Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, November 6, 2021

అగోచర ఆధ్యాత్మిక ప్రయాణం

 అమ్మ అతడి గుండెలో నాట్యమాడింది  దాని ఫలితమే 

అమ్మ మహిమల  అతిపెద్ద  అద్భుత తెలుగు గ్రంథం   భారతవర్ష 

 1265 పేజీల  భారతవర్ష   సరళ గ్రాంథిక  ప్రబంధం

 అచంచల భక్తితో  రోజుకి 20 గంటలు రచన చేస్తూ  ఒక్క ఆంగ్ల పదం లేకుండా   100 పాత్రలతో  రెండువందల వృత్త పద్యాలతో, అష్టాదశ వర్ణనలతో  ఉన్నత సాహిత్య ప్రమాణాలతో  8 నెలలో భారతవర్ష  గ్రంథ రచన పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ కూడా పొందాడు.    ఇంతకీ ఎవరా కవి ?  అతడే 6 విదేశీ భాషలలో  రచనలు చేసిన బహుభాషా కోవిదుడు మాతృభాషా సేవా శిరోమణి బిరుదాంకితుడు విజయవాడ వెంకట కవి, 

అతడి  అసలు పేరు పుట్రేవు వెంకట ప్రసాద్. అతడి కలంపేరు "పూలబాల"  అధికార భాషా సంఘంచే  ఆంధ్ర ప్రభుత్వంచే మాతృభాషా సేవాశిరోమణి అనే బిరుదుని పొందారు. తెలుగు భాషకు పునర్ వైభవాన్ని తీసుకురాడానికి తెలుగు సంప్రదాయాలకు భారతీయసంస్కృతుల పెద్ద పీటవేస్తూ నేటి సమాజానికి మాతృభాష ఎంత అవసరమో,  భాషా సంస్కృతులను కోల్పోయిన జాతి తల్లిదండ్రులు లేని అనాథలా ఎలా తయారవుతుందో కళ్ళకు కట్టి నట్టు 100 పాత్రల దృశ్యకావ్యంలో  వర్ణించారు పూలబాల.   

100 పాత్రల నవలలో అమ్మే ప్రధాన పాత్ర. అమ్మ ప్రధాన పాత్రగా  అమ్మపై   సంస్కృతాంధ్రాలలో హృదయాన్ని అంటుకునే పాటలు పాటలు కీర్తనలు రాశారు.

ఇంటికి వచ్చిన అతిథిని  దుర్గ గా భావించి పాదాలకు పసుపు రాసి సేవించడం ఈ కావ్యం లో  ఒక అద్భుత ఘట్టం. అరుణ తార అనే ఒక ఎం పీ  అవినీతి ఎరుగని  ఒక నిరాడంబర వనిత.  ఒక పేద కుటుంబాని చెందిన  ఒక యువతిని ఒక కీచకుడు  అవమాన  పరచగా ఆ యువతిని  ఆదుకుని ఆ కీచకుడిని శిక్షించి, భంగపడిన యువతిని ఓదార్చడానికి వారి ఇంటికి వస్తుంది. ఆ ఇంటి ఆడపిల్ల లు  కృతజ్ఞతతో   ఆమె  పాదాలను తాకాలని ప్రయత్నిస్తుండగా  అరుణతార  ఒప్పుకోదు. అప్పుడు  మన సంప్రదాయ ప్రకారం ఆమెను ఆ పిల్లల తల్లి మాలిని  కుర్చీలో కూర్చోండ బెడుతుంది. ఇలా మన సంప్రదాయం ఎంత గొప్పగా ఉందొ  అని చూపిస్తాడు కవి.  

ఆ ఇంటి పెద్ద కొడుకు గొప్ప కవి శ్రేష్ఠుడు కథానాయకుడు  అతడి పేరు భారతవర్ష  అతడు సంస్కృతంలో ఆమెను దుష్ట సంహారం చేసిన  దుర్గగా వర్ణిస్తూ 

"త్రిమూర్తి ప్రేరిత , త్రిభువన విలసిత త్రినేత్ర భూషిత మాతా సుంభ  నిసుమ్భ హారిణి ద్వాదశరూపిణి మాతా!  చండ  ముండ సంహారిణీ నిశ్చల రూపిణి మాతా, త్రిగుణ వర్జితా గంగా జనిత విచలిత రసనా మాతా!" ఇలాపాడతాడు.  అని  ప్రౌఢంగా  సంస్కృతంలో    వ్రాసిన కవి  మళ్లీ   ఆ ఇంటి ఆడ పిల్లలు ఇలా పాడతారు అని తెలుగులో   సరళంగా  

