Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 19, 2025

Deutsche Reime - Need for New Rhymes

 జర్మన్ రైమ్స్ లేదా డోయిచ్ఛ రైమ - కొత్త నీరు 

పూలబాల ఇప్పుడు కొత్తగా  రైమ్స్ ఎందుకు రాసారో   కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

పాతరైమ్స్ అర్థాలు తెలిస్తే షాక్ అవుతారు  కొత్తనీరు అవసరం అంటారు. 


జర్మన్ లో  నేను చిన్న పిల్లలకి  రైమ్స్ రాసాను అని స్నేహితుడికి తెలుగులో చెపితే "ఆ దేశస్తులు ఎవరో రాసిన వాటిని సేకరించి ముద్రిస్తున్నాన్నావా ?" అన్నాడు  ఎవరో రాసిన వి కాదు నేనే జర్మన్ రైమ్స్  రాసాను అన్నాను. ఏంటి నువ్వే రాసావా ? అన్నాడు.  "ఎవరో రాసిన రైమ్స్ ని ప్రచురించలేదు. సొంత గా రైమ్స్ రాసాను " అని చెప్పాను. అప్పుడు అర్థం అయ్యింది. నేను రైమ్స్ రాశానని.  


చాలామందికి  రైమ్స్ ఎందుకు రాయడం? అనిపిస్తుంది .  రైమ్స్  ఇప్పుడు రాయడమేమిటి ఎప్పుడో రాసినవి ఉన్నాయి కదా ? అనిపిస్తుంది. అప్పటి రైమ్స్ అర్థాలు వాటి వెనుక ఉన్న కథలు తెలుసుకుంటే కొత్త రైమ్స్ అవసరం ఉందనిపిస్తుంది.  


                                                  

ప్లేగు, మధ్యయుగాలనాటి  పన్నులు, మతపరమైన హింస, వ్యభిచారం: చిన్న వయసులో పరిచయం చేయాల్సిన  అంశాలు  కావు. రైమ్స్ వెనక ఉండే కథలు  ఇవే.  నేటికీ కూడా  ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల ఈ  నర్సరీ రైమ్‌లను పాడుతున్నారు. పాఠశాలలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు  ఈ విషయాలను  తెలుసుకోలేకపోతే  పిల్లలకి ఎలా తెలుస్తుంది?

 మీరు రైమ్స్ ని  కొంచెం లోతుగా తవ్వితే,  ఆశ్చర్యకరమైన  కథలను బయటకొస్తాయి. చెట్ల నుండి పడిపోయే పిల్లలు సెంట్రల్ లండన్‌లో తలలు నరికివేయబడుతున్న వాళ్ళు, జంతువులను సజీవంగా వండడం  ఈ అంశాలను పసిపిల్లలతో పాడించడం సముచితకాదు. 

 “బా, బా, బ్లాక్ షీప్” అనేది 1275లో ప్రవేశపెట్టబడిన ఉన్నిపై పన్ను  గురించి.  కొన్ని పాఠశాలలు తరగతి గదులలో దీనిని పునరావృతం చేయకుండా నిషేధించారు కూడా. 


గూసీ గూసీ  గేండర్   ఇలాటి రైమ్ రాస్తారనిఊహించడం కూడా కష్టం

Goose-a goose-a gander, Where shall I wander? Up stairs and down stairs,
In my lady's chamber; There I met an old man, Who wouldn't say his prayers,                        

 So I took him by his left leg,  And threw him down the stairs

అక్కడ నేను ఒక వృద్ధుడిని కలిశాను  అతడు    ప్రార్థనలు చేయడు, కాబట్టి నేను అతని ఎడమ కాలు పట్టుకుని పట్టుకు అతన్ని మెట్లపై నుండి క్రిందికి విసిరేశాను

కొంతమంది ఈ పద్యం  Priest holes  సూచిస్తుందని చెపుతారు  - రాజు హెన్రీ VIII, అతని పిల్లలు ఎడ్వర్డ్, క్వీన్ ఎలిజబెత్ కింద హింసల సమయంలో  కాథలిక్ పూజారులు దాగునేవారు . ఒకసారి పూజారిని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లి  మెట్లపై నుండి విసిరివేసేవారు.  


దీని వెనుక మరో కథ ఏంటంటే ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XVI మరియు అతని భార్య మేరీ ఆంటోయినెట్ , వీరిద్దరూ రాజద్రోహానికి పాల్పడినట్లు తేలింది మరియు తరువాత శిరచ్ఛేదం చేయబడ్డారు.


