Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, August 23, 2024

భారతవర్ష భారతీయ ఆత్మకు ప్రతీక - ఆచార్య కృష్ణారావు .

పుస్తకం చేతికి శోభ , మెదడుకి మేత , మనసుకి తోవ మొత్తంగా మనిషికి జ్ఞానం.

అటువంటి చేతికి శోభను చేకూర్చి, మేధను పెంచి, త్రోవను చూపించి, జ్ఞానం కలిగించి, చివరకు మోక్షం ప్రసాదించే ఆక్షర సాక్షాత్కారం భారత వర్ష గ్రంథం.
.
'భారత వర్ష' ' చక్కని వచన ప్రబంధం. ఆధునిక కాలంలో గ్రాంధికం రాయబడిన కావ్యం.

చక్కటి గద్యం , ఛందోబద్ధమైన పద్యాలు, సంస్కృత శ్లోకాలు , గీతాలు, మంచి వర్షనలతో నిండి వెలుగులీను తెలుగు కావ్యం.


భారత వర్షను చదివిన త ర్వాత మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి . ఇందులో ప్రేమ, శృంగారం, ఆధ్యాత్మక దృష్టి, ధర్మ ప్రబోధం, సంస్కృతి పరిరక్షణ, ఆధునిక, భాషా పోషకత్వం, శాస్త్రజ్ఞాన మున్నగు ఎన్నో అంశాలు ఆలోబింపజేస్తాయి.ఇన్ని అంశాలు ప్రక్షిప్తం చేయబడిన మానవతా ప్రబోధ కావ్యం భారతవర్ష. ఎన్నో పాత్రలు , మరెన్నో సందరాలలో, ఎన్నో సన్నివేశాలతో చదువరులకు ఉత్సుకతను కలిగిస్తూ సాగిపోయే రచన.
.
ఉత్తమోత్తము మైన భారతీయ సంస్కృతిని ఉ న్నతమైన తెలుగు భాషా సౌందర్యాన్ని అత్యున్నతమైన మానవతా విలువలను అత్యవసరమైన మనిషి ధర్మాన్ని తెలియ జేస్తూ గుర్తు చేస్తూ, వికసింప జేస్తూ హృదయ వైశాల్యాన్ని పెంచే కావ్యం - భారతవర్ష.
.
ఖారతవర్ష, విదిష, నంది ని, లకుమ, ఆరుణ తార, మీనాక్షి, రాఘవ , కేశవుడు, నాయుడు, మొదలగు వంద పాత్రలను అనుసంధానిస్తూ, మనవుని సకల లక్షణాలనూ స్పష్టంగా వ్యక్తీకరించిన మృహత్ గ్రంథం.
.
కథానాయకుడు భారతవర్ష ఉత్తమ శ్రేణి సంస్కారవంతుడు. భారతీయల సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని, భారతీయ శాస్త్ర జ్ఞానాన్ని, భారతీయ ఆధ్యాత్మిక చింతనను ఆశ్ర యించినవాడు. మనవ జన్మ సార్థకతను గుర్తించినవాడు, ఆచరణవాది అతి సామన్య స్థితి నుండి అత్యున్నత స్థాయికి చేరినా మనిషిగా కర్తవ్యం మీరని స్థితప్రజ్ఞుడు . ఎదుటి వారికి చేతనైన సాయం చేసే కారుణ్యమూర్తి. మనుషులందరూ బాగుండాలని సమాజం పురోగతిలో సాగలని కాంక్షించే మననతామూర్తి. అందర్నీ సమనంగా గౌరవించి, ఆదరించే ఉదారమూర్తి.
.
శాంతి, సహనం, ధర్మం, ధైర్యం, ప్రేమ, కరుణ , ఆధ్యాత్మికత అభ్యదయం, మోక్షం - అన్నీ కలసిన స్థిత ప్రజ్ఞతే భారతీయ ఆత్మ. ఆ ఆత్మమ ప్రతికగా నిలిచే పాత్ర భారత వర్ష. భారత వర్ష. అందరూ తప్పక చదవవలసిన కావ్యం
.
భారత వర్ష కావ్యం భారతీయ సంస్కృతిని, భారత ధర్మాన్ని, మాతృ భాషా ఒన్నత్యాన్ని ప్రకటించే భారతీయ దర్పణం.



