Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, January 26, 2024

చెత్త వెధవలను తయారు చేసే చదువు

చదువు ఎందుకురా అంటే జ్ఞానం కోసం అంటాడు పైకి.   అంతా అంతా  కపటం.  బట్టి పట్టయినా,  కాపీ కొట్టినా పైరవీలు చేసైనా ధ్రువీకరణ పత్రాల మీదే దృష్టి అంతా.  కాకి కళ్ళు ఎప్పుడూ ఎండికలమీదే  ముష్టివాడి కళ్ళు  ఎప్పుడూ ముద్దమీదే తెలుగువాడి కళ్ళు  కెప్పుడూ ఉద్యోగం మీదే . 

క.  ముష్టికి  వచ్చిన మనిషి 

కిష్టము ఏమ ను  నుముద్ద  కేడ్చును  గానీ        

ఇష్టము లేనిది జ్ఞానము     

స్పష్టము  మార్కుల ఏడ్తురు  చదువరు లిట్లే   

నువ్వు తినడానికి ఉండి చదువుకుంటూ  లేదా కులవృత్తి ఉండి చదువుకుంటుంటే అప్పుడు చెప్పు చదువు  జ్ఞానం కోసం అని, పొట్టతిప్పలని  జ్ఞానం కోసం  అని చెప్పినా ఎవరు నమ్ముతారు ?

డబ్బులకోసం చెత్త  సినిమాలు తీస్తూ సినిమా కళ అని చెపితే  నమ్ముతారా? 

చెత్త సినిమాలు తీయడం కంటే  పిల్లలని చెత్త వెధవల్లా  తయారు చేయడం  ఇంకా తప్పు.    

చెడ్డ  తల్లి తండ్రులు  చెత్త చదువు వెరసి చెత్త వెధవలను తయారు చేసే చదువు  తయారు చేస్తున్నారు .

ఇంగ్లీష్ తెలుగు కంటే గొప్ప బాష అని చెప్పడం ఏంటి ?

ఇంగ్లిష్ చదువుకోకపోతే ఉద్యాగాలు రావని బెదిరింపు ఏంటి ? 

అసలే మిచదువుకున్న ఉద్యాగాలు రాడంలేదంటూ ఏడుస్తూ 

ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలి అని చంపడం ఎందుకు ?




Sunday, January 21, 2024

అంబేద్కర్ కాంట్రావర్సీ

అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసాడా ? దాన్ని రాయడం అంటారా?

షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు అంటాము. ఆ లెక్కలో చూసుకున్న రాజ్యాంగ ధర్మాసనం అధ్యక్షుడు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన రచన కాబట్టి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ కి ఆ ఘనత దక్కాలి కదా?

1950 రాజ్యాంగం డ్రాఫ్ట్ ను తయారు చేయడంలో 286 మంది పాల్గొన్నారు అని ఖచ్చితంగా సమాచారం ఉండగా  తాజ్మహల్  కట్టిన కూలి వాళ్ళ పేర్ల ను  తీసిపారేసినట్టు  వాళ్ళ పేర్లను తీసిపారేసి అప్పటి భారత అధ్యక్షుడు, రాజ్యాంగ ధర్మాశనం అధ్యక్షుడు  బాబూ రాజేంద్రప్రసాద్ పేరునుకూడా  కరివేపాకులా తీసిపారేసి అంబేద్కర్ ఈజ్ ద సోల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టి ట్యూషన్" అని  అంబేద్కర్ ని  ఎందుకు అంతగా ప్రచారం  చేస్తున్నారు? 

కమలా చౌదరి


ఒక్క బోయ మాత్రమే పల్లకీ మోయగలడా ?

ఒక్కడే మోసేసాడు అంటున్నారు. అది సాధ్యమా ? అలాగే ఉంటుంది అంబేడ్కర్ ఒక్కడే రాసాడంటే. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసాడు. దాని ముందూ వెనక ఏమీ ఉండదు. రాజ్యాంగ రచనలో 286 మంది పాల్గొన్నారు
రాజ్యాంగం రాయడంలో 15 మంది మహిళలు ఉన్నారన్న సంగతి తెలుసా?

