Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, July 13, 2020

Bharatavarsha 5 Basava in hospital


బసవని తలకు కట్టు కాలికి కట్టుతో ఆస్పత్రిలో మంచముపై స్పృహలేక పడియున్నాడు. బసవడి  తలిదండ్రులు బుచ్చమ్మ , రాజుగారు, అతడి మిత్రులు  లకుమ, అగస్త్య అతడి మంచము వద్ద నుండిరి.  బసవడు మెల్లగా కళ్ళు తెరిచి వారిని చూచెను. ద్విచక్ర వాహన ఊరేగింపు  (బైక్ రాలీ)లో ద్విచక్రికను అతివేగముగా నడిపి  ముందుపోవు వారిని అధిగమించు  చుండగా ఎదురుగా వచ్చిన భారీ వాహనము ఢీకొని తలకి కాలికి దెబ్బలు తగిలెను. బైరెడ్డి వచ్చినాడు. ఆ ఊరేగింపు నిర్వాహకుడు అతడే . బసవడికి అతడే తన వాహనమునిచ్చెను. వచ్చినాడేమో అని అందరూ అనుకొనిరి కానీ  బసవని పలకరించుటకు అతడేమాత్రమూ ఆసక్తి కనబరచలేదు.  రాజుగారిని బైటకు పిలిచెను. కాసేపు పిదప బసవడి  తండ్రి లోపలకి వచ్చి  భార్యకు మెల్లగా ఎదో చెప్పి  బైటకు వెడలెను. బసవడు ఏమైనదని తల్లిని అడిగిననూ ఆమె మౌనము వహించెను 


అప్పుడే రమ్య పూర్ణిమ,   వచ్చిరి . అహ్మద్ బైరెడ్డి  వచ్చి  వాహనము బాగుచేయించుటకు పదివేలు పట్టుకుపోయినారు. అని వారి సంభాషణ విన్న బసవడి  చెల్లి రమ్య చెప్పెను.  పుండుమీద కారము జల్లినట్లు న్నదని .బుచ్చెమ్మగారు  కన్నీళ్లు పెట్టుకొనిరి.     

 బసవడికి కళ్ళు మూతలు  పడినవి. వైద్యుడు వచ్చి అందరినీ బైటకు పంపివేసెను. బసవడు అట్లు ఎంతసేపు ఉండెనో అతడికి గుర్తు లేదు.  స్పృహ వచ్చిన పిదప ఎవరో ఇద్దరు మగ గొంతులు వినిపించుచుండెను.  బసవడు కొద్దిగా కనులు తెరిచెను.  తన గదిలో ఎదురుగా సందీపుడు , రాఘవ కూర్చొని యుండిరి.   

బుద్ధిమంతులు పెద్దలు చెప్పగా విని నేర్చుకొందురు. మూర్ఖులు అన్నీ తమ అనుభవముద్వారా నేర్చుకొందురు. బసవడు మూర్ఖుడు వాడికి ఇట్లు కావలసినదే. అని సందీపుడనెను. రాఘవ నీవేనా అట్లనుచున్నావు అని సందీపుడు అనగా "మరేమి చేయమందువు. వాడికి జ్ఞానము లేదు మంచి ఏదియో  తోచదు. ఎవ్వరు చెప్పిననూ వినువాడు కాదు. తల్లితండ్రులనే కొట్టు రకము. బాధపడనిచో వాడికి బోధపడద"ని రాఘవ అనెను.  వారాడుమాటలు వినదలిచి  బసవడు కనులు  మూసుకొనెను.

సందీపుడు " ఇతడి తలిదండ్రులను చూచిన జాలికలుగుచున్నది వీడి దుస్థితిని చూచి వారెంత దుఃఖించుచున్నారో "  అనెను 

  రాఘవ: బసవడి దుస్థితికి కారణము వారే. తల్లి అతిగారభము చేసినది.

  సందీపుడు : కానీ తండ్రి ఎప్పుడూ మందలించుచుండును కదా.

