"ఇది ఏమి చోద్యము మీ తండ్రిగారు దక్షిణామూర్తి అగ్నిహోత్రము వంటివారని వినికిడ"ని వర్షుడనెను. "నిప్పుకైననూ చెదపట్టుటయే కలియుగ ధర్మము."యని అగస్త్యుడు బదులు పల్కెను."నాఉద్దేశ్యము స్వదార ఉండ పరదార ఏలననీ.."యని వర్షుడు అనగా , అగస్థ్య "నేను గ్రహింపజాలకుంటిని " అనెను . "స్వదార అనిన అగ్నిసాక్షిగా పెండ్లాడిన స్త్రీ, పరదార అనిన పొరుగువాని భార్య"యని భారతవర్ష వ్యాఖ్యానించగా అగస్థ్యముఖము జేగురించెను "పొరుగింటిపుల్లకూర రుచియని వినలేదా? అయిననూ స్వధర్మమునే విడిచిన వాడికి స్వదార ఒక లెక్కా? " అని అగస్త్యుడనగా "మీ నాన్నగారు క్రైస్తవ్యం పుచ్చుకొనిరా ? అదన్న మాట మీ అమ్మగారు మీ నాన్న గారితో విడిపోవుటకు కారణము"అని వర్షుడు అనెను. "తాను మారుటయే కాక మా అమ్మను కూడా మతము మారవలెనని బోధించుచున్నాడు. ఆర్థిక సామాజిక స్థితిని ఆసరా గా తీసుకొని ప్రభావితం చేసి మతమార్పిడి చేయుట, ఇది కదా బలవంతపు మత మార్పిడి అన్న. ఇట్లు మతము మార్చుట తప్పు , చట్ట వ్యతిరేకము కదా !
ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమే కానీ కంచె చేను మేసిన చందాన ఇంటి పెద్ద మతము మారి ఇంటి వారందరినీ అందరినీ మార్చుట సర్వ సామాన్యమైపోయినది. నా విద్యార్థిని నందిని ఇంతకూడా ఇదే సమస్య. తన తండ్రి మతము మారి చర్చ్ లు నడుపుచూ ధనార్జన కొరకు ఊరందరినీ మతమార్పిడి కి ప్రోత్సహించుటయేకాక, తన భార్య బిడ్డలను కూడా మతము మారవలెనని వేదించుచున్నాడు.
వర్షుడు: మారిన ప్రతి ఒక్కడూ తమ క్రింద నున్నవారిని అందరినీ మార్చవలెనని చూచుటయే హీనము , కానీ ఆది కాలము నుంచి ప్రభుత్వములే ఈ పనికి పూనుకొనుట హీనాతి హీనము.
అగస్త్య : ఆది కాలము నుంచి అనగా ?
వర్షుడు: ఆంగ్లేయుల కాలము నుంచి. భారతీయ ఆంగ్ల కవయిత్రి తోరుదత్త కుటుంబమే ఇందుకు సాక్ష్యము. జాన్ కీట్స్ అను ఆంగ్లకవి వలె పిన్న తోరుదత్త వయసులో 21 సంవత్సరములకే మరణించెను. బియాంకా అనే ఆంగ్ల నవల , జూర్నాల్ మద్మజేల్ దాహ్ర్వ్ అనే ఫ్రెంచ్ నవల పూర్తి చేయకనే క్షయతో మరణించెను.
అగస్త్య : ఆమె గురించి కొంచము వినియుంటిని అని అగస్థ్య అనెను " వారి తల్లిదండ్రులు గురించి వినియుండవు, వారిది దత్ వంశము, ఆమె తండ్రి గోవింద దత్ బ్రిటిష్ వారిపాలనలో వారి పలుకుబడి లోనయి చర్చ్ వల్ల విశేష ప్రభావితము గావించబడి 1862 లో మతమార్పిడి పొంది యున్నాడు. తొరుదత్ తాత గారు రసమే దత్ హిందూ స్కూల్ స్థాపకులు కీర్తికెక్కిన విద్యావేత్త , ఆమె దాయాదుఁడు రొమేష్ ( రమేష్ కాదు) చందర్ దత్ చరిత్రకారుడు, రచయిత మరియు అధికారివలెపాలనాధికారి అనిన ఐ.ఏ.ఎస్. అధికారి ఇటువంటి విద్యాధికులైన వారిని బ్రిటిష్ వారు అధికారబలంతో సునాయాసముగా మతము మార్పిడి చేసెడివారు. పాపము తొరుదత్ తల్లి ఎంతో వేదన చెందిననూ తరువాత భర్తనే అనుసరించెను.
అగస్త్య : ఎంత దారుణము అప్పటిలో తెలవారు అట్లు చేసినారా ?
వర్షుడు: అప్పట్లో ఏమి ఖర్మ! నేటికీ ఆంధ్ర రాష్ట్రము ముఖ్యమంత్రి అదే పని చేయుచు న్నాడు. అతని క్రింద పనిచేయు మంత్రులు , పాలక సిబ్బంది లో అత్యధికులు అతనిని సంతృప్తి పరుచుటకు మతము పుచ్చుకొనవలసినదే.