అబ్బే వాళ్ళు లెక్కలోకి రారు. వాళ్ళ గురించి మనం లెక్కలోకి తీసుకోకూడదు. గొప్పతనం అంతా అంబేడ్కర్ కే ఆపాదించేద్దాం. అంబేద్కర్ ని అడ్డుపెట్టుకుని మన ప్రయోజనాలు మనం చూసుకుందాం.ఈ ఉద్దేశంతోనే మిగితా రాజ్యాంగ రచయిత లనందరినీ చీకట్లోకి నెట్టి అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగ నిర్మాత అనే ప్రచారం జరిగింది. నిజానికి అంబేద్కర్ ఒక్కడే కలం కాగితాలు పుచ్చుకుని ఒక బల్ల వద్ద కూర్చొని రాత్రీ పగలు రాజ్యాంగం రాసాడని అర్ధం వచ్చేలా ప్రచారం చేశారు.

నిజానికి ప్రచారాలన్నీ ఇలానే ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ సినిమా. సినిమాల్లో ధనికులుగా మారిన నటులను పడే పడే చూపిస్తూ వారు కేపిటలిస్టులు గా మారి తమ చిత్రాలను తమ బిడ్డల చిత్రాలను నిర్మించుకుంటూ చెత్త కథలతో సమాజ వినాశనానికి యువత పతనానికి కారణం అవుతున్న వారినే సూపర్ స్టార్, మెగా స్టార్ లగా చూపిస్తున్నారు. కేపిటలిస్టులు గా మారిన కళాకారులు ప్రతిభావంతులైన కళాకారులను ఎంతమందిని ఎలా అణగ దొక్కుతున్నారో చూపిస్తే వారిలో ఉన్న నిజమైన కళ బైటబడుతుంది. సినిమాలు తీసి రోడ్డునపడ్డ నిర్మాతల కుటుంబాలు వారి పిల్ల బ్రతుకులను చూపకుండా డబ్బులున్న నలుగురు నటనిర్మాతల వైభవాలని ప్రచారం చేస్తూ చిత్రసీమని అంటే డబ్బే డబ్బు అని వ్యామోహం సృష్టించారు. ప్రచారాలు ఇలా ఉంటాయి. అసలు నిజాలు చెప్పకుండా అతిప్రచారాలతో వ్యక్తి పూజకు తెరతీస్తున్నారు వారి పాదాలకు మోకరిల్లే లా చేసుకుంటున్నారు. అంబేద్కర్ విషయంలో కూడా జరిగింది ఇదే. ఆయన కన్నా తోపులు ఎంతో మంది ఉన్నా ఆయనే అందరికి కన్నా గొప్పవాడని, ఆయన ఒక్కడే రాజ్యాంగాన్ని రాయకున్నా ఆయనే రాసేశాడని ప్రచారం చేసారు.


నిజానికి రాజ్యాంగ రచన అని అనకూడదు. అనేక దేశాల రాజ్యాంగాల ను లో చట్టాలను తీసుకుని మన రాజ్యాంగ తయారు చేశారు అంటే రచించినట్టు ఎలా అవుతుంది ? మన రాజ్యాంగం కాపీ రాజ్యాంగం అని మనకి తెలుసు కదా. 60 రాజ్యాంగాలను తీసుకొని అనేక మంది అభిప్రాయాలని తీసుకుని సవరిస్తూ పోగా సుమారు 3 సం. (2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు) పట్టింది. 286 మంది రాజ్యాంగ రచనలో పాల్గొన్నారు అందుకే రాశారు అనేకంటే కూర్చారు అనడం సబబు. కానీ రాజ్యాంగ కూర్పులో లేదా నిర్మాణం లో పాల్గొన్న 15 మంది మహిళలు లు కూడా ఉన్నారు. అందులో కమలా చౌదరి ఒకరు.


