Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, October 19, 2025

జర్మన్ రైమ్స్ లేదా డోయిచ్ఛ రైమ - Need for New Rhymes

 జర్మన్ రైమ్స్ లేదా డోయిచ్ఛ రైమ - కొత్త నీరు 

పూలబాల ఇప్పుడు కొత్తగా  రైమ్స్ ఎందుకు రాసారో   కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

పాతరైమ్స్ అర్థాలు తెలిస్తే షాక్ అవుతారు  కొత్తనీరు అవసరం అంటారు. 


జర్మన్ లో  నేను చిన్న పిల్లలకి  రైమ్స్ రాసాను అని స్నేహితుడికి తెలుగులో చెపితే "ఆ దేశస్తులు ఎవరో రాసిన వాటిని సేకరించి ముద్రిస్తున్నాన్నావా ?" అన్నాడు  ఎవరో రాసిన వి కాదు నేనే జర్మన్ రైమ్స్  రాసాను అన్నాను. ఏంటి నువ్వే రాసావా ? అన్నాడు.  "ఎవరో రాసిన రైమ్స్ ని ప్రచురించలేదు. సొంత గా రైమ్స్ రాసాను " అని చెప్పాను. అప్పుడు అర్థం అయ్యింది. నేను రైమ్స్ రాశానని.  


చాలామందికి  రైమ్స్ ఎందుకు రాయడం? అనిపిస్తుంది .  రైమ్స్  ఇప్పుడు రాయడమేమిటి ఎప్పుడో రాసినవి ఉన్నాయి కదా ? అనిపిస్తుంది. అప్పటి రైమ్స్ అర్థాలు వాటి వెనుక ఉన్న కథలు తెలుసుకుంటే కొత్త రైమ్స్ అవసరం ఉందనిపిస్తుంది.  


                                                  

ప్లేగు, మధ్యయుగాలనాటి  పన్నులు, మతపరమైన హింస, వ్యభిచారం: చిన్న వయసులో పరిచయం చేయాల్సిన  అంశాలు  కావు. రైమ్స్ వెనక ఉండే కథలు  ఇవే.  నేటికీ కూడా  ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల ఈ  నర్సరీ రైమ్‌లను పాడుతున్నారు. పాఠశాలలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు  ఈ విషయాలను  తెలుసుకోలేకపోతే  పిల్లలకి ఎలా తెలుస్తుంది?

 మీరు రైమ్స్ ని  కొంచెం లోతుగా తవ్వితే,  ఆశ్చర్యకరమైన  కథలను బయటకొస్తాయి. చెట్ల నుండి పడిపోయే పిల్లలు సెంట్రల్ లండన్‌లో తలలు నరికివేయబడుతున్న వాళ్ళు, జంతువులను సజీవంగా వండడం  ఈ అంశాలను పసిపిల్లలతో పాడించడం సముచితకాదు. 

 “బా, బా, బ్లాక్ షీప్” అనేది 1275లో ప్రవేశపెట్టబడిన ఉన్నిపై పన్ను  గురించి.  కొన్ని పాఠశాలలు తరగతి గదులలో దీనిని పునరావృతం చేయకుండా నిషేధించారు కూడా. 


గూసీ గూసీ  గేండర్   ఇలాటి రైమ్ రాస్తారనిఊహించడం కూడా కష్టం

Goose-a goose-a gander, Where shall I wander? Up stairs and down stairs,
In my lady's chamber; There I met an old man, Who wouldn't say his prayers,                        

 So I took him by his left leg,  And threw him down the stairs

అక్కడ నేను ఒక వృద్ధుడిని కలిశాను  అతడు    ప్రార్థనలు చేయడు, కాబట్టి నేను అతని ఎడమ కాలు పట్టుకుని పట్టుకు అతన్ని మెట్లపై నుండి క్రిందికి విసిరేశాను

కొంతమంది ఈ పద్యం  Priest holes  సూచిస్తుందని చెపుతారు  - రాజు హెన్రీ VIII, అతని పిల్లలు ఎడ్వర్డ్, క్వీన్ ఎలిజబెత్ కింద హింసల సమయంలో  కాథలిక్ పూజారులు దాగునేవారు . ఒకసారి పూజారిని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లి  మెట్లపై నుండి విసిరివేసేవారు.  


దీని వెనుక మరో కథ ఏంటంటే ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XVI మరియు అతని భార్య మేరీ ఆంటోయినెట్ , వీరిద్దరూ రాజద్రోహానికి పాల్పడినట్లు తేలింది మరియు తరువాత శిరచ్ఛేదం చేయబడ్డారు.


4. లండన్ వంతెన పడిపోతోంది  1744

“లండన్ వంతెన పడిపోతోంది” అనేది 1014 వైకింగ్ దాడి లేదా పాత వంతెన పడిపోతుందని నిజంగానో  భయంతో  ఆరోజు పరిస్తుతులను భయాలను రైమ్స్ రూపంలో రాసుకున్నారు.  అవి ఇప్పటి తరాలకి  , అందునా మన పిల్లలకి అవసరమా ?


5. మేరీ, మేరీ, కాంట్రరీ  - 1744


 మేరీ, మానసిక రోగని వర్ణించడానికి ఒక పదం . మేరీ, మేరీ, కాంట్రరీ  తోటపని సలహా   లాగా ఉండే  ఈ ప్రసిద్ధ ఆంగ్ల నర్సరీ రైమ్ వాస్తవానికి  ఇంగ్లాండ్ క్వీన్ మేరీ  I ( బ్లడీ మేరీ) యొక్క నరహత్య స్వభావాన్ని వివరిస్తుంది.   ఆమె 1553 నుండి 1558 వరకు రాణిగా  వందలాది మంది ప్రొటెస్టంట్లను ఉరి తీయించింది . (వెండి గంటలు మరియు కాకిల్ షెల్స్ వాస్తవానికి హింస పరికరాలు, తోట పని  పరికరాలు కాదు.)

