Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, April 24, 2024

599 మార్కులవెనుక కథ

కులం గురించి  ఎవ్వరూ మనం పట్టించుకున్నంతగా ఎవ్వరూ పట్టించుకోరు. కులం అంటే మనం పడి చస్తాం. పి.  వి.  సింధు కులం ఏంటని ఇంటెర్నెట్ని వేటాడిన మూర్కులం మనం కాదా ?     మనకి మార్కుల పిచ్చి కూడా కులం పిచ్చిలా పట్టింది 


జర్మనీ లో ఉద్యోగం చేస్తున్న నా విద్యార్థిని  ఇలా అంది. "నేను ఎన్ని ఇంటర్వూస్ కి వెళ్లినా నా  గ్రేడ్ లు మార్కులగురించి ఎవ్వరూ అడగలేదు. "  కానీ ఇక్కడ మాత్రం ఒక విద్యార్థికి 599 మార్కులు వస్తే చెంకలుగుద్దుకునే వాళ్ళు మురిసి ముక్కలైపోయేవాళ్లు  చాలామంది ఉన్నారు. 


ఇన్ని మార్కులు ఏంసూచిస్తున్నాయి?

ఇన్ని మార్కులు వచ్చిన వారు మేథావులని  మన అభిప్రాయమైతే మనంత వెర్రివాళ్ళు , మూర్ఖులు ఎవరూ ఉండరు .ఆలోచన చేయండి    ఇన్ని మార్కులు గుడ్డి  చదువు ను సూచించడంలేదా ?  మనకి బుర్ర మందగించి  ఆలోచన నశించి  ఇలా తయారయ్యాం. మార్కులు మార్కులు అని చచ్చిపోతున్నాం  కానీ ఇన్ని మార్కులు వచ్చిన వాళ్లకి సామాజిక స్పృహ సున్నా ఉంటుంది. 


ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?

విద్యావ్యస్థలో లోపాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఇంగ్లీషులో తెలుగులో , సైన్స్ లో వందకి వంద వెయ్యడానికి కుదరదు. ఒక్క స్పెల్లింగ్ తప్పులేకుండా ఒక్క సెంటెన్స్  స్ట్రక్చర్  తప్పులేకుండా రాయడం సాధ్యమేనా ?  కళ్ళుమూసుకుని దిద్దితే ఇలా మార్కులు వస్తాయి 


ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?

విద్యాసంస్థల ఫ్రాడ్ ని కూడా సూచిస్తున్నాయి. 


ఇన్ని మార్కులు ఇంకా ఏంసూచిస్తున్నాయి?

మార్కుల రేట్ రేస్ ని సూచిస్తున్నాయి.  

90 మార్కులు వస్తే బాగా చదివేదానుకుంటారు . 99 మార్కులు వస్తే అద్భుతం అనుకుంటారు. వందకి వంద వస్తే ఫ్రాడ్ అనుకుంటారు. సౌదీ అరేబియాలో ఒంటెల వెనుక  పిల్లలని కట్టి ఒంటెల పందెం నిర్వహించే వ్యాపారులు గుర్తుకొస్తున్నారు  

Monday, April 8, 2024

అప్పాజీ ప్రతిభ (Appaji - a great Prodigy)

     Appaji - a great Prodigy



The king of Kalinga had his message sent

for cabbages and carrots to be lent

There grows no legume of that sort

so he sent a message to Vizianagaram fort

 

when it was read out in the royal court

Appaji deliberately accepted to transport

That decision left the king puzzled

even the wise courtiers were dazed

 

 Because the journey is so long

but Appaji commissioned carts strong

They might think that he was crazy

but he is a real prodigy he's a strategy

 

The carriages are with soil filled

when seeds sown all were thrilled 

For the king it was a very little invest

when they reached ready was the harvest

 

Wow! Appaji - what a real prodigy

for every problem he has a strategy

Friday, March 29, 2024

కోట్ల వ్యాపారానికి తెర లేపిన ఫ్రెంచ్ ప్రతిభ

 


ఉన్నత విద్యకోసం, వ్యాపారం కోసం   విదేశీ భాషలు నేర్చుకుని తమ అవసరం తీర్చుకుంటారు  కొంతమంది . ఇంకొక్క మెట్టు ఎక్కి ఆ భాషలను ఇతరులకు బోధిస్తారు కొంతమంది. మరొక్క మెట్టు ఎక్కి విదేశీ కంపెనీలలో దుబాషీలగా  పని చేస్తారు కొంతమంది. ఆ పై మెట్టు  ఎక్కి రచనలు కూడా చేస్తారు కొద్ది మంది.  ఆ  అతికొద్ది మందిలో ఏ ఒక్కరో అత్యున్నత శిఖరం చేరి  ప్రపంచరికార్డు నెలకొపుతారు, ప్రతిభా పురస్కారాలను అందుకుంటారు దేశ విదేశాల్లో వ్యాపార వైజ్ఞానిక రంగాలలో జరిగే చర్చలలో సేవలందించి  ప్రతిభకు ఎల్లలు లేవు అని నిరూపిస్తారు. ఆ ఒక్క వ్యక్తే  వెంకట  పూలబాల. 