అగస్త్య : అనగా క్రిందివారు పైవారికొరకు ఆత్మను అమ్ముకొనవలసినదేనా! మా అమ్మ కూడా భర్తకు కట్టుబడి మతం మారవలెనని చెప్పుచున్నావా?
అట్లుచేసినచో పాపమని జాలిపడెదను. మీ అమ్మగారి తెగువను మెచ్చుకొనుచున్నాను.
52 ఏ. డి నందు థామస్ అను వర్తకుడు భారతదేశమునందు ప్రవేశించిన మొదటి కిరస్తానీయుడు. అతడిని థామస్ ఆపొజెల్ అని కూడా అందురు. అతడు కేరళలో మతమార్పిడుల కు శ్రీకారం చుట్టిననూ 72 లో అతడు తన రెండవ భారత సందర్శనములో తన కార్య క్రమములను చెన్నపట్టణమునాకు మార్చి వేసెను. అచ్చట ప్రజలకు ఆ మతము ఏమాత్రము నచ్చలేదు . అందుకు వారు అతనిని చంపివేసిరి. 1523 లో పోర్చుగీసు వారు అతడి సమాధిపైన చర్చ్(థామస్ చర్చ్) ని నిర్మించినారు. అప్పటి చెన్న పట్టణమే మద్రాసుగా మారి సెయింట్ థామస్ చర్చ్ యే సాంథోమ్ గా మారెను. మరికొంతకాలం పిమ్మట చరిత్ర పై స్పృహ కలిగిన వారు దానిని తిరిగి చెన్నైగా మార్చి వేసినారు. చరిత్ర స్పృహకల్గి, వేదమును గౌరవించు ప్రజలుండిన మతమార్పిడులు దుర్లభము అగును. హేతువాదులమని చెప్పుకొనువారు కొందరు, జనవిజ్ఞానవేదికని చెప్పుకొనువారు కొందరు, బౌద్దమని చెప్పుకొనువారు కొందరు వేదములను తూలనాడి దేశ సంస్కృతి సంప్రదాయములపై విషము కక్కెదరు.
అగస్త్య : జై భీమ్!! జైబుద్ధ!! అని బైరెడ్డి వర్గీయులు పలకరించుకొందురు. బుద్ధునడ్డుపెట్టుకుని వేదములను చులకన చేయుదురు. భౌతిక రసాయన శాస్త్రములను అడ్డు పెట్టుకుని మన సంప్రదాయములు చెత్త అని దుర్బాషలాడుదురు.
"ఇదంతా కుట్ర, దుర్భుద్ధితో దేశ వ్యతిరేకులు చరిత్రను వక్రీకరించి విద్యయందు జొప్పించిన ఫలితము." అని వర్షుడనెను "వీరికి ఎట్లు బుద్ధి చెప్పుటయో" అని అగస్త్యుడు అనగా అదట్లుండనిమ్ము నీ తలితండ్రులు వేరుపడినప్పటికీ ఇరువురూ బాగుగానే యున్నారు కదా? వారెచ్చటున్నారు ? అని వర్షుడు అడిగెను
" మానాన్న ఎగుమతి వ్యాపార సంస్థను స్థాపించి యున్నాడు. నాల్గు కోట్ల పెట్టుబడికి చేరిన పెద్ద సంస్థకి పెట్టుబడి అంతయూ మా అమ్మ ఆస్తే. ప్రస్తుతము మా అమ్మగారు చెన్నపట్నములో ఉద్యోగము చేయుచూ నాకు కావలిసిన ధనము పంపుచున్నారు. మా తల్లిదండ్రులు ఎప్పుడో వేర్పడిననూ విడాకులు వ్యాజ్యము నడుచుచున్నది. ఆస్తుల గొడవలింకనూ మిగిలియున్నవి.
నీవు వసతిగృహములో ఉన్నావని తెలియును, కానీ ఈ గొడవలు నాకు దెలియవు. కానీ అవి మనము తీర్చునవి కావు న్యాయస్థానము చూచుకొనును. నీకొచ్చిన సమస్య ఇంకా ఏమైననూ ఉన్నదా?
అగస్త్య: ఒక కారణముచే తల్లి వద్దకు మరొక కారణముచే తండ్రివద్దకు పోవుటకు మనసు రాకున్నది.
వర్షుడు: కాలము వచ్చినచో ధైర్యము, మనసు అవే వచ్చును.అంతవరకూ వేచియుండుము.

చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు తెలియచేసారు
ReplyDeleteఇంత లోతుగా విషయాలు వ్రాస్తున్నారు అంటే ఎన్ని విషయాలు కూలంకషంగా చదువుతున్నారో
ReplyDeleteకథ చాలా ఇంట్రెస్టింగా వుంది ముఖ్యంగా భారత్ వర్ష అగస్త్య మధ్య సంబాషణ
ReplyDeleteచరిత్ర ఎప్పుడు బాగుంటుంది సార్, తెలియని విషయాలు బాగా చెప్పారు చరిత్ర గురించి . మీరు ఎప్పుడు ఎన్నో కథలు రాయాలి అని కోరుకుంటున్నాను
ReplyDeleteఅచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు
ReplyDelete