6. త్రీ బ్లైండ్ మైస్ // 1805


త్రీ బ్లైండ్ మైస్” అనేది బ్లడీ మేరీ పాలనకు మరొక  చెప్పవచ్చు,  ప్రొటెస్టంట్ బిషప్‌ల  హ్యూ లాటిమర్, నికోలస్ రాడ్లీ మరియు కాంటర్‌బరీ ఆర్చ్ బిషప్, థామస్ క్రాన్మర్— లు సజీవంగా దహనం చేయబడ్డారు   త్రీ బ్లైండ్ మైస్ అనే పేరు లో    అంధత్వం వారి మత విశ్వాసాలను సూచిస్తుంది. 

7. హియర్ వుయ్ గో రౌండ్ ది మల్బరీ బుష్ // 1840


“హియర్ వుయ్ గో రౌండ్ ది మల్బరీ బుష్” తరచుగా పిల్లల ఆటలో భాగంగా పాడతారు. ఇంగ్లాండ్‌లోని వేక్‌ఫీల్డ్ జైలు మాజీ గవర్నర్, . డంకన్, ఈ పాట మల్బరీ చెట్టు చుట్టూ వ్యాయామం చేసే  మహిళా ఖైదీలతో ఉద్భవించిందని సూచించారు. 


8. రింగ్ అరౌండ్ ది రోజీ - 1665 

పద్యం లండన్‌లోని గ్రేట్ ప్లేగును సూచిస్తుంది. “రోజీ” అనేది  కప్పి ఉంచిన దద్దుర్లు, వారు “పోసీలతో నిండిన జేబుతో కప్పడానికి ప్రయత్నించేవారు .” ప్లేగు దేశ జనాభాలో దాదాపు 15 శాతం మందిని చంపింది,   పద్యంచివర్లో —“యాషెస్! యాషెస్! మనమందరం కిందపడిపోతాము”—అలా దాచవద్దని చెప్పేవారు . 


అందుకే నేను రాసిన రైమ్స్ లో అమ్మ నాన్న , చంద్రుడు, సూర్యుడు , మేఘం , సీతాకోకచిలుక , వంటి ప్రకృతి అంశాలను    ఉపాద్యాయుడు , స్నేహితులు  స్కూల్ వంటి సామాజిక అంశాలను చక్కటి అంత్య ప్రాసతో పాడుకోడానికి వీలుగా రాసాను. స్వస్తి. 

  

Friday, October 17, 2025

Journalists

 1948 లో పుట్టి  70 లో  వృత్తిలో   మెరిసి ప్రస్తుతం తలా నెరిసిన ఒక వృద్ధ జర్నలిస్ట్.  సోషియలైట్  ఈవెనింగ్స్ , స్నాప్ షాట్స్  బాలీవుడ్ నైట్స్  ఇంసాటియబుల్ అనే కామపూరిత   పుస్తకాలు  రచించిన శోభా డే ఒక నవలా రచయిత్రి మరియు కాలమిస్ట్.   ఆమె తన కల్పిత రచనలలో సామాజికవేత్తలు మరియు లైంగికతను చిత్రీకరించినందుకు బాగా ప్రసిద్ధి చెందింది, ఈమె భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ద్వేషాన్ని మాటల్లో, తన రాతల్లో వెళ్ళగక్కుతుంది!  పాశ్చాత్య సంస్కృతి కి  వకాల్తా పుచ్చుకుని భారత సంస్కృతి సంప్రదాయాలను తూలనాడే  శోభా డే   విచ్చలవిడి తనాన్ని కోరుకుంటుంది. స్త్రీలకి సెక్స్ స్వేచ్ఛ ఉండాలని బల్లగుద్ది వాదిస్తుంది!   



చెత్త ఆర్టికల్స్ తో కాంట్రవర్సి ట్వీట్ లతో  చక్కటి  పేరు సంపాదించుకు న్న  ఈవిడ 

"ఒకవేళ నేను రాణీ పద్మావతి స్థానంలో ఉంటే "జౌహార్" పాటించేదానిని కాదు!" అంటున్న ఈ శోభా డే ఒక ఆడ జర్నలిస్టు!  ఈవిడ రాణి పద్మావతి పట్ల చేసిన వ్యంగ్యం గా చేసిన వ్యాఖ్యలకి మరొక మహిళా జర్నలిస్టు ఇచ్చిన కౌంటర్ ఏమంటే. "అద్దంలో నీ మొఖం చూసుకో..!ఒకవేళ నువ్వే పద్మావతి ఐతే, అల్లాఉద్దీన్ ఖిల్జీ యే "జౌహార్" పాటించేవాడు!"


రానా అయ్యుబ్ 

రాణాకు ఆ బిరుదు ఇవ్వలేదు కానీ అందరూ ఆమెను జాతి వ్యతిరేకిగా గుర్తించారు. ఇటీవల ఆమె కోవిడ్ 19 కోసం కొంత డబ్బు సేకరించినందుకు అరెస్టు చేయబడింది, కానీ ఆమె ఎక్కువ డబ్బును సొంత ఉపయోగం కోసం ఉపయోగించింది ED ఆమెను అరెస్టు చేసింది. ఆమె అతిపెద్ద అవకాశ వాది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత, ఆమె గుజరాత్ ఫైల్స్ ప్రమోషన్ ప్రారంభించింది. పాఠకులు కూడా అదే పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.