4. లండన్ వంతెన పడిపోతోంది  1744

“లండన్ వంతెన పడిపోతోంది” అనేది 1014 వైకింగ్ దాడి లేదా పాత వంతెన పడిపోతుందని నిజంగానో  భయంతో  ఆరోజు పరిస్తుతులను భయాలను రైమ్స్ రూపంలో రాసుకున్నారు.  అవి ఇప్పటి తరాలకి  , అందునా మన పిల్లలకి అవసరమా ?


5. మేరీ, మేరీ, కాంట్రరీ  - 1744


 మేరీ, మానసిక రోగని వర్ణించడానికి ఒక పదం . మేరీ, మేరీ, కాంట్రరీ  తోటపని సలహా   లాగా ఉండే  ఈ ప్రసిద్ధ ఆంగ్ల నర్సరీ రైమ్ వాస్తవానికి  ఇంగ్లాండ్ క్వీన్ మేరీ  I ( బ్లడీ మేరీ) యొక్క నరహత్య స్వభావాన్ని వివరిస్తుంది.   ఆమె 1553 నుండి 1558 వరకు రాణిగా  వందలాది మంది ప్రొటెస్టంట్లను ఉరి తీయించింది . (వెండి గంటలు మరియు కాకిల్ షెల్స్ వాస్తవానికి హింస పరికరాలు, తోట పని  పరికరాలు కాదు.)

6. త్రీ బ్లైండ్ మైస్ // 1805


త్రీ బ్లైండ్ మైస్” అనేది బ్లడీ మేరీ పాలనకు మరొక  చెప్పవచ్చు,  ప్రొటెస్టంట్ బిషప్‌ల  హ్యూ లాటిమర్, నికోలస్ రాడ్లీ మరియు కాంటర్‌బరీ ఆర్చ్ బిషప్, థామస్ క్రాన్మర్— లు సజీవంగా దహనం చేయబడ్డారు   త్రీ బ్లైండ్ మైస్ అనే పేరు లో    అంధత్వం వారి మత విశ్వాసాలను సూచిస్తుంది. 

7. హియర్ వుయ్ గో రౌండ్ ది మల్బరీ బుష్ // 1840


“హియర్ వుయ్ గో రౌండ్ ది మల్బరీ బుష్” తరచుగా పిల్లల ఆటలో భాగంగా పాడతారు. ఇంగ్లాండ్‌లోని వేక్‌ఫీల్డ్ జైలు మాజీ గవర్నర్, . డంకన్, ఈ పాట మల్బరీ చెట్టు చుట్టూ వ్యాయామం చేసే  మహిళా ఖైదీలతో ఉద్భవించిందని సూచించారు. 


8. రింగ్ అరౌండ్ ది రోజీ - 1665 

పద్యం లండన్‌లోని గ్రేట్ ప్లేగును సూచిస్తుంది. “రోజీ” అనేది  కప్పి ఉంచిన దద్దుర్లు, వారు “పోసీలతో నిండిన జేబుతో కప్పడానికి ప్రయత్నించేవారు .” ప్లేగు దేశ జనాభాలో దాదాపు 15 శాతం మందిని చంపింది,   పద్యంచివర్లో —“యాషెస్! యాషెస్! మనమందరం కిందపడిపోతాము”—అలా దాచవద్దని చెప్పేవారు . 


అందుకే నేను రాసిన రైమ్స్ లో అమ్మ నాన్న , చంద్రుడు, సూర్యుడు , మేఘం , సీతాకోకచిలుక , వంటి ప్రకృతి అంశాలను    ఉపాద్యాయుడు , స్నేహితులు  స్కూల్ వంటి సామాజిక అంశాలను చక్కటి అంత్య ప్రాసతో పాడుకోడానికి వీలుగా రాసాను. స్వస్తి. 