వీడు పూరిగా చెడిపోవుటకు కారణము తండ్రే. ఎదో ఒక రకముగా చదువు పూరి అయ్యి పట్టా చేతికొచ్చిన చాలని " నిన్నూ  రాఘవ వలె  అమెరికా పంపించెదన"ని కొడుకుకి చెప్పుచుండును.  అమెరికాలో భారతీయుల పరిస్థితి దారుణముగా నున్నదని నేనెంత చెప్పిననూ అతడు పట్టించుకొనడు."అని రాఘవ అనెను. "అటువంటి తండ్రులు ఉందురా!" అని సందీపుడు నోరెళ్ళ బెట్టెను. అదే సమయమున సీతారత్నం వచ్చి, బసవడికి బుట్టతో తినుటకు తెచ్చి అతడు పడుకొని ఉండుట చూసి   రాఘవను పలకరించెను "

 ఏవయ్య రాఘవా ఇప్పటికైనా  అర్థమైనదా  ఇచ్చట జీవితము లేదని . మా అబ్బాయి కృష్ణుడు అచ్చటే యున్నాడు.  ఇచ్చట కాళ్ళీడ్చుకొని తిరుగుటమాని  అమెరికా మరల పొమ్ము  అద్భుతముగా నుండును. అని హితవు పలికి వెడలిపోయెను. 

కొడుకుకి అచ్చట ఎటున్నాడో కానీ అతడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకొనుట ఈమెకి అద్భుతముగా యున్నది. అచ్చట ఎంత అద్భుతముగా నున్నదో నిజము నిలకడ మీద తెలియును అని రాఘవనెను. 

పెద్దలకి  అమెరికాయే స్వర్గము. పిల్లలకి సినిమా యే  స్వర్గము  అని  సందీపుడు అనగా

"సినిమా నటులను స్వాతంత్య్ర  సమరయోధులవలె   చూపించు చున్నారు కదా! రౌడీలను నాయకులుగా చూపించుచూ యువకుల  మనస్సులను నేరపూరిత విషయాల వైపు ఆకర్షించుచున్నారు . చెత్త భాష,  ప్రవర్తనను  ప్రజాదరణ పొందేలా చేయుచున్నారు."

"హీరో పాత్ర ద్వారా వారు సమాజంపై మరియు సంప్రదాయాలపై దాడి చేయుచున్నారు. ఉపాధ్యాయులు మరియు సమాజంలోని పెద్దల పట్ల   నిర్లక్ష్య మరియు ధిక్కార వైఖరి వారు వీరోచితంగా చూపిస్తున్నారు పండితుడు కంటే ఒక నేరస్తుడు పోకిరీ గొప్పవాడని  చూపుచున్నారు. 

"మన  యువకులు వారిని  గుడ్డిగా అనుసరిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు . వారు వెండితెరపై చూసేది  వాస్తవికత కాదని నిజజీవితం అందుకు భిన్నంగా ఉండునని గ్రహించలేకున్నారు.   పాఠశాలలు  సినిమా వ్యతిరేకంగా విద్యను అందించాలి కానీ వారు పరీక్షలు, మార్కులే తప్ప ప్రవర్తన ని పట్టించుకోడంలేదు. తొలినాళ్లలో సినిమా ప్రజలను అలరించే సందేశం తో కూడిన వినోదం అందించేది . మాయాబజార్ మరియు పాండవ వనవాసం వంటి చిత్రాలు మన సంప్రదాయాలు మరియు ఇతిహాసాల గురించి జ్ఞానాన్ని ఇచ్చాయి. నేటి సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, హింస కామాన్ని  రెచ్చగొట్టే   సినిమాలు తీసి  గల్లా  పెట్టెలు నింపుకుంటున్నాయి. 


సందీపుడు : ఈ ఇంగ్లిష్ వాళ్ళ వలెనే  పరిస్థితి  ఇంత దిగ జారిపోయింది 

జేమ్స్ కామెరూన్  కెనడా చిత్రనిర్మాత. అతను దాదాపు 10 సంవత్సరాల క్రితం 'అవతార్' చిత్రాన్ని నిర్మించాడు. 'అవతార్' చిత్రం  ఆలోచన 'భగవద్గీత' నుండి ప్రేరణ పొందింది. అంతర్జాతీయ చిత్రనిర్మాతలు హిందూ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది చిత్రాలను రూపొందించుచుండగా , మన చిత్రనిర్మాతలు మన సంప్రదాయాల నుండి తప్పించు కుంటున్నారు. చిన్నప్పుడే టీచర్ తో ప్రేమ, తల్లి తండ్రులని తన్నడం ,   పెళ్ళికి ముందు సహజీవనం వంటి సినిమాలు తీస్తున్నారు.  నకిలీ ప్రేమ మరియు ఆప్యాయతతో రౌడీల కథలను చూపించడానికి ఆసక్తి చూపుతున్నారు, తరచుగా గురువులను మరియు దేవుళ్లను అవమానిస్తారు. తెరలపై నటులను సమస్యల నుండి రక్షించే దేవుళ్ళుగా చిత్రీకరిస్తారు. 