ఆమె జాతి వ్యతిరేకి మరియు జాతి వ్యతిరేకిగా పరిగణించబడుతుంది. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం జాతి వ్యతిరేకులకు కూడా సమాన హక్కులను అందిస్తుంది. ఈ వాక్ స్వాతంత్య్ర నిబంధనలే ఈ జాతి వ్యతిరేకులను మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధైర్యం చేస్తున్నాయి. రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ వారికి దేశభక్తి లేదు. ఆమె ఎల్లప్పుడూ ప్రధాన మంత్రి మోడీని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆమె మతం ముందు తన దేశం తర్వాతే ముఖ్యం. అలా జరిగినప్పు డల్లా ఆ వ్యక్తిని జాతి వ్యతిరేకి అంటారు. ఆమెకు ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వేరే పని లేదు

ఒక భారతీయ ఉదారవాదిగా, ఆమె చాలా పక్షపాతంతో ఉందని నేను భావిస్తున్నాను, ఆమె బాధితులుగా మారే అదే ఎజెండాను అనుసరిస్తోంది. గుజరాత్ అల్లర్లు ఎందుకు జరిగిందో కూడా ఆమె దర్యాప్తు చేసి ఉంటే నాకు నచ్చేది. అదే సమయంలో లవ్ జిహాద్, ముస్లింల దళితుల చికిత్సలు, ముస్లిం తీవ్రవాదం మరియు భారతదేశంలో ముస్లిం యువత ఐసిస్ జిహాద్‌లో ఎలా చేరుతున్నారు అనే విషయాలను ఆమె పరిశోధించి ఉంటే బాగుండేది . కేరళలో ముస్లింలు కాని వారిని ముస్లింలు ఎందుకు హింసిస్తున్నారు, క్రైస్తవ ఫాదర్ చేతులు నరికివేయడం పరిశోధించి ఉంటే .బాగుండేది 

కాశ్మీరీ పండిట్ల అంశాన్ని కవర్ చేయడం ..  ఆమె వ్యాసాలన్నీ ముస్లింలు బాధితులు కావడం గురించి మరియు ఆమె ముస్లింల  దురాక్రమణదారులుగా వదిలేయాలని ఎంచుకుంటుంది, దీనివల్ల చాలా మంది బాధితులుగా మారారు మరియు దారుణమైన విషయం ఏమిటంటే, ఆమె ముస్లిం అనే ముసుగులో చేసింది. ఆమె భారతదేశంలోని అతిపెద్ద మైనారిటీగా, వారు అత్యల్ప విద్యా రేటును కలిగి ఉండటం, అతి చిన్న మైనారిటీ కంటే కూడా తక్కువ, లేదా ముస్లిం సమాజంలో జన్యు వ్యాధులు లేదా ముస్లింలను



మమతా కులకర్ణి సినిమా రంగంలో పనిచేస్తున్నప్పుడు మమతా కులకర్ణికి చాలా మంది గ్యాంగ్‌స్టర్ల తో పరిచయం ఉంది. డాన్ చోటా రాజన్ ఫోన్ కాల్ కారణంగా, మమతా కులకర్ణికి చైనా గేట్‌తో సహా అనేక సినిమాల్లో పని దొరికిందని చెబుతారు.


ఆ తర్వాత మమతా పేరు అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ముడిపడి ఉంది. విక్కీ గోస్వామితో సంబంధం కలిగి ఉంది. ఇది 1997లో సౌదీ అరేబియాలో విక్కీ గోస్వామికి 2000 కోట్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు. 25 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, కానీ ఇస్లాంను స్వీకరించి నందు కు మరియు ఐదు సంవత్సరాల తర్వాత అతను విడుదలయ్యాడు.


జైలులో ఇస్లామిక్ సంప్రదాయంలో మమతా కులకర్ణిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ కెన్యాలో నాణ్యమైన సమయాన్ని గడిపారు. మమతా కులకర్ణి ఇప్పుడు విక్కీని వివాహం చేసుకున్నారనే వార్తలను ఖండిస్తున్నప్పటికీ, విక్కీ పట్ల తనకున్న ప్రేమను ఆమె ఖండించలేదు, మమతా 25 సంవత్సరాల తర్వాత గత సంవత్సరం భారతదేశానికి తిరిగి వచ్చింది. 

ఆమెను కిన్నార్ అఖారా మహామండలేశ్వర్‌గా నియమించారు. తరువాత కిన్నార్ అఖారాలో ఉద్రిక్తత తలెత్తడంతో ఆమె దీని నుండి కూడా తొలగించబడింది. ఇప్పుడు చరఖారీ మహామండ లేశ్వరుడిగా మారడానికి ₹10 కోట్లు చెల్లించారని ఆరోపించబడింది.

₹10 కోట్లు మర్చిపో; నా దగ్గర ₹1 కోటి కూడా లేదు. ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. నేను ఎలా బతుకుతున్నానో మీకు తెలియదు. నా దగ్గర డబ్బు లేదు. నన్ను మహామండ లేశ్వరు డిగా చేసినప్పుడు నా గురువుకు 'దక్షిణ'గా సమర్పించడానికి నేను ఎవరి దగ్గరైనా ₹2 లక్షలు అప్పుగా తీసుకోవలసి వచ్చింది)

Thursday, October 16, 2025

అడవి బాపిరాజు నారాయణ రావు - సమీక్ష

స్వాతంత్య్ర  సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త ఐన బాపిరాజు భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ సాహిత్యంపై ఆసక్తి తో రచనలు చేసేవారు .  1922 లో భారత స్వాతంత్య్ర  సంగ్రామంలో పాల్గొని జైలుకి వెళ్లారు  జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారు . ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. అదే సమయంలో కథలు రాశారు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు . 1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశారు . 