 తెలుగు మధ్య తగరతి కుటుంబంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకుని  భాష సోపానాలు ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించిన బహుభాషి  పూలబాల. 

ఫ్రెంచ్‎లో నవల రాసిన తెలుగు రచయత వెంకట్ పూలబాల. ఒక్క ఫ్రెంచ్‎లోనే కాక ఆరు విదేశీభాషలతో అత్యధికంగా పుస్తకాలు రచించిన ఎక్స్ ఫోనిక్ రైటర్‎గా పేరుతెచ్చుకున్నారు. ఈయన సాహిత్య ప్రస్థానం రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పేదాకా సాగింది. పూర్తి తెలుగులో ఒక్క ఇంగ్లిష్ మాట వాడకుండా  రెండు లక్షల యాభై  వేల  పదాలతో 1265 పేజీలు  అతిపెద్ద గ్రంధం  “భారతవర్ష”  ను అతి తక్కువకాలం ఎనిమిది  నెలల్లో రచించి పూలబాల  మొదటి ప్రపంచ రికార్డును సాధించారు.  ఈ టీ వీ పూలబాల “భారతవర్ష”  పై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యాశాఖామంత్రి చేతులమీదుగా రాష్ట్ర అధికార భాషా సంఘం వారి మాతృభాషసేవా శిరోమణి బిరుదు పొందారు.  రెండువందల ఇంగ్లిష్ సోనెట్స్ గల ఇండియన్ సోనెటీర్  అనే ఆంగ్ల పద్యకావ్యాన్ని   అతి తక్కువ కాలం, నాలుగు నెలల్లో రచించి రెండవ ప్రపంచ రికార్డు సాధించారు. అందుకుగాను ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడెమీ పూలబాలకు మీడియా పురస్కారాన్ని అందజేసింది.    జపనీస్ లిపి పై పట్టు సాధించి జాపనీస్ లో పుస్తకం రాయడమే కాకుండా ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీలో జపనీస్ భాషను బోధిస్తున్నారు. 


ప్రభుత్వ అనువాదకుడిగా    

ఫ్రాన్స్ తునిసియా జింబాబ్వేలతో పాటూ ఇతర దేశాల నుంచి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సహజ వ్యవసాయం ద్వారా వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను పరిశీలించేందుకు భారతదేశానికి వచ్చారు. అప్పుడు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ రైతులతో సంభాషిచే సమయంలో అటు ఫ్రెంచ్ వారికి ఇటు తెలుగు వారికి వారధిగా నిలిచారు పూలబాల. ఈయన ఫ్రెంచ్‎ను తెలుగులోకి.. తెలుగును ఫ్రెంచ్‎లోకి అనువదించడానికి ప్రభుత్వ అనువాదకుడిగా తన సేవలు అందించారు. అగ్రి కల్చర్ రీసెర్చ్ మీద సరికొత్త విషయాలను తెలియజేయడానికి బెంగళూరులో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యారు. తన ఫ్రెంచ్ భాషతో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవలందించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇదంతా పాత కథ 


బుర్కినా ఫాసో పశ్చిమ ఆఫ్రికా లో ఒక చిన్న దేశం. కానీ ప్రపంచంలో అత్యుత్తమ పత్తి ని  పండించే దేశం. ఈ దేశం ఎప్పుడూ ముడి పత్తిని అమ్ముతూ ఉండేది.  ఇప్పుడు వస్త్ర పరిశ్రమకు కావలసిన దారాలు తయారుచేయాలని నిర్ణయించుకుంది. 


బుర్కినా ఫాసోకు భారతదేశంలో పూణేలో  ఉన్న గోద్రాజ్ అనే సంస్థను సలహా సాంకేతిక సహాయం కోసం సంప్రదించింది. ఈ సందర్భంలో ఫ్రెంచ్ అనువాదకుడు అవసరం పడింది  ఫ్రెంచ్  అనువాదం మరియు వాయిస్ ఓవర్ ద్వారా అంతర్జాతీయ వస్త్ర వ్యాపార అనుసంధానంలో పూలబాల ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను. ఈ ఒప్పందంవిజయవంతంకావడంతో కొట్లావ్యాపారా నికి తెరలేస్తుందని వ్యాపారం నాది కానప్పటికీ చాలా సంతోషంగా ఉందని "ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి ఆనందించే శాస్త్రవేత్తలా ఎంతో ఆనందం గాఉందని" చెప్పారు. పూలబాల

Wednesday, March 6, 2024

స్త్రీ పురుషులు ఎందుకు సమానం కాదు ?

