Friday, April 8, 2022

రాజధానిలో గ్రంధరాజం

 మన ధర్మం ఏమిటో మన సాహిత్యం చెప్పలేకపోతే 

మన ధర్మానికి మన సాహిత్యానికి కూడా విలువవుండదు 

మన భాష లో ఉన్నత పదజాలం  మనకి తెలియకపోతే 

నీచమాయాజాలంలో చిక్కుకుంటే  మధురభావాలు మనకి

దక్కకుంటే మన భాషకి మన బ్రతుకుకీ కూడా విలువుండదు.

 భూపేయంబిది రాయలు మెచ్చిన తెలుగు రత్నాల వెలుగు 
రాజధానిలోని రమణుల కరముల వెలుగు.  


ఉన్నత మైన ఆలోచనలు ఉన్నవారే ఉన్నతులు

వెధవలెప్పుడూ  వెల గురించే ఆలోచిస్తారు కేవలం విలువలగురించి      

మాట్లాడి,  వెలకోసం వెంపర్లాడితే వెలయాళ్ల సమాజం మిగులుతుంది 

ఉన్నకాలు నరుక్కుని పెట్టుకున్న కొయ్యకాలు మెరుస్తున్నాదని 

మురిసిపోయే తల్లితండ్రులు, కార్లుంటే కాళ్ళెందుకనే ప్రభుత్వాలు 

తెలుగు ఎలా వెలుగుతుంది ?  పక్కింటివాడి దీపం ఉంది కదా అని

విషపు మాటలు విడిచిపెట్టి ఎదో ఒకలా తెలుగు మాట్లాడుతున్నానని 

సర్దుకుపోక స్వచ్ఛ మైన తెలుగు భాషని ఆస్వాదించి చూడు. 

 మన ధర్మం మన భాషతోనే మొదలౌతుంది , మన సంస్కృతి మన భాషలోనే బ్రతుకుతుంది. 

 "భారతవర్ష" గ్రంధం మన భాషా సంస్కృతి ధర్మాలగురించి మధురంగా  చెపుతుంది. 

2 comments:

  1. Bharatvarsha reached to Delhi. Congratulations

    ReplyDelete
  2. Thank you. It has to reach its destination in October

    ReplyDelete

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...