నారాయణరావు సాంఘిక నవల మాత్రమే కాక  శాస్త్రీయ సాహిత్యం( క్లాసికల్ లిటరేచర్) కూడా. 

ఇది ఒక ప్రేమ కథ:  కథా నాయకుడు నారాయణ రావు. నాయిక శారద .

నారాయణ రావు కథ ఏవరేజ్ గ  ఉంటుంది. భాష సూపర్ హిట్  

ప్రేమ అంటే పెళ్లి అయిపోయిన తరువాత ప్రేమ. పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి పెళ్ళికి ముందు ప్రేమఏం  ఉండదు.  


పెళ్లి తరువాత చెప్పుడు మాటలు విని మొగుణ్ణి  దగ్గరకి చేరనివ్వని భార్య శారదని  భరించడం ముఖ్య కథాంశం. 


కథా నాయకుడు నారాయణ రావు.

నారాయణరావు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక పెద్ద ధనిక భూస్వామి బ్రాహ్మణ కుటుంబానికి చిన్న కుమారుడు. అతను చెన్నైలో న్యాయశాస్త్రం చదువుతు న్నాడు.  నారాయణ రావుని బాపిరాజు అర్జునిడితో పోలుస్తారు,  ఎప్పుడూ ఖద్దరు బట్టలు కట్టుకునే గాంధేయవాది గా చూపిస్తాడు. నారాయణరావు తాను ప్రయత్నించే ప్రతిదానిలోనూ రాణిస్తాడు - ఆయన చదువులో మొదటివాడు,   కర్ణాటక శైలిలో వయోలిన్ వాయించడంలో  క్రీడలలో సమర్ధుడు. 


నారాయణరావు మిత్రులు ; లక్ష్మీపతి , రాజారావు , పరమేశ్వరరావు , ఆలం. 

 నారాయణరావు , ఆలం సాహెబ్ ఎఫ్ ఎల్ చదివారు,  రాయాజేశ్వరరావు ఎం బి బి ఎస్,  పరమేశ్వరమూర్తి కవి చిత్రకారుడు గాయకుడు ,  లక్ష్మీపతి  నారాయణరావు బావ.. 


కథా నాయిక శారద తల్లి విలన్  

ఆ చెప్పుడు మాటలు చెప్పేది శారద తల్లి. నారాయణ రావుది  సంపన్న కుటుంబమే అయినా  శారదా తండ్రి అంత  కాదు. అందుకే శారదా తల్లికి    నారాయణరావు కుటుంబంతో సంబంధం నచ్చదు. వారంటే చిన్న చూపు  అందుకే  శారద మనస్సును విషపూరితం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది.  దారుణంగా  కూతురికాపురంలో నిప్పులు పోసేస్తుంది. 

 

ఇంతకన్నా దారుణం ఏంటంటే  శారద ఏదో ఒక రోజు తనను ప్రేమిస్తుందని నమ్మి నారాయణరావు భార్య దగ్గరికి రానివ్వకపోయినా  తాక నివ్వకపోయినా  సహనంతో భరిస్తాడు. రచయిత   కథానాయకుడి ఓర్పు నిబద్దత గురించి గొప్పగా చూపిస్తున్నానని అనుకుంటాడు . హద్దు దాటిన సహనం కథ చివరిదాకా సాగుతూ  వెగటుగా అనిపిస్తుంది. రోజు ఒక చెంప వాయిస్తుంటే  రెండో చెంప చూపుతున్నట్ట నిపిస్తుంది. మొగుడంటే కనీసగౌరవం లేకుండా అతడి నుంచి తప్పించుకునే భార్య శారద పట్ల అంత  సహనం అపాత్ర దానంలా చేతకాని తనంగా కూడా అనిపిస్తుంది. మన పాత తెలుగు సినిమాల్లో కోడలు  అత్త అవమానించినా, హింసించినా , చంపేస్తున్నా నోరెత్తదు.. నారాయణరావు   అంత కంటే ఎక్కువ సహనం చూపిస్తాడు.


అనేక పాత్రలు ఉన్నాయి. కథాంశాలు మరియు ఉప కథాంశాలు ఉన్నాయి.అసలు కథ నడవ కుండా ఉపకథలు తగులు కుంటాయి. అలా అని ఉపకథలేవీ  ఉన్నతమైన కథలు కాదు. కుటుంబాలు,  రాజవంశాల  రాజకీయాల గురించి చర్చలు , సాహిత్యం, సంగీతం మరియు కళల గురించి  చర్చలు కొంత విసుగు తెప్పిస్తాయి. 


అన్ని ఉప కథాంశాలు మరియు చాలా పాత్రలతో,  నారాయణరావును మొదటి నుండి పాఠకుల దృష్టి మధ్యలో చాలా దృఢంగా ఉంచాడు రచయిత. నారాయణరావు ఆకర్షణీయమైన వ్యక్తిగా , బాపిరాజు తరచుగా ఆయనను పురాణ కథానాయకుడు అర్జునుడితో పోలుస్తాడు.  అతడి ద్వారా న్యాయంపై తన అభిప్రాయము  ఇలా చెపుతాడు  " న్యాయము ధర్మ దూరము. అసత్యం కలపందే  సత్యం నెగ్గదు."  


తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు - విశ్వలపురంజమీందారు

రైలు ప్రయాణం తో కథ మొదలౌతుంది .  గవర్నరు గారికి స్వాగతము పలుకుటకు రాజమండ్రి పోవు బృందంలో  ఒకడు తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు ఒకరు. ఆయన స్వరాజ్య సముపార్జన యజ్ఞ మందు పాల్గొనిన దేశభక్తుడు  సాంప్రదాయ వాది.   అతడు నారాయణ రావు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారమ్ పై చూసి,  నారాయణ రావు ఎక్కిన పెట్టిలో ఎక్కి  స్నేహితులతో )  ప్రయాణిస్తున్న నారాయణరావును చూసి  తన కుమార్తె శారదకు చక్కని పెండ్లికొడుకగునని  భావించి  అతడి పేరు  ఇంటిపేరు,  గోత్రము  అడిగి చివరిగా  అతడికి  వివాహంమైనదా లేదా అని అడుగును. నారాయణరావు కాలేదని సమాధానమిచ్చును.  




Friday, October 10, 2025

French poem of life

   ఎల్లిపోయినవా బాపు ! Tu es parti, Bapu.

కన్నోళ్ల కడుపుకై ఎన్ని ఖార్కానాలు కలియతిరిగావో     

 వారి ఆకలి తీర్చడానికి ఎన్నెన్ని అంగళ్లకు ఎదురీదావో 

చివరికీ,,,ఈ బతుకు బజార్లోనుండి 

ఈ జిందగీ చౌరస్తాలోనుండి ఎల్లిపోయినవా బాపు 

ఎవరినీ నొప్పించకుండా 

ఏ చేయి సాయానికి ఎదురుసూడకుండా 

ఎదిగొచ్చిన కొడుకుల భుజాలపై భారంకాకుండా 

ఏ కోడలి నాలికపైన కూడా ఒక్క చెడ్డ మాటైనా దొర్లకుండా

కట్టుకున్నదాని కొంగుకు కడివెడు కన్నీళ్లు మూటగట్టి ఎల్లిపోయినవా బాపు !!


Combien d'épreuves as-tu endurées, 

combien d'usines as-tu cherchées pour nourrir tes enfants ? 

Combien de difficultés as-tu dû affronter pour un seul repas ?

Enfin, de ce marché de la vie

De ce carrefour de la vie

 tu as disparu, Bapu.

Sans blesser personne

Sans attendre d'aide

Sans peser lourd sur les épaules des fils adultes

Sans écouter un seul mot grossier de les lèvres d'aucune bru

 laissant les larmes de celle qui avait été ligotée,

 tu es parti Bapu!!

                               

Wednesday, September 17, 2025

JEAN PAUL SATRE

 జీన్-పాల్  సార్త్ర  ఫ్రెంచ్ తత్వవేత్త, నాటక , నవలా రచయిత,  స్క్రీన్ రైటర్, రాజకీయ కార్యకర్త, జీవితచరిత్రకారుడు, సాహిత్య విమర్శకుడు. ఇతనిని 20వ శతాబ్దపు ఫ్రెంచ్ తత్వశాస్త్రం, మార్క్సిజం లో ప్రముఖ వ్యక్తిగా పరిగణిస్తారు. సార్త్ర తత్వశాస్త్రంలో అస్తిత్వవాదం ( ఫినామెనాలజి) కి సంబంధించి కీలక వ్యక్తులలో ఒకరు.


జీన్-పాల్ సార్త్ర 1905 లో  పారిస్ లో ఫ్రెంచ్ నావికాదళ అధికారి జీన్-బాప్టిస్ట్  అన్నె-మేరీలకు ఏకైక సంతానంగా జన్మించాడు.  సార్త్రకి రెండు సంవత్సరాల వయస్సులో అతని తండ్రి అనారోగ్యంతో మరణించాడు. అన్నే-మేరీ మెయుడాన్ లోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లి, అక్కడ ఆమె తన తండ్రి చార్లెస్ ష్విట్జర్ సహాయంతో సార్త్ర ను పెంచింది, ఆమె సార్త్రకి  చాలా చిన్న వయస్సులోనే శాస్త్రీయ సాహిత్యానికి పరిచయం చేసింది. ఎకోల్ నార్మల్ లో జేరినప్పటి మొదటి నుండి, సార్త్రే అల్లరి వాడుగా ఉన్నాడు, చిలిపి చేష్టలు చేసేవాడు. 


1927లో, ఇతను జార్జెస్ కాంగుయిల్హెమ్తో కలిసి పాఠశాల రెవ్యూలో గీసిన అతని సైనిక వ్యతిరేక వ్యంగ్య కార్టూన్, ముఖ్యంగా ఆ పాఠశాల అధికారి గుస్టావ్ లాన్సన్ను కలచివేసింది.  అదే సంవత్సరంలో, తన సహచరులు నిజాన్, లారౌటిస్, బెయిల్లౌ, హెర్లాండ్లతో కలిసి, చార్లెస్ లిండ్బర్గ్ విజయవంతమైన న్యూయార్క్ సిటీ-పారిస్ విమానాన్ని అనుసరించి అతను ఒక చిలిపి చేష్టను మీడియా వాళ్ళను పిలిచి నిర్వహించాడు. లిండ్బర్గ్ కు ఎకోల్ గౌరవ పట్టా ఇవ్వబోతోంది అని మీడియా కు చెప్పాడు. లు పతి  పారిసియన్ సహా అనేక వార్తాపత్రికలు మే 25న ఈ కార్యక్రమాన్ని ప్రకటించాయి. పాత్రికేయులు, ప్రేక్షకులతో సహా వేలాది మంది, వారు చూస్తున్నది లిండ్బర్గ్ మాదిరిగా కనిపించే ఒక స్టంట్ అని తెలియక వచ్చారు.  ఈ సంఘటన లాన్సన్ రాజీనామా చేయడానికి దారితీసింది.


