Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, September 24, 2020

Bharatavarsha 40

 .         చ్చటి  చేలుము  చ్చటగ    ట్టము    గట్టిన   పల్లెజూ  చినన్

               నచ్చటె  వెచ్చగ  మనము  నాట్యము జేయును పట్టుబ  ట్టపై       

                ముచ్చట  గొల్పుచు  ముత్యపు  మిద్దెలు,   వీధులు   పైడిచే రులే                

                మెచ్చుచు బల్లిపా    డిదని   ల్కిన   చాలదు   చూచిరా వలెన్   



"పచ్చని చేల మధ్య మట్ట సముగా ఒదిగిన  భవనములు, వ్యర్ధములు  లేని విశాలమైన వీధులు  శుభ్రమైన  లోగిళ్ళు, తిన్నని వరుసల్లో తీర్చి దిద్ది నట్లు న్న భిన్న వర్ణముల కాంతులీను  ఇళ్ళు ,  ముఖ్మలు గుడ్డపై  పేర్చిన ముత్యముల  శ్రేణులే కదా ఈ పల్లెనందున్న ఇళ్ళు! గగన విహారము  జేయు గంధర్వులెవరైనను  గాంచిన వేల  ఎకరాల మధ్యనున్న తెల్లని భవన సముదాయము  వెండి పళ్ళె మందు బొండు మెల్లెలు న్నట్లగుపించి ఎత్తుకు పోదురేమో!"యని మృదంగమును గుడ్డయందు మూటకట్టి భుజమున దాల్చి నడుచుచున్న కేశవుడు చేతిసంచి పట్టుకొని వెంట వచ్చుచున్న పార్వతితో అనెను. 


మారు మూల గ్రామమైన బల్లిపాడుకు రైలు మార్గములేదు గావున కేశవుడు అచటికి 8 మైళ్ళ దూరములో గల కొవ్వూరుకు బోవబయలుదేరెను. చంద్రమతి గారు కేశవుని విశాఖపట్నము పోవలదని బల్లిపాడు నందుండిపొమ్మని ఎంతపోరిననూ వినక  విశాఖ పట్నము బోవు రైలు కొరకు కేశవుడు కొవ్వూరు బోవుచుండగా అక్క తమ్ముడిని రైలెక్కించి వీడ్కోలిచ్చుటకు వెంటబోవుచున్నది.

“అమ్మ(చారుమతిగారి)మరణానంతరము నాకు ఇప్పటివరకు నిన్ను జూచుటకు అవకాశము చిక్కలేదు. పెద్దమ్మ చంద్రమతి పుణ్యమా యని ఈనాటికి నిన్ను స్వగ్రామమునూ చూడగలిగితిని.” యని కేశవు డనెను. “ఇంత మనోహరమగు పల్లెను వీడి బోవనేల ? ఈ మారు మూల దిబ్బ పై యుండుట కష్టమ ని పోవుచున్నావా?”  “విశాఖపట్నమువలె పెద్ద పట్నము కాదు కదా అనుచున్న పార్వతితో కేశవుడు “అక్కా పట్టణము పెద్దదైన మనమేమి జేసుకొందుము?”  అయిననూ ప్రదేశము నందేమున్నది అంతా  మనుషులలోనే యున్నది.  నీవు మారు మూల దిబ్బ అనుచున్న ఈ పల్లెను యంత్ర కర్మాగారములతో నింపినచో, వీధులు నదులు చెత్తతో నిండును, ప్రకృతి నాశనమగును కానీ అభివృద్ధి ఆగునా? మనము  మారుమూల దిబ్బలనుచున్న పల్లెలెన్నో ప్రపంచ కీర్తిని పొందెను కదా. 