"అమ్మా దుర్గా మళ్ళీ రావమ్మా అమ్మా దుర్గా వెళ్ళీ రావమ్మాఈ దీనుల లోగిలి లోకి అడుగిడ రావమ్మా  నీ అడుగుల సవ్వడి వినగా చేస్తూ చేమా పులకించేనమ్మా నీ పాద ముద్రలు పడగా ధర్మం ధరలో విలసిల్లేనమ్మా నీ గజ్జెలు ఘల్ ఘల్ మనగా దుష్ట శక్తులు తొలగే నోయమ్మా ! అమ్మా దుర్గా వెళ్ళీ రావమ్మా, ఈ దీనుల లోగిలి లోకి అడుగిడ రావమ్మా,  నీ విభుని విభూతి పొందుట ఈ జన్మకు గొప్ప నుభూతోయమ్మా.... " 

అని  రెండు స్థాయిల్లోరాసి  పాఠక  హృదయాలను రంజింపజేసాడు.  

దుర్గమ్మ మీదనే కాక పూలబాల రాముడు కృష్ణుడు మీద కూడా  అనేక గీతాలను కీర్తనలు  వ్రాసాడు .   ఒక్క వాగ్దేవి పైనే   6 పాటలు వ్రాసాడు. పద్యాలకైతే లెక్కేలేదు.


 భారతవర్ష గ్రంధం  సరస్వతి ప్రార్ధనతో  ప్రారంభమవుతుంది . 

చ . అనువుగ వేడ భారతి  సత్కృప నొసంగె కవిత్వ శక్తతన్  
కినుకము వీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
 అనితము నీకృప ధన్యముగాదె సనాతని దివ్య బాసటన్  
మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్

సరిగా వేడుకొనగా సరస్వతి దయతో కవిత్వ సామర్ధ్యమును 
కినుకము వీడి  ( దయతో ) కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమును
అనుగ్రహిచెను. అనితము (సాటిలేనిది ) నీకృప ధన్యముగాదె
 సనాతని( సరస్వతి ) దివ్య బాసటన్ (గొప్ప సాయముతో) 
మనసులో పుట్టిన పద్యాలను మాలగట్టి తల్లి పాదములవద్ద ఉంచెదను.

అని ప్రారంభంలో వ్రాసి చివరలో గ్రంథ రచన ముగిశాక  పద్యాల కోసం వెనక్కి తిరిగి చూసుకోలేదు తరళ మత్తేభ శార్ధూల పద్యాలు సునాయాసంగా వ్రాసాను.


క. అమ్మకు దయకలి గినచో
కమ్మని తేనెల తలంపు కలమున బట్టున్
నెమ్మిక కలిగిన మదిలో
అమ్మయె కొలువ గయుండు అన్నియు తానై

భారతవర్ష లాంటి పెద్ద గ్రంథం రాసే ప్రతిభ నాకు లేదు. అంతా అమ్మ దయే అంటూ భారత వర్ష గ్రంథంసరస్వతి అమ్మ పాదాలవద్ద ఉంచిన ఒక పుష్పం మాత్రమే.అంటాడు పూలబాల

శార్ధూల మత్తేభ ఛందస్సు లో పద్యం రాద్దామనుకుని అలిసి పోయి బల్ల మీద తలవాల్చి పడుకుండిపోయాను. లేచి రాస్తే మొదటి రెండు పాదాలు వచ్చేసేవి. మిగితా రెండు పాదాలకి చుక్కలు కనిపించేవి. ఆమె పాదాలు పట్టుకునేవాడిని అప్పుడు వ్రాసిన పద్యమే ఇది

శా. పూదోట్ల న్దిరుగా డినాత లపులం బ్రోచేవు యేభాగ్య మో
పూదేనం తయున ద్దినాప దములన్ బుట్టేవు తాళంబు గా
స్వాధీనం బుగని మ్ముచంద మికనే ౙాల్వార పారాణిగా నీ
పాదాల ద్దెదని ల్వవమ్మ నిలునా భావాల వేదంబుగా.