ప్రస్తుతం మనం పురుషాధిక్య సమాజం అనే మాట ఎక్కువగా వింటుంటాము. అది ఎంతవరకు నిజమో తెలుసా ? అంతకంటే ముందు పురుషాధిక్య సమాజాం ఎలా ఏర్పడిందో తెలుసా ?  

                                          

ఆ తెలియకేం మనుధర్మమే దానికి కారణం అని స్త్రీ వాదులు మానవతావాదులు తయారవుతారు మనదేశాన్ని ఆడిపోసుకోడానికి. బాల్య వివాహాలు అనగానే మనదేశాన్ని  ఆడిపోసుకుంటారు. 

బాల్య వివాహాలు ప్రతి దేశంలో నూ ఉన్నాయి. ఉదాహరణకు  క్వీన్ ఎలిజబెత్ భర్త ఎనిమిదవ  హెన్రి కథ  తెలిస్తే ఇలా మాట్లాడరు. ఏడవ హెన్రి  కి ఇద్దరు కొడుకులు.  పెద్దకొడుకు ఆర్థర్,   చిన్న కొడుకు ఎనిమిదవ   హెన్రి . ఆర్థర్ పెళ్లి కి అతడి వయసు 7 సంవత్సరాలు , ఎనిమిదవ హెన్రి  పెళ్ళికి అతడి వయస్సు 15 ఏళ్ళు. ఎనిమిదవ   హెన్రి  ఆరుగురి భార్యలని వాహం చేసుకుని , ఇద్దరికీ శిరచ్చేదం , ఇద్దరికీ విడాకులు ఇవ్వగా ఒకామె ( జే న్ సెమూర్ ) పురిటిలో చనిపోతుంది.  చివరి కి కేథరీన్  పార్ అనే మరో ఆమెను చనిపోయే ముందు చేసుకుని రాజ్యాన్ని ఆమె హస్తగతం చేస్తాడు.  మగ సంతానాన్ని ఇవ్వ నందుకు శిరచ్చేదం చేయిస్తాడు . బాల్య వివాహాలు వరకట్నాలు మగపిల్లలని కనన్నందుకు మరణ దండన ఇవన్నీ  ఇంగ్లాండ్ రాజకుటుంబాల లో ఉన్నవే.  

పురుషాధిక్య సమాజం కేవలం భారతదేశంలోనే లేదు , ప్రపంచం అంతటా ఉన్నది అదే. గ్రీకు మైథాలజీ  చదివితే దీని మూలాలు పురుషాధిక్యత ఎలావచ్చిందో కొంత తెలుస్తుంది. 

గ్రీకు  మైథాలజీలో  మానవజాతిని  పెని ట్రేటర్ ( పెట్టువాడు ) పెనిట్రేటెడ్ ( పెట్టించుకునేది ) గా విభజించి   పెని ట్రేటర్ కే  విలువ ఇచ్చేవారు.  మన సినిమాల్లో కూడా తన్నే వాడికి విలువ ఎక్కువ  తన్నులు  తినే వాడికి  విలువ ఉండదు. బాగా తన్నే వాడినే హీరోయిన్ కోరుకుంటుంది . 

యుద్ధాలలో స్త్రీల  పాత్ర ఏంటి అనే  ప్రశ్న ఎప్పుడైనా తట్టిందా?

స్రీలు ఆదిశక్తి పరాశక్తి అని అంటాం. కానీప్రపంచ యుద్ధాలు వచ్చిన ప్పుడు స్త్రీలని కాపాడుకులేక పురుషులు చచ్చేవారు. (ఈరోజుకి కూడా స్త్రీకి రక్షణ ఏర్పాటు చేయడానికి పురుషులు చాలా ఇబ్బందులు పడుతుంటా రు.)  స్త్రీలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. వాస్తవం చెప్పాలన్నదే నా ఉద్దేశం.   స్త్రీ శరీరం అందం మగాణ్ణి వివశుడిని చేస్తుంది.  స్త్రీ శరీర ఆకర్షణ బెర్ముడా ట్రైయాంగిల్ లాటిది అనిపిస్తుంది.   ఆ ఆకర్షణ    తప్పించుకోలేక  ప్రాచీన కాలం నుండి, మగాడు   స్త్రీని  వేటాడాడు,  అత్యాచారం చేశాడు. స్త్రీ అందం యుద్ధాలని  అత్యాచారాలను ప్రేరేపించింది.  మానవ చరిత్రలో యుద్ధాల ఎంత సాధారణమో  అత్యాచారాలు కూడా అంతే  సాధారణం. యుద్ధంలో సాధారణంగా  పురుషులు  హత్యకు గురైతే  స్త్రీల అత్యాచారానికి గురవుతారు.  ఈ  సంఘటనలు లక్షలాది గా చరిత్రలో ఉన్నాయి. 


