1. నీరద యాన స నాతని
వారము లోనిల చి యుంటి వాక్జెలి నీకై
నేరము లెంచక రమ్మా
కోరన విద్యల నొసగుము కూరిమి తోడన్
నీరదయాన సనాతని అంటే మేఘాలమీద ప్రయాణించే
సరస్వతీ,
వారము లో నిలచి యుంటి, వాక్జెలి నీకై అంటే వాకలిలో నీకొరకు
నిలిచి యున్నాను నేరము లెంచక రమ్మా, నాలో ఏదైనా దోషాలుంటే
క్షమించి, కోరన విద్యల నొసగుము కూరిమి తోడన్.
2. ధనమెం తున్నను అందున
ఘనమే మికలదు తలంప కలిగే యాలో
చనలే ముందుకు నడుపిం
ధనమం చుతెలిసి నవాడు ధన్యుడు ఇలలో
డబ్బుకంటే దానిని సద్వినియోగం చేసే మనసు ముఖ్యం
డబ్బు కంటే తెలివి ప్రధానం. మంచి ఆలోచనలు ముఖ్యం.
అని తెలిసినవాడు ఈ భూమిపై గొప్పవాడు, ధన్యుడు.
3. జాపితి కరములు నీకడ
జూపుము నీదయ నొసంగి శుభమగు విద్యన్
చూపుము తోవను ముందుకు
దీపుర మగుకను లతోడ దీపము నీవై
చదువుల తల్లికి దయ కలిగితే కవి కలం నేరుగా తేనె
కురిపిస్తుంది. త అమ్మ కి కవిపై వాత్సల్యం కలిగితే
అతడి లో కొలువై ఉంటుంది.
4. మందమ తినిమతి మరుపును
తొందర తలపు లనెల్ల తొలగిం చమ్మా
అందరు మెచ్చెడి గుణమును
చిందర కానిత లంపులు
చిరముగ నిమ్మా
నా మతి చురుకుగా పని చేయదు. తొందరపాటు
ఎక్కువ. ఈ గుణాలని ఎవరు మెచ్చరు. కాబట్టి
అందరు మెచ్చే గుణాలనిఅనుగ్రహించిచిందర
కాని తలపులు అంటే ఏకాగ్రత నియ్యమ్మా!
5. వందన మగునీ వదనము
కుందన కాంతుల నుచిమ్ము కోపము లేకన్
పొందిక కగలధి నాయిక
సుందర రూపము నుచూడ శోకము తొలగున్
వాగ్దేవీ నీవు శాంతమూర్తివి. ప్రశాంతమైన నీ వదనంలో
కరుణేతప్ప కోపం ఎప్పుడూ కనిపించదు.
శారదాంబా నీ
ముఖం చూస్తేనే చాలు నాకు శోకము తొలగి ఆనందం కలుగుతుంది.
6. వదలను భారతి పదములు
వదలను పుస్తక ముచూపు మార్గము విడిచా
పదలను ఎన్నడు పిలువను
మదకట వెలుతురు నుదెచ్చు మనసుకు విద్యే
మనసుకు వెలుతుర విద్యే. ఆ విద్య నువ్వే యని గ్రహించాను.
అమ్మా భారతీ నీ పాదాలని వదలను. పుస్తకాలను వదలను.
నువ్వుచూపిన మార్గాన్ని వదిలి ఆపదలను ఎన్నడూ పిలవను.
7. వందన మిదిగో భారతి
సుందర సుమముల నుదెచ్చి శోభిత మగునీ
స్కందము లకుమా లగవే
సందమ మగురూ పుచూడ సంతస మవదా
వందన మిదిగో చదువులమ్మా అందమైన పువ్వులు తెచ్చి
నీ భుజములపై మాలగా వేసి అందమైన నీ రూపును చూస్తే
కనులు నిండిపోతాయి. నాకు చదువును అనుగ్రహించు
8. కోరిన విద్యల నిచ్చెడి
భారము నీదిక బలమగు బాటను చేసా
సారము నియ్యగ వేడెద
కూరును నీదయ కలిగిన కోరిన వెల్లన్
నాకేం తెలియదు నిన్నే నమ్ముకున్నాను. నాకు కోరిన
విద్యల నిచ్చే భారము నీదే. నీ దయ ఉంటే అన్నీ
సమకూరుతాయి. ఏదైనా సాధ్యమే.
9. ప్రతిమ చదువరి మనసున
ప్రతిష్ట జేసిన దిజాలు ప్రతిభ తానే
పాతము వలెవ చ్చి బడును
స్మృతియు కూడును చదువరి సతకాం తుడగున్
తల్లి ప్రతిమను చదువరి తన మనసున ప్రతిష్ట జేసినచో
అదిజాలును.
ప్రతిభ తనంత తానే ధారా పాతముగా వచ్చి
పడుతుంది దానితో పాటు స్మృతి అంటే జ్ఞాపకం కూడా
సమకూరి చదువరి శతకాంతుడవుతాడు
10. పదికా వ్యముల నింటికి
విధిగా దెచ్చిచ దవంగ విజయం తథ్యం
సుధలే నోటన పొంగగ
బుధుడే నీచెలి మికోరు భుమిలో సుమతీ
పది
కావ్యాలు లేదా పెద్ద పుస్తకాలు చదవడం మాటలు
కాదు. ఒక్కటి చదవడం కూడా చాలా కష్టం. అందుకే
విధిగా పది పుస్తకాలు దెచ్చి చదివితే నోటన సుధలే
పొంగగ బుధుడే నీచెలి మికోరు భుమిలో సుమతీ
అంటే బాగాపండితులు కూడా నీ స్నేహం కోరుకుంటారు.
11. చూతము రండిజ నులార
చూతము రండిక నులార చూడగ విద్యా
మాతను సుందర కావ్యము
లోతుల నిజరూ పుదక్కు రోచసు పెరుగున్
విద్యా మాత నిజమైన రూపము చూడాలను కుంటే
సుందర కావ్యము లోతులు స్పృశించాలి. కాళిదాసు
మేఘ సందేశము, భాగవతము, భారతము, చదివితే
నిజరూ పుదక్కడమే కాక చదివిన వారికి తేజస్సు
పెరుగుతుంది.
12. తెల్లని హంసను ఎక్కిన
చల్లని మాతను తలంచి చక్కటి విద్యన్
ఉల్లము నిండగ నిమ్మని
అల్లన వేడెద చదువుల నన్నియు నిచ్చున్
తెల్లని హంసను ఎక్కిన చల్లని మాతను అంటే సరస్వతిని
తలంచి
చక్కటి విద్యను మనసు నిండగా అంటే ఆనందం
కలిగేలా ప్రసాదించ మని వేడుకుంటాను. కోరిన విద్యలనెల్ల
ఇచ్చే ఆ తల్లి నాకు కావలసిన చదువును ఇస్తుంది.
13. తోచని వానికి పొత్తము
దాచిన సంపద లనిచ్చు ధామము చూడన్
చూచిన సంపద నీవే
వేచిన పుస్తక మునీయ వేడెద నమ్మా
ఏమీ తోచక అనేక పనులు చేస్తుంటారు. ఏమీ తోచనప్పుడు
పుస్తకం చదవడం అంటే రచయిత దాచిన జ్ఞాన సంపదను
పొందడమే. జ్ఞానసంపద అంటేనే సరస్వతి. ఆ సరస్వతి ని
ప్రార్ధించి మంచి పుస్తకాలు ఇమ్మని వేడితే చదువరులకు
బుద్ది జ్ఞానం పెరుగుతాయి.
14. సాధన జేయగ విద్యల
ప్రార్ధన చేతుని కవిన్న పాలువి నిట్టే
అర్ధము సారము తెలిసిడి
విధము దయచూ డుమమ్మ విద్యల తల్లీ
విద్యలకు సాధన ముఖ్యం. సాధనకు తల్లి ప్రార్థన ముఖ్యం
నిత్యం ప్రార్ధన చేస్తాను నా విన్నపాలు వినిట్టే అర్ధము సారము
తెలిసిడి విధము దయచూడు.