"నిజ జీవితంలో  నటులలో అనేకమంది  క్రూరులు  నీచులే.  వాస్తవానికి వారు కీర్తి పేరుతో డబ్బును దోచుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లించరు."

"అలాటి  నటుల పుట్టినరోజులు జరుపుకోవడం, రోడ్లపై వారి నిలువెత్తు బొమ్మలను పెట్టడం  పెట్టడం, వాహన ఊరేగింపులు నిర్వహించడం ముఖ్యంగా పాలాభిషేకం చేయడం  ఎంత సిగ్గుమాలిన చర్య !  ఇది పాఠశాలలకు అవమానం."

"రెండేళ్ల క్రితం తమిళనటుడి  ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేశారు. 66 కోట్ల నల్లధనాన్ని కనుగొని వారు షాక్ అయ్యారు. ఇది నల్లధనం కాదు. ఇది ప్రజాధనం. ఈ సంఘటన మొత్తం తమిళ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి సినీ నటులు వెండితెరపై పేదలకు న్యాయం కోసం పోరాడుతారు ఛీ !"

స్వాతంత్ర్య సమరయోధులు, గొప్ప నాయకుల పుట్టినరోజులలు ఎప్పుడైనా జరుపుకున్నారా?     మీ అమ్మ నాన్న పుట్టిన రోజులు మీకు గుర్తున్నాయా?

బసవడి కళ్ళు తెరుచుకొనెను. 

                                                                            ***

అన్న సంతర్పణ అవధానం ముగిసినది.  భారతవర్ష, అగస్త్య ఇద్దరూ  పెరటి  చెట్టు క్రింద  కూర్చుని  మాట్లాడుకొనుచుండగా    మంజూష లకుమను  తోడ్కొనివచ్చెను. “వర్ష,  కార్యక్రమము ఎట్లు సాగెను ,సమయమునకు రాలేకయినందుకు విచారించుచున్నాను  ఏమీ అనుకొనరాదు “ అని లకుమ  అనెను.  

“విచార మెందులకు  రాకూడదనే నీవు  రాలేదు , నీకు అవధాన ప్రక్రియ అనిన వెగటించునని మా అన్నకు తెలియునులే అని మంజూష హాస్యమాడుచుండగా వర్షుడు  “ఓహో లకుమా! ఎప్పుడువచ్చితివి? పొద్దుపోయి వచ్చితివే, అనెను. “నీవునూ  దామినివలె మాట్లాడుచున్నావు, నేడు ఒకవారము రోజులు మా  అమ్మ  వద్దకు హైద్రాబాదు పోవుచున్నాను. బయట కారు నిలిచి యున్నది, పోవుముందు నిన్నొక చిన్న సహాయమర్ధించ వచ్చితిని” అనెను  చేయగలిగినదేదైనా తప్పక చేతునని వర్ష పలుకగా . “అద్దె ఎంతైననూ నాకొక  చక్కటి ఇల్లు చూచిపెట్టుము నాకు వసతిగృహమునందు స్వేచ్ఛలేదు. నా కదలికలపై దామిని ఆరాలుతీయుట నాకు మిక్కిలి అప్రియముగ నున్నద”ని  లకుమ  అనెను .  

వారు మాటలాడుచుండగా కాఫీ తెచ్చుటకు మంజూషలోపలికి పోయెను. లకుమ అగస్థ్యతో కరచాలనము చేసెను. అది చూచి  మాలినిగారు  "ఒకే పాఠ శాలలో  చదువుకొన్న మీ అందరూ ఇట్లు కలుసుకొనుట చూచిన ముచ్చటగానున్నది. లకుమా, దామిని ఉత్తమురాలు నీక్షేమము కోరే ఏదైననూ చెప్పును.”అని అనిరి “ఆమె పురాతన పద్ధతులు నావంటికి సరిపడవు. స్వేచ్ఛా భావములు గల ఏ ఆధునిక  స్త్రీ ఆమెను మెచ్చదు.” అని లకుమ అనెను. 

నీ స్వేచ్ఛను ఆమె ఎట్లు హరించివేయుచున్నదో తెలుపుము అని వర్షుడు చల్లగా అడిగెను 

అఖిల భారత విద్యార్ధి సంఘం నేడుదేశవ్యాప్త సమ్మెకు   పిలుపునిచ్చెను  ఆ  సమ్మె లో  నేను పాల్గొన్నందుకు పెద్ద రాద్దాంతము జేసెను.  విద్యార్థులు విప్లవాల్లో పాల్గోనవలెనని విద్యార్ధి సంఘాలు కోడై కూయుచున్నవి. దామిని అవేమీ ఎరుగదు ఆడది గరిట పట్టి వంటచేసుకొనుటకే అన్నట్లు మాట్లాడును. అని లకుమమండి పడెను.