బ్రిటీష్ సైనికులు, రష్యన్ సైనికులు లేదా ఎవరైనా, ఏ  సైనికులు అయినా ఏ యుద్ధం జరిగినా ముందుగా బాధితురాలు స్త్రీ. 1944లో, మోంటే కాసినో యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలి   అత్యంత క్లిష్టమైన యుద్ధాలలో ఒకటి.   ఇటలీ సైన్యం ఫ్రెంచ్  జనరల్ చార్లెస్ దుగాల్  ఆధ్వర్యంలో    ఉన్నాయి. 


ఉత్తర ఆఫ్రికాలోని ఫ్రెంచ్ కాలనీల నుండి వస్తున్న ఫ్రెంచ్ సైన్యం. క్రూరమైన హింస  ఉన్మాదం లో వేలాది మంది మహిళలు, యుక్తవయస్సు బాలికలు చిన్నారులపై  రోజుల తరబడి అత్యాచారాలు జరిపారు     వారు ప్రతి పట్టణం మరియు గ్రామంలో 10 నుండి 80 సంవత్సరాల వయస్సు గల ప్రతి మహిళపై అత్యాచారం చేశారు. ఏకకాలంలో ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


ఇలాటి అత్యాచారాలు చేసిన సైనికుల్ని  శిక్షించడం కుదరదని  రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు  ఆ సమయంలో అత్యాచారాలను తగ్గించే లక్ష్యంతో ఇంపీరియల్ జపనీస్ సైన్యం ఆక్రమిత దేశాలు మరియు భూభాగాల్లో  కంఫర్ట్ వుమెన్ లేదా కంఫర్ట్ గర్ల్స్ ని ప్రవేశపెట్టారు. ఇలా  లైంగిక బానిసత్వంలోకి నెట్టబడిన మహిళలు మరియు బాలికలు లక్షల్లో ఉండేవారు . 


1992లో బోస్నియన్ యుద్ధ సమయంలో మహిళల పై   అత్యాచారం అనేది జాతి ప్రక్షాళన లక్ష్యంగా  ఒక యుద్ధ  నీతి  కింద సాగించారు    బోస్నియన్ యుద్ధంలో 50,000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు అని  రిపోర్ట్ కాని కేసుల సంఖ్య ఇంకా  చాలా ఎక్కువ.

రష్యాపైన చైనా పైన   జాపనీస్ సైన్యం చేసిన అరాచకాలు,  ఇన్ని అన్నీ కావు  లక్షల మందిని చంపి లక్షల మందిని రేప్ చేసిపారేశారు.  జపాన్ అరాచకాలు 

జపాన్ పై  అణుబాంబు దాడి జరగడం వల్ల ఆ కేకల్లో జపాన్ చేసిన దురాక్రమణలు,  దాడులు,  ఆ దాడుల్లో  జాపనీస్ సైన్యం చేసిన అరాచకాలు,   పైశాచిక కృత్యాలు  కప్పడిపోయాయి.  తన అమానుషత్వాన్ని  సానుభూతి పరదాలు వెనుక  దాచి  జాపనీస్ అమాయక ముఖాన్ని చూపిస్తుంది లక్షల మందిని చంపి లక్షల మందిని రేప్ చేసిన పెద్దగా పైకి రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు సుమారు కోటిమందిని చంపేసినా పైకి రాకుండా చూసుకుంది.  కొరియా  కోసమని చైనా మీద,  పోర్ట్ ఆర్థర్ కోసమని రష్యా మీద యద్దానికి దిగి గెలిచింది. 

1931 లో మంచురియా ని జపాన్ ఆక్రమించుకుంది, 1937 లో షాంగై ని ఆక్రమంచుకోడానికి యుద్దానికి దిగి ఆక్రమించుకుంది. తరువాత చైనా రాజధాని నాన్జింగ్ ని ఆక్రమించుకోమని ఆజ్ఞ రావడంతో యథేచ్ఛగా మారణకాండ కొనసాగించారు. కనిపించిన వారందరిని చంపుకుంటూ పోయారు. వారం రోజుల్లో అందరూ లొంగిపోవాలని ఆశాకా ప్రకటించాడు. లొంగవద్దని చెప్పి చైనా ప్రభుత్వం తమ సైనికులకు చెప్పి తానూ తప్పుకుంది . లొంగిపోయిన చైనా సైన్యాన్ని వారితోనే గోతులు తీయించి వాటిలో వారిని బ్రతికుండగానే పాతేశారు. ఇద్దరు జాపనీస్ సైనికులు పందెం వేసుకుని మరీ చైనా  సైనికుల తెగగొట్టారు. మొదట వంద తలలు తెగ్గొట్టటం తరువాత నూట యాభై ఇలా పందేలు వేసుకుని నదిలో నీరంతా ఎర్రగా పారాలని పందేలు వేసుకున్నారు. సరదాగా ల్యాండ్ మైన్స్ పెట్టి కొంతమందిని చంపి , మరికొంత మందిని కిరోసిన్ త్రాగించి పరిగెత్తించి చంపారు. ఆడవాళ్ళని రాత్రంతా రేపే చేసి చంపారు. పాలిస్తున్న తల్లిని స్థానాల్లో టొప్పకీ తో పొడిచి చంపారు.  వాటిని ఫోటోలు తీసి పేపర్లలో గొప్పగా రాసుకున్నదేశం జపాన్.  