15. మందగ మనమధు రస్మిత
సుందర వదనా రవింద శోభిత మౌనీ
ముందర కూర్చొని తన్మయ
మందుచు నినువే డువారి భాసము పెరుగున్
మందగ మన మధు రస్మిత అంటే హుందాగా మెల్లగా
నడుస్తూ మధుర మైన చిరునవ్వు చిందిస్తూ ఉండే
నీ సుందర వదనము ప్రాతః శోభితము. నీ ముందర
కూర్చొని తన్మయ మందుచు నినువేడ భాసము
అంటే కాంతి పెరుగున్ అంటే పెరుగుతుంది.
16. నోటికి విందులు జేసిన
పూటకు సరి మరి పదాల పువ్వుల పూతల్
వాటము గమూర్కొ నవియే
దీటుగ నిలచుం డుగాద ధీమము పెరుగన్
నోటికి విందులు జేసిన పూటకు సరి అంటే ఎంత తిన్నా
ఒక పూటకి అరిగిపోయి
మళ్ళీ ఆకలి వేస్తుంది. మరి పదాల
పూతలు అంటే పువ్వుల లా వికసించిన పదాలును
మూర్కొన అనగా వాసన చూడగా అవి మనసున నిలిచి
ధీమము అంటే బుద్ధి పెరుగుతుంది.
17. పూర్తిగ నమ్మిక కలిగిన
మూర్తియె అమ్మయ నిపించి ముచ్చట గొల్పున్
ఆర్తిగ అమ్మాయ నినిత్య
కీర్తన జేయగ తరాల కీర్తియు కలుగున్
సరస్వతి శాంతమూర్తి సులభ సాధ్యురాలు. వేడుకుంటే
సులభంగా కరిగి విద్యను ఇస్తుంది. కానీ సరస్వతి మాతను
పూరి నమ్మకంతో వేడేవారు ఆమె మూర్తిని చూడవచ్చు
కీర్తిని కూడా పొంద వచ్చు.
18. భాగవత మెవరు పాడిన
రాగము లందుప లుకుస్వ రసుధల్ నీవే
భగవత్ గీతయు భారత
భాగవ తమునం దుజూడ భావము నీవే
భాగవతమందు పాడెడి రాగములన్నింటిలో దేవి ముఖమే
కనిపిస్తుందిఎందుకంటే సంగీతానికి గురువు సరస్వతీదేవి
భగవత్ గీత, భారతం లో కూడా దేవి ముఖాలే కనిపిస్తాయి.
19. నియమము తప్పక నడచిన
జయమే ఇచ్చును తలంప చదువుల తల్లిన్
భయమును మాపును శారద
హయమయి బుద్ధంత యుపారు నబ్బుర పరచున్
విద్య అంటే కొన్ని నియమాలు ఉంటాయి. నియమాలు తప్పక
నడచి నట్లైతే జయము మనదే. చదువుల తల్లి మీద భయ భక్తులు
ఉంటే మనసు, నియమాలు నిశ్చలంగా ఉంటాయి. నిత్యం చదువుల
తల్లిని తలుచుకుంటే చదువు హయమువలె అంటే గుఱ్ఱము
వలే సాగుతుంది.
20. విశ్వకి రణశ క్తి జనిత
విశ్వవిదాత చరసృష్టికి బీజము నీవే
విశ్వము నీవే విద్యక
వశ్యము నీకరు ణచూపు వారిజ నేత్రీ
విశ్వకిరణాలు అంటే కాస్మిక్ రేస్, విశ్వకిరణ శక్తి జనిత
కాస్మిక్ రేస్ ఎనర్జీ నుంచి పుట్టినది అనగా సరస్వతి.
విశ్వవిదాత సృష్టికి మూలం అంటే సరస్వతి సాయంతోనే
సృష్టి జరిగింది. విశ్వము నీవే విద్యకు, అవశ్యము నీ కరుణ
చూపు. వారిజ నేత్రీ అంటే తామర వంటి కనులున్నదానా
------------------ -------------------------------------------
21. కలలో పాదము కనబడె
నిలలో కొచ్చిన కనులకు నిదురే రాదే
తలుపే దీసివె దకినే
తలబా దుకువా ల తల్లి తలపుల మెరిసెన్
కలలో అమ్మ పాదము కనబడగా స్వర్గసీమలో అడుగు పెట్టి
నట్టు అనుభూతి చెందాను కల కరిగి ఇలలో కొచ్చిన కనులకు
నిద్ర రాలేదు మళ్ళీ ఆ కల కావాలని ఎంత కోరుకున్నా అమ్మ
కలలోకి
రాలేదు. కలం పట్టగానే కాయితంపై పాటై కురిసింది.
తల్లి నమ్మిన వారి తలపులలో ఎప్పుడూ ఉంటుంది.
22. చీకటి కమ్మిన జగతిన
దూకమ లదుకొన నిశీధి దోవన దొరికెన్
నాకొక సన్నని కిరణము
తాకెను తలపుల నువాణి తలయే మార్చెన్
విద్యలకు అధినాయిక సరస్వతి. ఆమె కూడా జ్ఞాన
కాంతితో సూర్యుడిలా ప్రకాశిస్తుంటుంది. మాతా నీ
దయవల్ల ఒక సన్నని కిరణం తాకింది. నా తలపులు
పసి ఆరి అనగా తలపులు పరిణితి చెంది నా తలే మారి
పోయింది. అంటే నా ఆలోచనా విధానమే మారిపోయింది.
23. కారణ మునేన నెన్నడు
బీరము లాడను వరాల వీణయె మీటెన్
సూరిగ మార్చిను శారద
నీరద యానద యనాకు ధారణ నిచ్చెన్
ప్రతిభకు కారణ మునేనే అనెన్నడు బీరము లాడను
నీ వరాల వీణా ద్వని వినగా నాకు కవిత్వం మీద ఆశ కలిగింది
నీరదయాన శారద దయ నాకు ధారణను ఇచ్చింది.
24. అమ్మకు దయకలి గినచో
కమ్మని తేనెల తలంపు కలమున బట్టున్
నెమ్మిక కలిగిన మదిలో
అమ్మయె కొలువ యియుండు నన్నియు తానై
చదువుల తల్లికి దయ కలిగితే కవి కలం నేరుగా తేనె
కురిపిస్తుంది. త అమ్మ కి కవిపై వాత్సల్యం కలిగితే
అతడి లో కొలువై ఉంటుంది.
25. తలచిన తడవగ పుట్టును
చలనము మనసున, మిటారు చందము తోడన్
అలలుగ సాగును తలపులు
అలసటె టులండు నొతెలియ దంతము వరకున్
శారదమ్మని తలుచుకుంటే కవితలు వాటంతటవే తన్నుకు
వస్తాయి. అమ్మమీద పద్యాలు రాయడాని కష్టపడక్కర్లేదు.
అసలు మొదలు బెట్టిన క్షణం నుంచి చివరిదాకా ఆలోచనలు
అలలలా ఆగకుండా సాగుతాయి. అంతం అయ్యేదాకా
అలసట తెలియదు.
26. చిరుత ప్రాయము నందున
తరుణ ప్రాయము ననిట్టి దారిని చూపే
కరుణన్ చూపక ఇపుడే
పరమా ర్థముకో రి నాకు పటిమల నిచ్చెన్
కవిత్వం రచన అమ్మ దయతో ఇచ్చిన బహుమతులే.
ఆ ఇచ్చేదేదో చిన్న వయసులోనే ఇవ్వ కూడదా. ఆ చూపే
కరుణ అప్పడే చూపిస్తే ఎంత బాగుండును. ఇప్పుడు యాభై
ఏళ్ళకి కవిత్వం రచన ఏం ఆశించి ఇచ్చింది?