  

Friday, October 17, 2025

Journalists

 1948 లో పుట్టి  70 లో  వృత్తిలో   మెరిసి ప్రస్తుతం తలా నెరిసిన ఒక వృద్ధ జర్నలిస్ట్.  సోషియలైట్  ఈవెనింగ్స్ , స్నాప్ షాట్స్  బాలీవుడ్ నైట్స్  ఇంసాటియబుల్ అనే కామపూరిత   పుస్తకాలు  రచించిన శోభా డే ఒక నవలా రచయిత్రి మరియు కాలమిస్ట్.   ఆమె తన కల్పిత రచనలలో సామాజికవేత్తలు మరియు లైంగికతను చిత్రీకరించినందుకు బాగా ప్రసిద్ధి చెందింది, ఈమె భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ద్వేషాన్ని మాటల్లో, తన రాతల్లో వెళ్ళగక్కుతుంది!  పాశ్చాత్య సంస్కృతి కి  వకాల్తా పుచ్చుకుని భారత సంస్కృతి సంప్రదాయాలను తూలనాడే  శోభా డే   విచ్చలవిడి తనాన్ని కోరుకుంటుంది. స్త్రీలకి సెక్స్ స్వేచ్ఛ ఉండాలని బల్లగుద్ది వాదిస్తుంది!   



చెత్త ఆర్టికల్స్ తో కాంట్రవర్సి ట్వీట్ లతో  చక్కటి  పేరు సంపాదించుకు న్న  ఈవిడ 

"ఒకవేళ నేను రాణీ పద్మావతి స్థానంలో ఉంటే "జౌహార్" పాటించేదానిని కాదు!" అంటున్న ఈ శోభా డే ఒక ఆడ జర్నలిస్టు!  ఈవిడ రాణి పద్మావతి పట్ల చేసిన వ్యంగ్యం గా చేసిన వ్యాఖ్యలకి మరొక మహిళా జర్నలిస్టు ఇచ్చిన కౌంటర్ ఏమంటే. "అద్దంలో నీ మొఖం చూసుకో..!ఒకవేళ నువ్వే పద్మావతి ఐతే, అల్లాఉద్దీన్ ఖిల్జీ యే "జౌహార్" పాటించేవాడు!"


రానా అయ్యుబ్ 

రాణాకు ఆ బిరుదు ఇవ్వలేదు కానీ అందరూ ఆమెను జాతి వ్యతిరేకిగా గుర్తించారు. ఇటీవల ఆమె కోవిడ్ 19 కోసం కొంత డబ్బు సేకరించినందుకు అరెస్టు చేయబడింది, కానీ ఆమె ఎక్కువ డబ్బును సొంత ఉపయోగం కోసం ఉపయోగించింది ED ఆమెను అరెస్టు చేసింది. ఆమె అతిపెద్ద అవకాశ వాది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత, ఆమె గుజరాత్ ఫైల్స్ ప్రమోషన్ ప్రారంభించింది. పాఠకులు కూడా అదే పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.


ఆమె జాతి వ్యతిరేకి మరియు జాతి వ్యతిరేకిగా పరిగణించబడుతుంది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం జాతి వ్యతిరేకులకు కూడా సమాన హక్కులను అందిస్తుంది. ఈ వాక్ స్వాతంత్య్ర నిబంధనలే ఈ జాతి వ్యతిరేకులను మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం చేస్తున్నాయి. రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ వారికి దేశభక్తి లేదు. ఆమె ఎల్లప్పుడూ ప్రధాన మంత్రి మోడీని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆమె మతం ముందు తన దేశం తర్వాతే ముఖ్యం. అలా జరిగినప్పు డల్లా ఆ వ్యక్తిని జాతి వ్యతిరేకి అంటారు. ఆమెకు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వేరే పని లేదు

ఒక భారతీయ ఉదారవాదిగా, ఆమె చాలా పక్షపాతంతో ఉందని నేను భావిస్తున్నాను, ఆమె బాధితులుగా మారే అదే ఎజెండాను అనుసరిస్తోంది. గుజరాత్ అల్లర్లు ఎందుకు జరిగిందో కూడా ఆమె దర్యాప్తు చేసి ఉంటే నాకు నచ్చేది. అదే సమయంలో లవ్ జిహాద్, ముస్లింల దళితుల చికిత్సలు, ముస్లిం తీవ్రవాదం మరియు భారతదేశంలో ముస్లిం యువత ఐసిస్ జిహాద్‌లో ఎలా చేరుతున్నారు అనే విషయాలను ఆమె పరిశోధించి ఉంటే బాగుండేది . కేరళలో ముస్లింలు కాని వారిని ముస్లింలు ఎందుకు హింసిస్తున్నారు, క్రైస్తవ ఫాదర్ చేతులు నరికివేయడం పరిశోధించి ఉంటే .బాగుండేది 

