విజయవాడలో నేను, అనంతపురం జిల్లాలో మారుమూల పల్లె గణిగెరలో వారు. ఒక వైపు ప్రయాణం 12 గంటలు. నేను వెళ్లలేకపోయినా సహృదయులైన, మాతృ భాషానురక్తులైన యువకులు రవిచంద్ర, వెంకటేష్ భారతవర్ష కావ్యాన్ని భుజాల కెత్తుకొన్నారు. తెలుగు మీద పూలవర్షం కురిపించారు.
ఈ నెల 17 వ తారీకున (17th june 2023) మదర్ తెరిస్సా విద్యా సంస్థల వార్షి కోత్సవం సందర్భంగా ప్రపంచ రికార్డు పొందిన తెలుగు గ్రంధాన్ని సభకి పరిచయం చేశారు. అమ్మభాషని ఎందుకు వీడకూడదో అన్న నా సందేశాన్ని వినిపించి ఆ వీడియో ని పంపారు. నా మనసుని పులకరింపజేశారు. నా కళ్ళు తడిచేసారు.
వారికి వందనాలు.
తెలుగు కి జేజేలు.
No comments:
Post a Comment