27. చిరుప ద్యములే వాగులు
చిరుపరు గులమెరి సిపోవు చిరుకాం తులతో
తిరుమల గిరివా గులవలె
తరగక పరవ ళ్లుదొక్కి తళతళ లాడున్
చిరుపద్యములే వాగులు. వాగులు పరిగెడుతున్నప్పుడు
సూర్యకాంతి పడి వాగుల్లో నీరు మెరుస్తుంటుంది. అలాగే పద్యాలు
కూడా మెరుస్తుంటాయి. తిరుమల గిరిపై జలపాతం ఎపుడూ
ఇంకక పారుతుంటుంది. అలాగే పద్యాలు కూడా తరగక
పరవ ళ్లుదొక్కి పారుతూ తళతళ లాడుతుంటాయి.
28. విద్యల తల్లికి నేనిత్తు
పద్యము లుగపద ములల్లి పదహా రతులే
పద్యము లుపొంది జీవము
హృద్యము గవాణి నిమోయు హంసలు కావే
పూలను అల్లి మాలలు కట్టి నట్టు పదములు తీసుకుని వాటినల్లి
మాలలు కడతాను. ఆ పదాలతో చదువు లమ్మకు హారతి స్తాను.
ఆ పద్యాలు జీవం పోసుకుని చదువులమ్మ ని మోసే హంసలుగా
మారిపో
తాయి.
29. వందల పద్యము లనేను
కందము నలిఖిం చివాణి కర్పణ గావిం
చందమ గుయాచ రణముల
చందన మైనిలు తునింక జన్మము వెలగన్
వందల పద్యము లనేను కందమునలిఖించి అంటే వందల
కందపద్యాలను వ్రాసి వాణి కర్పణ గావించి అందమగు యా
చరణముల చందన మైనిలు తునింక జన్మము వెలగన్.
30.ఊపిరి చివరకు జారిన
దీపము కొడిగ ట్టుదాక తెలుగున్ తేనై
యొప్పెద జనులె ల్ల మెచ్చ
నాపక రాసెద తెలుగు నాదను వరకున్
ఊపిరి చివరకు జారిన అంటే అంత్య కాలం సమీపించేదాకా
దీపము కొడిగ ట్టుదాక మృత్యువు కబళించే దాకా తెలుగున్ తేనై
యొప్పద అంటే తెలుగులో తియ్యటి రచనలు చేస్తుంటాను
జనులె ల్ల మెచ్చ నాపక రాసెద తెలుగు నాదను వరకున్
------------------------------------------------------------------------------------------------------------------
31. వరమే చూడ్కులు సోకిన
కరువే మున్నది అపార కరుణే దక్కన్
సిరులే దొరలుచు వచ్చును
చెరువై ముంగిట నపొంగి చిరమై నిలచున్
సనాతని చూపు మన మీద పడడం అంటే మాటలు కాదు.
అదొక వరం. ఆమె కరుణ దక్కితే కరువే తీరిపోయి సిరులే
చేరువైపొంగి ముంగిట నిలుస్తాయి.
32. నిదురను నిలిపెడి దినీవె
కదలక రాసెడి సవిత్తు కలముయు నీవే
చెదరని దృష్టియు బుద్ధియు
మధురమ గుతలపు లనిచ్చు మాతవు నీవే
రాత్రి పూట రాస్తున్నప్పుడు నిద్ర రాకుండా చూసేది నువ్వే.
నేను విసుగు వచ్చి అటు ఇటు తిరగకుండా కూర్చునే శక్తిని,
రాసే శక్తిని ఇచ్చేది నీవే. మంచి ఆలోచనలని ఇచ్చేది కూడా నీవే
33. కాసుల దాసుల నేకులు
మూసల బతుకు లగాను గెద్దుల లవలే
గ్రాసము చుట్టూ తిరగన్
భాషల దాసుల కుపూల బాటలు దక్కున్
డబ్బుకి దాసులై గానుగెద్దుల్లా డబ్బుచుట్టూ కొంతమంది
తిరుగుతూఉంటారు. కొంత మంది భాషకి దాసులై తిరుగు
తుంటారు. వారికి పూలబాటలు దక్కుతాయి. బాషా దాసు
డనైన నాకు
ఆ తల్లి దయవల్ల పూలబాటలు దక్కాయి.
34. ఎటులో నలిగిన జీవిత
మిటువా లివెలిగి నదంత మెత్తగ పారే
కిటుకే వాగ్జెలి కరుణే
అటులే నాతుది యుకూడ అమ్మకు ఎరుకే
ఎటులో నలిగిన జీవిత మిటువాలి అంటే రచనా రంగంలోకి
రాకముందు నాజీవితం ఎన్నో కష్టాల తో గడిచింది,
తరువాత
తల్లి దయవల్ల రచనా రంగంవైపు వాలి వెలిగి ఒక నదిలా
మెత్తగ సాగిపోయింది. కిటుకే వాగ్జెలి కరుణే అంటే ఆ రహస్యం
సరస్వతి దయే. ఇలా రచనా రంగంలోకి వచ్చిపెద్ద గ్రంధాలు
రాస్తానని నా ఊహకి అందలేదు. అటులే నాతుదియు అంటే
నా ముగింపు కూడా
సరస్వతికి తెలుసు.
35. శ్రీమంతు లుపూజ జేయగ
హేమంబు తెత్తుర టచూడ మహీత లమునన్
చేమంతు లెదక్కు పేదకు
ధీమంత మున్నక వితల్లి తెలపరె భక్తిన్
సరస్వతిని పూజించడానికి శ్రీమంతులు హేమంబుఁ
అనగా బంగారం తెత్తురు పేదలు చేమంతులు తెత్తురు.
వారే ధీమంతులైన కవులైతే కృతులల్లి తెత్తురు
36.వేడెద గులాబి మాలలు
వేడుక తీర గజమాలు వేసెద కృతుల్
పాడుచు శారద దయకై
జోడుక రముల నుమోడ్చి జోతము చేతున్
గులాబి గజమాలలుగా కూర్చి వేడుక తీరగ నీ మేడలో
అలంకరించి కృతులుపాడుచు శారద దయకై క రముల
నుమోడ్చి జోతము చేసెదను.
37. బంతులు తెచ్చెద నగుమో
మంతయు కాంతుల నుచిమ్మ మాలలు వేతున్
చెంతనె కూర్చుని పాడెద
గొంతును సవరిం చిమాత గొప్పను చాటన్
బంతులు తెచ్చినగుమోమంతయు
కాంతుల
నుచిమ్మ
మాలలు గా
కూర్చి
నిన్ను
అలంకరింతును
బంతిపూల
కాంతిలో నీ
ముఖాన్ని
చూసి
పరవశిస్తాను
నీ
చెంతనె
కూర్చుని నీ
మహిమలను
చాటుతూ
పాడతాను.
38. చంపక రాసులు దెచ్చితి
సొంపగు నీపద ములందు షోదయ కాంతుల్
నింపెస లారగ భక్తితొ
నింపెద విద్యల నొసంగ నీరద యానా
చంపకములను అంటే చామంతి పూలు రాసులుగ దెచ్చి
ఉషోదయ కాంతులలో మెరుస్తున్ననీ పాదముల పై వాటిని
భక్తితో వేస్తూ విద్యల నిమ్మని వేడుకుంటాను.
39. సిరిమ ల్లెలుదె చ్చి కొలుతు
సిరులే వియుకో రనేను జితకా శిని నీ
కరమె త్తిదీవె నలిమ్ము
వరమే నాకది కచాలు భవమే కాదా
ముక్కంటికి మారేడు దళాలంటే ప్రీతి అమ్మా నీకు
తెల్లని వస్తువులంటే ప్రీతి అందుకే తెల్లని మల్లెలు
తెచ్చి మనసారా అర్పించి నిన్ను కొలుస్తాను.