భారతవర్ష  పూర్తిగా చదివి మూడు పేజీలు ఇచ్చిన గురువు గారు నాకోసం ఎంతశ్రమ తీసుకు న్నారో  కదా!
నాలాటి అనామకుడికి మీరు ఇంత  సమయం వెచ్చిస్తారని కలలోకూడా అనుకోలేదు. ముత్యముల వంటి  మీ పదాలు చూసి తెలుగు తల్లి నవ్వులనుకున్నాను. మూడు పుటల వ్రాసిన మీచేతులు తెలుగుతల్లి చేతి చేమంతులను కున్నాను.

                                      గురువుగారి చరణాలకు వర్ణమాలలో సుమమాల

- అన్యభాషల్లోవ్రాసినా  -  ఆనందం దొరకలేదు

ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ఇంగ్లీషులో పుస్తకాలు వ్రాసానుఅప్పుడు పొందిన ఆనందం  భారతవర్ష వ్రాసినప్పుడు కలిగిన ఆనందంతో పోలిస్తే చాలా తక్కువ

-  ఇప్పుడు కలిగిన ఆనందాన్ని చెప్పడానికి నాకు స్ఫురించిన ఒకే ఒక మాట

"బాల్యంలో మా అమ్మ  నన్నెత్తుకొని  ముద్దాడినట్టుంది.  

-  ఉన్న మాట చెప్పాలంటే మనసు ఊయలూగేస్తోంది.    

-

ఋషి వంటి ఆచార్య కృష్ణారావు గారి కరస్పర్శ  తన గ్రంధపు ఛందము పెరిగింది.  

-   -  

ఎగ్గులు ( దోషాలుఏఱుగొని ( వరద ప్రవాహంలో కొట్టుకొని పోవు) గ్రంధం గంధం పూసుకొంది

-   -  

ఒనరారు పదములతో ఎనలేని ఓర్పుతో  ఓరుదీర్చి మీరిచ్చిన  అక్షరదీవెన ముందుమాట

అం అః     అంతాయత్తైన(సొంపైన ) మీ ముందుమాట  నాకు అందుమాటా

అందుకే 

మందాక్రాంతమందు గురువర్యులకు పూలబాల పాదాక్రాంతము  

UUU     UII         II          UUI     UUI   UU

శ్రీమంతం  బౌనెన    రుగన      పత్రంబు  లేకాంచ  చిత్త 

మేమందా రంబగు    చదవ     నామ్రేడి    తంబౌగు  ణంబు             

హేమంబే  యంచుతొ లగగ    దాహేఠ    ముల్లాస మెల్ల  

ఆమంత్రి  తంబౌము  దముగ   తెల్గంద   మేలెకృ  తినే

శ్రీమంతంబగుపత్రములను చూచిన మనస్సు ఆనందమును పొందుచున్నది.

 మీరు వ్రాసిన మూడు పత్రములనూ తెలుగందం పరిపాలించుచూ ఆనందమును ఆమంత్రించుచుండగా (నాలో) హేఠము తనంత తానే తొలగి పోయెను.  

Thursday, August 22, 2024

అమ్మ దయ ఎలా ఉంటుందో ఒక్క పద్యంలో

అమ్మ దయ ఉంటే కవి పడుకున్న కలం రాస్తుందనే పద్యం .



.

క. అమ్మకు దయకలి గినచో
కమ్మని తేనెల తలంపు కలమున బట్టున్
నెమ్మిక కలిగిన మదిలో
అమ్మయె కొలువ గయుండు అన్నియు తానై

.
భారతవర్ష లాంటి పెద్ద గ్రంథం రాసే ప్రతిభ నాకు లేదు. అంతా అమ్మ దయే అంటూ భారతవర్ష సరస్వతి అమ్మ పాదాలవద్ద ఉంచిన ఒక పుష్పం మాత్రమే. అన్నారు పూలబాల.

భాషే మన జాతికి నెత్తురు - ఫ్రమ్ ది డైరీ ఆఫ్ పూలబాల

మనకి మన సంస్కృతి కి బంధాలు ప్రబంధాలే.


భాష కోల్పోయిన సమాజం తన ఉనికిని కోల్పోతుంది.