ఆయన రచనలు సామాజిక శాస్త్రం, సాహిత్య అధ్యయనాలను ప్రభావితం చేశాయి. 1964లో నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్నాడు. అయితే దానిని తిరస్కరించడానికి ప్రయత్నించాడు. తాను ఎప్పుడూ అధికారిక గౌరవాలను తిరస్కరించానని, "ఒక రచయిత తనను తాను ఒక సంస్థగా మార్చుకోకూడదు" అని చెప్పాడు.


సార్త్రకి తోటి అస్తిత్వవాది, తత్వవేత్త, స్త్రీవాది సిమోన్ ద బువా (Simone de Beauvoir) తో బహిరంగ సంబంధం ఉండేది. సార్త్ర, ఇంకా దిబువా  కలిసి సాంస్కృతిక సామాజిక ఆచార వ్యవహారాలను సవాలు చేశారు, 


 ఈ ఇతివృత్తం అతని ప్రధాన తాత్విక రచన 'బీయింగ్ అండ్ నథింగ్నెస్'


Sully Prudhomme 1901

 Les principales œuvres poétiques de Sully Prudhomme, poète lauréat du prix Nobel de littérature en 1901, incluent Stances et Poèmes (1865), Les Épreuves (1866), Les Solitudes (1869), La Justice (1878), Le Prisme (1886), et Le Bonheur (1888). Ses poèmes traitent souvent de l'analyse de l'âme et de la quête d'un idéal, avec un style d'une grande précision morale. 


The principal poetic works of Sully Prudhomme, a poet who won the Nobel Prize for Literature in 1901, include Stances and Poems (1865), The Trials (1866), Solitudes (1869), Justice (1878), The Prism (1886), and Happiness (1888). His poems often deal with the analysis of the soul and the quest for an ideal, with a style of great moral precision.


Notable poetic works:

Stances and Poems (1865): A collection of his early works.

Les Ordeals (1866): Poems exploring difficult and painful themes.

Les Solitudes (1869): Poems exploring feelings and inner thoughts.

Les Destins (1872): A long poem addressing the notion of destiny and fate.

La Justice (1878): A committed poem on justice and social ideals.

Les Vaines tendresses (1875): A collection of poetry.

Le Prisme (1886): A collection of miscellaneous poems.

Le Bonheur (1888): A philosophical and poetic work on happiness.

Épaves (1908): A collection of posthumous poems.


Œuvres poétiques notables :

Stances et Poèmes (1865) : Recueil de ses premières œuvres.

Les Épreuves (1866) : Poèmes explorant des thèmes difficiles et douloureux.

Les Solitudes (1869) : Poésies explorant les sentiments et les pensées intérieures.

Les Destins (1872) : Poème long abordant la notion du destin et de la fatalité.

La Justice (1878) : Poème engagé sur la justice et les idéaux sociaux.

Les Vaines tendresses (1875) : Un recueil poétique.

Le Prisme (1886) : Recueil de poésies diverses.

Le Bonheur (1888) : Une œuvre philosophique et poétique sur le bonheur.

Épaves (1908) : Recueil de poèmes posthumes. 



Les Solitudes » de Sully Prudhomme est un recueil de poèmes centré sur l'introspection, la recherche de l'idéal, et l'élévation spirituelle et intellectuelle, caractéristiques de l'art de l'auteur. Le poète, qui a remporté le prix Nobel de littérature en 1901, explore souvent les thèmes du scepticisme dolorieux et du rationalisme inquiet, comme en témoigne son intérêt pour la nature, l'amour et la mort, présents dans d'autres recueils. 


Sully Prudhomme's "Solitudes" is a collection of poems centered on introspection, the search for the ideal, and spiritual and intellectual elevation, characteristics of the author's art. The poet, who won the Nobel Prize for Literature in 1901, often explores themes of sorrowful skepticism and restless rationalism, as evidenced by his interest in nature, love, and death, present in other collections.


Thèmes principaux :

Analyse intérieure et quête de l'idéal :

Prudhomme se penche sur le monde intérieur, ses doutes et ses aspirations, une démarche qui se reflète dans le titre même du recueil.


Main Themes: Inner Analysis and the Quest for the Ideal:

Prudhomme examines his inner world, his doubts and aspirations, an approach reflected in the very title of the collection.


L'œuvre s'inscrit dans une recherche d'élévation, aussi bien sur le plan de la connaissance savante que de la spiritualité. 

Intellectual and Spiritual Ascent:

The work is part of a quest for elevation, both in terms of scholarly knowledge and spirituality.


Rationalisme et scepticisme :

La sensibilité de Prudhomme, marquée par le scepticisme et une quête d'analyse rationnelle, influence la manière dont il aborde les questions existentielles. 


Rationalism and Skepticism:

Prudhomme's sensibility, marked by skepticism and a quest for rational analysis, influences the way he approaches existential questions.


Une œuvre de l'analyse :

« Les Solitudes » se distinguent par la réflexion profonde que l'on retrouve dans d'autres œuvres de Prudhomme, faisant de lui un représentant du rationalisme inquiet et du doute humain. 

René François Armand Prudhomme, dit Sully ... - FranceArchives

Premier prix Nobel de littérature en 1901, Sully Prudhomme, de son vrai nom Armand Prudhomme, fut le poète du rationalisme inquiet et du scepticisme douloureux.


A work of analysis:

"Les Solitudes" is distinguished by the profound reflection found in other works by Prudhomme, making him a representative of restless rationalism and human doubt. René François Armand Prudhomme, known as Sully... - FranceArchives

The first Nobel Prize winner for Literature in 1901, Sully Prudhomme, whose real name was Armand Prudhomme, was the poet of restless rationalism and painful skepticism.

