Thursday, August 28, 2025

40 ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు

 పిల్లల పుస్తకాలతో మొదలుపెట్టి పీ హెచ్ డీ దాకా...

చాలామంది దృష్టిలో సినిమాలకి రాసినవారు గొప్పకవులు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్టు సినిమాలకి రాస్తేనే గొప్పకవి కాదు. నేడు పూలబాల అనువాద రచన ఏదేశమేగినా పీ హెచ్ డీ విద్యార్థులకు రీసర్చ్ కి ఉపకరిస్తోందని చెప్పారు. మరిన్ని నోబెల్ సాహిత్య బహుమతిని పొందిన నవలలను పూలబాల తెలుగులోకి అనువదించడానికి కృషి చేస్తున్నారు

నా రచనలు పీ హెచ్ డీ విద్యార్థుల రీసెర్చ్ కి ఉపయోగపడుతున్నాయి అని గొప్ప హెప్పుకుంటే సరిపోదు కారణభూతులైన వారిని స్మరించుకోవాలి అన్నారు పూలబాల

ప్రముఖ బహుభాషావేత్త సాహితీ వేత్త పూలబాల తన బాల్య మిత్రుడు దూసి సూర్యనారాయణ మూర్తి చిన్న నాటి స్నేహితులు, పార్వతీపురంలో ఒకే స్కూల్ లో కలిసి చదువుకుని 1980లో విడిపోయిన వీరు 2022 లో అనుకోకుండా కలిశారు

నా బాల్య మిత్రుడు మూర్తి లేకపోతే గుడివాడ రామారావు గారి లాంటి గొప్ప వ్యాపారవేత్త, సాహితీ ప్రోత్సాహకుడితో పరిచయం అయ్యేది కాదు. భారతవర్ష గ్రంథవిడుదలకు ఆర్ధిక సాయం అందేదికాదు. ఆ ఘనత నా బాల్య మిత్రుడు దూసి మూర్తి కె దక్కుతుంది. ముద్రణ పూర్తయ్యాక విడుదలవరకు నాతొ తిరిగి నా విజయానికి కారణం అయ్యాడు. నా విజయనానికి భారతవర్ష ఎంత కారణమో మూర్తి కూడా అంటే కారణం. ఇద్దరం ఒకే రంగు చొక్కాలు తొడుక్కుని వేదికమీద లక్ష్మీ పార్వతిగారితో నిలబడడం మరుపురాని సందర్భం అన్నారు పూలబాల.

ఎంత గొప్ప రచయితైనా, రాజైనా నిలబడడానికి భూమి కావాలి. భూమి అంటే ఆధారం. రాజుకి సైన్యం రచయితకి అభిమానం కరువైననాడు, రాజు రాజు కాడు , రచయిత రచయితా కాడు. మిలిలేది వల్లకాడు.

సమాజం ఒక వనం రచయితలూ కవులు, మొక్కలు తోటలు. తోటలు పూతోటలుగా మొక్కలు వృక్షాలుగా ఎదిగితే మంచిదే. "ఈ మొక్క వృక్షంగా ఎదిగితే నాకేంటి ?" అనుకోకూడదు. వనాలు వృక్షాలు అందరికీ పుష్పాలని ఫలాలని అందించి నట్టుగా అనేక రచతలు కూడా అందిస్తారు. వారందరికీ వందనాలు. ముఖ్యంగా పుస్తాకాలని ఎన్నడూ అమ్ముకొని రచయిత పూలబాల నిజమైన సాహితీ సేవకుడని సాహిత్య వృక్షం అని చెప్పచ్చు.

ఎన్ టీ యార్ అకాడెమీ అధ్యక్షులు అట్లూరి కృష్ణసతీష్ గారు, తెలుగు సాహిత్య ప్రాధాన్యతను గ్రహించి పూలబాల భారతవర్ష నవలకి ఆర్ధిక సాయంచేయడమే కాక పూలబాల రచించిన కాళహస్తీశ్వర శార్ధూల శతకాన్ని విని ఆస్వాదించి, మెచ్చి అట్లూరి మీడియాలో మరియు 360 డిగ్రీస్ ఛానల్ లో అవకాశం వచ్చేట్టు చేశారు.

రచయితలని ఆరోజుల్లో రాజులు. ఈరోజుల్లో మనసున్న మారాజులు ప్రోత్సహిస్తున్నారని అందరికి వందనాలని పూలబాల తెలిపారు. భక్తి , శృంగార, విప్లవ, మరియు (విదేశీ భాషల నుంచి)అనువాద సాహిత్య రచయిత ఫాస్ట్ న్యూస్ పాఠకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసారు.

ఒక రచనా ప్రాణాన్ని ఒక మొక్క తో పోల్చాడు పూలబాల. ఒక మొక్క ఎదగడానికి సాయం చేయడం చాలా మంచి పని. మొక్కలని తుంచడం వృక్షాలని నరకడం పాప కార్యం.

No comments:

Post a Comment

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...