రచనలో ఎప్పుడు కష్టం వచ్చినా సరస్వతి మీద కీర్తన రాసేవాడిని. క్రింది గీతం అటువంటిదే అంటాడు రచయిత పూలబాల

"శాంతమానసము నీయవే శారద, నీరద యాన నీదయ రాదా
శాంతమానసము నీయవే శారద, నీరద యాన నీదయ రాదా
కాలము వాలమై రణముకు పిలవ మిత్రుడు శత్రువై విషమును చిందించ
హృదయము రగిలించ జగములు ఇగిలించ .......
శాంతమానసము నీయవే శారద, నీరద యాన నీదయ రాదా "


పెళ్లి చూపుల సందర్భం లో పెళ్లి కూతురు పాడే వీణపాట


ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం

సస్య కేదారముల  పాఱెడి  సారం భవాబ్దినావిక గీతా సారం

విహసిత సుందర వదనం వంశీధర  వర  మదనగోపాలం 

విహసిత సుందర వదనం వంశీధర వర  మదనగోపాలం   

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం



ఛందస్సు కోసం సనాతనిని ఎలా వేడుకున్నానో అలాగే ఆధ్యాత్మిక భావనలు రాసేటప్పుడు దుర్గనే వేడుకున్నాను. విదిష అనే అమ్మాయి కథానాయికి. ఆమె ధ్యానం చేయడం ద్వారా ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం మొదలౌతుంది. ఈ కథలో ఆమె కి దుర్గ పూనుతుంటుంది. దుర్గ పూనిన ఆమెను వర్ణించే ఘటనల్లో నాకు ఒళ్ళు బరువెక్కిపోయేది . వేరే లోకంలోకి వెళ్లిపోయేవాడిని. ఆ వర్ణనలకు పాఠకులు కూడా పులకరించిపోయేవారు. దుర్గ బొమ్మకు చలనం వచ్చి గౌడ సోదరులని ఎలా సంహరిస్తుందో వర్ణించే ఘట్టంలో పాఠకులకు దుర్గ కనిపిస్తుంది. అంతటి దుర్గాస్ఫూర్తి తో వ్రాసిన భారతవర్ష గ్రంథం పాఠకుల గుండెల్లో దుర్గా మాతని ప్రతిస్టహింపజేస్తుంది.

సాహిత్య పరంగా చూస్తే భారతవర్ష గీతాలు శంకరాభరణం చిత్రంలో గీతాలతో పోటీపడే విధంగా ఉంటాయి/ భర్త అక్రమ సంబంధం కారణంగా విడిపోయి వంటరి తనం అనుభవిస్తుంది మీనాక్షి అనే ఒక గొప్ప ఇల్లాలు. స్వయం కృషితో సంగీత ప్రపంచంలో సూర్యుడు లా వెలుగుతున్నా సిరులెన్ని ఉన్నా వంటరి తనం తో విచారంగా ఉన్న ఆమె ఇంటికి కథానాయకుడు భారతవర్ష వెళ్లి ఆమెను అమ్మ అని పిలిచి తన పాడిత్యంతో ఆమెను అలరిస్తాడు. అతడు మీనాక్షి పుట్టినరోజునాడు పా డే వీణపాట

జగదానందకారకం నీ జననం   మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం

జగదానందకారకం నీ జననం,  మధుర సురరాగ  స్వర కల్ప సృజనాత్మకం

నీజీవన తత్వము జీవిత లక్ష్యము సృజనాత్మక సుమధుర సంగీతమూ

నీగానమె నీ గమనము, నీ గమనమె గరిమాగమ నిగమ ప్రయాణము 

నీ గానమున విఱియు నవరాగమూ  అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము  

జగదానందకారకం నీ జననం ... 


అంగయార్ కన్నె  పశ్చాత్తాపముతో  రాముని పై పాడినపాట  


నీలమేఘ శ్యామా రామా నీ మనసెట్లు తెలుసుకొందు  నన్నెట్లు మలచుకొందు   

రఘుకులతిలకా రామచంద్రమా  సుగుణము లొలకే  రాజచంద్రమా

నీలమేఘ శ్యామా రామా  నిను ఎట్లు  తెలుసుకొందు నామనసెట్లు తెలుపుకొందు

చల్లని చూపుల మెల్లని స్వామి  ఏ వనములలో తిరగను నీ కై, 

ఇలా అనేక పాటలు, పద్యాలు, సాహిత్య సరదాల మధ్య కదిలే కావ్యంలో రాజకీయం వికట్టహాసంచేస్తుంది సినిమా రంగం కంపుకొడుతుందికుటుంబ కథ కన్నీళ్లు పెట్టిస్తుంది పాండిత్యం చల్లని వెన్నెల కురిపిస్తుంది . శృంగారం మత్తెక్కించి మంటై మండుతుంది. ఆద్యాత్మికత ఆత్మను స్పృశిస్తుంది

నవరసాలతో ఘన కావ్య రచన చేసిన పూలబాల మనలో భాషే మన సంస్కృతి, మనలో భక్తే మనలో శక్తి అన్నాడు. అమ్మపై అచంచల భక్తి తో  రాసిన  భారతవర్ష ప్రబంధం చదవడం ఒక ఆధ్యాత్మికానుభూతి అంటున్నారు చదివిన పాఠకులు.  