కాశ్మీరీ పండిట్ల అంశాన్ని కవర్ చేయడం ..  ఆమె వ్యాసాలన్నీ ముస్లింలు బాధితులు కావడం గురించి మరియు ఆమె ముస్లింల  దురాక్రమణదారులుగా వదిలేయాలని ఎంచుకుంటుంది, దీనివల్ల చాలా మంది బాధితులుగా మారారు మరియు దారుణమైన విషయం ఏమిటంటే, ఆమె ముస్లిం అనే ముసుగులో చేసింది. ఆమె భారతదేశంలోని అతిపెద్ద మైనారిటీగా, వారు అత్యల్ప విద్యా రేటును కలిగి ఉండటం, అతి చిన్న మైనారిటీ కంటే కూడా తక్కువ, లేదా ముస్లిం సమాజంలో జన్యు వ్యాధులు లేదా ముస్లింలను



మమతా కులకర్ణి సినిమా రంగంలో పనిచేస్తున్నప్పుడు మమతా కులకర్ణికి చాలా మంది గ్యాంగ్‌స్టర్ల తో పరిచయం ఉంది. డాన్ చోటా రాజన్ ఫోన్ కాల్ కారణంగా, మమతా కులకర్ణికి చైనా గేట్‌తో సహా అనేక సినిమాల్లో పని దొరికిందని చెబుతారు.


ఆ తర్వాత మమతా పేరు అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ముడిపడి ఉంది. విక్కీ గోస్వామితో సంబంధం కలిగి ఉంది. ఇది 1997లో సౌదీ అరేబియాలో విక్కీ గోస్వామికి 2000 కోట్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు. 25 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, కానీ ఇస్లాంను స్వీకరించి నందు కు మరియు ఐదు సంవత్సరాల తర్వాత అతను విడుదలయ్యాడు.


జైలులో ఇస్లామిక్ సంప్రదాయంలో మమతా కులకర్ణిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కెన్యాలో నాణ్యమైన సమయాన్ని గడిపారు. మమతా కులకర్ణి ఇప్పుడు విక్కీని వివాహం చేసుకున్నారనే వార్తలను ఖండిస్తున్నప్పటికీ, విక్కీ పట్ల తనకున్న ప్రేమను ఆమె ఖండించలేదు, మమతా 25 సంవత్సరాల తర్వాత గత సంవత్సరం భారతదేశానికి తిరిగి వచ్చింది. 

ఆమెను కిన్నార్ అఖారా మహామండలేశ్వర్‌గా నియమించారు. తరువాత కిన్నార్ అఖారాలో ఉద్రిక్తత తలెత్తడంతో ఆమె దీని నుండి కూడా తొలగించబడింది. ఇప్పుడు చరఖారీ మహామండ లేశ్వరుడిగా మారడానికి ₹10 కోట్లు చెల్లించారని ఆరోపించబడింది.

₹10 కోట్లు మర్చిపో; నా దగ్గర ₹1 కోటి కూడా లేదు. ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. నేను ఎలా బతుకుతున్నానో మీకు తెలియదు. నా దగ్గర డబ్బు లేదు. నన్ను మహామండ లేశ్వరు డిగా చేసినప్పుడు నా గురువుకు 'దక్షిణ'గా సమర్పించడానికి నేను ఎవరి దగ్గరైనా ₹2 లక్షలు అప్పుగా తీసుకోవలసి వచ్చింది)

Thursday, October 16, 2025

అడవి బాపిరాజు నారాయణ రావు - సమీక్ష

స్వాతంత్య్ర  సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త ఐన బాపిరాజు భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ సాహిత్యంపై ఆసక్తి తో రచనలు చేసేవారు .  1922 లో భారత స్వాతంత్య్ర  సంగ్రామంలో పాల్గొని జైలుకి వెళ్లారు  జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారు . ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. అదే సమయంలో కథలు రాశారు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు . 1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశారు . 


నారాయణరావు సాంఘిక నవల మాత్రమే కాక  శాస్త్రీయ సాహిత్యం( క్లాసికల్ లిటరేచర్) కూడా. 

ఇది ఒక ప్రేమ కథ అంటారు  కథా నాయకుడు నారాయణ రావు.  కథా నాయిక శారద .

పేమంటే పెళ్లి అయిపోయిన తరువాత ప్రేమ.  పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి పెళ్ళికి ముందు ప్రేమ  ఉండదు. అది కూడా వారిరువురి మధ్య ప్రేమ కాదు.  నారాయణరావు వన్ వే లవ్.   