జక్కనవల్ల  కైదల , క్షేత్రయ్య వల్ల  మొవ్వ , సిద్ధేంద్రయోగి వల్ల  కూచిపూడి , అన్నమయ్య వల్ల  తాళ్ళపాక, ఆదిభట్ల వల్ల  అజ్జాడ అటు చరిత్ర లో  ఇటు జన హృదయములలో  శాశ్వత కీర్తిని పొందలేదా? ఈ పల్లె ఒకనాటికి దివ్యకాంతులీనవలెను. అట్లు బోవుచున్న వారికొక యువకుడు ఎదురు వచ్చుచూ కేశవుని జూచి నవ్వి " మొన్న ఉత్సవ కార్యక్రమములో నీ మృదంగవాదమదిరెను కానీ ఎప్పుడూ ఈ డోలు మేడలో ఉండవలెనా ? ఏమిచేతువోయి నిత్యమీ డోలుతో ? యని వేళాకోళము జేసెను. పార్వతికరికాలి మంట నెత్తికెక్క " దొమ్మీ రేడా , నీవేల అంత  పెద్ద  చరవాణి చేతపుచ్చుకుని తిరుగుచున్నావు ? అది నిత్యమీ నీ చేతనుండవెలనా ? యని అడిగెను. దిస్  ఈ స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ ఫ్రెండ్స్ యు నో యనాంగ్లమున బింకముగా పల్కినాతడికి  దిస్  ఈ స్ ఫర్ కమ్యూనికేషన్ విత్ గాడ్ యు నో యని కేశవుడు  చెప్పెను.అట్టి ఘాతమునూహించని ఆ బుడతడి తేజమడికి వత్తి కాలెను. వారు బస్సుకొరకు ముందుకు సాగుచుండిరి. ఎదురుగా ఒక వృద్ధురాలు ఒక నడివయస్కురాలు వచ్చుచూ వీరిని పలకరించిరి. 

“నాన్నా  కేశవా గాయత్రీ మంత్రం జపిస్తున్నావురా ?”  “చేస్తున్నాను మామ్మగారూ”  యని కేశవుడు అనగా ఆ వృద్ద్ధురాలు కేశవుని సమీపించి తల పైచెయ్యిఉంచి మంత్రములు చదువ నారంభించెను.  పక్కనే ఉన్న నడివయస్కురాలు నవ్వు చుండెను.

ఆ వృద్ధురాలు మంత్రోచ్చారణ ముగించి "  పబ్యా అను నవసంఖ్యాక సూక్తములను జపించిన శత్రునిగ్రహము కలుగును. సువర్ణస్య అనుఏకాదశ సంఖ్యాక మంత్రములజపించిన సర్వకామ సిద్ధియగును. ఆధ్యాత్మికైఃకః' అను మంత్రముజపించినమోక్షమందును. ''ఆసనోరుద్రమ్‌'' అని జపించిన దీర్ఘీయుష్కుండగును.''అపనః శోశుచత్‌'' అను దాని మధ్యాహ్నకాల సూర్యుని స్తుతించిన ముంజగడ్డి మధ్యనుండు ఇషీక (గడ్డిపరకవలె) సులభముగ పాపము నుండి ముక్తుడగును.  ప్రయాణములో శుభమగుటకు ''జాతవేదసే'' అను మంత్రమును జపింపవలెను.” అని చెప్పి ఆశీర్వదించెను.

వారట్లు ముందుకు పోవుచుండగా వీధిలో అరుగులపైన కూర్చున్న పెద్దలు " కేశవా మరల ఎప్పుడు వత్తువు?" యని ప్రశ్నించు చుండిరి. త్వరలో తప్పక వచ్చెదనని కేశవుడు వినయముగా సమాధానము జెప్పుచూ సాగుచుండెను. ఇంతలో చెట్టుకింద మధ్య వయ్కసులైన కొందరు పురుషులు వారిని ఆపిరి. అందొక ధరకర్వాటుడు (బట్టతల) "ఇట్లు జరుగునని నేను ఎనిమిదేళ్ల  క్రితం జెప్పితిని, ఎమ్మా పార్వతీ జెప్పితినిగానా? అమ్మ(చారుమతి)చనిపోయిన కొత్తలో జెప్పితిని. కేశవుడికా చిన్న పిల్లాడు గుర్తుండకపోవచ్చు, నీకు గుర్తుండవలెను. 