కరమెత్తి దీవెనలిస్తే అదేచాలు.
40. గాత్రము కుసూత్ర మువాణి
ఆత్రము గలవా రికబ్బ దామెద యకున్
పాత్రుల యినవా రికెమరి
గాత్రము అబ్బును పవిత్ర గానము పారున్
కళలకు మాతవగు శారదా గాత్రముకు సూత్ర ము నీవే.
కేవలం ఆత్రము గల వారికి అబ్బదు గాత్రము. నీదయకు
పాత్రులైన వారికే గాత్రమబ్బుతుందిఅటువంటి
పవిత్ర
గానము జన హృదయాల్లో పారుతుంది.
41. చిత్తరు వులుగీ యుటకున్
చిత్తము వలయున దివాణి చిత్తము తలతున్
పొత్తము హస్తము నందున
చిత్తము భక్తుల కునిచ్చు సిరిగల దేవిన్
చిత్తరువులు గీయుటకు చిత్తము అనగా మనసు కావలెను
అది కూడా వాణి చిత్తమే. అంటే ఆమె దయ కలిగితే చిత్రకళ
నిస్తుంది. పుస్తకము హస్తము నందున గల దేవి నీకు వందనము.
నా చిత్ర కళను కొంచెం ముందుకు సాగనీయమ్మ శారదా!
42. మేళము కట్టితి సుస్వర
నాళము లనుహం సవాహి నలరిం చన్ నే
పాళము గభజన జేతును
తాళము తప్పక నెవాణి తలపుల కొలుతున్
మేళము కట్టి సుస్వర నాళములను అనగా సన్నాయి వంటి
ఊదే వాద్య పరి కరములతో హంసవాహినలరించుచూ నేను
తాళము తప్పక శ్రావ్యం గా శాస్తీయ సంగీతంలో పరవశించి
పాడుతూ వాణిని కొలిచెదను.
43. చిరుకా నుకల న్నింట న
లరుయా జ్ఞాపిక లలోన రమణీ మణియే
చిరునగ వులుగు ప్పించును
బిరుద మ్ములయం దు వాణి వీణయ మోగున్
నాకు వచ్చిన చిరు కానుకలనుంచి పెద్ద జ్ఞాపికల
వరకు అన్నింటా అమ్మ చిరునవ్వులే కనిపిస్తాయి.
ఇక బిరుదులన్నీ ఆమె ఆశీర్వచనాలే!
44.కరముల కలమై కవులకు
శిరముల శ్రీపతి నరేంద్ర చిన్నము లైయా
భరణమ గువాణి పూజిత
చరణము లకునే నభంగ చర్చన జేతున్
చదువుల తల్లి కవులకు కలమై గొప్పవరమై నిలుస్తుంది రాజులకు
గొప్ప బిరుదులు కూడా గొప్ప పదములే కదా అందుకే శిరముల
శ్రీపతి నరేంద్ర చిన్నములై యాభరణమలై నిలిచేది ఆమే కదా!
అట్టి శారదాంబ పూజ్య చరణాలకు నేను సేవ చేసుకుంటాను.
45. శబ్దము లన్నిట నుండిని
శ్శబ్దము నందుబ హుసూక్ష్మ శబ్దము లందున్
లుబ్దము కాకజ గత్తుల
లబ్ధము గానిల చుశబ్ద లక్ష్మి కి నమసుల్
శబ్దములన్నిట అంటే సంగీత సరస్వతి ఆమె శబ్ద రూపిణి
ఆమె నిశ్శబ్దము నందు, బహుసూక్ష్మ శబ్దము లందు కూడా
యుండును. లుబ్దము కాక అంటే నశించిపోక జగత్తుల అంటే
ప్రపంచములో లబ్ధముగా
నిలచుశబ్దలక్ష్మికి కి నమసుల్
46. పదపద ముననిం డియుండి
పదపద మనిదా రిచూప పథమే మారెన్
ముదముగ కవులను కాంచగ
సుధలను కురిపిం చినారు సుందర మార్తుల్
సరస్వతి నా పదపద ముననిండియుండి పదపద మని
దారి చూపగా నా పథమే మారిపోయింది. అలాగే కవులకు
బాసట గా నిలవగా వారంతా అద్భుతమైన కవితా సుధలను
కురిపించారు, గలుగుతున్నారు అంతా సరస్వతి మహిమే!
47. ఎంతటి వేడుక నీతల
పెంతటి వేడుక తరగని పెన్నిధి నాకే
సొంతము వంతము ఏలను
జంతర గానము నునేను చక్కగ జేతున్
47. చాలన కతృప్తి బొందక
కూలక నిలిచెడి పదాల కోటలు కట్టన్
కాలము కాటెరు గకయవి
నీలిగ గనసూ రివోలె నేటికి మెరిసెన్
రాజుల కోట లు కాలం వేటుకు కూలిపోతాయి. చాలనక
తృప్తి పొందక కవులు పదాలతో కట్టే కోటలు అంటే గొప్ప
కావ్యాలు కాలాతీతంగా నిలుస్తాయి. ఆకాశంలో సూర్యుడు
లా చిరకాలం మెరుస్తుంటాయి. కవులు రాస్తూనే ఉండాలి.
48. లేదను చింతయె కలగని
సాధుజ నులెల్ల రుయోగ సంతస మందెడ
సాధ్యులు విద్యల సారము
వేదన లేకను భవించు వీరులు వారే
డబ్బు సంపద లేదను చింతయె కలగనివారు సాధుజను
లందరు యోగానందము గొప్ప ప్రశాంతత పొందెడివారు.
వారే అసాధ్యులు. వారే విద్యల సారమునెరిగిన వారు
వేదన లేక జీవితాన్ననుభవించు వీరులు. వారే యోగులు.
49. శక్తియు సమయము నిచ్చును
భక్తియె కుదిరిన మదిలో పారును తానే
భుక్తియు కూర్చుస నాతని
శక్తిని నమ్ముకొ నబుద్ది శాఖలు బారున్
ఆసుపత్రుల కోర్టుల వెంట, పోలీస్ స్టేషన్ల వెంట తిరిగే
వారిని మనం
నిత్యం చూస్తుంటాము. ఆ ఖర్మ పట్టకుండా
ఆరోగ్యాన్నిచ్చినది ఆ మాతే. సరస్వతి రచనలకు శక్తే
కాదు సమయాన్ని కూడా ఇస్తుంది.
భక్తికుదర హృదయాన
ఆమె వరదై పారుతుంది.
భుక్తి కూడా కుదురు స్తుంది.
సనాతని శక్తిని నమ్ముకొ
నబుద్ది శాఖలు బారున్.
50. రథమిచ్చెను వాణి పూల
రథమే ఇచ్చిక థలెన్నొ రాయమ నంపెన్
పథమే నిశ్చయ మికనా
కథయే తుదజే రుదాక కరమే యాపన్
వాగ్దేవి నాకు పూల రథమిచ్చి కథలెన్నో రాయమని
పంపించింది. నా పథాన్నిఆమే నిశ్చయించింది.
నా కథ ముగిసేదాకా కథలు రాస్తూనే ఉంటాను.
51. విన్నప మిదిగో భారతి
గున్నప మాయెని కవిద్య గుణములు బోయెన్
పొన్నము దెచ్చిన చాలును
దున్నను కూర్చొన గమొక్కి ధూపము వేతుర్
చదువులో గుణానికి ప్రాధాన్యత లేదు, ఎంత తెలివి తక్కువ వాడికైనా
అక్షరం రాయలేని వాడికైనా డబ్బులిస్తే చాలు సీటు ఇచ్చేస్తున్నారు.
దున్నపోతునైనా పున్నమిచంద్రు డని కూరొబెట్టి చదువు చెప్పేస్తున్నారు.