ముఖ్య కథాంశం: పెళ్లి తరువాత చెప్పుడు మాటలు విని మొగుణ్ణి  దగ్గరకి చేరనివ్వని భార్య శారదని  నారాయణ రావు ఓర్పుతో చివరి దాకా ఇలా భరిస్తూ ఉంటాడు   

ఈ కింద సీన్   నారాయణరావు ఓర్పు కు మచ్చుతునక  


"నాలుగున్నర గంటల కులికిపడి నారాయణరావు లేచిచూడ శారద తలుపుదగ్గర నే తివాసీ పై పరుండి నిద్రపోవుచున్నది.  ఆ సుందరీమణి తన యిల్లా లటుల పరుండవలసిన గతియేమి? ఆమెకు దనయెడల ఎంతటి అసహ్యతయో?  ఇంతకు దన్నా బాల ప్రేమింపకపోవుటకు దనయెడల నేమిలోపము కని పెట్టినదో? ప్రేమవిషయమున లోపములు గణనకు వచ్చునా? 

 ఈ బాలికకు దానన్న ప్రేమ లేమియే నిజమయినచో దానేమి చేయ వలెను? ప్రేమలేని బాలికతో గాపుర మెట్లు? యువకునకు యువతి గావలెను. యువతికి యువకుడు గావలెను. మన వివాహములలో ఒకరికొకరు స్నేహితులుకండి యని మనకు నేర్పినారు. ప్రేమకూడ కుదిరినచో వారి దాంపత్యప్రవాహము గంగా నదియే. లేనిచో స్నేహితులుగానైనా సంసారయాత్ర సాగించుకొందురు. (?)

మరల తుదిప్రయత్నము చేయవలెనని యాత డూహించుకొని పరమ కరుణామూర్తియై భార్యకడకేగి నిదురబోవు నా బాలిక నెత్తికొని పోయి  మంచముపై బరుండబెట్టి తనివితీర ముద్దు గొనెను. శారదకు చటుక్కున మెలకువవచ్చిన లేచి 'అమ్మయ్యో ' యని దిగ బోయినది. ఎవరైనా చూచినా నవ్విపోయెదరు కనీసము మంచము మీద పడుకొనినట్టు నటించుము అని కోరగా ఆమె మంచంమీద  తలదించుకుని కూర్చొనును. కొద్దీ సేపు తరువాత నారాయణరావు ఆమె పై చేయివేయగా " నాకేమిటి బాబూ ఈ బాధ అని గదిలోనుంచి పారిపోవును. నారాయణరావు మంచము పై పడుకున్నట్టు నటించును 

స్త్రీ అవమానిస్తున్నా దులిపేసుకుని  అణిగి మణిగి ఉండాలని  రచయిత చెప్పకనే చెప్పాడు. 


 నారాయణ రావు గుణగణాల వర్ణన 

నారాయణరావు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక పెద్ద ధనిక భూస్వామి బ్రాహ్మణ కుటుంబానికి చిన్న కుమారుడు. అతను చెన్నైలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు.  నారాయణ రావుని బాపిరాజు అర్జునిడితో పోలుస్తాడు,  ఎప్పుడూ ఖద్దరు బట్టలు కట్టుకునే గాంధేయవాది గా చూపిస్తాడు. నారాయణరావు తాను ప్రయత్నించే ప్రతిదానిలోనూ రాణిస్తాడు- ఆయన చదువులో   కర్ణాటక శైలిలో వయోలిన్ వాయించడంలో  క్రీడలలో సమర్ధుడు. 


కథానాయకుడి మామగారు:   తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు - విశ్వలపురంజమీందారు

రైలు ప్రయాణం తో కథ మొదలౌతుంది .  గవర్నరు గారికి స్వాగతము పలుకుటకు రాజమండ్రి పోవు బృందంలో  తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు ఒకరు. ఆయన స్వరాజ్య సముపార్జన యజ్ఞ మందు పాల్గొనిన దేశభక్తుడు  సాంప్రదాయ వాది.   అతడు నారాయణ రావు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారమ్ పై చూసి,  నారాయణ రావు ఎక్కిన పెట్టిలో ఎక్కి  స్నేహితులతో )  ప్రయాణిస్తున్న నారాయణరావును చూసి  తన కుమార్తె శారదకు చక్కని పెండ్లికొడుకగునని  భావించి  అతడి పేరు  ఇంటిపేరు,  గోత్రము  అడిగి చివరిగా  అతడికి  వివాహంమైనదా లేదా అని అడుగుతాడు. నారాయణరావు కాలేదని సమాధాన మిస్తాడు. దాంతో పెళ్లిచూపులుఏర్పాటు చేస్తారు  , కథ మొదలౌతుంది 


నారాయణరావు మిత్రులు ; లక్ష్మీపతి , రాజారావు , పరమేశ్వరరావు , ఆలం. 