"చదువుకుని   గరిట పట్టుటయా ఛీ ఛీ  ఎంత సిగ్గు చేటు ఎర్రజెండా పట్టి పోలికేకలు వేయవలెను కానీ!" అని వర్షుడు వ్యంగముగా అనుటలో కనిపెట్టి "నీ వెప్పుడు రచనలు, అవధానములు  చేసుకొనుచూ అదే లోకము అనుకొనుచున్నావు. నీకు స్వేచ్ఛ విప్లవ భావముల గురించి ఏమి తెలియును ? అని వర్షునికి  ఘాటు గా సమాధానమిచ్చెను. 
 

 "ఎట్టి భావములను స్వేచ్చాభావములని తలకి పట్టించుచున్నారో నేటి కాలమందు చలన చిత్రములను చూచెడి వారికి  తెలియును. అని మాలినిగారు అనగా వర్షుడు " చూచెడి వారికి చూచి చెడిన వారికి కాదమ్మా ఆలోచించెడివారకు తెలియును. చలచిత్రములలో సంభాషణాలేకాక  కాక  గీతములందు కూడా  ఇట్టి చెత్త భావములనే దట్టించి శ్రోతలపై  రుద్దుచున్నారు." అని వర్షుడనగా "చిత్ర గీతములందు  ఏమి దట్టించారయ్యా   నేను  చెవులో ఈ పాటల యంత్రము నుంచుకొని  నుంచుకొని నిత్యమూ  అనేక గీతములను వినుచున్నాను నాకేల కనిపించవు? "అని లకుమ అనెను 

వర్షుడు "ఏదీ  నీ  పాడు యంత్రమును ఇటిమ్మ"ని తీసుకొని మీట నొక్కగా ఒక తెలుగు చిత్ర గీతము వినిపించుచుండెను. "చెవికి పోగు పెడితే తప్పు , జుట్టుకు రంగు కొడితే తప్పు ఒంటికి టాటూ వేస్తే తప్పు ఫ్రెండ్స్ కూడా తిరిగితే తప్పు , బొడ్డుకి రింగు పెడితే తప్పు టైటుగా ప్యాంటూ వేస్తె తప్పు నైట్ అంతా మెలకువ తప్పు 9'o క్లాక్ లేస్తే తప్పు  బ్రేక్ ది రూల్స్ ....ఎగ్జామ్  ఫీజు నొక్కితే తప్పు పరీక్షా వేళా క్రికెట్ తప్పు ఊరుకుంటే ఎన్నో చెబుతార్రా  బ్రేక్ ది రూల్స్ ..." వర్షుడు యంత్రమును కట్టేసి ఇలాటి పాటలు విన్నచో ఎవడైననూ  బాగుపడునా ?"  అనెను 

లకుమ : కానీ సంగీతము అద్భుతముగా నున్నది కదా!

అగస్త్యుడు : సాహిత్యము ఎంత చెత్తగానున్ననూ మనకభ్యంతరము లేదు. పచ్చగడ్డి కైననూ మసాలా దట్టించినచో లొట్టలేసుకుని తినుటకు జనులు అలవాటు పడినారు.  హేపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యరా , హత విధీ!  ఇది తెలుగు పాట అట. " అని అగస్త్యుడు ఈసడించెను. 

లకుమకు అగస్త్యునికి వాగ్యుద్దము మొదలాయెను. ఇంతలో మంజూష కాఫీతో ప్రవేశించి అంతటితో ఆపవలెను సినిమాలను ఎక్కువ చర్చించిన అంతకంటే పాపము మరొకటిలేదు అనుచూ అందరికీ కాఫీ ఇచ్చి వర్ష నేడు కార్తీక పౌర్ణిమ మరిచితివా అనిగుర్తు చేసెను. ఓహో మరచితిని , నేడు పౌర్ణమి పూజ కలదు." అనెను


అదివిని లకుమ నవ్వుచూ "నీకిటువంటి చాదస్తములు కలవని నాకు తెలియదు,  సంధ్యావందనాలు, పూజలు, వ్రతాలు… విసుగు."  అని లకుమ అనగా  మంజూష "ఈ పూజ ఎందుకు చేతురో తెలుసా? యని అడిగెను.  " నీవు ఈ మూడాఛారామని వదలి విప్లవాల బాటలో  నడచుట మంచిది.   " లకుమ హితవు పలికెను .