52.ఘోరము బళ్ళెటు లాయెనొ
భారతి కనవే మిసుంక భారము పెరిగెన్
తీరుగ భాషలు జెప్పక
తీరని లోటుగొ నివిద్య దిశయే మారెన్
ఘోరము బళ్ళెటు లాయెనొ భారతి చూడు బడులు ఎలా అయి
పోయినవో సుంకాల (ఫీజులు) భారము పెరిగెను. తీరుగ భాషలు
జెప్పక తీరని లోటుమిగిలి తుదకు విద్య దిశయే మారి
పోయింది.
53. మందికి విద్యను గరుపుట
నందిని నిలచుం డబెట్టు నకలే కాదా!
వందన ముజేయ గకుదర
దందరి కిసుఖము గనడ్డ దారులె వలయున్
రాతి నందిని లేపి నిలుచుండ బెట్టడం ఎంత కష్టమో
(అసాధ్యమో) మందికి విద్య చెప్పడం కూడా దానికి నకలు
అంటే అటువంటిదే కదా! గురువుకి మనస్ఫూర్తిగా నమస్క
రించలేని వారికి చదివేలా వస్తుంది. అలాంటి వారు
అడ్డ దారులే కోరుకుంటారు.
54. బారుగ బోకులు జేరగ
దూరము అయ్యెని కవిద్య దోపిడి మిగిలెన్
ఘోరము సంఘము చెడి, తల
భారము మిగిలెను భుజాల బరువే పెరిగెన్
నేటికాలం లో విద్య చెడిపోడానికి విద్యారంగంలో విద్యా
లక్ష్యం లేక వ్యాపార లక్ష్యాలతో ఉన్న మనుషులే కారణం.
వీరివల్ల విద్య చెడి సమాజం చెడిపోయి విద్యార్థుల
భుజాలకు భారము మిగిలింది.
55. ఇష్టప డుటచే తకాదు
కష్టప డుటవ ల్లకాదు కాసులు తోడన్
తుష్టుల జేయగ వత్తురు
దుష్టులు కాగిత పువిద్య దొబ్బుకు పోవన్
చదువుని ఇష్టపడితే కష్టం తెలియకుండా నేర్చుకోవచ్చు.
చాలామంది ఇష్టపడలేదు కష్టపడలేరు. కానీ వీరందరికీ
చదువుకున్నట్టు ఒక కాయితం ముక్క కావాలి. ఆరోగ్యం
లేకపోయినా ఆరోగ్యం ఉన్నట్టు పత్రం ఉంటే ఏం లాభం ?
56.పోరగ పోరగ చదువుచు
కూరగ గణముల నుదెచ్చు కొనుయా ఆంగ్లా
చారమ దియెనతి దుష్టా
చారమ దిదిద్ది సరియగు చదువును ఇమ్మా
పోరగ పోరగ అంటే పోరుపెట్టి వెంటపడి విద్యచెప్పి కూరుచు
కూరుచు గణములను (మార్కులను) కొలిచి అదే చదవని
అదే తెలివిని భావించే బుద్ధి చెరిచెడి ఆంగ్లా చారము, దుష్టా
చారమును తెచ్చుకున్నాము ఈ పద్దతిని మార్చి సరియగు
చదువును ఇవ్వు తల్లీ
57. ఇష్టప డువారు నేర్తురు
కష్టప డకభా షకూడ కళయే మనలన్
తుష్టల జేయును నేర్వగ
స్పష్టమ గునాత్మ కుభాష చందన మనుచూ
భాషను ఇష్టప డువారు నేర్తురు కష్టపడక. భాషకూడ
కళే.
సంతుష్టల జేయును నేర్వగ, అంటే భాషను
బాగా నేర్చుకుంటే అది ఆత్మకు సంతృప్తిని స్తుంది.
భాష ఆత్మకు పూసిన చందనం.
58. ముష్టికి వచ్చిన మనిషి
కిష్టమ గునదే మిముద్ద కేడ్చును గానీ
ఇష్టము తెలివియె నందురు
స్పష్టము మార్కుల కేడ్తురు చదువరు లిట్లే
ముష్టికి వచ్చిన వాడు ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం
చేస్తాడు ఇష్టాయిష్టాలు చెప్పడం ఎక్కడుంటుంది?
చదువు
కొచ్చినవాళ్ళు ఇష్టాయిష్టాలతో, జ్ఞానంతో నిమిత్తం
లేకుండా ఉద్యోగాల
కోసం మార్కుల కోసంప్రాణాలు
తీసుకుంటున్నారు.
59. సంపద నడవడి యనిచది
వింపరు బిడ్డల ధనాశ మితిమీ రకటా!
ఎంపిక చేతురు చదువులు
చంపుచు బిడ్డల మనసులు సంపద కొరకున్
నడవడి మనిషికి గొప్ప సంపద అని అందరూ అంగీకరిస్తారు.
కానీ దానిని పట్టించుకోక డబ్బు సంపాదించే చదువులనే
తల్లిదండ్రులు
ఎంపిక చేయడంతో బిడ్డలు పోటీ కి తట్టుకోలేక
చనిపోతున్నారు.
తల్లిదండ్రుల ధనాశ పిల్లల ఉసురు తీస్తోంది.
60. తప్పుడు మనుషులు చేరగ
గొప్పచ దువుల న్నికూడ ఘోరము కావా?
తుప్పున జెడ్డిను మగుయా
తప్పుడు మనుషుల నుతూచి తక్కెట కివ్వా
విద్యాసంస్థల లోకి తప్పుడు మనుషులు చేరితే గొప్ప
చదువుల న్నికూడ ఘోరంగా పాడయిపోతాయి తుప్పు
పట్టిన ఇనుములా టి వారు ఈ తప్పుడు మనుషులను
పాత ఇనుము లాగే తూచి తక్కెట కివ్వాలి.
తుప్పున జెడ్డ + ఇనుము = తుప్పున జెడ్డినుము
61. బుద్ధివి కాసము పోయెను
సిద్దము గచిలక పలుకులు చిందులు చిక్కెన్
పెద్దకు ఇంగిత మెక్కడ
గెద్దకు పిల్లల నుపంపి గెంతులు గెంతన్
నేటి విద్యలో ఆలోచన లేదు. చిలక పలుకులు , చిందులు
వేయడం మిగిలింది జ్ఞాపకం పెట్టుకుని రాసేస్తే పట్టా ఇచ్చేస్తారు
బుద్ధి వికాసం లేని చదువెందుకు ? పెద్దల ఇంగిత జ్ఞానం ఏది ?
గెద్దకు అంటే అమెరికా కు పిల్లలను పంపి గెంతులు వేస్తున్నారు
62. దినుసుల కొరకే పోరాడు
మనుషులు బింకమునుజూపి మసియగు దాకా
మనుగడ మాత్రము చూచుకు
అనువగు చీకటి నచత్తు రాకలి ప్రాణుల్
కొంతమందిమనుషు జీవితమంతా తిండిగింజలకోసమే
పోరాడుతూ ఉంటారు. బింకంగా కనిపిస్తూ మసియగు దాకా
మనుగడ మాత్రము చూచుకుంటారు అనువగు చీకటిన
అనుకూలముగా ఉండే అజ్ఞానముతో చత్తు రాకలి ప్రాణులు.
-----------------------------------------------------------------------------------SARANAM
63. మ్లేచ్చుల భాషకు తలొంచి
స్వేచ్చను అప్పన ముజేసి చీకులు సోకుల్
నచ్చగ సర్వము వారివె
తెచ్చెడి తొత్తుల నెటైన దిద్దుము తల్లీ
మ్లేచ్చులు అంటే పాశ్చాత్యులు. వారి భాషకు తలొంచి
మన భాషా స్వేచ్చను వారికి అప్పన ముజేసి వారి నుంచి
సోకులు అంటే వస్త్రాలు ఇతర అలంకరణలు, చీకులు
అంటే తాగుడు తెచ్చుకుని వారికి తొత్తులుగా మిగిలిపోయే
వారిని నీవే ఎలాగైనా దిద్దాలి.