 చదువులు : నారాయణరావు , ఆలం సాహెబ్ ఎఫ్ ఎల్ చదివారు,  రాజేశ్వరరావు ఎం బి బి ఎస్,  పరమేశ్వరమూర్తి కవి చిత్రకారుడు గాయకుడు ,  లక్ష్మీపతి  నారాయణరావు బావ.. 


విలన్ :   కథా నాయిక శారద తల్లి  విలన్

ఆ చెప్పుడు మాటలు చెప్పేది శారద తల్లి.  నారాయణ రావుది  సంపన్న కుటుంబమే అయినా  శారద తండ్రి అంత  కాదు. అందుకే శారదా తల్లికి    నారాయణరావు కుటుంబంతో సంబంధం నచ్చదు.  వారంటే చిన్న చూపు  అందుకే  శారద మనస్సును విషపూరితం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది.  దారుణంగా  కూతురికాపురంలో నిప్పులు పోసేస్తుంది.  

ఈ క్రింది శోభన రాత్రి  సంఘటన  చదివితే ఆమె  విలనీ తెలుస్తుంది 

శోభనం రాత్రి :   నారాయణరావు భార్య శారద  లోనికి వెళ్ళనని పట్టుపట్టినది. ఆమె తల్లి కుమార్తెకు  భర్తపై అ యిష్టమని తెలిసి సంతోషించినది. కాని గర్భాదానమునాటి రాత్రి కొమార్తె గదిలోనికి వెళ్ళదనుట నలుగురకు దెలిసినచో నేమనుకొందురో యని భయపడి 'లోపలికి వెళ్ళు తల్లీ' యనిమాత్ర మన్నది.

ఇంతకన్నా దారుణం ఏంటంటే  శారద ఏదో ఒక రోజు తనను ప్రేమిస్తుందని నమ్మి నారాయణరావు భార్య దగ్గరికి రానివ్వకపోయినా  తాక నివ్వకపోయినా  సహనంతో భరిస్తాడు. రచయిత  కథానాయ కుడి ఓర్పు నిబద్దత గురించి గొప్పగా చూపిస్తున్నానని అనుకుంటాడు . హద్దు దాటిన సహనం కథ చివరిదాకా సాగుతూ  వెగటుగా అనిపిస్తుంది. ర ఒక చెంప వాయిస్తుంటే  రెండో చెంపచూపుతు న్న ట్టనిపిస్తుంది. మొగుడంటే కనీసగౌరవం లేకుండా అతడి నుంచి తప్పించు కునే భార్య శారద పట్ల అంత  సహనం అపాత్ర దానంలా చేతకాని తనంగా కూడా అనిపిస్తుంది.   

నారాయణరావు పాత్ర  పాత తెలుగు సినిమాల్లో కోడలు పాత్రలా అనిపిస్తుంది   అత్త అవమానించి నా, హింసించినా , చంపేస్తున్నా నోరెత్తని పాత సినిమా కోడలు గుర్తుకి వస్తుంది . అత్తా  ఒకింటి కోడలే సినిమాలో రమణమూర్తి భార్య సంధ్య తన అత్త సూర్యకాంతం అవమానాలని  బాధలని తట్టుకుని చివరకు తిరగబడుతుంది.   నారాయణరావు   అంత కంటే ఎక్కువ సహనం చూపిస్తాడు చివరివరకూ  సద్దుకుపోతాడు.

శారదకు తానంటే ఇష్టం లేదని నారాయణరావు కాశీ యాత్రలకు పోతానని బయలుదేరతాడు. కొంచెం ఎడబాటు ఉంటే బాగుంటుందని  భావిస్తాడు. యాత్ర ముగించుకుని చాలా కాలం తర్వాత వస్తాడు మావగారు. పునస్సంధాన మహోత్సవము ఏర్పాటు చేస్తారు 

