Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, January 8, 2021

Bharatavarsha -108

 సుందరి పార్వతీ అపహరణ ఘట్టమును ముగించిన పిదప మాలిని , మంజూష నందినీ శిలా ప్రతిమలువలే బిగుసు కొని చూచుచుండిరి. ముందుగా మాలినిగారు తేరుకొని బాహ్య స్మృతి పొంది " నీ విమానమునందు ఆ పార్వతెట్లు  కూర్చొన్నదో , నీవు చెప్పుచుండగ  నా గుండె ఆగిపోవునేమో అనిపించెను.”  ఇట్టి అసాధారణ ప్రతిభాపాటవములున్న వైమానికురాలిని ఘనముగా సత్కరించవలె "నని నందిని ముందురోజు వస్త్రాలయము నుండి కొనితెచ్చిన ఒక కుంకుమ రంగు చేనేత చీరను పసుపు రంగు రవికను ఇచ్చి  ఒక ముత్యాల హారమును  ఆమె మెడలో వేసి అలంకరించెను.

మాలినిగారు భోజనములు వడ్డించగా అందరూ భోజనములు చేయుచుండిరి. ఇంతకీ పార్వతి ఎచ్చటున్నది అని ముగ్గురు ఆత్రముగా  అడిగిరి, అప్పుడు సుందరి “నేను ఇంటికి వచ్చి చూడగా తాళము పెట్టి యుండుటచే దసపల్లా హోటల్ నందొక గది తీసుకొని యుంచినాను” అని సుందరి చెప్పెను.“వీరిద్దరూ ఎప్ప్పుడూ ఇంటి పట్టునుండక ఆసులో కండెవలె తిరుగుచుందురు. మీరందరు సాయంకాలము పోయి పార్వతిని తీసుకు రావలెను.” అని మాలినిగారు అనుచుండగా “భోజనములైన పిదప పోయెదము.” అని నందిని మంజూషలు అనిరి “లేడికి లేచిందే పరుగన్నట్లున్నది మీవరస సుందరి కి విశ్రాంతి అవసరము సాయకాలమే పోవలెను” అని మాలినిగారు పట్టుపట్టిరి. “లేదు మేము పోయెదము అని మంజూష హఠము  చేయుచుండగా మాలినిగారు విసిగిపోయి మంజూషను గరిటెతో చిన్నగా తలపై మొట్టి " నా మాట వినకున్న నాతో  మాట్లాడవలద”ని మూతి ముడిచినారు. సుందరి అది చూచి ఒకటే నవ్వు చుండెను. ఎట్టకేలకు భోజనములు ముగిసినవి సుందరి కూడా వారితో బయలుదేరెను.

వారు కిలకిలా రావములు చేయుచూ ముగ్గురూ ఇంటి ఆవరణలో నున్న వాహనము వైపు పోవుచున్నారు. మాలినిగారు వారివెంట నడుచుచున్నారు. నందిని “సుందరి నీవు నడిపెదవా?” అని అడిగెను " సుందరి” నాకు లైసెన్స్ లేద"ని  చెప్పెను. మంజూష, నందిని సుందరిని “నీ వద్ద ఉన్న లైసెన్స్ చూపమ”ని కోరగా సుందరి తన పైలెట్ లైసెన్స్ ను తీసి చూపెను. మంజూష నందిని ఆ లైసెన్స్ ను తేరిపార చూచిరి.  విమానము నడుపుటకు ఐదు సంవత్సరములకు పౌర విమాన శాఖవారిచ్చిన అనుమతి. మంజూష  “విమానము లైసెన్స్  చూచుట జీవితములో  ఇదే  మొదటిసారి.  

కారు నడుపుటకు అనుమతి లేదు గానీ విమానము నడుపుటకున్నది. ఇదెట్లున్నదనగా  మజ్జిగున్నదా అని అడిగిన లేదు పెరుగున్నది అన్నట్లున్నది” అనెను. సుందరి మెల్లగా పండ్లికి లించెను. నందిని సుందరిని చూచి పడీపడీ నవ్వు చుండెను. వెనకనే యున్న మాలినిగారు " వీరికి ఇకఇకలు పకపకలు హెచ్చగుచున్నవి.  నందిని  ఇట్లుండెడి పిల్ల కాదు  ఈ మంజూష దానిని చెడగొట్టినది. పార్వతి అనుకూలవతి యగు చక్కటి పిల్ల , పార్వతి వచ్చిన మీ పనిచెప్పెదను” అని సణుగుచుండగా. నందిని “అత్తా నీ ఇంట దీపము పెట్టుకోడలిని  మంచి చేసుకొనక ఇట్లు మాటలాడుట న్యాయమా అని అనుచూ వాహనము నధిరోహించెను. 