నీకు హితబోధ బాగుగా జరుగుచున్నదే! నీకు చెప్పిన వారిని పూజలనాపమని చెప్పి వారు ఒప్పుకొందురేమో తెలుసుకొనుము . అని మంజూష అనెను.   

అఖిల భారత విద్యార్ధి సంఘం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె లో పాల్గొంటివికదా  ఇంతకూ సమ్మె ఎందుకో తెలుసుకొంటివా ? అని అగస్త్యుడు అడిగెను  

కేరళలో కాషాయీకరణ జరుగుచున్నదట. దానికి వ్యతిరేకముగా నాదములు చేసినాము.  

అగస్త్య  : కాషాయీ కరణ జరుగుచున్నదా అనగా నేమి ? 
 లకుమ: వారంతే జెప్పినారు. అని లకుమ మూతి విరిచి ముఖము తిప్పుకొనెను  
బాగు బాగు  ఆ రెండు ముక్కలు జెప్పి చేతికి జెండా ఇచ్చినారన్నమాట. అచ్చట విశ్వవిద్యా లయములో సరస్వతి విగ్రహమును తొలగింప మని వీరు యాగీ చేయుచున్నారు అని అగస్త్యుడు విషయమును జెప్పెను. 

సరస్వతి  విద్యలకు అధినాయిక ఆమెను తొలగించుటన్న విద్యను తొలగించుటయే.  ఈ పనులన్నీ చేయువాడు  బైరెడ్డి  అహ్మద్   వారితో నీవు జేరుటయా?  నీ వేలుతో నీ కన్ను పొడుచుచున్నారు.  అని మాలిని ఆవేదన చెందెను . వచ్చే వసంత పంచమినాడు సరస్వతి పూజ చేయుము. అని మంజూష లకుమకు  పరిహారము చెప్పెను.      

లకుమ : శాస్త్ర  సాంకేతిక పరిజ్ఞానము మాత్రమే మానవాళికి వెలుగు చూపగలదు 
అగస్త్య : విప్లవం కూడా ఉండవలెను. ఎందువలెననగా వారు చెప్పినదానికి మనము డూ డూ బసవన్న వాలే తలా ఊపవలెను కదా! 

 వారట్లు మాట్లాడు కొనుచుండగా వర్షుడు పోయి సంధ్య వార్చుకొని వచ్చెను.
నీకు ఈ చాదస్తము కూడా ఉన్నదా అని లకుమ వర్షుని చూసి నవ్వెను 

"స్నేహితులు చెప్పినది విని నీవట్లనుచున్నావు కానీ నీకై నీవు చదివి , శోధించి తెలుసుకున్నది కాదు.  లకుమ  "గూగుల్ నందుకూడా అట్లేయున్నది " అనెను. " గూగుల్ నందు ఒక అజ్ఞాని అట్లు వ్రాసిన అదియే నిజమని నమ్మతగదు. గూగుల్ నందు కొన్ని తప్పులు దొర్లినచో వారునూ సరి చేసికొందురు. నేడందరూ ఏది ప్రచారము గావించిన అదే నిజమని నమ్ముచున్నారు.  సంధ్యా వందనము సూర్యుడికి శక్తినిచ్చి  ఆధ్యాత్మికంగా  విశ్వానికి చైతన్య మిచ్చును."
 
ఏమో నాకు తెలియదు సంధ్యావందనము మూఢనమ్మకమును బ్రాహ్మణులు అందరిపై  అని లకుమ అనగా ,  సంధ్యావందనము చేయమని   బలవంత పెట్టి రుద్దువారెవరు కలరు .     

మరి విప్లవమను అమాయకులపై  ఎవరు ర్ధుచున్నారు?  తెలియునా ? తెలుసుకోకున్నచో నీవే నష్టపోయెదవు. మన కళాశాలలో విద్యార్థులే కళాశాలలోంచి విప్లవం లోకి విప్లవంలోంచి అడవుల్లోకి  అచ్ఛనుండి శాశ్వత చీకటిలో కి పోయిరి. 

