ముంబై మహానగరంలో జెట్ఏర్వేస్ విమానం దిగిన అరుణతార అంచ గమనమున సాగుచుండెను. ఆ ముగ్ధ మనోహరి ఠీవి చూచిన వారికి ఆమె మహారాణి యనిపించును కానీ నర్తకి యనిన నమ్మబుద్ది కాదు. యాబది వర్షములు సమీపించు చున్ననూ ఎర్రని బుగ్గలలో తగ్గని నిగారింపు, దేహంలో తగ్గని పసిమి ఛాయతో వెలుగుచున్న అరుణతార కామ దృష్టితో చూచువారికి, విలాసిని వలే కనిపించును. కళాదృష్టి తో చూచిన వారికి మోహినివలే కనిపించును. ఆమె కళ్ళు సూదంటురాయిని ,మోము చందమామను, ఆహార్యం అప్సరను, నడక రాయంచను తలపించును. ఒక్క ముక్కలో చెప్పవలె నన్నఆమె జక్కన చెక్కిన తీరైన శిల్పమువలే చూచువారికి తరలి వెళుతున్న తెలుగువారి తరతరాల వారసత్వ సంపదవలే కనిపించును.
విమానాశ్రయము లో పాలరాతి పై నడుచునప్పుడు పాలరాతి బొమ్మ వలే , దాటి బైటకు వచ్చి సూర్యకాంతిలో నడుచునప్పుడు బంగారు బొమ్మవలే కనిపించెను. సూర్యకాంతిలో మిలమిల మెరియుచున్న అరుణతారను చూచిన ఓ వృద్ధ ప్రయాణికుడు
మరొక ప్రయాణికుడితో "ఎవరోయీ ఈ చెకుముకి? లకుముకి చందమున నా డెందమును పరిగ్రహించెన"నెను. అందుకు అతడు "ఆమె ప్రక్కనే నడుచుచున్న మొండికట్టె ఎవడోయి, నల్లని తుమ్మమొద్దు
వలెనున్నాడు, ఆమె చేతిని చూరగొనుటాయే గాక చూర్ణము చేయుచున్నాడ"నెను. అదిచూచి మొదటి ప్రయాణీకుని
ముఖము వివర్ణమయ్యెను. విమానాశ్రయ నిష్క్రమణ
ద్వారం వద్ద నుంచి బైటపడిన అరుణతార తనకై ఎదురు చూచుచున్న వాహనము నధిరోహించగా ఆమె ప్రక్కనున్న తుమ్మమొద్దు “ఓబరాయ్” అనెను. వాహనము దూసుకు పోయెను.
ఒబెరాయ్ నందు వాహనము దిగగానే ఆమెను
సాదరంగా తురయ టెలిఫిలిమ్స్ వారు సమావేశ మందిరమునకు కొనిపోయిరి. విద్యుత్దీపకాంతిలో దగద్ధగాయ మానమై ప్రకాశించుచున్న సమావేశ మందిరమున విద్యుత్ దీపములతో పోటీపడుచూ ఉన్నత
రంగస్థలం పై కూర్చునిఉన్న తారలందరూ అరుణతార ప్రవేశముతో వెలవెలపోయిరి. వారందరి మధ్యలో ఆమె తారల మధ్య చంద్రునివలె కనిపించెను.
ద్రోణదళముల వంటి ఆమె కనులయందు విద్యాస్పర్థలో గౌడడిండిమ భట్టును ఓడించి, అతని కంచు
ఢక్కను పగుల గొట్టించిన శ్రీనాధుని విజయ గర్వము అనేక మేటి నర్తకీమణుల శృంగార నాట్య
భంగిమల భంగపరిచి వారి స్థానములను కొల్లగొట్టిన
ఆమె ముఖమునందు తొణికిసలాడ కాతులీనుచున్నఆమె ముఖమునే అందరూ చూచుచుండిరి.
మాయ అను పౌరాణిక నాటకము నూరు
భాగములు పూర్తి చేసుకున్న సందర్భముగా నాటక విజయోత్సవమును తురయ టెలిఫిలిమ్స్ జరుప నిశ్చయించి
ఏర్పాటుచేసిన సభకు ఆ నాటకమునందు ఆస్థాన నర్తకి గా ప్రముఖ పాత్ర పోషించిన అరుణతార గొప్ప
ఆకర్షణ అయ్యెను. ఆమెపై ప్రశంసల వర్షము కురిసెను. కొందరు ఆమె నటనను
పొగడగా మరికొందరు ఆమె నాట్యమును పొగిడిరి. కొద్దిమంది ఆమె అందమును పొగిడిరి. ఎవరో ఒక రసికాశిఖామణి, కేరళ నుండి
ఎంపికైన ఎగువసభ సభ్యుడు, శృంగారోత్సాహమున పుష్పగుచ్ఛమిచ్చునెపమున
తూలిపడి ఆమె కుచాగ్రములను స్పృశించెను.