కమలా చౌదరి

ఆమె అమెరికా మిచిగన్ యూనివర్సిటీ నుంచి పీ. హెచ్. డీ. చేసి ఐ. ఐ .ఎమ్. ప్రొఫెసర్ గా, రీసెర్చ్ సెంటర్ లకి డైరక్టర్ గా, హార్వర్డ్ విసిటింగ్ ప్రొఫెసర్ గా, ఇంకా అనేక ఉన్నత పదవులలోప్రకాశించిన సంగతి తెలుసా ?

లీలారోయ్

మహిళలకి ప్రవేశం లేని దాకా యూనివర్సిటీలో ప్రత్యేక అనుమతితో చదువుకుని వాళ్ళని ఎంత ప్రభావితం చేశారంటే, ఆ యూనివర్సిటీ లో ఒక భవనానికి ఆమె పేరు పెట్టారు.

సరోజినీ నాయుడు

స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన రచనలు పద్యాలద్వారా సమాజాన్ని ప్రభావితం చేసి ఇండియన్ నైటింగేల్ గా కీర్తికెక్కి సరోజినీ నాయుడు కూడా రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు.

రాజ్యాంగ ధర్మాసనం కావాలని 1935 లో బ్రిటిష్ వారిని కోరింది రాజాజీ. బ్రిటిష్ వారు దానిని 1940 లో అంగీకరించారు. రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్ రాజాజీ కి ఎందుకు ఇవ్వకూడదు?

బీ. ఎన్. రావు మొట్టమొదటి రాజ్యాంగ డ్రాఫ్ట్ ను తయారు చేశారు.
రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్
బీ. ఎన్. రావు కి ఎందుకు ఇవ్వకూడదు?

మహాభారత రచయిత వ్యాసుడు అంటాము వినాయకుడు అనం కదా!





Saturday, January 20, 2024

దేశభక్తి - ధార్మిక పద్యమాల

 క . అరువు  గధార్మి   కతనిడ   

పరువు గలిగి  నవారె  వ్వరును  చేప 

ట్టరవుగ   అమ్మను దెచ్చిన             

బరువే  కదఅ  మ్మమనకు   బంధము  కాదా.


క . అత్తను చల్లగ జంపెను మొత్తము అడ్డుతొ లగించ మొగుణ్ణి జంపెన్ గుత్తగ దేశము నందున పెత్తన మువెల గబెట్ట బుద్దులు పుట్టెన్


క. దేశము తమసొ    త్తనుకొని       

ఆశలు నెరవే   ర్చమంచు  ఆఱుతురు కానీ   

పాశము ఎఱుగరు నీచులు  

కోసుగ  ఎగబడి  తిందురు  కోలము లల్లే    


క. జాతిని  దోచిన జారులు 

తాతల  కుత్తుక  లుకోసి  తప్పుడు  దారుల్      

నేతలకు  నేర్పిరి  అనువుగ    

 జాతిని   ముక్కలు  గచేసి  జారిరి జారుల్  


క. మౌనము   మనసు   కిశక్తి    

గానము  మనసు   కిరక్తి    కల్గును చేసే    

దానము   ముక్తిని ఇచ్చును          

ధ్యానము  ఇచ్చును విముక్తి    దారిని చూపున్ 


క. కామము  పండితు  నైనను 

పామరు  నైనను  పశువుగ మార్చును  సర్పం    

బై మరి  కరవగ బుట్టుగ  

రిమ్మతె   గులుద   శకంఠు   రీతిశ  మించరే    



క. బీరము లెన్నియొ పలికిన

ఓరగ అతివ  లుచూడ  ఒక్కింత  తైనన్  

ఓర్వరు   చలచి  త్తులెమగ   

వీరులు  అతివల కనగనె   వీగరె రీతిన్             


                   