విప్లవమంటే  అన్యాయం పై తిరుగుబాటు అని అమాయకులని ఆవేశపరులని రెచ్చగొట్టి  ఉద్యమాల్లోకి లాగుతారు . కానీ  ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక టూల్ విప్లవం. విప్లవమంటే  ఒక రాజకీయ మాఫియా . దానికి మొదటి స్థాయిలో  స్టూడెంట్ ఫెడరే షన్, పీ. డి. ఎస్. యు నగరాల్లో ఉంటాయి.  అవి మంచి ని నాదాలతో  తో ఆవేశపరులు ఆకట్టుకుంటాయి. దాని కాళ్లు చేతులు అడవుల్లో ఉంటాయి. పీపుల్స్ వార్ గెరిల్లా వార్,  అవి రవన్న వర్గం, ఆశన్న వర్గం, వేణు అన్న వర్గం, రామకృష్ణ వర్గం ఇలా వర్గాలుగా ఉంటాయి. 

విప్లవం తల రాజకీయ పార్టీ. ఆ తలలో ఆలోచన ఏంటి ? 
రాజ్యాధికారం. 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరి గ్రామంలో స్థానిక భూస్వాములు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ నాయకుల నాయకత్వంలో సాయుధ రైతు తిరుగుబాటుతో నక్సలిజం ప్రారంభమైంది. మావో జెడాంగ్ బోధనల నుండి ప్రేరణ పొందిన ఈ ఉద్యమం "ప్రజా యుద్ధం" ద్వారా రాష్ట్రాన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది.

 విప్లవం అంటే కనిపించని రాజకీయం. 

రష్యన్ విప్లవం: రష్యాలో విప్లవాన్ని  లెనిన్ నేతృత్వంలోని రాడికల్ రాజకీయ సమూహం బోల్షెవిక్‌లు ప్రారంభించారు. అక్టోబర్ 1917లో, బోల్షెవిక్‌లు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించి, కీలకమైన భవనాలను స్వాధీనం చేసుకుని,  ప్రభుత్వాన్ని పడగొట్టి  సోవియట్ నేతృత్వాన్ని మార్చారు.     ఈ  సంఘటనను అక్టోబర్ విప్లవం అని పిలుస్తారు.

 

ఫ్రెంచ్ విప్లవం   :ఫ్రెంచ్ విప్లవం 1789 నుండి 1799 వరకు ఒక దశాబ్దం పాటు కొనసాగింది. ఇది 1789 ఎస్టేట్స్-జనరల్తో ప్రారంభమై 1799 నెపోలియన్ బోనపార్టే ప్రభుత్వాన్ని పడగొట్టడంతో ముగిసింది

స్పానిష్ విప్లవం : స్పానిష్ విప్లవం" 1936 నుంచి 1939 వరకు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది .  రిపబ్లికన్ లోయలిస్ట్ వర్గానికినేషనలిస్ట్  వర్గానికి మధ్య జరిగిన పోరు.  నేషనలిస్ట్ వర్గాన్ని నడిపించింది ఆర్మీ జనరల్ ఫ్రాన్సిస్కో. ప్రజలని రెచ్చగొట్టి,ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ మాన్యుయెల్ అజాన్యా ప్రభుత్వం పైన ఆర్మీతో తిరుగుబాటు చేసాడుజర్మనీ, ఇటలీ సహాయంతో ప్రజాస్వామ్య  ప్రభుత్వాన్ని కూలద్రోశాడు.  జాతీయవాదుల విజయం ఫ్రాన్సిస్కో నియంతృత్వంతో స్పానిష్ విప్లవం  ముగిసింది.

విప్లవం అంటే విదేశీ శక్తులు : తిరుగుబాటు ఎక్కడ మొదలైనా పొరుగుదేశాలు ప్రవేశించడం మామూలే కదా. చాలాదేశాల్లో తిరుగుబాటు చేయించేవే అవి. నీ చదువుని బుర్రని , చదువుని జీవితాన్ని మన దేశాన్ని  అల్లకల్లోలం చేసేదే విప్లవం.  ఉద్యమాలన్నీ నిజాయతీగా జరిగినవాఅంటే ప్రజలకోసం లేదా ప్రజా ప్రయోజనాల కోసం జరిగినవి కావుఉద్యమాల్లో ఎక్కువ రాజకీయ ప్రయోజనాలకోసం జరిపించినవేఅందుకే  లెనిన్ " నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో తెలుసుకోవాలని అంటాడు.      

