏమైనా చూసుకోవలసింది ఉందా ? ఉంది. ఏంటది? అదే పదాలు, పదబంధాలు అర్ధవంతంగా వాడామా? లేక నోటికొచ్చినవి రాసేసామా ? సరే చూద్దాం.
కవిరా జులుద్భ వించిరి
ఈ ప్రదేశం కవులను ఉత్పత్తి చేసింది అని ఈ పాదం అర్థం సిలపతిగారం అనే పురాణ గ్రంథకర్త గొప్పతమిళ కవి ఇలాంగో అడిగళ్ "పూమ్పుహార్" వాసి. మణిమేఖల కావ్యకర్త చితాలై చాతనార్ఇక్కడ పుట్టకపోయిన ఈ ప్రదేశం గురించి రాసాడు. సిలపతిగారం అనే కథ చదివినవారు అది ఒక పురాణ కావ్యము లేదా గొప్ప కథ అనుకుంటారు. అది కథ కాదు జరిగిన విషయాన్నేఅడిగళ్ కధగా మలిచాడు. అతడు హిందూ కవి అయినా జైన సన్యాసి అని నిరూపింఛ డానికి చాలా కుట్ర జరిగింది.
కవనం బునపే రుపొంది కాలము చేయన్
ఈ పాదం అర్థం పూంపుహార్ కవులు కావ్య రచన కీర్తినిపొందటం. పట్టినాథర్ గుడి లో ఉండేది ఈయనే. ఐదు ప్రసిద్ధ తమిళ పురాణాలు సిలపతిగారం, మణిమేఖలం, ,శైవక చింతామణి, వలయపతి , కుంటలకేసి. వాటిలో రెండు, సిలపతిగారం, మణిమేఖలం పూంపుహార్కు సంబంధించినవి.
నవరస మధుర ఇతిహాసం
సిలపతిగారం, మణిమేఖలం నవ రసాలు కలిగిన మధురమైన ఇతిహాసాలని అర్థం. కన్నాగి కొవలన్ పూంపుహార్లో నివసించారు. కన్నాగి సభలో రాజుని ఎదుర్కోడం వీరం, ఆమె భర్త కోవలం శిరచ్చేదము భయానకం. మాధవితో అతడిపరిచయం, శృంగారం. ఇలా ఇతిహాసంచదువుతుంటే అన్ని రసాలు కనిపిస్తాయి. అందుకే ఇది నవరస మధుర ఇతిహాసం
మవనీ తలమె ల్లయల్లె మాలిమి తోడన్
భూమి అంతటా వ్యాపించాయని ఈ పాదం అర్థం.
కవిరా జులుద్భ వించిరి
టవిమల తేజము లుబొంది టవసిం చిరిధ
న్యవిరా గజీవు లందిరి
శివమో క్షంబిట బొందిరి సిద్ధులు యోగుల్
కవిరా జులుద్భ వించిరిట
అంటే గొప్ప కవులు ఇక్కడ పుట్టారు అని అర్థం
విమల తేజము లుబొందిట వసించిరి
స్వచ్ఛమైన కీర్తిని పొంది ఇక్కడ నివసించారు
ధన్యవిరా గజీవు లందిరి
వైరాగ్యమును పొందిన ధన్య జీవులు పొందిరి
శివమో క్షంబిట బొందిరి సిద్ధులు యోగుల్
శివమోక్ష అంటే ఈ ప్రదేశానికి చెందిన శివ మోక్ష కథలలో తిరువెంకదార్ (పట్టినాథర్) కథ ఒకటి. తిరువెంకదార్ ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టి ఐస్వరాన్ని త్యజించి మోక్షం కోరి దేశాటన చేసి చివరకు తాను పుట్టిన వూరు కావేరిపూపట్టినం ( పూమ్పుహార్) చేరుకొని సముద్రాన్ని చూస్తూ ఒక గిన్ని తనపై కప్పించుకుని శివలింగంగా మారాడు.
ముచుకుంద చోళుడు సురరాజు ఇంద్రుడుకి మధ్య స్నేహబంధం ఉంది అని ఈ పాదం అర్థం ముచుకుంద చోళుడు చాలా శక్తివంతుడు. అతడి సాయం ఇంద్రుడికి కూడా అవసరమైంది. అతడి సాయం పొందిన సురరాజు అతడిని " ఏం కావాలో కోరుకో ఇస్తాను "అంటాడు. అప్పుడు ముచుకుందుడు ఇంద్రుడు వద్ద నున్న సోమస్కంద (విష్ణు ప్రతిమ)ను అడుగుతాడు. ఇంద్రుడు సందిగ్ధంలో పడతాడు. అటువంటి విగ్రాహాలు ఏడూ తయారు చేసి ఇందులో అసలదిఎదో కనుక్కోమంటాడు. ముచుకుంద చోళుడు అసలు విగ్రహాన్ని గుర్తించడం తో ఇంద్రుడు ఏడూ విగ్రాహాలని అతడికి ఇచ్చేసి తన శిల్పి విశ్వకర్మ తో పూపుహార్ నిర్మింపజేసాడు. వారి మైత్రికి నిదర్శనము పూమ్పుహార్.
ఇంత విపులంగా వివరించాక పద్యం అర్థవంతంగా లేదని ఎలా చెప్పగలము!
ReplyDeleteSahitya...... Thanks remaining part of the story will be sent to your mail
DeleteToo good explanation sir.. mee telugu works chooste... maa lanti language lovers ki vocabulary perugutundi and basha loni beauty ardham authundi.
DeleteKeep enlightening us sir..
You are a true language lover. your feedback gives me strength to writer better. thank you sir.
Deleteఈ నాటి పరిస్థితుల్లో కంద పద్యములు యందు మీరు చూపిన మక్కువ నేటి తెలుగు ఉపద్యాయులందరికి ఒక ధైర్యము ఇస్తున్నది
ReplyDelete