ప్రబంధం అంటే సంస్కృతానికి మాత్రమే చెందిన శైలి. అంటే మన ప్రాచీన భారత శైలి (ఇండియన్ స్టైల్) వేదాలని జర్మన్ లోకి అనువదించిన మేక్స్ ముల్లర్ అన్నట్టు మానవులకు తెలిసిన మొదటి గ్రంధం ఋగ్వేదం. అంటే సంస్కృత బాష ఎంత ప్రాచీనమైనదో చెప్పనక్కరలేదు. సంస్కృతాన్ని ఒక పథకం ప్రకారం నాశనం చేశారు. ఒక బాష నశించిపోతే ఆ లోచనా విధానం ఇంకా జీవన విధానం సమూలంగా మారిపోతుంది. సంస్కృతం అడుగంటి పోయిన తర్వాత భారతదేశానికి పట్టిన దుర్గతి గురించి తెలుసు కుంటే హృదయం ద్రవిస్తుంది.

తెలుగు భాషను పూజకు పనికిరాని పువ్వును చేశారు. చదువుకి పనికి రాణి భాషని చేశారు. తరువాత నిత్య జీవితంలో కూడా పనికి రాని భాషగా తెలుగు భాషను చేట పెయ్యిని చేశారు. ( గడ్డి కూరిన చనిపోయిన దూడ పెయ్యి ). హేపీగా జాలీగా ఎంజాయ్ చెయ్ రా. ఇలాటి ఇంగ్లీష్ మాటల తో పాటలు. ఇంగ్లీష్ ట్యూన్స్ కి తెలుగు పాటలు రాయడం. చివరకు చికుబుకు చికుబుకు రైలే అంటూ ఇంగ్లీష్ స్వరం తో తెలుగు పాట. తెలుగు మాట బాణీ స్వరం ఏవీ లేవు. దీనికి తోడు ఎకాడ , (ఎక్కడ ) ఏం దుకు ( ఎందుకు ) అంటూ మాటలు. భాష కోల్పోయిన సమాజం తన ఉనికిని కోల్పోతుంది.
.
వినోదం (సినిమా టీవీ) నేటి మన భాష, ప్రవర్తనను ప్రభావితం చేస్తూ ఉంటే మన భాష మన సంస్కృతిని ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే భాష సంస్కృతికి పునాది. ఎందుకంటే నమస్కారం అనే మాట మన తెలుగుజాతి మర్చిపోయి చాలా కాలం అయింది దాంతో పాటుగా సంస్కారాన్ని కూడా మర్చిపోయి పిల్లలు తమ కంటే చాలా పెద్ద వాళ్ళని వృద్ధుల్ని కూడా హాయ్ అని పలకరించడం ఇంటికి వచ్చే అతిథి వెళుతూ ఉంటే బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పమ్మా అంటూ తల్లిదండ్రులే పిల్లల్ని పోరు పెట్టి మరి నేర్పిస్తున్నారు. ఉంటాము, వెళ్లి రండి అనే మాటలు పోయి బాయ్ బాయ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. క్షేమంగా వెళ్లి రండి అనడానికి ఇష్టపడటం లేదు హ్యాపీ జర్నీ అంటున్నారు. ఓరి దేవుడా అంటే నా మోర్దా కాబోలు ఓ మై గాడ్ అంటున్నారు. మన మాట మన సామెత మన తత్వము మన వేషము ఇప్పుడు కనిపించవు మరి ఇవన్నీ ఏమైపోయాయి. ఒగ్గు కథ బుర్రకథ హరికథ నాటకము నవల ఉన్నప్పుడు భాష ఇంత నాసిగా లేదు. భాష చింత చెట్టు లాగా గట్టిగా ఉండేది. ప్రబంధాల కాలంలో అయితే మర్రి చెట్టు లాగా మహావృక్షంగా ఉండేది . ఉన్నత భాష కథా విలువలు కలిగిన సాహిత్యం ప్రబంధం. మర్రిచెట్టు లాంటిది . మనకి వృక్షాలు ఎంత అవసరమో ప్రబంధాలు అంతేఅవసరం.

Wednesday, August 14, 2024

వాయిస్ అఫ్ పూలబాల

అచ్చు డిస్కవరీ ఛానల్ వాయిస్ తో దుమ్ము లేపుతున్న తెలుగుగోడు.