 పతాక సన్నివేశం  - ముగింపు  గానం

 భారత వర్షం సారంగం పద తారంగం 

భారత వర్షం పద రంగం పద చదరంగం 

వినువీధి కెగసిన వీరతురంగం విశ్వమానవుని వీరంగం 

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

కౌముది లో కమ్మదనం కౌగిలిలో వెచ్చదనం

అనురాగముతో నీ మెడకి  పూసిన శ్రీ గంధం

రాగాలల్లిన ప్రణయ మారుతం , నీ మనసు కట్టిన  మంగళ సూత్రం

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

భారత వర్షం సారంగం పద తారంగం - 

భారత వర్షం పద రంగం పద చదరంగం -

కృతకర్మ కూర్చిన  ద్రుతవిలంబితం  

స్రుతి స్మృతి సంగమ రాగ చోదితం 


ఈ పాటలన్నీ  గొప్ప గాయనీ మణులతో పాడించి  ఆడియో వీడియో రూపంలో అందరికీ ఉచితంగా అందజేస్తున్నారు విజయవాడకు చెందిన  బహుభాషా కోవిదుడు పూలబాల.  ఈ పద్యాలను ధారణ చేసి , టీ  వీ కార్యక్రమాల్లో నూ   వేదికలమీద పాడి తెలుగు భాషతో అలరించి ఆకట్టుకుంటున్నారు పూలబాల      1265 పేజీల పెద్ద గ్రంధాన్ని చదవడం కష్టం అని 145 పేజీల చిన్న గ్రంధంగా కూడా వ్రాసి అనేక మందికి ఉచితంగా పంచుతున్నారు. ఎవ్వరు వేదిక ఇచ్చినా ఒక   గంట సమయంలో ఒక సాంస్కృతిక కార్యక్రమంగా నృత్య గానాలతో కవితలతో కథలతో ఒక రూపకంలా   ఉచితంగా భారతవర్ష ని ప్రదర్శించిచూపుతున్నారు/ 

 తెలుగు భాష భారతీయ సంస్కృతి పై అభిమానమున్న ఎవరైనా 9700877409 అనే నెంబర్ కి ఫోన్ చేసి పూలబాలకి ఒక అవకాశం ఇవ్వగలరు 


దేవుడు ప్రతి అమ్మాయికి తగిన వరుణ్ణి ఎక్కడో పుట్టించే ఉంటాడు అంటుంటారు కదా?  పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి అంటే ఇదే. మనం పిల్లలని రుణసృణాల బంధం అని నమ్ముతాం. ఇలా  భారతీయులు ఆధ్యాత్మికతను ఆలింగనం చేసుకుంటారు. మరి అదే ఆధ్యాత్మికత ఈ గ్రంధంలో గంధంలా కలిసి గుబాళి స్తుంది.  అందుకే భారతవర్ష ఆధ్యాత్మిక కావ్యం. ఆచార్య ఎన్ . వి కృష్ణారావు గారు అందుకనే భారతవర్ష ని "భారతీయ ఆత్మ" అన్నారు.  

నాస్తికులు పాశ్చాత్త్య విజ్ఞానం తమకు పూర్తిగా తెలియకున్నా భారతీయ విజ్ఞానాన్ని గెలిచేస్తుంటారు.  భారతీయ శాస్త్రాల ప్రకారం చెప్పే ఫలితాలు (పంచాంగం నుండి గ్రహణాలు ) ఆధునిక శాస్త్రీయ విజ్ఞాన ఫలితాలతో సరిపోతున్నాయి కదా. అందు చేత నాస్తికులు కూడా చదివి ఆనందించే గ్రంధం భారతవర్ష.   