 మీ అమ్మ ఆస్తి అంతా మీ పెద్దమ్మతన ఆస్తిలావాడుకొన్నది. కొడుకుని కూతురిని అమెరికా పంపించింది. నేనానాడే  చెప్పేను, దేవుడనే వాడున్నాడని "ఇప్పుడవన్నీ ఎందుకులెండి" అనెను  పార్వతి.  "మీ అమ్మని ఎంత ఇబ్బంది పెట్టింది , ఆస్తంతా లాక్కొంది , ఆఖరికి మీ అమ్మ  కాలవ గట్టున గుడిసెవేసుకొన్నది" ఈ లోపున ఇంకొకడొచ్చిజేరెను. అతడు ఒత్తుతల కలిగి గిత్తవలె నున్నాడు.  " రోజులెల్ల కాలం ఒకేలాగుండునా ? ఎంత పిసినారమ్మ మీ పెద్దమ్మ , ఎంగిలిచేత్తో  ఆమె కాకిని    గొట్ట నేనెన్నడూ చూడలేదు.  ఏంచేసుకొనును  అంత  ఆస్తి ? మీపెద్దమ్మ సంగతి నీకు తెలీదు  దేవుడి ఉత్సవానికి పైసా రాల్చెడిది కాదు. 

ఎంతకష్టాల్లో ఉన్నా మీ అమ్మ అడగకుండా కొంత తెచ్చి ఇచ్చేది.  ధర్మాలు చేసి, నలుగురికీ సేవచేసి పోయింది  పుణ్యాత్మురాలు మీ అమ్మ.  ఒత్తు తలాయన ఆపగానే బట్టతలాయన అందుకున్నాడు "  కొడుక్కి  కూతురికి అంతా  దోచిపెట్టి అమెరికా పంపింది , వాళ్ళు కనీసం చూడడానికి కూడారాలేదు. మీరే సేవచేసి ఆవిడ ప్రాణాలు కాపాడేరు ."  బట్టతలాయన కొంచెం ఆపగానే  ఒత్తుతలాయన అందుకున్నాడు " అవునమ్మా మీరు రాక పోతే ఆవిడని పట్టించుకునేవారు ఈ వూర్లో ఎవ్వరూ లేరు . కుక్కచావే వచ్చిఉండేది. కేశవుడి మనసు కలుక్కు మంది. కానీ ఊరిజనం, పెద్దవారు శ్రేయోభిలాషులు.  మాట్లాడలేక " బస్సు వస్తున్నాది  అన్నాడు " " ఇంతకీ ఏమైనా ఇచ్చిందా ఆస్తి ?  "ఇస్తుందండీ , ఇస్తుందిట" అంది పార్వతి "ఆ ఇస్తుంది ఇస్తుంది వెళ్ళండి వెళ్ళండి ." అన్నారాయిద్దరు   పార్వతి కేశవులు కొవ్వూరు బోవు బస్సునధిరోహించిరి.


                                                              ***

 బొకారో  కొవ్వూరు రైలునిలయమునకు  సరైన సమయమునకే వచ్చి ఒక్క నిమిషమాగి   9. 43 నిమిషములకు పెట్టున కూసి పెద్దకుదుపుతో కదిలెను. ఎండ విస్తారముగా కాయుటచే అంతయూ ప్రకాశవంతముగా నున్నది. మృదంగముతో రైలు పెట్టి లోకి ప్రవేశించి కిటికీవద్ద కూర్చినిన కేశవునకు పార్వతి కిటికీ నుంచి సంచి నందించి  క్షేమముగా జేరినట్లు తెలపవలెనని అనునంతలో రైలు కదిలిపోయెను. దయమాలిన యంత్ర మొక్కనిమిష మాగినదికాదు అనుకొనుచూ  కిటికీనుండి చూచుచున్నకేశవునకి పార్వతి చేయి ఊపుతూ కానవచ్చెను.  కనిపించునంతవరకు కేశవుడు అక్కని చూచుచుండెను. అక్క చుక్క అయిన పిదప పెట్టిలోకి జూచిన కేశవునకు ఒక్కప్రయాణీకుడూ కానరాలేదు. 

కేశవుడు మృదంగము దీసి రైలు లయ ననుసరించి వాదనము చేయుచుండెను. కొద్దినిమిషములలో రైలు గోదావరి నిలయము జేరెను. అచ్చట ఒక విద్యార్థి బృందము రైలు పెట్టిలోకి ప్రవేశించెను. వారందరూ ఆధునిక వేషధారులై ఆంగ్లమున సంభాషించు చుండిరి  అందొక విద్యార్థి చేత గిటారు కలదు. పొడవైన కేశములతో పంచ కట్టుకున్న కేశవుని చూచి కిటికీ వద్ద నుండి  తొలగమని ఆ బృందమందు ముఖ్యుడనగా "నేను ఇచ్చట నుండి ప్రకృతి చూచి పరవసించుచున్నాను" అని కేశవుడు సమాధానమిచ్చెను. కేశవుడి మాట తీరు జూసి వీడెవడో వెంగళప్ప వలె నున్నాడు  ఆటపట్టించవలెనని సైగలు వారు ఒకరితో నొకరు జేసుకొనిరి. 