స్త్రీల  శారీరక  బలహీనత పురుషుల మానసిక బలహీనత ( కోరిక ) వెరసి  పురుశాధిక్య సమాజానికి కారణమైంది. కానీ స్త్రీ పురుషులు సమానమే , మనుషులంతా ఒక్కటే అని చెప్పడానికి బాగుంటుంది. పదవిలో ఉన్నవాడు పదవిలో లేనివాడు ఒక్కటే అని కూడా చెప్పవచ్చు.  స్త్రీ లు ఒక్కరే కాదండీ బలహీను లందరూ పీడించ బడుతున్నారు.  నిజాయతీ పరులు కూడా పీడించబడుతున్నారు.  కానీ స్త్రీవాదులు చేసే ఓవరేక్షన్ ఇంతా అంతా కాదు. 

చరిత్ర చదివితే తెలుస్తుంది.  కానీ చరిత్ర అంటే చిన్న చూపు కలిగించి అటకెక్కించేశారు. టెక్నాల జీ,  ఇంగ్లిష్ వాడు మనకు దేవుళ్ళు . మన బాషా మన చరిత్ర మనకి చిన్నతనం.   మన పిల్లలకి చదువు రాదు సినిమాలు చూడడం తప్ప.  మనపిల్లలు ఎప్పుడూ చదువుతూనే కనిపిస్తారు అనినా ఒక్కడికీ ప్రపంచ జ్ఞానం ఉండదు.  అది చదువు కాదు టెక్స్ట్ బుక్స్ తో కుస్తీ.   ప్రాణాలు అరచేతు ల్లో పెట్టుకుని పరీక్షలకి  బట్టే పట్టడం తప్ప మామూలుగా చదవడం టైం దండగ అనేలా మైండ్  సెట్ చేసేసింది మన విద్యావ్యస్థ.    


Television Channels in France

Television in France was introduced in 1931, when the first experimental broadcasts began. Colour television was introduced in October 1967 on La Deuxième Chaîne. France uses the DVB-T transmission technology. The 13 first digital free channels were launched on 31 March 2005. Pay channels were progressively added until 2006. Regional channels started to launch on the TNT in 2007. On 30 October 2008, the TNT HD was launched with four national channels: TF1, France 2, M6 and Arte.

Four companies dominate the French TV market :

Groupe TF1 (owned by Bouygues)

France Télévisions, state-owned channels 

Groupe M6 (owned by RTL Group), 

Groupe Canal+ (owned by Vivendi).

The popular Television channels in France and their profile.

TF1, TMC, C 8 ,  M6  - General programs

Arte ( culture),   6ster ( family) ,  Guilli,( family children) ,  Chérie 25 ( women movies)

 LCI , C news - 24/7 News

Monday, February 26, 2024

Research on Bharatavarsha

భారతవర్ష విడుదల అయిన నాటి నుంచి నేటిదాకా ఎన్ని కొత్త పుస్తకాలో,  ఎన్ని కార్యక్రమాలో ఎన్ని టీ  వీ  ఇంటర్ వ్యూ లో..  ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన నాకు భారతవర్ష పై రీసెర్చ్ చేస్తున్నానని , నేను వ్రాసిన గ్రంధం గురించి,   నాగురించి తెలుసుకుంటున్నానని తెలియదు.  

భారతవర్ష వ్రాసేటప్పుడు  అది ప్రబంధ కావ్యమని తెలియదు. భారతవర్ష పూరిగా చదివిన వ్యక్తి  మల్లాది అనిల్ గారు  భారతవర్షలొ ప్రబంధ కావ్య లక్షణాలు ఉన్నాయని  2021 లో  టీవీ ఇంటర్వ్యూ లో  చెప్పారు.  అప్పటికీ   ప్రబంధ కావ్యమంటే అష్టాదశవర్ణనలు ఉండాలని తెలియదు. అష్టాదశవర్ణనలు ఏమిటో తెలియదు.  