64. విత్తము పాలించు జనులను
సత్తము లనుపా లించును చదువే, ఇలలో
ఉత్తము లనుజే యునదే
విత్తము కవుల కు,చిత్త మెల్లయు విద్యే
విత్తము పాలించు జనులను అంటే డబ్బు పాలిస్తుంది.
సత్తములను(సత్పురుషులను) పాలించు చదువే, ఇలలో
ఉత్తము లనుజే యునదే అనగా చదువే జ్ఞానమే మనుషు
లను ఉత్తములుగా చేస్తుంది కవులకు చిత్త మెల్ల విద్యే
ఉంటుంది.
65. నరజ న్మమునా డుచూడ
పరధ ర్మములే కసాగె పరమా త్ముని
వరమై నేటికి సర్వము
పరమై పరవి ద్య తోడ బరువై పోయెన్
ప్రాచీన కాలంలో ఇతర మతాలు భారతదేశంలో ప్రవేశించక
ముందు భారతీయులు స్వధర్మంలో బ్రతికేవారు. తర్వాత
పరమతాలూ ధర్మాలు ప్రవేశించాయి. నేటి ఆంగ్లవిద్యతో
సర్వం పరధర్మమై పోయింది.
66. ఏకమ నస్సు మిగులావ
శ్యకము విద్యకు, తపస్సు చదువ న్నయదే
ఏకము గపేక మేడగు
ఏకమ నసులే నివిద్య ఎప్పుడొ కూలున్
ఏకమ నస్సు మిగులావశ్యకము విద్యకు అనగా ఏకాగ్రత
లేనిదే విద్య రాదు చదువంటే తపస్సే. ఏకము గపేక
మేడగు ఏకమనసులేనివిద్య పేకమేడలా బలహీనంగా
యుండి
ఎప్పుడొ కూలిపోతుంది.
67. పలుచన జేయగ భాషను
పలుచన యగుజా తియెల్ల పలుకే కాదా
గెలుపుకు మూలము తెలుసుకు
గెలిపిం చగతెలు గుజాతి గెలుపే గాదా
పలుచన చేయగ భాషను పలుచన యగు జాతి యెల్ల ,
గెలుపుకు మూలము పలుకే కాదా అంటే భాష మాట
నెగ్గడానికి చాలా ముఖ్యం , అది తెలుసుకుని తెలుగుని
గెలిపిస్తే మన జాతి గెలుస్తుంది. భాష ఉనికిని కోల్పోతే
జాతి ఉనికి ని కోల్పోతుంది.
68. పత్యము మికతెలు గుపడదు
పైత్యము తలకె క్క జాతి పౌరుష మేలా
సత్యము ధనాశ జంపెను
ముత్యము వంటిమ నభాష ముక్కలు యయ్యెన్
రోగికి నిషిద్ధ(తినకూడని) ఆహారాన్ని సూచిస్తూ పత్యం
అనే మాట వాడతారు. ఆంగ్ల మాధ్యమంలో జేరిన వారికి
తెలుగు నిషిద్ధం గా సూచించడమే కాక తెలుగాడి తే
దండిస్తారు కూడా. మరి జాతి పౌరుషం?దాన్ని ధనాశ
చంపేసింది. ముత్యాలవంటి భాష ముక్కలైంది .
69. తెత్తురు తెలుగును కావగ
కొత్తగ చట్టము నునాడు కొట్టరె మరిచె
య్యెత్తితె లుగుత ల్లికిజై
వత్తురు అప్పుడి కపట్ట భారతి పదముల్
మాతృ భాషలో మాత్రమే చదువు చెప్పాలని తెలుగు
రక్షణకి కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టాన్ని తెస్తుంది.
ఆరోజు అందరూ తెలుగుకు జేజేలు పలుకుతారు.
ఇంగ్లీష్ ని ఒక భాషగా మాత్రమే నేర్చుకుంటారు.
మన బతుకు
మనకు మిగులుతుంది.
70. తెలుగను మాధ్యమ వసరము
తెలుగు చలనచిత్రముల కు తెల్లము తెలుగున్
ఆంగ్లము కుదోచి పెట్టుచు
పిల్లల దోతురు ల్లవారి పాదము లొత్తన్
తెలుగు మీడియం సినిమాలొస్తే బాగుంటుంది. రావాలంటే
సినిమాకి గుండె శస్త్రచికిత్స చేయించాలి. తెలుగుని ఆంగ్లేయులకు
దోచిపెట్టి, భాషా సంస్కృతులని నాశనం చేసిన తరువాత ఎన్ని
గుండె ఆపరేషన్లు చేయించి లాభమేంటి? తెలుగువారికి తెలుగువారిగా
బతికే తెగువను గుండెల్లో ఇంత జాతి పౌరుషాన్ని నింపడం ఉత్తమం.
.
చదువే గీతము పాడగ
చదువే యగుసం గీతము చక్కగ పాడే
విధమే స్మృతికి మూలము
అదియే చదువరి కుగట్టి ధారణ కాదా
చదువే గీతము అంటే చదువే సంగీతము చక్కగా పాడితే
పద్యాలు సులభంగా గుర్తుంటాయి కదా. అలాగే పాడితే
ధారణ అంటే జ్ఞాపకం. చదివినదంతా జ్ఞాపక ముంటుంది.
71. జీవిత మెటులుం డునొమరి
భావిత రాలకు తరాల భాష యె పోయెన్
రావిక అప్పటి మాటలు
లేవిక వెనకటి గుణములు లేవిక తల్లీ
అర్థ ఆంగ్లముతో వ్యర్థమై పోయిన నేటి తరంలో తరతరాలుగా
వస్తున్న తెలుగు భాష కొంకర పోయింది. మనుషుల గుణాలు
కూడా మారి పోయాయి. భావితరాలకు జీవిత మెటులుం డునో
ఊహకి అందదు. పాతతరం తెలుగు ఎంత బాగుండేది! రావిక
అప్పటి మాటలు లేవిక వెనకటి గుణములు లేవిక తల్లీ.
72. రావెస నాతని నూపుర
రవముల్ డెందము నసుస్వ రములే పల్కన్
కావ్యసు ధారస ధారలు
తేవెర సరాణి వినీవె తేనెలు తేవే
రావమ్మా సనాతని నీ నూపుర రవములు డెందమున
సుస్వరములై నిలిచేలా కదలిరావమ్మా కావ్యసుధా
రసధారలు తేవమ్మా రసరాణివి నీవె తేనెల భాషను తేవె.
73. చక్కటి మృదువ గుమాట
లెక్కడ పదపరి మళంబు లెక్కడ దేవీ
రక్కసి బూతుల గోతుల
నక్కల వలెబడ గభాష నాశన మయ్యెన్
అమ్మా ఇప్పుడు భాష అంతా కలుషితమై పోయింది.
మంచి పదాలు, పద పరిమళాలు లేవు భాషంతా బూతుల
మయం. బూతుల గోతులో పడి తెలుగునాశనమైంది.
74. సినిమా విషమై కురవగ
మనిషే మృగము గమారె మనసే మారెన్
ధనికుల్ భజనే జేయుచు
ఘనకా వ్యములూ సుమరువ గరిమే పోయెన్
సినిమాలు రాకముందు కావ్యాలు రాజ్యమేలుతుండేవి.
చక్కటి పదాలు ఉపమానాల తో ఉన్న బాషా మృతాన్ని
అందరూ సేవించేవారు. సినిమా బాష విషమై కురవగ
వెకిలి హాస్యంతో, మితిమీరిన హింస తో మనిషే మృగ
ముగ మారిపోయేడు. వర్తా పత్రికలూ ధనికుల భజనే
చేస్తున్నాయి. ఘనకావ్యముల ఊసు మరిచిపోయారు.