వెనుకనుండి ఎవడో కేశవుని కేశములను లాగెను. కేశవుడు వెనుకకి తిరిగి చూచినంతలో మరొకడు కేశవుని మృదంగ మెత్తు కొని పోవుచుండెను. కేశవుడతని వెనుక పడగా కేశవుని స్థానమందు గిరాటు పూనిన యువకుడు చతికిలపడెను. కిటికీవద్ద నున్న స్థానములన్నీ ఆ యువకులు ఆక్రమించిరి. “నా స్థానము నాకిమ్ము నేనచ్చట కూర్చిని మృదంగము  వాయించుకొనవలెను” అనగా బృందం మొత్తము గొల్లు మనెను. నీ మృదంగ వాదముతో నా గిటారు వాదననోడించినచో నీస్తానము నీకిత్తును లేనిచో నీవు వేరొక చోటు చూసుకొనవలెను అని ఆ యువకుడు తన మిత్రులవంక జూసి కన్ను గీటుచూ చెప్పెను. కేశవుడంగీకరించెను. “గిటారు వాదకుడు పాడుటందు దిట్ట నీవు గాత్రకోవిదుడవైన పాడి గెలవవచ్చు మృదంగము వాదానందే గెలవ వలసిన పనిలేదు” అని ఒకడనగా కేశవుడు  మందహాసము జేసి మీకొరకైనచో పాట  వరకు బోవలసిన పనిలేదు. అనగా వారికి పుండుమీద కారము జల్లినట్టయినది. 

ఈ జుట్టు  పోలిగాడు గొప్ప విద్వాన్సుని వలె నీల్గుచున్నాడు వీడి పని పట్టెదనని పల్కి " ఓడినవారు వాద్యపరికరమును వదిలిపోవలెను, ఇది షరతు.” “మీ షరతు నేనంగీకరించుచున్నాను,  నాదియూనొక  షరతుగలదు పాట పాడువారు తమ సొంతపాటనే పాడవలెను. ఇతరులు వ్రాసిన గీతములు పాడరాదు”  అనగా ఖండిత వదనములను జూపలేక మొగము తిప్పుకొనిరి. 

చేతకాకున్నచో పాట మాని వాద్య పరి కరములందుకొనవచ్చును. ని కేశవుడనగా సరే యనుచు అతడిని బెదిరించుటకు ర్యాప్  తరహా గానము చేయవలెను  అని షరతు పెట్టిరి. కేశవుడు సరే యనెను. "ఎవరు నెగ్గినారో ఎవరు ఓడినారో ఎవరు నిర్ణయింతురు ?" అని ఒకడడుగగా  " మీరే నిర్ణయించవలెను  " అని కేశవుడనగా  బృందం తెల్ల బోయెను.  "మీ మీద నాకు నమ్మకముంది  అనుచూ   ఏ భాషయందు పాడవలెను ఆంగ్లమా? తెలుగా? యని అడుగగా బృందం మూగబో యెను.  కేశవుడు మృదంగము తీసుకొని  రైలు లయకు  అనుగుణముగా రెండు నిమిషములు వాదన సాగించి ఆపెను. గిటార్ వాదకుడు లయతప్పి భిన్నమైన లయను పుట్టించుచుండెను. రైలు లయ విడిగా వినిపించుచుండెను. “ర్యాప్ గానమనిన మద్దెల గొట్టుటకాదు, సత్తా ఉన్నచో చూపుము” కేశవుడు ప్రారంభించెను. 

 నా తల సూరీడూ .. నా కళ్ళు గోళాలూ .. నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ 

1. నా లక్ష్యము వింధ్య శిఖరము  2. నా మార్గము కఠినాతి కఠినము 

 3. నా మాట  మందార బృందారము నీ వరమూ 

I am kid crawling at your feet maata vegdeveee.