        శా. పూదోట్ల    న్దిరుగా  డినాత  లపులం  బ్రోచేవు  యేభాగ్య మో                
పూదేనం  తయున ద్దినాప  దములన్ బుట్టేవు తాళంబు గా
  స్వాధీనం  బుగని  మ్ముచంద  మికనే   ౙాల్వార పారాణిగా నీ
పాదాల ద్దెదని  ల్వవమ్మ  నిలునా భావాల వేదంబుగా.     

నవరస పద్యాలు : 

వృత్తపద్యాల తో  అచ్చతెలుగులో  ఒక మంచి కథ వ్రాయాలనుకుని   బారతవర్ష కథ  వ్రాస్తూ ఆస్వాదించడం మాత్రమే తెలుసు  తరళ మత్తేభ శార్ధూల   పద్యాలు వ్రాయడానికి ఛందస్సు నేర్చుకుంటూ   అనేక  ఉపమానాలు ప్రకృతి వర్ణనలు తో మునిగిపోయిన నాకు   నేను వ్రాసిన పద్యాలలో  నవరసాల పద్యాలు  ఉన్నటు తెలియదు. రెండు సంవత్సరాల తరువాత  2022 ఆగస్టు లో  వ్యూస్ టీ వీ ఇంటర్వ్యూ కోసమని హైదరాబాదు  వెళ్ళేటప్పుడు పద్యాలమీద దృష్టి సారించగా నవరసాల పద్యాలు ఉన్నట్టు తెలిసింది.   అప్పుడు నవ రసాలపద్యాలు  అనే పది పేజీల సంపుటి తయారు చేసాను.

పురాణ ఇతిహాసాలు : 

పురాణ ఇతిహాస ప్రస్తావన ఎంత ఉందో తెలియదు.  పురాణ ఇతిహాసాలు  అప్రయత్నంగా వ్రాస్తే శృంగారం మాత్రం ప్రయత్న పూర్వకంగా, ఇంకా చెప్పాలంటే ఇష్ట పూర్వకంగా వ్రాసాను.  

భారతవర్షలో  తెలుగు సంస్కృత గీతాలు కృతులు అన్నీ  గాయకురాలు శ్రీవల్లి  వాట్సాప్ కి 2020 లోనే పంపినా వాటిని ప్రత్యేకంగా  ఒక  డాకుమెంట్ మీదకు చేర్చి దాచడానికి   2022 28 మే న  మార్కాపురంలో  బారతవర్ష సాహిత్య సాంస్కృతిక సమావేశం జరిగే వరకూ  కుదరలేదు. అలా దాచినా అది వందలాది భారతవర్ష అనే పేరుగల  డాక్యుమెంట్స్ లో కలిసిపోయి ఎక్కడో పోయింది.

2022, 2023     మాతృభాష దినోత్సవాలలో  పిలిచి  సత్కరించినా  ఫ్రెంచ్ జర్మన్ , జాపనీస్  పుస్తకాలతో రచన తో  పాటుగా ఇండియన్ సోనెటీ ర్  అనే పుస్తక రచనలో అంతకంటే పెద్దదైన  భారతవర్ష ద్వితీయ ముద్రణలోనూ ,   దాని ఆంగ్ల అనువాదమైన  లవ్ అండ్ పీస్ రచనలోనూ  ఊపిరిసలపక  సతమతమౌతున్న  నాకు  భారతవర్ష  పాటలన్నీ ఒక దారికి చేర్చాలని అనిపించలేదు 

2024 ఫిబ్రవరిలో  లో ఫ్రెంచ్ జాపనీస్ , జర్మన్ కొత్త పుస్తకాలు వెలువరించి ఒక భారం దించుకున్నాక   2024 ఫిబ్రవరి 14 వ తారీఖున లయోలా కాలేజీ వారు మాతృబాష దినోత్సవము సందర్భంగా  భారతవర్ష ని సత్కరించిన రోజున లయోలా కళాశాల  చిత్రాలతో భారతవర్ష గీతాలన్నిటినీ ఒక బ్లాగ్ లోపొందు  పరిచాను.  

  

2024 ఫిబ్రవరి 21 వ తారీఖున  దూరదర్శన్ లో   మాతృబాష దినోత్సవము సందర్భంగా  కార్యక్రమానికి భారతవర్ష లో అష్ఠాదశవర్ణనలు ఉన్నాయని తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు  దూరదర్శన్ వారి ఆహ్వానం భారతవర్ష పై  అన్వేషణ చేసి భారతవర్ష ఒక ప్రబంధం  అని తెలుసుకు నేలా చేసింది     భారతవర్షలొ  అష్ఠాదశవర్ణనలు వెలికి తీసి ఒక పుస్తకం ముద్రిస్తున్నాను.   