క. కొప్పున    మల్లెలు  దాల్చుచు 

గుప్పున ఒకగో  టుగత్తె   గొప్పగ రాగా               

తప్పక   తలల   న్నియును           

తిప్పరె  చొక్కము నుచూడ    తిమ్మిరి రాదా  


  క  చూపులు  కలవ   గ కను 

    పాప లు మైమరి చివలపు  పాటలు  పాడె న్  

    చేపక  నులు కం  టికొలను     

    లోతుల   కివెడ  లిబాహ్య  లోకము  వీడెన్ 



క. వెనకటి   కెవ్వ డొ   జెప్పిన 

ఘనమగు మాటల ను దెచ్చి ఘాటుగ జెప్పన్ 

ఒనగూ రునదే   మున్నది 

 అనుకూ  లము కానివిద్య ఆత్మను చంపున్ 


 (అనుకూ  లముకా  నిమాట  అత్తరు పూతే)   


 

క. చిప్పను చేతిన బట్టుకు 

గొప్పగ విద్యను వెలుగుని గోటుగ జెప్పు చు 

తుప్పల సిగ్గునొదిలిన 

చిప్పకు తప్పక నుబుట్టు  సిగ్గులు చూడన్  


క. చేతిన  చిప్పను బట్టుకు 

మూతిన మీసము నుదిప్పి ముష్టికి రాగా   

చూతురె   ట్లతడిని అట్లే 

చూతురం  దరువి  ద్యవెలుగు  చూపున  నగన్ 


క. గింజల కాసప డునట్టి   

లంజల  కొడుకు  లఓట్లు లంపట దెచ్చున్  

గుంజల కుకట్టి కొడుకుల 

భంజన  జేయగ పుడమికి భారము తగ్గున్

 

Friday, January 19, 2024

Literature has its value - strange experience

Literature has its value. 

I am improving my Celebrated Novel Bharatavarsha spending all my holidays, sitting still at the table boiling my brain.  The novel gives me immense pleasure. Immeseurable pain. Unfathomable emotions.


My experience with Bharatavarsha on 18th Jan 2024

I started to SRM univesity at 9.00 am on 18th Jan. I went to SRM University for the first timeon receiving invitation for the university. I had the pleasure of the company of my wife. I dropped her at her mother's place Yerrabalem which is on the way to SRM University.

I had a great confusion to find the route to the University from there.
I was lucky to get a man who was going to MANDADA which is so near the University. He is a middle aged man who saw the novel Bharatavarsha in th car. He came to know about the Novel. He was overjoyed to touch the novel. While getting down at his destination he was touching my feet for giving the world such a great work. 

I was astonished.  Literature has great value. 

SRM యూనివర్సిటీ గ్రంధాలయంలో భారతవర్ష గ్రంథం

SRM యూనివర్సిటీ గ్రంధాలయంలో భారతవర్ష గ్రంథం

SRM యూనివర్సిటీ  ప్రొఫెసర్ భరద్వాజ్ యూనివర్సిటీ  డీన్ ప్రొఫెసర్  విష్ణుపాద్ ఇద్దరు తమిళులైనా నేటి తరానికి  పనికొస్తుందని భావించి  భారతవర్ష గ్రంధాన్ని SRM యూనివర్సిటీ గ్రంధాలయంలో తమ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.  


పూర్తి తెలుగులో ఒక్క ఇంగ్లిష్ మాట వాడకుండా  రెండు లక్షల యాభై  వేల  పదాలతో 1265 పేజీలలో వ్రాయబడిన   అతిపెద్ద గ్రంధం  “భారతవర్ష.”ప్రపంచ రికార్డు సాధించిన భారతవర్ష సరళ గ్రాంధిక ప్రబంధం వేయి కవితల సమాహారం అచ్చ తెలుగు మాధుర్యం. ఈ టీ వీ పూలబాల “భారతవర్ష” పై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. రచయిత పూలబాలకి రాష్ట్ర అధికార భాషా సంఘం  మాతృభాషసేవా శిరోమణి అనే  బిరుదు విద్యాశాఖామంత్రి చేతులమీదుగా అందజేసింది. 