అప్పుడు నారాయణరావు  పరిస్థితి 

"నేడెటులశారదతో మాట్లాడగలిగెనోయతనికే తెలియదు. ఉస్సురని వెడలిపోవజూచుచు 'మాట్లాడ వేమి శారదా!'నాపై ప్రేమలేదా  యని జాలిగ ప్రశ్నించెను. శారద భయమునిండిన హృదయముతో నిజము చెప్పిన ఈయన వదలు నను ఆశతో కంపిత స్వరమున నాకు ప్రేమలేదు' అని గబుక్కున కన్నుల నీరునిండ నేడ్చినది. నారాయణరావును కొరడాతో మొగమున గొట్టినట్లయి చివుక్కున వెనుకకు జరిగి మెదడు ర క్తహీన మైపోవ తూలి, లేచి, అచ్చటనుండి వచ్చి సోఫాపై  తాను  కట్టుకున్న దివ్య భవనము కూలిపోయినదని తన బతుకు నిరర్థకమైపోయినదని ఏడ్చును. "

నారాయణ రావు నవలలో  అనేక పాత్రలు ఉన్నాయి. కథాంశాలు మరియు ఉప కథాంశాలు ఉన్నాయి.అసలు కథ నడవ కుండా ఉపకథలు తగులు కుంటాయి. అలా అని ఉపకథలేవీ  ఉన్నతమైన కథలు కాదు.  ఆ ఉపకథలలో  పాత్రలన్నీ సాధారణ మానవ దుర్గుణాలను బలహీనతలను కలిగి ఉంటాయి.  

 ఉపకథలలో ఒక అక్రమ సంబంధం కూడా ఉంది. 

పుష్పశీల రాజేశ్వరరావు కథ  - ఒక అక్రమ సంబంధం గురించిన కథ 

అక్రమ సంబంధాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కానీ ఆరోజుల్లోనే ఇంత బరి తెగించిన ఆడవాళ్లు ఉండేవారని ఊహించలేము. ఆ రోజుల్లో రచయిత ఎంతో  ధైర్యంగా రాసారని చెప్పచ్చు

సుబ్బయ్య శాస్త్రి గారి భార్య పుష్పశీల. ఆమె రాజమంద్రిలో భర్తతో ఉండును.   బి ఇ . మూడవ సంవత్సరము చదువుతున్న నారాయణరావు స్నేహితుడు రాజేశ్వరరావును  ఆమె మోహించును.  రాజేశ్వరరావు కూడా ఆమె కొరకు  తహతహలాడును.   ఆమె రాజేశ్వరరావు కౌగిలిని రుచిచూసి ఆ రుచిని ఈనాటికీ ఆస్వాదించుచున్నది. అతడు తన భర్త అయినచో తన జన్మ ధాన్యము అగునని ఆమె తలచి భర్త సుబ్బయ్య శాస్త్రి ని ప్రేమలో ముంచి మురిపించి అతడి మీద కవితలు చెప్పి భర్తను నమ్మించి  అతడు కోర్టుకు వెళ్ళినప్పుడు తన ప్రియుడిని పిలిపించుకొని అతడి ప్రేమను పొందును. అతడు తన ప్రేమ గురించి నారాయణరావుతో నిర్లజ్జగా ఇలా  చెపుతాడు " రాజమండ్రి వెళ్లినందుకు నాకు పనైందిరా . నా ప్రేమ సఫలమైందిరా . ఆమె అందం కనీవినీ ఎఱుగనిదిరా. ఆమె లేని మగ జన్మ వ్యర్థం రా!" ఇలా సాగుతుంది సంభాషణ చదివితే  నిండా మునిగితే అందరు అంతే అనిపిస్తుంది 


రాజేశ్వరరావు ఉత్తరం చదివితే ఈరోజుల్లోనే కాదు ఆరోజుల్లోకూడాఅంతే  అనిపిస్తుంది. 

నేనేమి చేసేది, నారాయణా!

 నాకూ మతిపోయింది. ప్రపంచంలో ప్రేమ లేదనుకున్నాను. స్త్రీకీ, పురుషుడికీ ఒకరిదేహంమీద ఒకళ్ళకు కోర్కె కలగడమే ప్రేమ అనుకున్నా. ఇప్పుడు నా సంగతిచూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇదివరకు చక్కని బాలికలతో స్నేహంచేసి వారి మనస్సులు చూరగొన్నాను గాని, ఇదేమిటో నా కర్థం కాలేదురా. పుష్పశీలాదేవికి నేనంటే పిచ్చే! 'నిన్ను వదిలి ఒక్క నిముషంఆన్నా ఉండలేను, నాకీ భర్త వద్దు' అని మొదలు పెట్టింది.