Sunday, September 14, 2025

Kalidas Meghdoot

కాళిదాసు ఒక ప్రఖ్యాత ప్రాచీన భారతీయ సంస్కృత నాటక రచయిత మరియు కవి.  భారతదేశపు గొప్ప సాహిత్య ప్రముఖులలో ఒకరైన కాళిదాసు  4వ శతాబ్దం కి చెందినవాడని  బహుశా గుప్తుల కాలం కవి అని అంచనాయే తప్ప  అతని జీవితం చాలావరకు తెలియదు.  అభిజ్ఞాన శాకుంతలం, కుమారసంభవ మరియు రఘువంశం వంటి ఇతిహాస కవితలు మరియు మేఘదూత వంటి గేయ కవితలు మానవ భావోద్వేగాలు, ప్రకృతి మరియు భారతీయ సంస్కృతిపై లోతైన అవగాహనను చూపిస్తాయి. సంస్కృత భాషపై ఆయనకున్న పాండిత్యం మరియు తదుపరి భారతీయ సాహిత్యం మరియు సంస్కృతిపై ఆయన చూపిన తీవ్ర ప్రభావానికి కూడా ఆయన ప్రసిద్ధి చెందారు.


Kalidasa was a renowned ancient Indian Sanskrit playwright and poet, considered one of the greatest literary figures of India, active between the late 4th and early 5th centuries CE, likely during the Gupta period. His life remains largely unknown, though his works plays like Abhijnanasakuntalam, epic poems such as Kumarasambhava and Raghuvamsa, and lyrical poems like Meghaduta—show a deep understanding of human emotions, nature, and Indian culture. He is also known for his mastery of the Sanskrit language and his profound influence on subsequent Indian literature and culture. 


Kubera, die hinduistische Gottheit des Reichtums und Arbeitgeber der Yakshas, ​​bestraft den Yaksha in Kalidasas Meghaduta für die Vernachlässigung seiner Pflichten und die mangelnde Pflege von Kuberas Lotusgarten. Zur Strafe wird der Yaksha für ein Jahr aus der Stadt Alaka auf den abgelegenen Berg Ramagiri verbannt, wo er sich nach seiner Frau sehnt und ihr schließlich einen Wolkenboten mit einer Liebesbotschaft schickt.


              

Kubera, the Hindu deity of riches and employer of Yakshas, punishes the Yaksha in Kalidasa's Meghaduta for neglecting his duties and failing to properly care for Kubera's lotus garden. As a punishment, the Yaksha is exiled for one year from the city of Alaka to the remote Ramagiri mountain, where he pines for his wife and eventually sends a cloud messenger to her with a message of love. 




Die Erzählung beginnt damit, dass ein Yaksha, der Kubera, dem Gott des Reichtums, dient, für ein Jahr nach Ramagiri verbannt wird, weil er seine Pflichten vernachlässigt hat.


The narrative begins with a Yaksha who serves Kubera, the god of wealth, being banished to Ramagiri for a year due to neglecting his responsibilities. 


Die Wolke als Bote: The Cloud as Messenger:

Während der Monsunzeit entdeckt der Yaksha eine Wolke und bittet sie, seiner geliebten Frau seine Botschaft zu überbringen.


During the monsoon season, the Yaksha spots a cloud and asks it to carry his message to his beloved wife


 अस्त्युत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः ।

पूर्वापरौ तोयनिधी वगाह्य  स्थितः पृथिव्या इव मानदण्डः

అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః ।
పూర్వాపరౌ తోయనిధీ వగాహ్య  స్థితః పృథివ్యా ఇవ మానదండః 


ఉత్తర దిక్కులో దేవతాత్మకుడైన హిమాలయ పర్వతాధిరాజు ఉన్నాడు. తూర్పు మరియు పడమర సముద్రాలలోకి ప్రవేశించి, భూమికి ఒక ప్రమాణదండంలా నిలబడి ఉన్నాడు.


1. कश्चित्कान्ताविरहगुरुणा स्वाधिकारात्प्रमत्तः
शापेनास्तङ्गमितमहिमा वर्षभोग्येण भर्तुः।
यक्षश्चक्रे जनकतनयास्नानपुण्योदकेषु
स्निग्धच्छायातरुषु वसतिं रामगिर्याश्रमेषु।।

కశ్చిత్‌కాంతా-విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తః  

 శాపేనాస్తంగమిత మహిమా సంవత్సర భోగ్యేణ భర్తుః ।  

    యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు        

       స్నిగ్ధ ఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు

అలకానగర యక్షుడు, భార్య నుండి వేరుపడిన బాధతో తన యజమాని శాపం పొందాడు. ఒక సంవత్సరం పాటు రామగిరిలో ఉండవలసి వచ్చింది. సీతాస్నాన పుణ్యమయ జలాలు, మృదువైన వృక్షచ్ఛాయలతో ఉన్న ఆశ్రమాలలో నివాసం ఏర్పరచుకున్నాడు.


  • కశ్చిత్ యక్షః – ఒక యక్షుడు; కాంతా విరహ గురుణా – భార్య వియోగపు భారంతో; స్వాధికారాత్ ప్రమత్తః – తన కర్తవ్యముపై నిర్లక్ష్యము చేసి; భర్తుః సంవత్సర భోగ్యేణ శాపేన – తన ప్రభువు (కుబేరుడు) విధించిన సంవత్సర కాల శాపం వల్ల; ఆస్తంగమిత మహిమా – తన ప్రతాప్ తగ్గిపోయి; జనకతనయా స్నాన పుణ్యోదకేషు – సీతా దేవి స్నానం చేసిన పవిత్ర జలాలలో;  స్నిగ్ధ ఛాయా తరుషు – చల్లని నీడనిచ్చే వృక్షాలలో (ఆశ్రయించి);   రామగిర్యాశ్రమేషు వసతిం చక్రే – రామగిరి పర్వతంలోని ఆశ్రమాలలో నివసించాడు.  