స్థూలంగా చూస్తే విదిష వర్షలది ఒక జన్మ సంబంధంగా కనిపిస్తుంది సూక్ష్మ పరిశీలన చేస్తే అంటే నవలలో వివిధ భాగాలలో ఉన్న  విదిష ప్రస్థానాన్ని ఒకచోట చేర్చి చూస్తే విదిష వర్షలది ఒక జన్మ సంబంధం కాదు జన్మ జన్మల సంబంధం అని తెలుస్తుందిఅగోచర ఆధ్యాత్మిక ప్రయాణమే వారి ( అందరి)జీవితాలు.  అనేక జన్మలలోంచి, దేహాలలోంచి కాలాలలోంచి, వారి ఆత్మలు ప్రయాణం చేస్తుంటాయి. ఎహే ఆత్మలు లేవు ఏమీలేవని కొట్టి పారేస్తే చెప్పలేము. ఆత్మలని నమ్మబట్టే కదా ప్రపంచంలో ప్రతి మతంలో కర్మకాండలు ఉన్నాయి. బైబిల్, కురాన్ గీత కూడా ఆత్మలున్నాయని, ప్రునర్జన్మలు ఉన్నాయని నమ్మాయి కదా!   సరే నండి నమ్మాము. మరి వాటిని తెలుసుకోడం ఎలా ?

వెంటనే తెలియాలంటే కుదరదు. యోగసాధన ద్వారా ద్వారా తెలుసుకోవచ్చు. అందుకు సమయం వెచ్చించాలి, ఏకాగ్రత కావాలి,  పరిపక్వత రావాలి. అన్నిటికీ మించి యోగ్యతో యోగమో ఉండాలి. సంగీత సాధన మొదలుపెట్టిన అందరికీ సంగీతం అబ్బుతుందా? 

విదిషకి భవిష్య వాణి విద్య యోగ్యత ఉంది రాలేదు యోగం ఉండి  వచ్చింది. తల్లి ఆత్మ కనిపించడం వెనుక ఆమె (కృషి) యోగ్యత ఏముంది?  చనిపోయిన తల్లి  కనిపిస్తు న్నాదని చెపితే అందరూ ఆమె మానసిక స్థితిని శంకిస్తారు. ఆమె కూడా కర్మ కాండ  చేయించే బ్రహ్మగారిని ఆత్మలుంటాయా అని అడుగుతుంది. అమ్మ ఆత్మ కనిపించడం నిజం అని నమ్మడానికి కూడా ఆమెకి సమయం పడుతుంది.  ఆవిషయం తెలియగానే తండ్రి కూతురిని మాతనిచేసి భవిష్యవాణి  అని వ్యాపారం మొదలెట్టేస్తాడు. ఇది మామూలే కదా పేడ పిడకలకి డిమాండ్ ఉంటే బజాజ్ కంపెనీ, గాద్రెజ్ కంపెనీ అన్నే రంగంలోకి దిగుతాయి. దేనికి డిమాండ్ ఉంటే దానితోనే వ్యాపారం చేస్తారు.  కానీ ఈ వ్యాపారం ఆమెకి ఇష్టం ఉండదు "అమ్మ కనిపిస్తేనే భవిష్యవాణి చెపుతాను నాకు ఏ మహిమలు లేవు" అని చెపుతుంటుంది. పరిమళ బాబా దగ్గర ఏడుస్తుంది. మెల్లగా సాధనలోకి దిగుతుంది. నిద్రాహారాలుమాని సాధనలో రోజులు, వారలతరబడి ములిగిపోతుంది.   

                                     


          

 ప్రకృతి మూడు రూపాలతో ప్రకటితమవుతుంది. మొదటిది ఇంద్రియాలతో తెలిసికోబడే స్థూల ప్రకృతి. రెండవది ఇంద్రియాలకు అతీతమైన సూక్ష్మ ప్రకృతి. ఇది అంతర్గతమైనది, అత్యంత శక్తివంతమైనది. మూడవది మూల ప్రకృతి (spirit)ఇది  శాశ్వతం, స్థిరమైంది. ఇది సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారం. దీనికి వినాశనము లేదు. ఐతే అందరూ ఈ ఆధ్యాత్మిక విషయాలని నమ్మాలని లేదు. పాపులర్ అయిన విషయాలనే జనబాహుళ్యం నమ్ముతుంది. మతం బాగా పాపులర్ అయ్యింది కనుక దాన్ని అందరూ సులభంగా నమ్ముతారు.  విశ్వాసాలు  సమాజంద్వారా సంక్రమిస్తాయి.  మతం అనేది మన పూర్వీకుల డెడ్-ఎండ్ మార్గం. ఆధ్యాత్మికత వ్యక్తిగత మైనది. హింగోరి చెప్పినట్టు మతం అంతమైనప్పుడు ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది.మతం అనేది జైలు లాటిది. ఐతే ఎత్తైన జైలు గోడను దూకి తప్పించుకునే ఖైదీలు ఎంతమంది ఉంటారు? అలాగే మతంగోడ దూకి ఆధ్యాత్మికతలోకి ప్రవేశించే వారి సంఖ్య కూడా తక్కువ. కానీ విదిష ప్రవేశిస్తుంది.  