అనేక ప్రభుత్వ , ప్రయివేట్ ప్రకటనలకు విద్యా వైద్య సంబంధిత ప్రచార వీడియోలకు,షిరిడి , సత్యసాయి ధార్మిక సంస్థలకు, జీవిత చరిత్రల వీడియోలకు స్వరాన్ని సమకూర్చి,న పూలబాల ఇలాంటి స్వరానికి పేజీకి 5000 ఇస్తారని "వాయిస్ ఈజ్ ఆ బిజినెస్ టూల్, " అని అంటున్నారు



నేర్చుకోవడం ఎలా ?

ఇంగ్లిష్ డిక్షనరీ సీడీలకు, ఇంగ్లిష్ నేర్చుకునే సీడీ లకు రచన వాయిస్ ఓవర్ గా స్వర సహకారాన్ని అందజేసిన పూలబాల తన అనుభవంతో "డైనమిక్స్ అఫ్ ఇంగ్లీష్ స్పీచ్ " అనే పుస్తకాన్ని రచించారు.

పుస్తకంలో ఏముంటాయి ?

44 ఆంగ్లశాబ్దాలు , వాటిని ఉత్పత్తి చేస్తే విధానం , అభ్యాసం చేసే క్రమం , వాయిస్ మోడ్యు లేషన్ , అమెరికన్ ఏక్ సెంట్ , బ్రిటిష్ ఏక్ సెంట్ ఎక్సెర్ సైజెస్ ఇందులో ఉంటాయి. తాను వ్రాసిన "డైనమిక్స్ ఆఫ్ ఇంగ్లిష్" అనే పుస్తకాన్ని, పుస్తకంతో పాటు శిక్షణ కూడా అనేక స్కూల్స్ లో ఉచితంగా కూడా ఇచ్చారు. విద్యాసామాజిక రంగాలలో అనేక మందికి ఉచితంగా సేవలందిస్తున్న పూలబాల కోరితే ఎవరికైనా ఈ పుస్తకాన్ని ఉచితంగా ఇస్తానని అన్నారు.

అల్ ఇండియా రేడియో లో అనేక ఇంగ్లీష్ టాక్స్ ఇచ్చిన పూలబాల ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లిష్ మరియు జాపనీస్ ఆరు బాషలలో ఏకకాలంలో మాట్లాడే పోలీ గ్లోట్ ( బహుభాషి ) ఆరు రకాల స్వరాలతో ఇంగ్లీష్ మాట్లాడే ఈ ఆరు భాషల పోలీ గ్లోట్ కి. మన అచ్చ తెలుగు సైనికుడికి భారతవర్షకి, ఆయన స్వరం నచ్చితే ఒక లైక్ వేసుకోడం మర్చిపోకండి.

Sunday, August 11, 2024

ఇంగ్లీష్ కి ఏమైనా కొమ్ములున్నాయా ? -

ఇంగ్లీష్ కి ఏమైనా కొమ్ములున్నాయా ? - విజయవాడలో (బెంజ్ సర్కిల్ వద్ద) తొలి మరియు అతిపెద్ద ఫారెన్ లాంగ్వేజెస్ స్కూల్ డైరెక్టర్, బహుభాషా కోవిదుడు, బహుళ గ్రంథకర్త పూలబాల.
.
ఇంగ్లీష్ మీడియం కుట్ర - చదువంతా అదే మీడియం లో ఎందుకు ?
జీవితాంతం ఈ బానిసత్వం ఎందుకు ? ఇది కుట్ర మాత్రమే.
నా అభిప్రాయం కాదు అనుభవం చెబుతున్నాను.

నావద్ద ఫ్రెంచ్ జర్మన్ వంటి భాషలను రెండు లేదా మూడు నెలలు నేర్చుకుని విదేశాల్లో చదువుకో గలుగు తున్నారు ఉదోగాలు చేయగలుగుతున్నారు. జర్మన్ లేదా ఫ్రెంచ్ మీడియం లో ఎవరూ చదువుకోడం లేదు.