I found these words  at your feet maata vegdeveee.

Quiero un rincón en tu mundo maataa hamsa vaahinee

Quiero el polvo de tu tobillo maata saraswati.


నా తల సూరీడూ ... నా కళ్ళు గోళాలూ ... నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ  

1 నా వేగము  అరుణ కిరణము  చూచి హిరణము  పొందు చలనము 

2 నే గగన విహగము   3. నా…. పదము మేఘపథమూ ....... 

 

Je me réveille seulement pour ta piete maman (I wake up only for your mercy )

non guardo le stelle nel cielo ma  tuoi piedi ( I don't look at stars but your feet)

ich bin das klingeln deiner anklet. Mutter Saraswati (I am the tinkle of your anklet)

Ich bin das Wackeln deiner Bangle. Mutter Saraswati. (I am the jangle of your bangles)


నా తల సూరీడూ ... నా కళ్ళు గోళాలూ ... నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ  

1. నా లోకము కాదొక లోకము  2.నా లోగిలి నవరస కౌగిలి  

3. రుద్రము, క్షుద్రము కరుణము హాస్యము శృంగారము ….

వచనము: భాషాయోష తెఱఁగు మెఱయ వస్త్రములు నా పదములు   బిట్టురమెరగక, రయము నెఱయు ధవళ కాంతులు నా పదములు  విద్వద్వజ్ర సంజాత  శత సంకీర్ణ ఉల్కా సంఘాతములు   నా పదములు  క్షితిజాన్తరాళ కరాళ  రుద్ర విస్ఫోటములు  నా పదములు. 

నా పద ములు తట్టు నీ గుండె తలుపులు,   మ్రోగించు మేళ తాళాలు.

నా తల సూరీడూ ..నా కళ్ళు గోళాలూ .. నా ఉచ్వాస నిశ్వాసాలు గ్రహ గతులూ ... 2

                                                         ***

బృందమంతయూ ఎంతగా యత్నించిననూ సొంతగా పాడలేక ఓటమిని అంగీకరించవలసి వచ్చెను. బృందము వారొకొక్కరికీ కాంతి ప్రసరించుచుండెను. అయిననూ దింపుడు కళ్లెము ఆశ వలె చివరి ప్రయత్నము చేయదలిచిరి  "ఒరేయ్ కైలాష్ నువ్వు  బాగా  అభ్యసించిన తెలుగు పద్యంఅప్పుడప్పుడు పాడు చుందువుకదా అది పాడుము" అని గిటారుడు మిటారిపల్కులను పల్కెను. కైలాష్ పద్యమును పాడదొడిగెను. 

టటకిట, టట్టకిట్ట, టటకిట్ట, టటట్ట,  

టకిట్ట, టట్టకిట్ట, టకిట,  టట్టకిట్ట, టకిటట్ట,  

టోన్ముఖ, టంకృతి స్ఫుటోత్కట, పటహాదినిస్వన,

 వియత్తల దిక్తటతాటితార్భటో ద్భట,  పటుతాండవాటన,

"ట"కారనుతా! బసవేశ పాహిమాం!

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యమొకటి పాడి కేశవునకు సవాలువిసిరెను. కేశవుడా పద్యమును పాడి వినిపించగా ఆ బృందమునకు తేజమడిగెను. రైలు గోదావరి వంతెనను సమీపించెను. వంతెన మీద రైలు వేగము తగ్గి  పోవుచుండగా రైలు ధ్వని, లయ  రెండునూ మారినవి. కేశవుడు ఆ ధ్వనిని ఆలకించి "షడగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  గ్ణడగ్డ్  డని ఈడ్చుచు, గ్ణడగ్ణడగ్డ్,  ట్గగ్ణ గ్ణడగ్డ్  ట్గగ్ణగ్డ్ డని లాగుచు ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ ట్గగ్ణగ్డ్ డను లోహానిస్వ నమ్మున గిర గిర దిరుగు అరుగు చక్రముల్ క్రిక్చ్కక్ క్రక్చ్కక్ యని పెక్కు స్ఫులింగముల్   క్కుచు షడట్గగ్ణ టడగ్డ్షడగ్డ్  అంచు లంఘించు రాక్షస క్రీంకార శక్తి స్వరూప పృషదంశ మిత్ర షడగ్డ్ ట్గగ్ణగ్డ్ గ్ణడగ్డ్ షడగ్డ్  బోకారేశ్వర పాహిమాం"  