ఆరవది ఏడవవ అధ్యాయము మార్మికదర్పణ సాధన, విదిష సాధన గురించి చాలా  విషయాలు చెపుతుంది. అక్కడినుంచి విదిష వర్షలది జన్మజన్మల సంబంధం అని విదిషకి అవగతమౌతూ ఉంటుంది. యోగ సాధనలో  అనేక జన్మలు ఒక లిప్త కాలం ఆమె స్మృతి పథంలో మెరిసి పోతాయి.

"బాంబుల మ్రోత బెర్లిను పట్టణమున మ్రోగుచుండగ జనులంత పరుగు దీయ 

భీతి నొందగ పరుగిడి ప్రాణమొదిలె చూచిచూచిక ప్రియుని జాడలేక"


అనే తేటగీతి విదిష బెర్లిన్ లో పుట్టి చనిపోయినట్టు చెపుతోంది. పదకొండవవ శతాబ్దమందు కశ్మీర మందు మదనాభిరామ కుమార్తె  గా జన్మించి బిల్హణుని ప్రేమించిన యామినీ పూర్ణతిలక గాను,1590 లో తూర్పుగోదావరి ముంగండగ్రహారం చెందిన ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన పండితుడు జగన్నాధ రాయలుని ప్రేమించిన చక్రవర్తి షా జెహాన్ కుమార్తె యువరాణి లవాంగికా గాను 

ప్రాచీన గ్రీకుపురాణ వీరుడు, మానవాతీత సంగీత నైపుణ్యాలను కలిగిన ఆర్ఫియస్ ను  పెళ్లాడిన యూరిడిసి గాను. (అతను గొప్ప కవీశ్వరుడు. అపోలో ఓర్ఫియస్కు తన వీణను బహూకరించెను. యూరిడిసి వివాహమైన కొలది దినము లకే పాముకాటుతో మరణించెను.) 

జర్మనీదేశపు మహాకవిగా ప్రసిద్ధికెక్కిన గూఠను  1770 లో  కలుసుకొని  ప్రేమించిన పద్దెనిమిదేళ్ల ఫ్రెడెరిక్ బ్రియాగాను. (బ్రియా ఎదురుచూచుచు మరణించెను) 

విదిష ఆత్మ ప్రస్థానం విశ్లేషిస్తే ఆమె గ్రీస్ లో ఒకసారి, జర్మనీలో రెండుసార్లు, అమెరికా లో ఒక సారి భారతదేశంలోమూడు సార్లు పుట్టిందని తెలుస్తుంది.  గ్రీకు పురాణం కాలం లో 900 బి.సి లో గ్రీస్ లో ఒకసారి, 17వ శతాబ్దంలో  స్ట్రోబోర్గ్ లో ఒకసారి,19వ శతాబ్దం లో బెర్లిన్ లో రెండవ ప్రపంచయుద్ధ కాలంలో మరొక సారి, 15 వ శతాబ్దంలో రాయలు ఆస్థాన నర్తకి గా ఒకసారి  16 వ శతాబ్దంలో జహంగీర్ కుమార్తె లవంగిక గా  మరికసారి,  20 వ శతాబ్దంలో అమెరికాలో లో వ్యోమగామిగా ఒకసారి జన్మించిన విదిష 21వ శతాబ్దంలో మళ్ళీ భారతదేశంలోనే జన్మించింది. విదిష అన్ని జన్మలలో పండితులనే  ప్రేమించింది. ఆమె పాండిత్యాన్నేవలచిందా? పండితులని ప్రేమించిందా? విదిష దేవత ఐతే చనిపోయి నట్టేనా? మరింత ఆసక్తి కరమైన భారతవర్ష -2 లో చదవండి. 




3 comments:

  1. Wow. Bharatavarsha II. Will they meet in Bharatavarsha II?

    ReplyDelete
  2. Bharatavarsha II is not a book. It's life. I mean the readers feel like that.

    ReplyDelete
  3. Vidisha paandityaanni mechchi panditulani premistundi

    ReplyDelete