తెలుగు మాట్లాడడానికి అనుమతించని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలని ఇప్పటికీ చూస్తున్నాం , మాట్లాడితే పిల్లవాడి మెడలో తెలుగు మాట్లాడను అని బోర్డు కట్టి ఊరేగించిన పాఠశాలలనీ చూసాం. తెలుగు తల్లి నోటికి తాళం వేసి తెలుగువాడిని కాపలాగా పెట్టి వెళ్లిన ఇంగ్లిష్ వాడిని , కోట్లాది మంది భారతీయులను చంపిన ఇంగ్లీష్ వాడిని స్మరిస్తున్నాం, వాడి బాష నేర్చుకుని తరిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోపోతే ఉద్యోగం రాదు అని చదువు ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నాం.

ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే ఉద్యోగం మాట అటుంచి ఇంగ్లిష్ కూడా సమంగా రాడంలేదు. ఆంగ్ల నాగరికతా వ్యామోహాన్ని సినిమా తో పెంచుతున్నాం. వచ్చిన ఆవగింజంత ఆంగ్లభాష ను గుమ్మడికాయంత చూపిస్తూ జాతి మొత్తం వాళ్ళ లా వేషాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇదంతా చూసి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కూడా బానిసత్వం వదల్లేదనిపించి . అందుకే అచ్చతెలుగులో భారతవర్ష అనే గ్రంథం రాయడం జరిగింది.

మన భాష మన ధర్మము. ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనమని తెలియజెప్పి అట్టి ధర్మమునకు మూలము సంస్కృతి అని, ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజెప్పే సరళగ్రాంధిక ప్రబంధం , వేయి కవితల సమాహారం , అచ్చతెలుగు మాధుర్యం భారతవర్ష.
.
పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధకావ్యం భారతవర్ష.

"భారతవర్ష " ఇంత పెద్ద గ్రంథాన్ని (1265 పేజీలు ) చదవడం కూడా అంతసులభం కాదు అందుకే ఒక సాంస్కృతిక కార్యక్రముద్వారా సంగీత నృత్త్యములతో వృత్త పద్యములతో ప్రదర్శిస్తే తెలుగు భాషా మాధుర్యమును ఆస్వాదిస్తారు కదా.

"ఇలా క్షీణిస్తున్న తెలుగు భాషకు అడుగంటుతున్న సంప్రదాయాలకు ఊపిరిలూదడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న తరుణంలో తెలుగు వారి స్పందన కరువయ్యింది . ఒక సాంస్కృతిక కార్యక్రమానికి స్కూల్ లో ఒక గంట అవకాశం ఇవ్వమని యాజమాన్యాలని కోరినప్పుడు చీదరించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలావుందంటే ఫారిన్ లాంగ్వేజెస్ అంటే పరిగెత్తుకొస్తున్నారు తెలుగు ఊసెత్తితే తల తిప్పుకుని పోతున్నారు. " అంటున్నారు ఈజీ ఫారెన్ లాంగ్వేజెస్ వ్యవస్థాపకులు పూలబాల.

Friday, August 9, 2024

వింటే ఫిదా పాటకు జీవం పోసిన గాయని

ప్రముఖ సంగీత విద్వాంసులు ఎన్‌సీహెచ్‌ బుచ్చయాచార్యులు వద్ద కర్ణాటక సంగీతంలో నేర్చుకుని  అనేక  సంగీత కార్యక్రమాలలో పాడి  శ్రోతల మనసులను గెలుచుకున్న ఈ గాన సరస్వతి   పేరు రుగ్వేదం పద్మశ్రీ. 2024 లో మార్చి 8 వ తారీకున విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని  పురస్కరించుకొని స్వరలయ సంస్థ ఆధ్వర్యంలో  పద్మశ్రీ నాన్‌ స్టాప్  గా  116 మంది తెలుగు సినీ నేపధ్య గాయనీమణులు ఆలపించిన గీతాలను ఏకగళంతో ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు విదేశాల్లోను కూడా తెలుగు పాటలను వినిపించి కీర్తి గడించిన ఈమె  భారతవర్ష పాటలను అద్భుతంగా ఆలపించిశ్రోతలను అనేక సార్లు  మంత్రం ముగ్దులను చేశారు.  పద్మశ్రీ  గారు  భారతవర్ష పాటలకు ప్రాణం  పోశారు  ఆమె భారతవర్ష పాటలు  పాడడం నిజం గా నేను చేసుకున్న అదృష్టం అన్నారు భారతవర్ష గ్రంథ రచయిత పూలబాల.