75. రావలె తెలుగుకు వెలుగును
తేవలె భారతి కపారు తేనెల పాటే
కావలె వెలుగుకు నెలవై
పావకి తెలుగై నిలువుము పాపల నోటన్
తెలుగు వచ్చి రాదనుచూ తెలుగుకు పరాయివారైన తెలుగు
వారిని మార్చుట ఎవరి తరము? విద్యల తల్లియే రావలెను.
తెలుగుకు వెలుగును తేవలెను. భారతి పారు తేనెల పాటే కావలె.
పావకి తెలుగై పాపలను పలికించవలెను.
76. దయగల మాతస నాతని
రయమున వచ్చువి నినావి లాపము చేయున్
సాయము దీవెన లిచ్చును
భయమే దరిచే రదింక భారతి యున్నన్
నా విన్నపాలు విని సరస్వతి హుటాహుటిన తరలివచ్చి
చేయవలసిన సాయము చేసి దీవెనలిచ్చి విద్యను
నిలుపుతుంది భారతి చెప్పేసేను గా ఇక భయం లేదు.
------------------------------------------------------------------------------------ SUDDHA KAVITHA
77. రాజమ రాళవి భూషిత
రాజక దంబవి లసితస రసిజా క్షీవా
క్తేజవి రాజిత కవిజన
పూజిత భగవతి కిపద్య పుష్పము లివియే
రాజ మరాళము అనగా
కలహంస
విభూషితము
అనగా
అలంకరించి
బడిన
, రాజ కదంబ విలసిత
అనగా
బహు
వర్ణముల
పూల
దండలు
చే
అలంకరించబడ్డ
వాక్
తేజ
విరాజ అనగా
వాక్
శక్తితో
ప్రకాశిస్తున్న
కవిజన
పూజిత
భగవతి ( సరస్వతి
) కి
ఇవే
నా
పద్య
కుసుమములు.
78. రాజమ రాళము పైనవి
రాజమ యివెలుగె డివిద్య లమ్మను అడలే
తేజము నిమ్మని నిష్టగ
పూజలు జేసియ లరింతు పువ్వుల తోడన్
రాజమ రాళముపై
అనగా కలహంస పై విరాజమానమై
వెలుగెడి విద్య లమ్మను అడలే తేజము నిమ్మని
మనసార మరియరి పూలిడి వేడెదను
79. బంగరు పాలము నుగప్పి
కంగర ములునా ట్యమాడ కచ్చపి మీటన్
పొంగెను నింగది చూడగ
వంగెను మైమర చిమాత వర్ణము చూడన్
బంగరు నుదురును నుగప్పి ముంగురులు ములునాట్య
మాడుతుండగా భారతి కచ్చపి మీటుచుండెను అదిచూచి
నింగికి హృదయము పొంగి నేలకు వంగి మైమరచి
అమ్మను చూస్తూ ఉండిపోతుంది.
80. సుందర నిర్మల వదనము
కుందన పాదయు గళమ్ము కోమల కరముల్
అందమ గవీణ మీటగ
విందగు యనుభూ తికోరి వేల్పులు వత్తుర్
అందమైన నిర్మల మైన ముఖము కళకళ
లాడుచుండగా భారతి వీణను తన కోమల
కరములతో మీటుచుండగా ఆ వెన్ననాదము
విని పులకించడానికి దేవతలే వస్తారు
81.ఎంతమ ధురవీ ణాస్వ న
మంతకు మిన్నగు సుగాత్రి సుస్వర రాగముల్
చెంతన కూర్చొని వినుయూ
హెంతటి భాగ్యమ దినీమ హిమయే కాదా
అమ్మా భారతీ
నీవు ఎంత మధురంగా వీణ వాయిస్తావో
మానవ ఊహకు
అందదు. అలాటిది పక్కన కూర్చుని
నీ వీణా నాదం వినగలగడం ఎంత అదృష్టమో!!!
82. చాలును ఒకపరి దర్శన
మేలును హృదయ మునేలు మేరువు అదియే
జాలము జనమిక నిండెను
చాలును దర్శన మునాకు చదువుల తల్లీ
చాలును ఒకసారి దర్శన మిచ్చావు అదే చాలు. నీ రూపము
హృదయ మునేలు మేరువు. అదియే ఆ రూపమే మాయా
జాలము జన్మ నిండెను ఆ దర్శన మునాకు చాలును
చదువుల తల్లీ దయుంచు.
------------------------------------------------------------------------
83.కొంటిని మట్టిస రస్వతి
నింటికి ప్రతిమ నుదెచ్చి నెంచక వెలనే
బంటుగ మారితి నిత్యము
కంటిని మనసం తఆమె కళయే నిండెన్
మట్టి సరస్వతి
విగ్రహాన్ని కొని ఇంటికి ఆ ప్రతిమను దెచ్చి
ఆ
విద్యామాతకు బంటుగ మారి నిత్యము కొలుస్తూ
ఉండగా
మనసంతా ఆమె విద్యాకాంతులతో నిండి పోయింది
84. ప్రతిభ నుకోరు పిల్లలు
వ్రతము గచూతు రుపొత్త మందున వాణిన్
ద్రుతము గవిద్య నేర్తురు
ప్రతిన బూనిచ దువిచ్చు పతియే కాచున్
ప్రతిభ నుకోరు పిల్లలు ఒక వ్రతముగ ప్రతి పుస్తకమునందు
వాణిని చూచెదరు. ద్రుతము గ అంటే త్వరగా విద్య నేర్తురు.
పిల్లలు ప్రతిన బూనగ చదువుకు పతియైన వాణి వారిని
తప్పక కాచును.
85. పుస్తక ముపూని కనబడు
మస్తక ములది ద్దునామె భక్తుల మేలెం
చస్తిర చిత్తము లకుశుభ
మస్తని దీవెన లనిచ్చి మనసే మార్చున్
చదువులమ్మ చేతిలో ఎప్పుడూ పుస్తకంతో కనబడుతుంది
మస్తక ములది ద్దునామె అంటే ఆలోచనలను సరిచేసి
వృద్ధి చేసేది ఆమే. భక్తుల మేలెంచస్తిర చిత్తములకు
స్థిరమును కలుగజేసి దీవెన లనిచ్చి శుభములొసగును.
86. బుద్ధిని దురపో వమనిషి
సిద్దమ యినలా భమేమి చదివే స్థిరమున్
బుద్ధిని ఒసగెడి మాతకు
శ్రద్దగ వందన ముజేతు చదువుల కొరకున్
బుద్ధిని దురపో వమనిషి సిద్దమ యినలాభమేమి
అంటే చదువుకోడానికి మనిషి మాత్రం వస్తే లాభం
ఏముంది చదువుకి స్థిరమైన బుద్ధి కావాలి. స్థిరమైన
బుద్ధినిమ్మని మాతకు శ్రద్దగ వందనము చేస్తే తప్పక
చదువు వస్తుంది.
87 .దానము చేయుట ధర్మము
దానము లన్నిట నుగొప్ప తలుపే విద్యా
దానము జేసిన విద్యను
దానము తరముల కుకల్ప దరువై యెప్పున్
దానాలన్నిటా గొప్పదానం
విద్యా
దానం
విద్యాదానం చేస్తే
అది
తరతరాలకు
తరగని నిధిలా కల్పతరువై ఒప్పుతుంది.