అనేక పాఠశాలలు, కళాశాలలు సాంస్కృతిక సంస్థలు భారతవర్ష కు సన్మానం చేశాయి.  అన్నిటికంటే గొప్ప సన్మానం ఒక యూనివర్సిటీ తమ గ్రంధాలయంలో ఉంచడం


                                    

నేటి కాలంలో తెలుగువ ఉపయోగంలేదని వదిలిపెట్టేసినవారికి కనువిప్పు కలిగిస్తుంది   భారతవర్ష. బాషా సంస్కృతిని నాశనం చేసేస్తే ఒక దేశాన్ని  సులభంగా  తమ చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చు అని విదేశీపాలకులు విద్యా వినోద రంగాలను మన బాషా సంస్కృతులను నాశనం చేయడానికి వాడారు. నేటి పాలకులు కూడా వారికి ఏమీ తీసిపోలేదు. ఒక జాతంతా వేషం మార్చుకుని బ్రతుకుతున్నాది. ఆంగ్లవస్త్రధారణ లేకపోతె నాగరీకుడు కానట్టే అని నాటుకుపోఎలా చేసాం.  ఇంగిలీషులేకపోతే బ్రతుకులేదని బెదిరిస్తూ సాగిన విద్యావిధానం వల్ల తెలుగుని వదిలి పెట్టేసి అత్యధికులు ఆంగ్లాన్ని  ఆలింగనం చేసుకున్నారు. సినిమాల ప్రభావంతో ఆంగ్లంలో  మాట్లాడితే  విద్యావంతుడని  ఆంగ్లంలో మాట్లాడితేనే ప్రతిష్ట అని స్థాపించాం.  కడకు మన బాషా సంస్కృతులని భూస్థాపితం చేసేశాం. ఇది మనం సాధించింది. 

భారతవర్ష తెలుగు భాషలో అందాన్ని , భారత దేశ సంస్కృతి లో గొప్పతనాన్ని , తెలుగు సంప్రదాయాలలో నిండు తనాన్ని  200 వృత్త పద్యాలలో  అనేక సంస్కృత గీతాలతో , కీర్తనలతో ఒక సామాజిక ఇతివృత్తం గల శృంగార కథ ద్వారా మనసులలో నాటుకునేలా చెబుతుంది.