దుర్గమ్మను చూచిన అనుభూతి కలిగించే - కృష్ణశ్రీ  పాట. 

 భారతవర్ష గ్రంథానికి  అందం, కీర్తనలకు కీర్తి  - కృష్ణశ్రీ .  

పిన్న వయసులోనే  దుర్లభమైన  గాత్ర  మాధుర్యాన్ని, కీర్తిని  ప్రతిష్టలను ఆర్జించిన గాయనీ మణి కృష్ణశ్రీ.   ఈ గాయని గురించి రెండు మాటల్లో చెప్పాలంటే  గొంతులో నిండా తీయని రాగాలు,  ఇంట్లో నిండా  బంగారు పతకాలు అదే  మన ఋగ్వేదం కృష్ణశ్రీ.  అక్కతో కలిసి వచ్చి భారతవర్ష లో శాస్త్రీయ గీతాలని పాడి పులకరించే లా చేస  ప్రతిభ ఆమెకు ఉంది.   గొంతు లో రాగాలు , ఇంట్లో పతాకాలు చాలా మందికి ఉంటాయి గుండెల్లో ప్రేమ  లేకపోతె ఒక చిన్న లైక్ కూడా కొట్టలేము.  ఇక్క డ అమ్మాయి చిన్న పిల్ల. నాన్న అనుమతి లేనిదే ఆ అమ్మాయి అగ్గిపెట్టి కూడా అందించదు.    

"పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి ...   ఈ డైలాగు ఎక్కడో విన్నటుంది  కదూ.  ఈ డైలాగుని వేదికపై చెప్పడం  గొప్పకాదు   విని చప్పట్లు  కొట్టేసి తమ పని చూసుకోడం గొప్పకాదు.   నేటికాలంలో అలాంటి వాళ్ళే  ఎక్కువ  ఆ మాటను మనసులో పెట్టుకుని ఆచరణలో పెట్టేవాళ్లు బహు తక్కువ  వాళ్ళే మహానుభావులు,  కర్మ యోగులు.  అటువంటి వారిలో ఒకరు ఋగ్వేదం కిషోర్ గారు.   కృష్ణ శ్రీ  నాన్న గారు.  వేద సంప్రదాయాలను  , సనాతన ధర్మాన్ని డైలాగుల్లో కాకుండా  చేతల్లో చూపించే మనిషి.   "అందుకే భారతవర్ష గ్రంథంలో  శాస్త్రీయ సాహిత్యాన్ని తన చేయి అందినంతవరకు పైకెత్తారు." అన్నారు రచయిత పూలబాల. 

సనాతన ధర్మానికి  సనాతన భాష, సాహిత్యం, సంప్రాయాదాయం చాలాముఖ్యం. అలనాటి పురాతన సంస్కృత కావ్య సంప్రదాయమే  ప్రబంధం.   భారతవర్ష  అనే తెలుగు గ్రంథం  ఈ కోవకుచెందినదే. ఉన్నత బాష  కథా విలువలున్నదే  ప్రబంధం.  భారతీయ సంస్కృతి ఇందులోనే దాగి ఉంది.    

నేటి తరం దారి మళ్లిన  హింస్మాత్మక ఆంగ్ల చిత్రకథల నకళ్లను చూసి దిగజారిపోతున్నాదని  భారతవర్ష ప్రబంధం వ్రాయడమేకాక   ఒక జీవిత ధ్యేయంగా   పెట్టుకుని  దానిని తెలుగు వారికి  చేరడానికి  కృషి చేస్తున్నారు వెంకట్ పూలబాల.   సినిమాతీస్తే మరో శంకరా భరణం లా ఉంటుంది. తెలుగు వారు ఆదరిస్తే అంత  కన్నా బాగుంటుంది.   

 నాటి శాస్త్రీయ సాహిత్యాన్ని   శాస్త్రీయ సంగీతాన్ని ఆదరిస్తారా ?  

ఇంకా అలాటి మనసున్న మహానుభావులున్నారు. 

ఎందరో మహానుభావులు  అందరికి వందనాలు.         

Wednesday, August 7, 2024

Rapes around the world