Sunday, September 1, 2024

భాషకి అలంకారం అక్షరమా శబ్దమా ?

 చంపక మాలలో  పద్యాన్ని మొదట  ఇలా రాసాను  

చంపకమాల పద్యంలో నజ భజ జ జ ర అనే గణాలు ఉండాలి. 1వ అక్షరానికి 11 వ అక్షరానికి యతి మైత్రి కుదరాలి అనే నియమాలు ఉన్నాయి. క్రింది చంపకమాల 2వ పద్యంలో  అన్ని నియమాలు సరిగానే ఉన్నాయి  కానీ  మొదటి పద్యంలో 2వ పాదంలో యతి మైత్రి  క-కు  హల్లుల వరకూ సరిపోతుంది.  అచ్చు లకు సరిపోదు.  ఇది చాలా సూక్షమైన లోపం.   

 (మొదటి అక్షరంగా   కి వచ్చి నపుడు 11 వ అక్షరం  కె  కానీ గె కానీ రావచ్చు.)  

కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్  -  ఈ పాదం లో "కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్ మార్చేస్తే పద్యం అందం పోతుంది. కు అనే అక్షరం ఒక్కటి ముట్టుకుంటే ఆ తరువాత వచ్చే అన్ని పదాలు మార్చాలి.   మొదటి పద్యం చూడండి. ఇలా ఉంటుంది.   



చ . అనువు గవేడ భారతి  అహార్య మహత్వ కవిత్వ శక్తతన్ 

  కినుక మువీడి నిచ్చెను కుశాగ్ర రసజ్ఞ నవచై  తన్యమున్

 కనక మునీకృ ప  భృగువు గాదె సనాతని దివ్య బాసటన్ 

మనమున బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్


 రెండవపాదంలో మొదటి అక్షరాన్ని సరిచేసి రాసాను . రెండవ సారి పద్యం ఇలా ఉంటుంది.


చ . అనువు గవేడ భారతి  అహార్య మహత్వ కవిత్వ శక్తతన్  

 గొనబ  గుభాష  యునిచ్చె    కుశాగ్ర రసచై     తన్యమున్   

కనక మునీకృ ప  భృగువు గాదె సనాతని దివ్య బాసటన్  

మనము  న బుట్టు పద్యముల నిత్తు తల్లికి నివాళి నిత్యమున్


కానీ మొదటిసారి రాసిన పద్యమే బాగుంటుంది. కారణం శబ్దం ముందు ఆ సూక్ష్మ లోపం ఒడిపోతుంది.  పోతన భాగవతం లో కూడా అక్కడక్కడా ఛందస్సు లో కాంప్రమైజ్ అయ్యాడు. మహాను భావుడు ఆయన ముందు నేనెంత ? 


(అంటే మనోజ్ఞమైన భాష అని అర్థం)




No comments:

Post a Comment

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...