-----------------------------------------------------------------------------------ANKITAM
88. కోమల పల్లవ పాణిని
శ్యామల కుంతల సలలిత సంభవ విద్యా
సోమవ దనార విందగు
ధీమతి వాగ్జెలి నినమ్మి స్థిరముగ కొలుతున్
89 .శాంతము ఆభర ణమునీ
కాంతియె తెలుపుసి త కాంతి కారిణి వాణీ
కాంతల తలంపు తొలగగ
బ్రాంతులు తొలగిం చరమ్ము భాషల రాణీ
శారద మాతా నీకు శాంతము ఆభర ణము. నీ కాంతి
ఆ విషయాన్ని తెలియజేస్తుంది. సితకాంతి కారిణి వాణీ
తెల్లని కాంతిని కలుగజేసే వాణీ స్త్రీల ఆలోచనలను
నా మనసులోకి రాకుండా బ్రాంతులు తొలగిం చరమ్ము
భాషల రాణీ.
90. శారద చరణమె శరణ ని
వారణ జేయుని కచింత వరవీ ణాపా
ణీరమ ణీయచ రణముల
విరాగ ముకోరు చువేడ బేటము తొలగున్
శారద చరణమె శరణమనివేడగా నివారణ జేయును చింతలు
వరవీ ణాపాణీ అనగా శ్రేష్టమైన వీణను ధరించిన రమణీయ
చరణములను విరాగముకోరుచు అనగా వైరాగ్యము కోరుచు
వేడగ బేటము అనగా దుఃఖము తొలగును.
91. ఏమని కొలవను శారద
సీమను దాటిద యతోడి చిరుచీ మింటన్
కోమల పాదము పెట్టెను
వామను డింటికి విరాట వాగ్టెలి వచ్చెన్
శారద గొప్పతనాన్ని
ఏమని
కీర్తించను
ఆమె
తన
సీమను
దాటి
దయతోటి
చిరుచీమవంటి
కవి
ఇంట
తన
కోమల
పాదము
పెట్టింది.
వామనుడింటికి
అంటే
మరుగుజ్జు
వంటి
కవి ఇంటికి
మేరుపర్వతం
వంటి
వాగ్దేవి
వచ్చింది.
92. మహాక వికాళి దాసును
మహాక వినిచే సినావు మహిమే తెలిసెన్
మహాక వులకం డనీవె
సహాయ మునాకు నుగమ్ము శతకం బందున్
93.పదార్చ న జేసె దవాణి
పదార్చ నవాంగ్మ యమందు పరమా ర్ధంబున్
విధాత తలపే ఎరుగను
సుధార సధార ల సృష్టి సుఖమే దెల్సెన్
పదార్చ న అనగా పదములతో అర్చన. వాణి పదార్చ న
అనగా వాగ్దేవి పాదాలకు అర్చన చేసెదను. నేను రాసే
వాంగ్మ యమందు పరమా ర్ధంబు నెరుగను. నాచేత
ఎందుకు ఇలా రాయిస్తున్నాడో విధాత తలపే ఎరుగను.
94. శిరమున భాద్యత లివ్వక
పరమగు భాషల నుదాల్చ వరమే ఇచ్చెన్
తరగని తలపుల నిచ్చెను
మరపును తోడుగ నిచ్చిక మత్తే జల్లెన్
శిరమున భాద్యత లివ్వక అంటే నెత్తిమీద బాధ్యతలులేని
జీవితాన్ని ఇచ్చిపరమగు భాషల ను అంటే విదేశీ భాషలను
దాల్చ వరమే ఇచ్చెన్. తరగని ఆలోచనలనిచ్చెను తోడుగ
మరుపు నిచ్చెను (సొంత విషయాలు మరిచిపోయే గుణము).
95. అర్థము లేనిచి రుతీగ
వ్యర్ధము గపూచె నుపూలు మసిలే పశువుల్
అర్థము కానక విడవగ
నిర్దయ గాపడి నతీగ నామయె దీసెన్
96. భారత వర్షను లిఖించి
భారతి కృపవ లనామె పదముల్ పాలన్
గారము గాకడి తినిపుడు
శారద కికపా లేలను శతకా లున్నన్
భారత వర్ష గ్రంథమును భారతి కృపతో లిఖించి ఆమె
పదములను పాలతో గారముగా అనగా గౌరవంగా కడితి
నిపుడు శారద కిక
పాలేలను శతకాలుండగా.
97. తోరణ ములల్లి రికవులు
కారణ జన్ములు వరాల గళమున్ భక్తే
పారగ పాడిరి కృతులు
భారత సంసృతి కిగొప్ప వరములు వారే
98. రాగము లిచ్చిన మాతను
రాగము నిచ్చిత నపేర్మి రథమం దున్ తా
రాగణ మునకూ ర్చొనజే
సాగణ సారథి గమాత శారద అయ్యెన్
99 .సితకాం తిప్రియ శారద
శతకం బులిఖిం చభక్తి శతమా నంబై
అతిశయ మగుయా భక్తిని
రతియే మనసం తపారె రసరా గంబై
100. సితకాం తిప్రియ శారద
శతకం బులిఖిం చిపాయ సమధుర కృతుల్
నుతము జేయుచు పాడగ
అతిశయ మందిన నునేను మరిచితి కాదా!
సితవ స్త్ర ధారిణే పద్మ ముఖే పుస్తక ధారిణే పద్మ స్తితే
లలితహ స్తే బింబాధరే సరసీరుహనేత్రే కచ్చపి ధారిణే
సులభ సాద్య సుధారస భాషా వాహినే విద్యానాయికే
విశ్వ కారణే నమో నమః
-----------------------------------------------------------------------------------------END
గొప్పక వులెప్పు డగుదురు
గొప్పగ రాజుల గుణాలు గొల్వగ కారే
చెప్పుచు భాషయె రాజని
గొప్పగ చూపగ తరాలె గొలుచును వారిన్
గొప్పక వులెప్పు డగుదురు రాజులను కొలిచినంతనే
గొప్ప కవులు కాలేరు. భాషే రాజాని చూపగా అందరూ
సులువుగా భాషను నేర్చుకుంటారు. అటువంటి కవులని
ప్రజలు గొప్ప కవులని గుర్తిస్తారు.
తరగని యక్షర లక్షలు
పేర్మితొ బ్రహ్మస తినాకు పెరగ మనిచ్చెన్
వరముగ వివేక మిచ్చెను
వెఱవక రచనల నుజేయ వేడుక నిచ్చెన్
వాగ్దేవి నన్ను పెరగమని ఆశీర్వదించి అక్షర లక్షలు
నాకు ఇచ్చింది వరముగా వివేకాన్ని కూడా ప్రసాదించింది.
ఆరోగ్యం గురించి వెరవకుండా రచనలు చేయడం వాటిని
అందరికీ అందించడం నాకు వేడుకయ్యింది.
89. అక్షర ములెచిరు దివ్వెలు
చక్షువు లుగమా రుదారి చక్కగ జూపున్
రక్షణ నొసగెడి సంపద
అక్షర ములచూ డనోడ నాయుధ ములగున్
అక్షర ములెచిరు దివ్వెలు చక్షువు లుగమారు అనగా
కళగా మారతాయి దారి చక్కగ జూపున్. రక్షణ నొసగెడి
సంపద కాపాడుకోడానికి అక్షరాలు ఆయుధాలౌతాయి.
87. యోగము విద్యను పొందుట
బాగుగ మాతను కొలవగ బలమే పెరుగున్
రాగము పెరుగును చదువులు
సాగును జీవిత మువెల్గు చదువే యబ్బన్
88. బరువే యగువి ద్యలన్ని
గురువే లేకను తీరునె టుపారు గుఱ్ఱము బరిలో
సరిరౌ తులేక మరిసరి
గురువై శారద నిన్నున డపంగ గుఱ్ఱము కావా
ప్రతిమ నుజేయు విధాత
ప్రతిమ నిషిమృ త్యువాత పడిచ చ్చుగదా
ప్రతిమ కాలము తీరగ
ప్రతిభ నింపస నాతని మరింక పరమే శుడెగా
రాజుల కోటలు కూలగ
తేజము మిగిలిను తరాల దుగుణం బుగా
పూజలు కొనికవు లువెడల
తేజము లదిగం తకీర్తి దేశమె దాటెన్