యని కేశవుడు  పాడగాబృందమునందరూ మొహమొహములు చూసుకొనిరి.  రైలు రాజమండ్రి  దాటి సాగుచుండెను, మృదంగము అంకతలమందు ( వొడి ) బెట్టుకొని కేశవుడు తన స్థానమందు తాను కూర్చొనెను. ఈ గిటార్ వాదకుని పేరు  రాకేష్  కానీ రాష్ యని జెప్పుకొనును. “రాష్ అనగా కదా కాస్త మంచి పేరు పెట్టుకొనరాదా?” యని కేశవుడడుగగా “అయ్యో  ఆంగ్లేయుని వలె కనిపించవలెనుకదా, రాకేష్ యని జెప్పిన ఆ జుట్టు  కట్టు కొరకు వేలాది రూపాయలు వెచ్చిచుచున్నదంతయూ బూడిదలో పోసిన పనీరేకదా” యని వాడి భీతి. “ఇక వీడి పేరు డేవిడ్ , వాడిపేరు మహేష్ “ “నీపేరేమి ?” యని చెప్పుచున్నవాడిని కేశవుడడుగగా  “నా పేరు కైలాష్” “వాడి అసలు పేరు కైలాస శర్మ.” యని డేవిడ్ జెప్పెను  “నీ తెలుగు బాగున్నది.” కేశవుడనెను. 

పరిచయములైన పిదప వారు స్నేహభావము కలిగి సన్నిహితముగా మెలిగి మాటలు ప్రారంభించిరి. నీ హాబీస్ ఏమి?  యని రాకేష్ అడుగగా ఏమీ లేవని జెప్పగా డేవిడ్ నీకు అర్థముకాలేదు హాబీస్ అనగా నీవు తీరిక సమయములలో చేయు పని.   నీవు బ్రతుకుటకు ఏపని చేయుచుందువు? “మృదంగము వాయింతును.” “అదిగాక తీరిక సమయములలో ఏమీచేయకుందువా? చేసెదవు కదా వాటినే హాబీస్ అందురు. "నాకు జీవితము భగవంతుని జేరుకొను ప్రయాణము. నేను నిత్యమూ అదే మార్గమున ప్రయాణించుచుందును." కేశవుడనెను. “ నీ లక్ష్యమేమి , అనగా నీ గోల్ ఏమి ?” భగవంతుని జేరుట అని వారికి ఎంత జెప్పిననూ అర్ధము జేసుకొనలేక తికమక పడుచుండగా, “సంపాదించి నిన్ను అభివృద్ధి జేసుకొ నవలెనుకదా?” “సంపాదించవలెను కానీ అది అభివృద్ధి ఎట్లగును. అది నా లక్ష్యము కాదు దానిపై మనసు లగ్నము కాలేదు” మీరు ఆంగ్ల అనుకరణలో సంస్కృతినే కాక  ఆత్మను కూడా కోల్పోయినారు. 

కొంతైననూ  భారతీయ పురాణ గ్రంథపఠనము ఉండనిచో   నేను చెప్పునది అర్థమగుటకు ఆస్కారం తక్కువ. మీరు ఆరు అందమైన అరుదైన  తెలుగు మాటలు  చెప్పగలరా? " వారు చెప్పలేక స్తంభించి యుండిరి " మరి మీరు నిత్యమూ తెలుగు మాట్లాడు చుందురు  కదా ? యని అడుగగా " అవును కానీ తెలుగు పై మనసు లగ్నము కాలేదు " అని చెప్పిరి. ఇప్పుడు ధనార్జన మీద నా మనసు లగ్నము కాలేదను మాట  కొంత అర్ధమైనదా ? అర్థమైనది , కానీ పురాణ పఠనము గ్రంథ పఠనము ఉన్నచో ఇంకనూ బాగుగా అర్ధమగునని ఎందుకు జెప్పితివి?  "గోదాదేవి యను కన్య  రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. ఆమె తండ్రి విష్ణుచిత్తులవారు  ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకొని  వెళ్ళుచుండెడి వారు.  వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, ఒక  రోజు ఈ రహస్యం   విష్ణుచిత్తులవారికి తెలిసి చాలా దుఃఖించి గోదాదేవిని మందలించిరి.  