 నర్మదా బచావో ఆందోళన్ క్రియాశీలక  పాత్ర వహించిన మేధా పాట్కర్  పేరు వినియుందువు . ఆమె లేవదీసిన ఉద్యమం అభివృద్ధికి ఆటంకం అని ఆలస్యముగా తెలిసినది   నర్మదా బచావో ఆందోళన్ లో  సర్దార్ సరోవర్ ఆనకట్ట ప్రాజెక్టును బాగుగా  ఆలస్యం చేసినది , ఆమీ ఉద్యమంవలన వలన దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి అవసరమైన నీరు మరియు విద్యుత్ లభించలేదు   

అభివృద్ధి ప్రాజెక్టులను నిరోధించడానికి పాట్కర్ యొక్క  సేవా సంస్థలు అంతర్జాతీయ సంస్థల నుండి (ఫోర్డ్ ఫౌండేషన్ మరియు జార్జ్ సోరోస్ నుండి నిధులు స్వీయకరించినవి. అవి మొత్తంలో డబ్బును తీసుకొనెను 

లఢక్ కు చెందిన విద్యా , వాతావరణ  క్రియాశీలక కార్యకర్త  సోనమ్ వాంగ్చుక్ ప్రజలను ప్రత్యేక రాష్ట్రము కావలెనని రెచ్చగొట్టి పెద్ద రగడ సృష్టించి వార్తలలోకి ఎక్కినాడు. అతడి బ్యాంకు ఖాతాలలో కోట్లాది రూ పాయలకు లెక్క లేదు అనుమతి లేకుండా యితడు కోట్లకొలది  విదేశీ నిధులను పొంది యున్నాడు

హెచ్ ఎం టి,  బి ఈ ఎల్ ,  ఎం టి పి సి, ఏర్ ఇండియా , బీ ఎస్ ఎం ఎల్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు  తప్పుడు కార్మిక సంఘాలకి వారి  విప్లవాలకు, సమ్మెలకు  బలిఅయిపోయినవి.అని భారతవర్ష చెప్పగా  

 “లకుమ ఆశ్చర్య పోయెను ఇవన్నీ ఎప్పుడు చదువుచున్నావు ? నేను చదువజాలను కానీ చెప్పినచో  వినుటకు బాగున్నది” లకుమఅనగా. అగస్త్య “అదియునూ ఒక సుగుణమే, నేటివారికి పుస్తకపఠనమన్న అత్తిపూచినట్టే.  కోటికొక్కడు పుస్తకపఠనము నందు ఆశక్తి కనబరుచును” వినుట కూడా  గొప్ప సుగుణమే. వినుటకు కూడా ఇష్టపడనివారుందురా అని లాకుమా అనగా. " మన బసవడు ఉన్నాడు కదా " అని అగస్త్యుడు గుర్తుచేసేను.



శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .. సతతము నిను సేవింతుము సత్కృపకనవే” మంజూష తులసి పూజాగీతమును పాడి  ప్రదక్షణ ఆచరించి పూజ ముగించి న తరువాత అందరూ లోపాలకి వెళ్లిరి. అబ్బో నీకిట్టి పాటలు వచ్చునా ! అని అగస్త్య అనగా   మాలిని గారు “పూజలు  వ్రతములు  ఖగోళ గతులను నిత్య జీవితమునకు దగ్గరగా తీసుకువచ్చి నిత్యా జీవితమును ఆనందమయము చేయునని నమ్మినచో  అందరూ నేర్చుకొనవచ్చు”  

సంస్కృతి సంప్రదాయములు దేశభక్తి లేని  సాంకేతిక పరిజ్ఞానము కొయ్యగుర్రము వంటిది చక్రములు లేని వాహనము వంటిది. అని వర్షుడు చెప్పెను లకుమ, అగస్త్య  ఇరువురు బయలుదేరవలెను అనగా " నేడు అతిధులకు భోజనము పెట్టుట మన సంప్రదాయము కావున పూజ చూసి భోజనం చేయవలసినదిగా మాలినిగారు కోరిరి . 


భోజనములు  ముగిసిన పిదప వర్ష గదిలో గోడపై అతికించి ఉన్న చిత్రము అగస్త్య లకుమలను ఆకర్షించెను. అది ఒక పెద్ద వృక్షము. దాని దిగువున వంశ వృక్షము అని వ్రాసి ఉన్నది.  ఇది ఎందులకు ? అని అగస్త్య ప్రశ్నించెను. మీ తాతగారి గురించి  నీకెంత తెలియును అని అడిగెను ?”   అని వర్ష అడుగగాచాలా  కొంచెము తెలియును” అని అగస్త్య అనెను.  మీ తాతగారి నాన్నగారి గురించి ఏమైనా తెలియునా ? అని అడుగగా అగస్త్య పెదవి విరిచెను. వర్షుడు" తెలుసుకొనుటకు ప్రయత్నించుము నేను ప్రయత్నించుచున్నాను" అనెను నీకు ఇట్టి ఆసక్తి ఎట్లు కలిగెను అని అగస్త్యుడు అనగా  