ఇది
చూచి ఒక సభికుడు ఏమిసాహసము, ఏమి కొంటెతనమని వ్యాఖ్యానించెను అది విని మరొక సభికుడు అది సాహసము గాదు దౌష్ట్యము , కొంటెతనము గాదు క్రొవ్విదము. అయిననూ నేటి భారత దేశమున
వయసుమళ్ళిన రాజకీయవేత్తలు సిగ్గు ఎగ్గు మరిచి ఇటువంటి పనులు చేయుట సాధారణమాయెనని
సరిపుచ్చుకొనెను. ఈ స్త్రీ లోలుడు మొన్ననే మూడవ భార్యను మట్టుబెట్టి ఇంకనూ పరస్త్రీల
చుట్టూ భ్రమరమువలె పరిభ్రమించుచున్నాడు అనెను. అందుకు పొరుగువారు నవ్వి స్త్రీ యనిన
తేనెపట్టే కదా , ఒక్క భ్రమరమేమి ఖర్మ అనేక భ్రమరములు తిరుగుచుండును. అందు నేనొక భ్రమరము
నవ్వవలెనని నా ఆకాంక్ష. ఆమెను పెట్టి ఒక చలన చిత్రము రూపొందించవలెనని యోచించుచున్నాన"నెను. ఇచ్చట కామాతురులు పెచ్చుగా యున్నారు యని ప్రక్కవాడు వెనుకవరుసకు మారిపోయెను.
కొద్దిమంది ముఖ్యులు ప్రసంగిచిన
పిదప ముంబయి
విశ్వవిద్యాలయ పురాణ విభాగాధిపతి ముంబై విశ్వవిద్యాలయంలోని పురాణ విద్య కు మంచి ప్రజాదరణ
లభించెనని టెలివిజన్లలో పౌరాణిక మరియు చారిత్రక నాటకాలకు ఆదరణ పెరుగుటవల్ల
ముంబై విశ్వవిద్యాలయంలోని సంస్కృత మరియు పురాణ కోర్సులపై విద్యార్థుల ఆసక్తిని పెరిగెనని
సంస్కృత కోర్సుల ప్రవేశాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగెనని. అదనంగా, ఈ సంవత్సరం సంస్కృతం
కోసం రెండు తరగతులు పూర్తి సామర్థ్యంతో నడపడం ఇది మొదటిసారి అని చెప్పుచూ” నేను చాలా
మంది విద్యార్థులను వ్యక్తిగతంగా తిరస్కరించాల్సి వచ్చెను, వచ్చే ఏడాది ప్రారంభంలో రావలెనని వారిని కోరిరి. సంస్కృత కోర్సులు, తులనాత్మక పురాణ శాస్త్రము నందు (కంపారిటివ్
మిథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు) ప్రవేశములు గత రెండేళ్ళలో
అతిపెద్ద పెరుగుదలను చూసింది. ఇంతటివిజయానికి కారణమైనదర్శకులు మరిన్ని చారిత్రిక, పౌరాణిక
నాటకాలను ఎంపిక చేసుకోవాలని కోరెను. ఆమె నటీ నటులను కొనియాడి, ముఖ్యంగా ఈ విజయంలో సింహభాగం
నర్తకీమణి అరుణతారదే అన్నారు. సమావేశమందిరము అంతా కరతాళ ధ్వనులతో నిండెను.
సమావేశము ముగిసెను.అందరు వెడలిపోయిన పిదప అరుణతార మెల్లగా సమావేశమందిరము నుంచి నిష్క్రమించి నడుచుచుండెను నేను ఒక విలాస మందిరమును నిలిపిపెట్టి
యుంచితిని, ఈ రాత్రి కి మనము నా తదుపరి చిత్రము గురించి చర్చించవలెను అని అరుణతార
ప్రక్కన ఉన్ననల్లని వ్యక్తి ఆమెను వేదించుచుండెను.