భారతవర్ష  -  ప్రాచీన కవితా ధోరణులు 

 ప్రకృతి వర్ణనలతో, ప్రౌఢ బాషా శైలితో  పురాణ ప్రస్తావనలతో  సాగే సంప్రదాయ కవిత్వాన్ని  ప్రాచీన కవిత్వం అంటారు.   ఇతిహాస పురాణ,  ప్రస్తావనలేకాక  అష్టాదశ వర్ణనలతో, వ్యాకరణ బద్ద  ఛందోబద్ధ నియమాలతో, వీర, శృంగార రసాలతో, అలంకారాలతో అలరించే  ఈ రచనా శైలి నన్నయ్య నుంచి చిన్నయ్య దాకా కొనసాగినా   మొఘలు  తురుష్క  పారశీ,  పాశ్చాత్త్య ప్రభావంతో  పూర్తిగా అడుగంటి పోయింది.  ప్రబంధాలు కనుమరుగైపోయాయి. చలనచిత్ర ప్రభావంతో   తెలుగు బాషా మనుగడే ప్రస్నార్ధకమయ్యింది. ఇలాటి గడ్డు పరిస్థితులలో నన్నయ్య చిన్నయ్య రాకపోయినా  నేటితరానికి ప్రబంధ సౌందర్యాన్ని అందించడానికి ఎవరో ఒక వెంకయ్య   వచ్చే ఉంటాడు. సమంగా చూడండి. ధర్మానికి సాహిత్యానికి సంబంధం ఉందంటూ ప్రబంధాల అందాలను, వేదచందాలను,  శృంగార పూగంధాలను పూంచిపట్టి   పూలబాల చేసిన శంఖారావం ఉత్కృష్ట భారతావని  ఆవిష్కారం  భారతవర్ష. 



1. భారతవర్ష గ్రంధం  చంపకమాల  తో ప్రారంభమవుతుంది 
అది ఇష్టదేవతా ( సరస్వతీ) ప్రార్ధన. ఇది ప్రాచీన కవితా ధోరణి  

చ . అనువుగ వేడ భారతి  సత్కృప నొసంగె కవిత్వ శక్తతన్  
కినుకము వీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
 అనితము నీకృప ధన్యముగాదె సనాతని దివ్య బాసటన్  
మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్

సరిగా వేడుకొనగా సరస్వతి దయతో కవిత్వ సామర్ధ్యమును 
కినుకము వీడి  ( దయతో ) కుశాగ్ర రసజ్ఞ నవచై తన్యమున్
(షార్ప్ లిటరరీ మైండ్) ని అనుగ్రహిచెను. అనితము (ఆన్ పేర్లల్డ్) 
 నీకృప ధన్యముగాదె సనాతని( సరస్వతి ) దివ్య బాసటన్ 
మనసులో పుట్టిన పద్యాలను మాలాగట్టి తల్లి పాదములవద్ద ఉంచెదను.  

 2. ఉ.  తూరుపు  రత్న దీప జిగి  తోరణ సోయగ మేలె నాకశ                                 

    మ్మేరవికాంతి తో వెలిగె వేంకట నాథుని సుప్రభా తసం

     కీర్తన జేయు భాస్కరుని  కేళిక  చూడరె  కీరవాణి రా 

     గార్చన చేయుకీరముల గారము చేయరె ముద్దుముద్దుగా


తూరుపున  రత్నదీప  జిగి  తోరణమును గట్టి   ఆకాశము నలకరించి  ఆదిత్యుడు అబ్రదీపమై వెలుగుచుండగా దీపము వెలిగించి  వేంకటే స్వరుని కి  సుప్రభాతసంకీర్తన  జేయుచున్నట్టున్నది.  చలించు వెలుగు రేఖల ను చూడగా  అంశుపతి  కేళిక  (సూర్యుని నృత్యము) చేయుచున్న ట్టున్నది.  కీరముల ( చిలుకల)  కిలకిలారావములు కీరవాణి  రాగార్చన చేయుచున్నట్టున్నది. అట్టి  కీరములను  ముద్దుముద్దుగా గారముచేయ వలెను. ప్రాతఃకాల శోభను ఆస్వాదించవలెను. 

సున్నితమైన ప్రకృతి వర్ణనలలో భారతీయ దేవీ దేవతల ప్రస్తావన ప్రాచీన కవితా ధోరణి. 


4. చ. తెరిచి గవాక్ష   మంతట  యు తే ట  గవెన్నె లకాంచ  నుల్లమే 

విరిసె  సుమాలు ముచ్చట గ వే డు    కజేయ   గనూర్ధ్వ  లోకమే 

మురిసి  వరాల   జల్లుల  ను మూట  గగుగుప్పె నొతాలు  తాపరే      

అరలు  తనూజ లందడి మి  హత్తు  కుభాష్ప ఝరుల్గు ప్పించెనో. 