వర్షుడు  "మా తాతగారు సైన్యమునందు పనిచేసి రెండవ ప్రపంచ యుద్దములో పాల్గొనిరి. భారత సైనికులు రెండు లక్షల యాబదివేలమంది పాల్గొనగా ఎనబదివేలమందికి పైగా వీరమరణము పొందిరి.  ఆ కాలమందు సైనికులు గోతులులో  రోజులతరబడి కూర్చొని ఉండెడివారు. వారు ఏదైనా ఆరోగ్య నెపమున సెలవడిగిన కాల్చి చెంపెడివారు , బయటకుపోవుటకు అవకాశములేక  నిస్పృహ తో తుపాకీ గొట్టమును నోటిలో పేల్చుకుని  సెలవు తీసుకొనెడివారు.
వర్ష: మా తాతగారు యుద్ధమందు వీరమరణము  పొందినారు.
అగస్త్య: ఏ యుద్ధమందు  వీర మరణము పొందినారు?  

“1940 దంకెక్ అనే ఫ్రెంచ్ పట్టణములో జర్మన్ సేన బ్రిటిష్ సేనను అడ్డగించి వెనక్కి పంపింది. అడాల్ఫ్ హిట్లర్ “బ్లిట్స్ క్రీగ్” ,ఒక తరహా మెరుపుదాడి, పథకం వల్ల 68,000 బ్రిటిష్ సైనికులు చనిపోయారు అందులో మా తాతగారు ఉన్నారని భావన. మాతండ్రిగారు,  కూడా అట్లే సైన్యమునందు పనిచేసి వీరమరణము పొందినారు.”
అగస్త్య: భావన అనుచున్నావు, ఖచ్చితంగా తెలియదా ?
వర్ష : ఎట్లు తెలియునోయి అది యుద్ధము, భౌతిక కాయాలని ఇండ్లకు పంపుటకు ఎట్లు వీలుపడును? సమాచారం కూడా ఊహామాత్రమే. దంకెక్నుంచి నలుగురు ఈతగాళ్లు ఈదుకుని ఇంగ్లాండ్ పోయినారని అప్పట్లో అనుకున్నారట. గజఈతగాళ్ళు మాత్రమే అట్లు చేయుటకు వీలున్నది. మాతాత గజ ఈతగాడు.
అగస్త్య: నాకునూ మా పూర్వీకుల పై ఆసక్తి కలుగుచున్నది. లకుమ మరి నీకు మీ పూర్వీకుల గూర్చి తెలుసుకొనవలెనని లేదా ?
లకుమ : మా పూర్వీకులు రాజనర్తకులని మా అమ్మ ఆప్పుడప్పుడు చెప్పుచుండును వారు ఎట్టివారో అందరికీ  తెలియును వారి గూర్చి తెలుసుకొనుట వ్యర్ధము. వర్షుడు "అగస్త్య ఆసక్తి ఉన్న ముందునువ్వు మీ తాతగారి గురించి తెలుసుకొనుము.   అగస్త్య "నేను మా   నాన్న ని కలసి సంవత్సరములాయెను. ముందు నేను మా నాన్నగారిని  కలిసెదను. లకుమ కారులో అగస్త్యను వదిలిపెట్టెదనని చెప్పగా లకుమ అగస్త్య కలసి బయలుదేరిరి. 

10 comments:

  1. చాల బాగుంది. తలా అటుఇటు తిప్పకుండా చదివిస్తోంది మీ భారత వర్ష

    ReplyDelete
  2. భిన్నమైన పాత్రలు, విభిన్నమైన మనస్తత్వాలు
    చరిత్ర వివరణ ఒక వైపు, సంస్కృతీ సాంప్రదాయాల వర్ణన ఒక వైపు

    ReplyDelete
    Replies
    1. Your joy of reading will increase as we advance. Thank you.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. కథ ని చదువుతూ ఉంటే ఎప్పుడు ముగించి ఇంకో ఎపిసోడ్ ని ఎప్పుడుఎప్పుడు చదువుదాం అని మనస్సు అంటుంది

    ReplyDelete
  6. The bharathavarsha is giving me the immense pleasure of reading telugu.

    ReplyDelete
  7. వైవిధ్యమైన పాత్రలు, సంప్రదాయాలు,మనస్తత్వాలు..... ఆహా ఒక మనిషికి కావాల్సిన అనుభావాల పుట ఈ భరతవర్ష... అబినందనలు పూలబాల గారు

    ReplyDelete
  8. భరతవర్ష చదవటం మొదలెట్టాను. అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete