స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త ఐన బాపిరాజు భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ సాహిత్యంపై ఆసక్తి తో రచనలు చేసేవారు . 1922 లో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలుకి వెళ్లారు జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారు . ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. అదే సమయంలో కథలు రాశారు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు . 1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశారు .
నారాయణరావు సాంఘిక నవల మాత్రమే కాక శాస్త్రీయ సాహిత్యం( క్లాసికల్ లిటరేచర్) కూడా.
ఇది ఒక ప్రేమ కథ: కథా నాయకుడు నారాయణ రావు. నాయిక శారద .
నారాయణ రావు కథ ఏవరేజ్ గ ఉంటుంది. భాష సూపర్ హిట్
ప్రేమ అంటే పెళ్లి అయిపోయిన తరువాత ప్రేమ. పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి పెళ్ళికి ముందు ప్రేమఏం ఉండదు.
పెళ్లి తరువాత చెప్పుడు మాటలు విని మొగుణ్ణి దగ్గరకి చేరనివ్వని భార్య శారదని భరించడం ముఖ్య కథాంశం.
కథా నాయకుడు నారాయణ రావు.
నారాయణరావు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక పెద్ద ధనిక భూస్వామి బ్రాహ్మణ కుటుంబానికి చిన్న కుమారుడు. అతను చెన్నైలో న్యాయశాస్త్రం చదువుతు న్నాడు. నారాయణ రావుని బాపిరాజు అర్జునిడితో పోలుస్తారు, ఎప్పుడూ ఖద్దరు బట్టలు కట్టుకునే గాంధేయవాది గా చూపిస్తాడు. నారాయణరావు తాను ప్రయత్నించే ప్రతిదానిలోనూ రాణిస్తాడు - ఆయన చదువులో మొదటివాడు, కర్ణాటక శైలిలో వయోలిన్ వాయించడంలో క్రీడలలో సమర్ధుడు.
నారాయణరావు మిత్రులు ; లక్ష్మీపతి , రాజారావు , పరమేశ్వరరావు , ఆలం.
నారాయణరావు , ఆలం సాహెబ్ ఎఫ్ ఎల్ చదివారు, రాయాజేశ్వరరావు ఎం బి బి ఎస్, పరమేశ్వరమూర్తి కవి చిత్రకారుడు గాయకుడు , లక్ష్మీపతి నారాయణరావు బావ..
కథా నాయిక శారద తల్లి విలన్
ఆ చెప్పుడు మాటలు చెప్పేది శారద తల్లి. నారాయణ రావుది సంపన్న కుటుంబమే అయినా శారదా తండ్రి అంత కాదు. అందుకే శారదా తల్లికి నారాయణరావు కుటుంబంతో సంబంధం నచ్చదు. వారంటే చిన్న చూపు అందుకే శారద మనస్సును విషపూరితం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దారుణంగా కూతురికాపురంలో నిప్పులు పోసేస్తుంది.
ఇంతకన్నా దారుణం ఏంటంటే శారద ఏదో ఒక రోజు తనను ప్రేమిస్తుందని నమ్మి నారాయణరావు భార్య దగ్గరికి రానివ్వకపోయినా తాక నివ్వకపోయినా సహనంతో భరిస్తాడు. రచయిత కథానాయకుడి ఓర్పు నిబద్దత గురించి గొప్పగా చూపిస్తున్నానని అనుకుంటాడు . హద్దు దాటిన సహనం కథ చివరిదాకా సాగుతూ వెగటుగా అనిపిస్తుంది. రోజు ఒక చెంప వాయిస్తుంటే రెండో చెంప చూపుతున్నట్ట నిపిస్తుంది. మొగుడంటే కనీసగౌరవం లేకుండా అతడి నుంచి తప్పించుకునే భార్య శారద పట్ల అంత సహనం అపాత్ర దానంలా చేతకాని తనంగా కూడా అనిపిస్తుంది. మన పాత తెలుగు సినిమాల్లో కోడలు అత్త అవమానించినా, హింసించినా , చంపేస్తున్నా నోరెత్తదు.. నారాయణరావు అంత కంటే ఎక్కువ సహనం చూపిస్తాడు.
అనేక పాత్రలు ఉన్నాయి. కథాంశాలు మరియు ఉప కథాంశాలు ఉన్నాయి.అసలు కథ నడవ కుండా ఉపకథలు తగులు కుంటాయి. అలా అని ఉపకథలేవీ ఉన్నతమైన కథలు కాదు. కుటుంబాలు, రాజవంశాల రాజకీయాల గురించి చర్చలు , సాహిత్యం, సంగీతం మరియు కళల గురించి చర్చలు కొంత విసుగు తెప్పిస్తాయి.
అన్ని ఉప కథాంశాలు మరియు చాలా పాత్రలతో, నారాయణరావును మొదటి నుండి పాఠకుల దృష్టి మధ్యలో చాలా దృఢంగా ఉంచాడు రచయిత. నారాయణరావు ఆకర్షణీయమైన వ్యక్తిగా , బాపిరాజు తరచుగా ఆయనను పురాణ కథానాయకుడు అర్జునుడితో పోలుస్తాడు. అతడి ద్వారా న్యాయంపై తన అభిప్రాయము ఇలా చెపుతాడు " న్యాయము ధర్మ దూరము. అసత్యం కలపందే సత్యం నెగ్గదు."
తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు - విశ్వలపురంజమీందారు
రైలు ప్రయాణం తో కథ మొదలౌతుంది . గవర్నరు గారికి స్వాగతము పలుకుటకు రాజమండ్రి పోవు బృందంలో ఒకడు తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు ఒకరు. ఆయన స్వరాజ్య సముపార్జన యజ్ఞ మందు పాల్గొనిన దేశభక్తుడు సాంప్రదాయ వాది. అతడు నారాయణ రావు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారమ్ పై చూసి, నారాయణ రావు ఎక్కిన పెట్టిలో ఎక్కి స్నేహితులతో ) ప్రయాణిస్తున్న నారాయణరావును చూసి తన కుమార్తె శారదకు చక్కని పెండ్లికొడుకగునని భావించి అతడి పేరు ఇంటిపేరు, గోత్రము అడిగి చివరిగా అతడికి వివాహంమైనదా లేదా అని అడుగును. నారాయణరావు కాలేదని సమాధానమిచ్చును.
No comments:
Post a Comment