పార్వతి బుద్ధిమంతురాలట అదియునూ చూచెదము అనుచూ నవ్వులతో హోటలుకు సాగుచుండిరి. దారంతా ఆమాటలే చెప్పుచూ వాహనమును నడుపుచున్న నందిని వేరొక కారుని డీకొనెను. పోలీసు ప్రత్యక్షమయ్యెను “అదృష్టము బాగుండుటచే ఎవరికీ దెబ్బలు తగలలేదు కానీ నువ్వు  పోలీసు వచ్చి స్టేషనుకు రావలసి యుండునని  నందినిని గద్దించుచూ  వివరములడిగి వ్రాసుకొనుచుండెను. పెంచలయ్య కుమార్తె అని చెప్పగానే అతడి విషణ్ణ వదనమందు నవ్వులు పూసినవి. ఇకపై  మీ బెంజ్ కారు గుర్తు పెట్టుకొందును మీరు వెళ్ళిరండి మేడం. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు నిత్యమూ జరుగుచునే యుండును. అని ఎంతో వినయముగా వారిని సాగనంపెను. సుందరి , మంజూష అచ్చెరువందిరి.  

                                                                    ***

లూయి విల్  : ఢిల్లీలో బయలుదేరిన అమెరికా సంయుక్తరాష్ట్రాల విమానము ఆఫ్ఘనిస్తాన్, టర్కీ , గ్రీస్, ఇటలీ, స్పెయిన్ మీదుగా అట్లాటిక్ మహాసముద్రమును దాటి లాఫాయెట్టి  మీదుగా ఇరువదినాలుగు గంటల సుదీర్ఘ ప్రయాణము పిదప భూగోళమునకావలి వైపునున్న మరియొక నాగరికతను చుంబించుచూ మహమ్మదాలీ అంతర్జాతీయ (లూయీవిల్) విమానాశ్రయమందు వాలెను. చెప్పనలవికాని  విమానాశ్రయ తిన్నమును  నిశ్శబ్ద నిర్మల  భూషణాదులు ద్విగుణీకృతము చేయుచూ  దోడా కొండల మధ్య ప్రవహించు చీనాబ్ నది వలె,  లదాక్  పర్వతముల మధ్య నున్న నీలి పాంగంగ సరస్సువలె, తపస్వినివలె నున్నది.  వర్షుడు విమానము దిగిన  పిదప ఇండియానా విశ్వవిద్యాలయ అధికారులు హార్దిక స్వాగతము పలికి తమ వాహనమందు కొనిపోయి విడిది ఏర్పాటు చేసినారు.  

అంతర్జాతీయ ముష్టియుద్ధ క్రీడాకారుడు మహమ్మదాలీ జన్మస్థలమగు లూయివిల్ అనినచో ముఖ్యముగా గుర్తుకువచ్చునవి, ఆలీ బాల్య గృహము,  స్లగ్గర్  కర్మాగారం మరియు కెంటాకీ  చికెన్ఫ్రై,(KCF) కానీ అచ్చటమరెన్నో చూడవలసిన ప్రదేశములు కలవు. 

నాటి సాయంత్రము ఆరు గంటలకు లోగాన్ ప్రదేశమందు గల ఫోల్కనర్ చిత్రప్రదర్శనశాల లోఇండియానా విశ్వవిద్యాలయము వారిచే నిర్వహించబడుచున్న ఆంగ్ల పద్య సాహిత్య ఉత్సవమునకు అతడిని కొనిపోయిరి. అనేక స్థానిక కవులు కవయిత్రులు  ఆ పద్య సాహిత్య ఉత్సవమందు పాల్గొనిరి. ప్రజలు కూడా ఈ ఉత్సవము తిలకించుటకు పెద్ద సంఖ్యలో   ఉత్సాహముగా వచ్చిరి. నగరమేయరు పారిపాటిగా ఈ సభకు అధ్యక్షత వహించెను. ఆయనకూడా సాహిత్య ప్రియుడు అగుటచే తాను వ్రాసిన ఆంగ్ల పద్యములను చదివి వినిపించెను. చిట్టచివరిగా భారతవర్ష తాను కొత్తగా వ్రాసిన , బ్యూటీ అఫ్  కల్చర్,   పీస్ అండ్ జస్టిస్ అను ఆంగ్ల పద్య సంకలనములనుండి కొన్ని పద్యములను వినిపించగా ఆ భాషా భావ సౌందర్యములందు తడిచి, నాజూకైన లయవిన్యాసభరిత ఆంగ్ల ఉచ్చారణ సొక్కి ఆహుతులు వివశులయ్యిరి. 

