గాయత్రీ విద్యాసంస్థల సంచాలకులు శ్రీ అభిలాష్ దంపతులు
కచ్ఛపి తంత్రులై మ్రోగి - వాగ్దేవి వైభవాన్నిఎలా చూపారంటే...
భాష సంస్కృతి పట్ల నిజాయతీ గా ఉండేవారు కష్టించి పనిచేసేవారే చాలా తక్కువ . ఆ తక్కువ మందిలో రచయిత పూలబాల ఒకరు. సినిమా మరియు పాశ్చాత్య సంస్కృతి కి వ్యతిరేకదిశలో అందమైన కమ్మని తెలుగు భాషకోసం ఆయన పడేశ్రమ లో నిజాయతీ ఉంది. అది ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో భారతవర్ష లాంటి ప్రబంధాలు , వన శృంగారం లాంటి పద్యకావ్యాలు, సరస్వతీ శతకం వంటి భక్తి కావ్యాలు రాసి ముద్రించి అందరికీ అందజేయాలని పని చేస్తున్నారు. ఆయనపడే బాధ అర్ధంచేసుకునేవారు మహాను బావులు.
ఆ కోవలోకి చెందిన వారే గాయత్రీ విద్యాలయం సంచాలకులు ఆకుల అభిలాష్ గారు వారి సతీమణి మంజూషగారు. 125 సంవత్స రాల క్రితం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో 1900 వ సంవత్సరంలో చేబ్రోలు సరస్వతి గారిచే సరస్వతీ శతకం రచించి బడింది. ఈ నాడు 2025 లో అంటే 125 సంవత్స రాల తరువాత పూలబాలచే మరల సరస్వతీ శతకీర్తనావళి లిఖించబడింది.
.
గురుపూజోత్సవంనాడు రచయితను తమ గాయత్రీ విద్యాలయానికి ఆహ్వానించి గురుపూజోత్సవ వేడు కలు అత్యంత వైభవంగా జరిపించి తమ చేతులమీదుగా సరస్వతీ శతకీర్తనావళి పుస్తకావిష్కరణ గావించి ఆ మాధుర్యాన్ని పిల్లలకి పంచారు. ఆ గానాన్ని విద్యార్థులు ఆస్వాదించారు. వాగ్దేవి వైభవాన్ని విద్యార్థి లోకానికి రుచి చూపించిన పుణ్య మూర్తులు.
గరిమ సాహిత్య సంస్థ అధ్యక్షులు శ్రీ నర సింహంగారు విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చి పుస్తకా విష్కరణలో పాల్గొని రచయత మీద సాహిత్యం మీద ప్రేమను తెలియజేసుకుని చిన్నారులను ఆశీర్వ దించారు. ఇలాంటి వారితోనే భారత దేశానికి పూర్వవైభం సాధ్యం.

No comments:
Post a Comment