Thursday, January 18, 2024

శృంగార కందమాల - సున్నిత శృంగారం

 క. చెంగా  విచీర   పయిటను       

సింగా  రించి మగువ తన  సిగ్గే  చూపెన్ 

శృంగార పటిమ గలదని               

అంగార తీక్షణత  తెలిపె  అందం  బుగన్


  క . తెరచి కన్నులు చూడగ   

  వరుడు   మరుడై   వెలుగుచు వన్నెలు చిందెన్ 

  సరసము  గురుతుకు వచ్చెను    

 విరలి  వరదై   పొంగుచు వరాల  వెన్నెల కాచెన్ 


క . భుజము లుబారు  గనున్న       

గజమం  టిబిగిమ    గవాడు  కాంక్షగ  చూడం       

గజగ     మెల్లవె    లిగె వా                   

రిజలో  చనకను    లరాస  లీలలు కాగెన్


క . మెరి సే    మేనిని  చూడగ    

విరిసే  పద్మము  కనులను  విప్పును ధౌరే 

మరుపే రాదిక  రాధిక   

విరితూ  పులతో  శరములు  విరివిగ  గుప్పున్ 


 క .లోగిలి చేరిన వలపు 

కౌగిలి చేరగ  చురచుర  కౌముది  కాలెన్ 

మోగెను  సిరిసిరి మువ్వలు    

భోగము  స్వర్గము   నిలిపెను   భూతల మునన్ 


ఉ . పువ్వులు  దాల్చఅం  గనుల  పుత్తడి   అందము  వృద్ధిచెం  దగన్      

నవ్వులు    రువ్వుచుం  దురిక    నారులు   చూపుల     కోయుడెం దమున్                           

మువ్వల  మోతమో      గసుర    మోహన       రూపము   కాంక్షరే   పగన్  

ఎవ్వడు    తట్టుకు      నిలుచు   ఈప్సిత     మంటగ  గామురే    గగన్ 


మ. బలమెం  తున్నను  వ్యర్థమే పురుషు  డేమాత్ర   మ్మిచ్చని ని                  

ల్పులలా  మందము కాంచగా పురుషు    లఱ్ఱుల్జా   తుర్వెర్రి వా         

రిలపా      లించిన  లాభమే    మిమరి       నారీమో  హంబున్న చో                       

బలమెం తవ్యర్ద    మోకదా   కనగ          యాబ్రహ్మా    దివేల్పు  లన్     


 క.  జడలు చూడబు జముల 

బడిసా గునదు   లుగండె వంపుల లోపా           

రెడినా   గులుగం  డితెగి

తొడలం  దుసుడు లుతిరుగు తోరపు వాగుల్


క. జడలు  బలిసిన  ఊడలు 

సుడులు  తిరుగు చుసాగు సుందర  ఝరుల్ 

జడలు   కనతీ   రుగపా 

రెడిఏ  రులుమూ  యరుకను   రెప్పలు జనుల్   

 


valapu, alupu salupu pilupu

jagana, yugaala , dagala , mrugaala 




Tuesday, January 16, 2024

మం త్రాలు ఎలా పనిచేస్తాయి ?

మంత్రాలు ఉన్నాయా? మంత్రాలు ఎక్కడ ఉంటాయి?

 ఎలా పనిచేస్తాయి? వాటి ప్రభావం ఎలా ఉంటుంది ?

మంత్రం అంటే మంతనం , ఒక రహస్య సమాలోచన , ఒక పథకం 

వివేకహీనుడికి మంత్రం అంటే వికృతాకారంగల మాంత్రికుడు, మంత్ర దండం పట్టుకుని  జపించే మాటలు. దాని ఫలితంగా ఎలుక - పిల్లిగానో, మనిషి - కుక్కగానో మారిపోడం. అల్పబుద్దితో ఆలోచిస్తే మంత్రం అంటే ఇదే. మానవ మస్తిష్కాన్ని ప్రభావం చేసే ప్రతి మాట మంత్రమే.  

 మిత బుద్ధితో ఆలోచిస్తే అన్నీ మితంగా  కనిపిస్తాయి.  ఉదాహరణకి  మితబుద్ధి తో ఆలోచిస్తే ప్రపంచం  అనే మాట  భౌతిక ప్రపంచానికి పరిమితవవుతుంది.  నిజానికిఅ నేక ప్రపంచాలు ఉన్నాయి. సంగీత ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, సాంకేతిక ప్రపంచం.  బుద్ధిని వికసింపజేసే జ్ఞాన ప్రపంచంలో ఉండాలంటే భాష,  ఆలోచన రెండూ  (కావాలి కాదు)పూర్తిగా పరిణితి చెంది ఉండాలి. 



ఉ . చిత్రము      గాదెవెం  డితెర  చిత్తము నేలచు   వేలుపే   యగున్ 

మంత్రము   లెచ్చట  కలవు మాటలు పాటలు  అన్నివే    ద ధీ   

మంత్రము  లేకదా  పనికి   మాలిన  భావము  లన్నియూ  విరాట్

తంత్రము    లేకదా  జనులు   తప్పక    విందురు  చప్పట్ల  దురన్ 


చిత్రముగాదె   వెండితెర  చిత్తము    నేలచు   వేలుపే   యగున్ 

మంత్రము   లెచ్చట  కలవు మాటలు  పాటలు  అన్నివేద  ధీ   

మంత్రములే  కదా  పనికిమాలిన  భావములన్నియూ    విరాట్

తంత్రము    లేకదా  జనులు   తప్పక    విందురు  చప్పట్ల  దురన్ 

Sunday, January 14, 2024

పండుగల మీద ఉత్పలమాల పద్యం

 పండుగంటే ఆనందం. ఎలా గడిపితే వస్తుంది ఆనందం

    పండుగలంటే కొత్తబట్టలు పిండివంటలు కావు  
    పండుగలంటే కోడిపందేలు పేకాట్లు  కావు 
    పండుగంటే భార్యల  షాపింగ్,  భర్తల మాపింగ్ కాదు 
  