 మొదట భర్తకావాలి, నేనూ కావాలి అన్నది. శ్రుతి మించి రాగాన్ని పడింది. ఇద్దరము ఇక విడిగా ఉండడం పడలేదు. కాబట్టి బయలు దేరివచ్చి ఈ హైదరాబాదులో మమ్మెవరూ పట్టుకోలేని మేడలో ఉన్నాము. మేమే నిజమయిన భార్యాభర్తలము. నీ స్నేహము వదలుకో లేను. నా యీ భార్యనూ వదలుకోలేను. నీ సదభిప్రాయం నాకు ఉండాలి. నీ కొక్కడికే నా అడ్రసు ఇస్తున్నాను. నాకు ఆవసరం వచ్చినప్పుడు వేయి రూపాయలవరకు నువ్వు ధనం సప్లయి చేయవలసి ఉంటుంది.


మరొక చిన్న ఉపకథ  సత్యవతి కథ -  

 సత్యవతి నారాయణరావు చెల్లెలు. ఆమె భర్త  వీరభద్రరావు పరమ కర్కోటకుడు. అవకాశవాది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టు రకము.  భార్యని గొడ్డుని బాదినట్టు  బాదుతాడు. ఆమె దెబ్బలు తింటూ "రామ రామ రామ" అనుకొంటుంది తప్ప భర్తకి ఎదురు చెప్పదు.  ఆ రంపపుకోతకి పెద్ద పిల్ల తప్ప ఆమెకి పుట్టిన పిల్లలందరూ చనిపోతారు. అలాటి వ్యక్తికి నారాయణరావు భారతదేశంలో స్త్రీలు ఎంత గొప్పవారో ఎంత భక్తి గలవారో చెపుతాడు.   అతడి మనసు మార్చి చెల్లి కాపురం చక్కబెట్టాలని  అతడి ఉద్దేశం. 

"బావ మన స్త్రీలు ఎంత గౌరవనీయులోయి, మన గౌరవాన్ని , మన నాగరికతను నీతిని జాతిని కాపాడుతున్నది స్త్రీలోయి , రుద్రమ దేవి, తరిగొండ వెంగమాంబ ను గుర్తుచేసుకో మంచాల తన భర్త బోగందాని వలలో పడితే భర్తను కాపాడమని దేవుని స్మరించి భర్త వీరమరణం పొందితే   సతీ సహగమనం చేసింది,  చరిత్ర తెలీదా  బావా నీకు." బావా నీవు ఉద్యోగంలో చేరడంవల్ల అలా అయిపోయావు గానీ నీ హృదయం చాలామంచిదోయి అని  నారాయణరావు  బావని  గంటలు గంటలు పొగుడుతాడు.  

  ఇక ఉపకథలు పొతే  కుటుంబాలు,  రాజవంశాల  రాజకీయాల గురించి చర్చలు , సాహిత్యం, సంగీతం మరియు కళల గురించి  చర్చలుఉంటాయి . అవి  కొంత విసుగు తెప్పిస్తాయి.  












Friday, October 10, 2025

French poem of life

   ఎల్లిపోయినవా బాపు ! Tu es parti, Bapu.

కన్నోళ్ల కడుపుకై ఎన్ని ఖార్కానాలు కలియతిరిగావో     

 వారి ఆకలి తీర్చడానికి ఎన్నెన్ని అంగళ్లకు ఎదురీదావో 

చివరికీ,,,ఈ బతుకు బజార్లోనుండి 

ఈ జిందగీ చౌరస్తాలోనుండి ఎల్లిపోయినవా బాపు 

ఎవరినీ నొప్పించకుండా 

ఏ చేయి సాయానికి ఎదురుసూడకుండా 

ఎదిగొచ్చిన కొడుకుల భుజాలపై భారంకాకుండా 

ఏ కోడలి నాలికపైన కూడా ఒక్క చెడ్డ మాటైనా దొర్లకుండా

కట్టుకున్నదాని కొంగుకు కడివెడు కన్నీళ్లు మూటగట్టి ఎల్లిపోయినవా బాపు !!


Combien d'épreuves as-tu endurées, 

combien d'usines as-tu cherchées pour nourrir tes enfants ? 

Combien de difficultés as-tu dû affronter pour un seul repas ?

Enfin, de ce marché de la vie

De ce carrefour de la vie

 tu as disparu, Bapu.

Sans blesser personne

Sans attendre d'aide

Sans peser lourd sur les épaules des fils adultes

Sans écouter un seul mot grossier de les lèvres d'aucune bru

 laissant les larmes de celle qui avait été ligotée,

 tu es parti Bapu!!