 ముగ్ద పారవశ్యమున మునకలయిన మేయరు గారు భారతవర్ష నుండి పుస్తకములను తీసుకొని అందునుండి మరికొన్ని పద్యములను చదివి శ్రోతలకు ఆనందామృతమును పంచి. “ప్రజలందరినీ కలుపు శక్తి కళకు మాత్రమే కలదనిన అతిశయోక్తి కాదు. ఈ ఆంధ్రకవి నేడు లూయివిల్ నగరమునే కాక జన హృదయములను వెలిగించెను. శాంతి మరియు న్యాయం కొరకు కదం త్రొక్కు పదాతి దళముల సృజించిన ఈ కవిని శాంతిసేనాని యనిన అతిశయోక్తి కాదు.  ఈ ప్రపంచ పౌరుని  గుర్తించిన లూయీవిల్ గౌరవము ఇనుమడించునని లూయివిల్ నగర తాళాలను భారతవర్షకు  అందజేసి  అతడిని  నగరగౌరవ పౌరునిగా  ప్రకటించిరి. పిదప భారతవర్ష నగర సందర్శనమునకు ఏర్పాటుచే సిరి.

లూయివిల్ రాజధాని కాకున్ననూ కెంటాకీ రాష్ట్రమందు వంద విభిన్న ఆకర్షణలు గల అద్భుత నగరము. వేయి సంవత్సరముల లూయివిల్ చరిత్రను ప్రదర్శనలద్వారా ప్రతినిత్యము చాటుచు వన్నెల సీతాకోకచిలుకవలె మెరియుచున్న ఫ్రెయిజర్ చరిత్ర ప్రదర్శనశాల యందడు గిడి, ఆంధ్రదేశమందిట్టి ప్రదర్శనశాల యుండవలెననుకొనుచూ  విందు వినోదములకు చిరునామా అయిన  ఫోర్త్ స్ట్రీట్ చూచి అచట ఉన్నత ఆకాశ హార్మ్యము లందు రాత్రంతయూ జరుగు రాసక్రీడల గూర్చి విని  సందర్శకులను అయస్కాంతమువలె ఆకర్శించుచున్న ఆవీధి ని వీడి  రోమన్ శిల్ప కళను చూపు పురాతన లూయి విల్ చారిత్రక  ప్రదర్శనశాల లోనికి పోయెను. భవన నిర్మాణమందు ఆసక్తిగల వారు తప్పక సందర్శించవలసిన ఈ భవనము ప్రాచీన కాలమందు రెండు కుటుంబముల నివాసము. దాని సమీపములోనే కాంకర్డు  కాసల్ అను విక్టోరియా కాల శిల్పకళను ప్రతిబింబించు మరియొక చారిత్రాత్మక రాచ భవనము కలదు.  అందుగల  సప్తవర్ణ నగిషీల చెక్క శిల్పములను జూచుచున్న వర్షుని స్మృతి పథమున విదిష యే మెదలుచుండెను. 

లూయివిల్ బేస్బాల్ క్రీడకు  ప్రపంచ  ప్రసిద్ధి గాంచిన నగరము. ప్రపంచములో అత్యుత్తమ బేస్బాల్ బ్యాట్లు తయారుచేయు స్లగ్గర్  కర్మాగారం మరియు ప్రదర్శనశాలకు బోయి  ఆ ప్రదర్శనశాల పైగోడకు ఆనుకొని యున్న 120 అడుగుల ఎత్తున తాటి చెట్టు పరిమాణమునగల బేస్బాల్ బ్యాట్ ను చూచి వింత గొలుపు ఆ ప్రదర్శన శాల నందు ప్రవేశించెను. పిదప వంద ఎకరముల  మానవ నిర్మిత సున్నపురాయి గుహ ను పెక్కుకళాఖండములకు నిలయమైన కెంటాకీ డెర్బీ ప్రదర్శనశాలను సందర్శించి ప్రత్యేక ఆకర్షణ గానిలచిన బహుమతుల అంగడికి పోయి అందరికీ బహుమతులు కొని వెనుదిరిగెను. కెంటకీ సాహితీ చరిత్రయందు అగ్రస్థానమంది నగరగౌరవ పౌరునిగా లూయీ విల్ నగరము పై తన ముద్రను వేసిన వర్షుడు తనదేశమునకు పోవు విమానమెక్కెను. విమానము గాలిలోకి లేచెను. 

3 comments:

  1. వర్షుడి సాహిత్య యాత్రను, లూయిస్ విల్ పట్టణమును చక్కగా వివరించారు.Adding pilot license of Sundari to this part shows the passion,dedication, and hard work of the writer

    ReplyDelete
  2. Thank you very much. మీ చక్కని ఫీడ్ బ్యాక్ ని ఒక పుస్తకంగా తేవచ్చు.

    ReplyDelete
  3. నాకావ్యం కంటే మీ ఫీడ్బ్యాకే నాకు నచ్చుతుంది

    ReplyDelete