మరుదినమున   స్వామివారు  మాలాధారణ కావించ కుండుటతో , దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని   బాధపడుచుండగా స్వామివారు విష్ణుచిత్తులవారి కలలో కనిపించి  తనకు  ప్రతిరోజూ గోదాదేవి ధరించిన మాలే  కావాలని ఆదేశిస్తారు. ఆ తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగును . వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమగును . గోదాదేవి ఎవరు ? నేనెప్పుడో వినలేదే ? యని మోహన్ అనగా "ఇటువంటి పురాణములను నమ్మ జాల"మని డేవిడ్ ఖండించెను." దీనికి ఏదైననూ చారిత్రాత్మక ఆధారమున్నదా ? "యని రాకేష్ అడుగగా "శ్రీవిల్లిపుత్తూర్ నందు ప్రఖ్యాతి గాంచిన  వైష్టవాలయము కలదు . ఈ ఆలయమునకు  అతి ఎత్తైన పదకొండంచెల గోపురం కలదు.  ఈ గోపురమే తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నం.   

విష్ణుచిత్తార్ లేదా పెరియాళ్వార్ కు  ఈ  ఆలయ తులసి తోటలో  లభించిన కుమార్తె ఆండాళ్. ఆండాళ్ ను మనము గోదాదేవిగాను, పెరియాళ్వార్  లేదా విష్ణుచిత్తార్ను విష్ణుచిత్తులగాను పిలుచుచున్నాము.  గోదాదేవి దక్షిణ భారతదేశంలోని 12 మంది అల్వార్ సాధువులలో  ఏకైక మహిళా అల్వార్. గోదాదేవి రచించిన తిరుప్పావై  చాలా ప్రసిద్ధమైనది.తిరుప్పవాయి, పెరుమాల్, (విష్ణు) స్తుతితో  గోదాదేవి (అండల్) తమిళంలో రాసిన ముప్పై చరణాల సమాహారం.  దీనిని ధనుర్మాసం లో ప్రతిరోజూ, విష్ణువు ఆలయంలో  పఠిస్తారు.

తిరుపతి లోకూడా స్వామివారి మేడలో బ్రహ్మ్మోత్సవములలో శ్రీవిల్లిపుత్తూర్ ఆలయంలో గోదాదేవి ధరించిన మాలానే వెంక టేశ్వరునికి ధరింప జేస్తారు . బల్లిపాడు నందు కూడా ఇదే ఆచారము కలదు. బల్లిపాడు మదన గోపాలస్వామి ( విష్ణువు అవతారము ) ఆలయమందు ప్రతి ఏటా గోదా దేవి కళ్యాణము , రధోత్సవం జరుగును" అటులనా మేము మాకు ఈవిషయములేవియునూ తేలియదే యని కొద్దిమంది అనుచుండ " కారణమేమయి యుండును ? " యని శర్మను కేశవడడిగెను .

2 comments:

  1. ఈ భాగంలో కేసవుడి పాత్ర, కేశవుడు పాడిన పాట రచయిత అంతరంగాన్ని ప్రతిబింబిస్తుంది.రచయితకు కళల పట్ల, భాష పట్ల ఉన్న తృష్ణ కనిపిస్తుంది.పల్లె అందాలను వర్ణిస్తూ రాసిన పద్యం అద్భుతంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. నిన్నంతా వెతుకులాట
      రాళ్లు రప్పలు గొట్టుకొని
      ముళ్లకంపలు జెక్కుకొని
      పెనుగులాట నేటికి ముగిసె
      నేస్తమా నానీకు శుభోదయం

      కుంచిత కోణాల్లో చిత్తు దారుల్లో ,
      కొత్త ఛందము కొరకు అంతులేని
      అలుపెరుగని అగాథ ప్రయాణము
      మునుపెరగని సంకుల సంగ్రామము
      కొత్త కృతి కై అజ్ఞాతంలో అభిక్రందము

      చిల్లర మూకల వల్లకాటి వాకిళ్లు దాటి
      మసక చీకట్లో డొంక దారుల్లో
      రాకాసి కోనల్లో బైరు బీళ్లలో
      బీరు మృగణ కల్గె మహా నిస్త్రాణ

      Delete