కిటికీతెరచి తేటగ ( స్పష్టంగా)  వెన్నెలనుచూడగా  ఉల్లము సుమము 

వలే విరిసినది.  విరిసిన సుమాల చూసి ఊర్ధ్వలోకము( స్వర్గము) మురిసి 

వానజల్లు కురిపించెనో లేక తాలుతావిరి  ( బ్రహ్మ) తన  విరిత నూజలను 

(పువ్వులు బ్రహ్మ దేముని కుమార్తెలు) ముద్దాడు చుండెనో! అన్నట్లున్నది. 


మరీదు అతికష్టముపై మండువాలోకి దృష్టి మరల్చెను.

స్వర్గం  పూలను అభినందించి వాన జల్లు  కురిపించడం  

బ్రహ్మ విరులను  ( కూతురులను) ముద్దాడి ఆనంద బాష్పాలను

 రాల్చడం చంపకమాలలో ఇమడ్చడం ప్రాచీన  కవితా ధోరణి.


ప్రాచీనధోరణిలోనే సాగుతూ వస్తున్న కవిత్వంలో కొత్త దృక్పధాలు 1850 తరువాత ప్రారంభమయినాయి. జపాన్‌కు వ్యతిరేకంగా కొరియా స్వాతంత్య్రంకోసం పోరాడిన యోధుడు, కవి హాయోంగ్ (1879) తో ఆధునిక కవిత్వం ఆరంభమయింది.  పాశ్చాత్య దేశాలలో కవిత్వంలో వచ్చిన మార్పులు, ఇంగ్లీషు సాహిత్యంతో పరిచయమున్న కవులలో పెరిగిన ఆసక్తి, రాజకీయ, సామాజిక రంగాలలో వచ్చిన మార్పులు, జీవన శైలిలో వచ్చిన కొత్తదనాలు ఆధునిక కవిత్వానికి మరికొన్నికారణాలు. 

ఆధునిక కవితాధోరణులలో  ముఖ్యమైనది "భావ కవిత్వం." ఇంచుమించు 1930 వరకు భావకవిత్వం రాజ్యమేలింది. 1935 తరువాత రెండో ప్రపంచ యుద్ధం నాటికి భావకవిత్వం స్థానాన్ని అభ్యుదయ కవిత్వం పూర్తిగా ఆక్రమించింది. భావకవిత్వంలో  ఆత్మాశ్రయ వాదం, ఊహా ప్రేయసులు, అమలిమ శృంగారం, ప్రకృతి వర్ణనలు, స్మృతి కవిత్వాలు ముఖ్యమైనవి.  కాటూరి, విశ్వనాధ,  నండూరి వంటి ఎంతోమంది కవులు భావకవితలలో వెలిగారు.. రాయప్రోలు, దేవులపల్లి వంటి వారు  భావకవిత్వాన్ని వెలిగించి  తమదైన ముద్ర వేసారు. పఠాభి  ఫిడేలు రాగాల డజన్' గేయాలు భావకవిత్వం మీద తిరుగుబాటుగా పరిగణించవచ్చు.  శ్రీరంగం శ్రీనివాసరావు కూడా 1930లో శ్రీ శ్రీగా మారకముందు భావకవిత్వం రాసిన వాడే.

1980 ప్రాంతం నుండే కొరియా కవిత్వం ప్రపంచ భాషల్లోకి అనువాదం అవుతున్నది. తమనుతాము కవులుగానే వియత్నామీయులు ఎప్పుడూ భావించుకుంటారు. వియత్నాం మొదటినుండి ఒక యుద్ధ్భూమి. వియత్నాం యుద్ధ కవితలను అక్కడివారే కాదు, ప్రపంచవ్యాప్తంగా కవులు రాశారు.


Wednesday, February 21, 2024

Indian Movie Trends

TALENT :  golkonda school,  paduta tiyyaga,  boys,  nenu inthe,   nenu unnanu 

FAMILY  : ummadi kutumbam, adarsha kutumbam,  sansaram oka chadarangam

LOVE : prema sagaram, tellagulabeelu   Prema,   premapelli,   preminchu pelladu, 

UNEMPLOYMENT :  ee chaduvulu maaku  vaddu,   punaadi   rallu,   alakalirajyam, manishi rodduna

CORRUPTION   sardarpaparayudu ,  gentleman,  shivaji

POLITICAL BRUTALITY ,  pratighatana,  assembly rowdee,  m dharmaraju  operation duryodhana

PARENTS' BRUTALITY ,  premakhaidi,   prema,  premayuddham,  nuvvu nenu,  dil

REVANGE  annadammula anubandham,  pagasaahistaa , AVEKALLU

SECRET AGENT/ DETECTIVE   agent gopi ,  goodachari 116 

SCIENCE MOVIES ; ADITY 369 , NANI 

DESOLATION : sreeranganeethulu, pandanti jeevatham   

SUSPICION : PREMALEKHALU  MUTYALMUGGU , ARTHANGI 

SEPERATION : ILLAU   chirunavvutho