Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, January 21, 2024

అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసాడా?

అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసాడా దాన్ని రాయడం అంటారా ?

అది రాయడమే ఏరకమైన రాయడం ? ఐతే అంబేద్కర్ ని ఎందుకు అంతగా పొగుడుతున్నారు ?


There are very few people who care to watch to grasp the truth. Watching superficially will seldom lead to truth. A fewer people care to read to grasp the truth. But people promote some videos or post and spread untruth or half truths thniking that they are suffering to educate the people. Actually they don't suffer for truth or atleast they don't think if it is truth or not. They simply share a post or video. Why they share a certain video or a post that it is popular or it benifts their agenda and justifies their group.

Amdedkar is the architect of the Constittion. This is what they say.

ఒక్క బోయ మాత్రమే పల్లకీ మోయగలడా ?

ఒక స్కూల్లో అనేక మంది ఉపాద్యాయులు ఉండగా ఒక్క టీచరు మాత్ర మే స్కూల్ లో అన్ని సబ్ జెక్ట్ లు, అన్ని పాఠాలు చెప్పేస్తు న్నాడు అంటే ఎలా ఉంటుంది ?


అలాగే ఉంటుంది అంబేడ్కర్ ఒక్కడే రాసాడంటే. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసాడు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసాడు. దాని ముందూ వెనక ఏమీ ఉండదు. ఇది అద్భుతమైన విషయంగా నీకు అనిపించింది. నేను భారతవర్ష 1265 పేజీల తెలుగు సరళ గ్రాంధిక ప్రబంధం రాసాను కదా. అది అద్భుతం కాదా. కాదు. ఎందుకంటే భారతవర్ష నవల అది రాజ్యాంగం. ఈ రెండింటిని పోల్చకూడదు. కష్టం ఒక్కటే. కానీ అదేం లెక్కలోకి రాదు.

రాజ్యాంగం రాయడంలో 15 మంది మహిళలు ఉన్నారన్న సంగతి తెలుసా? వాళ్ళు లెక్కలోకి వస్తారా ? అబ్బే వాళ్ళు లెక్కలోకి రారు.

వాళ్ళ గురించి మనం లెక్కలోకి తీసుకోకూడదు. గొప్పతనం అంతా అంబేడ్కర్ కే ఆపాదించేద్దాం. అంబేడ్కర్ ఒక్కడే గొప్పవాడు. మన ప్రయోజనాలు మనం చూసుకుందాం. కానీ రాజ్యాంగం రచనలో పాల్గొన్న 15 మంది మహిళలు కానీ గొప్పతనం తెలుసుకుందాం.

అందులో కమలా చౌదరి ఒకరు.

ఆమె అమెరికా మిచిగన్ యూనివర్సిటీ నుంచి పీ. హెచ్. డీ. చేసి ఐ. ఐ .ఎమ్. ప్రొఫెసర్ గా, రీసెర్చ్ సెంటర్ లకి డైరక్టర్ గా, హార్వర్డ్ విసిటింగ్ ప్రొఫెసర్ గా, ఇంకా అనేక ఉన్నత పదవులలోప్రకాశించిన సంగతి తెలుసా ?

లీలారోయ్

మహిళలకి ప్రవేశం లేని దాకా యూనివర్సిటీలో ప్రత్యేక అనుమతితో చదువుకుని వాళ్ళని ఎంత ప్రభావితం చేశారంటే, ఆ యూనివర్సిటీ లో ఒక భవనానికి ఆమె పేరు పెట్టారు.

సరోజినీ నాయుడు గొప్ప కవయిత్రి కూడా రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్నారు. కవులు అంటే మనకి చిన్న చూపు పీ.హెచ్.డీ. లు ఉండాలి, అవి కూడా సరిపోవు పదవులు ఉండాలి. అది కూడా సరిపోదు వారిని డబ్బు అధికారం ఉపయోగించి ప్రచారం చేయాలి. అలా చేస్తే చేస్తే మనకి ఎక్కుతుంది. మనం చదివి తెలుసుకోము. చదివే శక్తి, ఆసక్తి లేవు. పక్కవాడు ఎవడైనా ఏకీభవించక పోతే తిడతాము. ఎందుకు తిడతాము? ఎందుకంటే మనకి ఒక గ్రూప్ లో చేరి రాళ్లు రువ్వడం అలవాటు కదా.

రాజ్యాంగ ధర్మాసనం కావాలని 1935 లో బ్రిటిష్ వారిని కోరింది రాజాజీ. బ్రిటిష్ వారు దానిని 1940 లో అంగీకరించారు. రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్ రాజాజీ కి ఎందుకు ఇవ్వకూడదు? కీ సి ఆర్ కి తెలంగాణ ఉదయ నాయకత్వాన్ని ఇచ్చాము కదా?

బీ. ఎన్. రావు మొట్టమొదటి రాజ్యాంగ డ్రాఫ్ట్ ను తయారు చేశారు.
రాజ్యాంగ నిర్మాణ క్రెడిట్
బీ. ఎన్. రావు కి ఎందుకు ఇవ్వకూడదు?

60 రాజ్యాంగాలనుంచి విషయాలను తీసుకొని అనేక మంది అభిప్రాయాలని తీసుకుని సవరిస్తూ పోగా సుమారు 3 సం. (2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు) పట్టింది.

మహాభారత రచయిత వ్యాసుడు అంటాము వినాయకుడు అనం కదా!


***

అంబేద్కరే రాజ్యాంగ నిర్మాత. అని మీరు వాదిస్తే నేను చెప్పేది ఏమీలేదు. నిజం చెప్పగలం తప్ప వాదించి ఒప్పించలేము. ఎవరికో నిజం చెప్పాలి ఎడ్యుకేట్ చేయాలి అనుకోడం ఏంటి. మనవాళ్లు చదువుకోలేరు ? వేరువేరు చోట్ల చదివి తెలుసుకోలేరు. ఇంతా రాసినా ఈ వ్యాసం చదివేవారు ఎందరుంటారు?

ఇలాటివి నేను రాయకుండా ఉండడానికి కారణం నా రచన, నాసమయం పాడవుతాయి. ఎవడైనా గొడవపెట్టుకుంటే మూడు కూడా పాడవుతుంది. నేను భారతవర్ష లో లక్షల అక్షారాలని పదం పదం టైపు చేసుకుంటూ, పదం చెక్ చేసుకుంటూ నిద్రాహారాలు మాని అచ్చతెలుగులో 2 లక్షల 50 వేల పదాలు టైప్ చేసాను. చక్కటి ఛందస్సుతో వందల పద్యాలు రాసాను. కొత్తతరం తెలుగుకి ఆకర్షితులవ్వాలని పెద్ద ప్రయత్నం చేసాను. అయినా చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవరు చదవకపోయినా మనకు తృప్తి ఆనందం కలుగుతాయి. గుర్తింపు వస్తుంది. అదిచాలు.

No comments:

Post a Comment