  • 2.  तस्मिन्नद्रौ कतिचिदबलाविप्रयुक्तः स कामी
    नीत्वा मासान्कनकवलयभ्रंशरिक्तप्रकोष्ठः।
    आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुं
    वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं ददर्श।।

  • 3. तस्य स्थित्वा कथमपि पुरः कौतुकाधानहेतो-
    रन्तर्बाष्पश्चिरमनुचरो राजराजस्य दध्यौ।
    मेघालोके भवति सुखिनोऽप्यन्यथावृत्ति चेतः
    कण्ठाश्लेषप्रणयिनि जने किं पुनर्दूरसंस्थे।।

  • 4. प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी
    जीमूतेन स्वकुशलमयीं हारयिष्यन्प्रवृत्तिम्।
    स प्रत्यग्रैः कुटजकुसुमैः कल्पितार्घाय तस्मै
    ‌प्रीतः प्रितिप्रमुखवचनं स्वागतं व्याजहार।।


  • धूमज्योतिःसलिलमरुतां संनिपातः क्व मेघः
    संदेशार्थाः क्व पटुकरणैः प्राणिभिः प्रापणीयाः।
    इत्यौत्सुक्यादपरिगणयन्गुह्यकस्तं ययाचे
    कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।।



    जातं वंशे भुवनविदिते पुष्करावर्तकानां
    जानामि त्वां प्रकृतिपुरुषं कामरूपं मघोनः।
    तेनार्थित्वं त्वयि विधिवशाद्दूरबन्धुर्गतोऽहं
    याञ्चा मोघा वरमधिगुणे नाधमे लब्धकामा।।


    संतप्तानां त्वमसि शरणं तत्पयोद प्रियायाः
    संदेशं मे हर धनपतिक्रोधविश्लेषितस्य।
    गन्तव्या ते वसतिरलका नाम यक्षेश्वराणां
    बाह्योद्यानस्थितहरशिरश्चन्द्रिकाधौतहर्म्या।।


    त्वामारूढं पवनपदवीमुद्गृहीतालकान्ताः
    प्रेक्षिष्यन्ते पथिकवनिताः प्रत्ययादाश्वसन्त्यः।
    कः संनध्दे विरहविधुरां त्वय्युपेक्षेत जायां
    न स्यादन्योऽप्यहमिव जनो यः पराधीनवृत्तिः।।


    तां चावश्यं दिवसगणनातत्परामेकपत्नी -
    मव्यापन्नामविहतगतिर्द्रक्ष्यसि भ्रातृजायाम्।
    आशाबन्धः कुसुमसदृशं प्रायशो ह्यङ्गनानां
    सद्यःपाति प्रणयि हृदयं विप्रयोगे रुणद्धि।।


    मन्दं मन्दं नुदति पवनश्चानुकूलो यथा त्वां
    वामश्चायं नदति मधुरं चातकस्ते सगन्धः।
    गर्भाधानक्षमपरिचयान्नूनमाबध्दमालाः
    सेविष्यन्ते नयनसुभगाः खे भवन्तं बलाकाः।।



    112 तस्मिन्नन्तर्हितमरुनधिं प्राप्य सद्यः प्रियायाः

    संसर्गं मे यदि लभते सन्ततः स्वप्रणीतम् ।

    दुःखस्यास्य त्वमनुपमसख्यस्त्वं च सन्देशवाहः

    सन्तोषं मे जनयसित तदा दुःखितायास्तदीयम् ॥


    తస్మిన్నన్తర్హితమరునధిం ప్రాప్య సద్యః ప్రియాయాః
    సంసర్గం మే యది లభతే సన్తతః స్వప్రణీతమ్ ।
    దుఃఖస్యాస్య త్వమనుపమసఖ్యస్త్వం చ సందేశవాహః
    సన్తోషం మే జనయసిత తదా దుఃఖితాయాస్తదీయం ॥


    “ఈ వియోగదుఃఖంలో నా ఏకైక సఖుడివి నీవే, ఓ మేఘమా! నా సందేశాన్ని ప్రియురాలి వద్దకు చేర్చితే ఆమె సంతోషిస్తుంది, దానితో నాకు కూడా సాంత్వన లభిస్తుంది.


    114. इत्थं नीतं प्रतिदिवसकं रात्रिभिः शोकसारं

    सन्देशं मे तदनु यशसा कल्पयिष्यन्ति सन्तः ।

    दृष्ट्वा कान्तां सुरभितवनान्तः प्रिये मन्मथेन

    संपृक्तां त्वं यदि कथयसि स्वां कथां तस्य हर्षः ॥


    ఇత్త్ం నీతం ప్రతిదివసకం రాత్రిభిః శోకసారం
    సందేశం మే తదను యశసా కల్పయిష్యన్తి సన్తః ।
    దృష్ట్వా కాంతాం సురభితవనాన్తః ప్రియే మన్మథేన
    సంపృక్తాం త్వం యది కథయసి స్వాం కథాం తస్య హర్షః 


    “ఓ మేఘమా! నేను ఇచ్చిన ఈ సందేశాన్ని నీవు నా ప్రియురాలికి చెప్పినపుడు, ఆమె మనసు మమకారంతో నిండిపోతుంది. వియోగదుఃఖం తొలగి ఆనందం కలుగుతుంది. ఈ విధంగా నా కథను అమృతవాక్యంలా నీవు చేర్చు.