సంతసమిచ్చు   మిత్రులుయు చక్కటి  విందులు  బంధువర్గమున్ 

సంతతి   యంత  నీదరిన      చల్లటి      సంగతులన్ని  విప్పగన్ 

వంతుకు సంతలం   బడక       వాకిట      ముచ్చట   లాలకిం  చగన్                    

అంతట  పండుగే     వెడలు     అందరు   మెచ్చగ   కూర్మి  చాటుచున్


ఉ . సంతస  మిచ్చుమి  త్రులుయు  చక్కటి  విందులు  బంధువ  ర్గమున్ 

సంతతి   యంతనీ    దరిన      చల్లటి      సంగతు    లన్నివి  ప్పగన్ 

వంతుకు సంతలం   బడక       వాకిట      ముచ్చట   లాలకిం  చగన్                    

అంతట  పండుగే     వెడలు     అందరు   మెచ్చగ   కూర్మి చాటుచున్


Saturday, January 13, 2024

ప్రకృతి వర్ణన తెలుగు పద్యం - ఉత్పలమాల

 ఉ.  తూరుపు  రత్న దీప జిగి  తోరణ సోయగ మేలె నాకశ                                 

    మ్మేరవికాంతి తో వెలిగె వేంకట నాథుని సుప్రభా తసం

     కీర్తన జేయు భాస్కరుని  కేళిక  చూడరె  కీరవాణి రా 

     గార్చన చేయుకీరముల గారము చేయరె ముద్దుముద్దుగా

ఆదిత్యుడు తూరుపున  రత్నదీప  జిగి  తోరణమును గట్టి   ఆకాశము నలకరించి అబ్ర దీపమై వెలుగుచుండగా ఆ జగత్ చక్షువు  వెంకటేశ్వరునికి  సుప్రభాతసంకీర్తన  జేయుచున్నట్టున్నది.  చలించు వెలుగు రేఖలను చూడగా  అంశుపతి  కేళిక (నృత్యము) చేయుచున్నట్టున్నది.  కీరముల (చిలుకల)  కిలకిలారావములు కీరవాణి  రాగార్చన చేయుచున్నట్టున్నది. అట్టి  కీరములను  ముద్దుముద్దుగా గారముచేయ వలెను. ప్రాతఃకాల శోభను ఆస్వాదించవలెను. అట్టి సమయమున అరుణతార నిద్దుర పోవుచుండెను.  



బ్రహ్మ కూతురులను ముద్దాడే చంపకమాల పద్యం

 చంపకమాల:   న జ భ జ జ జ ర ;  యతి 11 వ అక్షరం   

   III        IUI        UII            IUI           IUI         IUI           UIU


తెరిచి గవాక్ష   మంతట  యు తే ట  గవెన్నె లకాంచ  నుల్లమే 

విరిసె  సుమాలు ముచ్చట గ వే డు    కజేయ   గనూర్ధ్వ  లోకమే 

మురిసి  వరాల   జల్లుల  ను మూట  గగుగుప్పె నొతాలు  తాపరే      

అరలు  తనూజ లందడి మి  హత్తు  కుభాష్ప ఝరుల్గు ప్పించెనో. 



 కిటికీతెరచి తేటగ ( స్పష్టంగా)  వెన్నెలనుచూడగా  ఉల్లము సుమము 

వలే విరిసినది.  విరిసిన సుమాల చూసి ఊర్ధ్వలోకము( స్వర్గము) మురిసి 

వానజల్లు కురిపించెనో లేక తాలుతావిరి  ( బ్రహ్మ) తన  విరిత నూజలను 

(పువ్వులు బ్రహ్మ దేముని కుమార్తెలు) ముద్దాడు చుండెనో! అన్నట్లున్నది. 

ఆ సుందర దృశ్యము నుండి మరీదు కష్టముపై మండువాలోకి దృష్టి మరల్చెను.

.

స్వర్గం  పూలను అభినందించి వాన జల్లు  కురిపించడం  

బ్రహ్మ విరులను  ( కూతురులను) ముద్దాడి ఆనంద బాష్పాలను

 రాల్చడం చంపకమాలలో ఇమడ్చడం ప్రాచీన  కవితా ధోరణి.