అరుణతార వద్దని వారించుచూ "నాయుడుగారు, మీరు నాకు అవకాశాలు ఇచ్చినారని కృతజ్ఞతతో మీకు మారాడలేకున్నాను. మీరు ఇంత
దూరము వచ్చి ఇక్కడ సమావేశములో పాల్గొనుట విడ్డురంగానున్నది. నిజము చెప్పవలెనన్న మీకు
ఈ పౌరాణిక నాటకమునకు ఏమీ సంబంధము లేదు. బుల్లితెర
కు మీకు బాదరాయణ సంబంధమైననూ కలదా? సంవత్సరముల క్రితమే నాకు అవకాశములు మృగ్యమైనవి, నేను రాజకీయ రంగములో
చేరి నిత్యమూ నిప్పులో నడుచుచుంటిని. వెలుగు
పార్టీలో మహిళాధ్యక్షురాలిగా నా మనుగడే ప్రస్నార్ధకమయ్యెను.
రేపు హైదరాబాదులో జరుగు పార్టీ సమావేశము నా భవిష్యత్తును నిర్ణయించును. రాత్రికి నేనిచ్చట బసచేసిన అది నాకు మరణ శాసనమగును.నేను చలచిత్రములందు ఆశలు త్రుంచుకొంటిని. మీకు ఏమి కావలెనో నాకు తెలియును. కానీ అది జరగని పని అని అరుణ అనగా, నీ అందంచూసి మనసు పడి వచ్చితిని నన్ను నిరుత్సా హప రచ కు, నేను చలన చిత్రము నిర్మించలేను కానీ నిన్నూరక రమ్మన్ననని కొంత డబ్బు తీసి నాయుడు ఆమె చేతిలో కుక్కుటకు ప్రయత్నించె ను.అగ్గిమీద గుగ్గిలమువలే రేగి అరుణ తార నాయుడిని నెట్టివేయగా అతడు క్రింద పడిపోయెను.
ఆ దృశ్యము చూడగానే ఇద్దరు పాత్రికేయులు నాయుడు వెంటపడిరి. అరుణ తార అవమాన భారంతో పక్కనే ఉన్న ఒక
ఉపహారగృహములోకి వెళ్లి ఒక బల్లవద్ద కూర్చొని పండ్ల రసము త్రాగుచుండెను, మసకవెలుతురుతో నిండిన ఆ మందిరములో మంద్రముగా సంగీతము వినిపించుచుండెను. భగ్న మనస్సుల నుద్దరించు వైవిధ్యభరితమైన సంగీతం మంద్రముగా వినిపించుచుండెను. అది తెలియని నిర్యాణ భ్రాంతి కలిగించుచుండెను. ఇంతలో ఆమె మీద ఒక చేయి వాలెను, మసక వెలుతురులో అతడు వెంటనే కనిపించలేదు కానీ కొద్ది సమయములోనే అరుణతార అతడు ఎవరో గ్రహించెను. అతడే జాతీయ వార్తలలో పెచ్చుగా కనిపించు రాజ్యసభ సభ్యుడు శశి. అతడే ఇందాక (తూలి ) తనపై పడి తనను తాకిన కాముకుడు.
"నీవంటి ప్రజాదరణగల తారామణులుండవలసినది ఆకాశమున గానీ పంకిలమున గాద"ని ఆమె శ్రమను హెచ్చుజేసి మెచ్చుకొని మాట్లాడి ఆమె ఖేదమును బాపెను. నీవు కోరినచో మా పార్టీ లో ఎం పి గా పోటీచేయుటకు అవకాశ మిప్పింతును. మా పార్టీ జాతీయపార్టీ నీవు పని చేయుచున్న ప్రాంతీయపార్టీకన్నా వేయి రెట్లు మెరుగు. విధాన సభకు పోటీ చేసి నాయకురాలిగా వెలగవలసిన నీవు ఒక కుటుంబపార్టీ లో కేవలము మహిళాధ్యక్షు రాలిగా పనిచేయుట దుఃఖదాయకము." అనెను నావద్ద ఏమిచూచి అట్లు చెప్పుచున్నారు. నన్ను ములగచెట్టు ఎక్కించుచున్నారు" అని అరుణ అనెను.
శశి: నీ సమస్య అచ్చటనేయున్నది. నీవు స్వయం ప్రకాశితవు. కానీ నీప్రతిభను నీవు గ్రహించ లేకున్నావు. హిమాయల మున కూర్చొండ వలసిన నీవు మూలగ చెట్టుకే భయపడుచున్నావు.
మీ వన్నియూ ఒత్తి పొగడ్తమాటలు అని అరుణతార ఏమీ అర్థం కాని దాని వలె తెల్ల ముఖం వేసెను మహారాష్ట్ర లో పోటీ చేసిన తప్పక నెగ్గగలరు. అనెను
శశి: మీ నాట్య భంగిమలు నా మనసులో ముద్రించి నాకు నిద్రించు భాగ్యమును లేకుండా చేసినారు. అట్లే మహారాష్ట్రలో హిమాలయ కీర్తిని ప్రజాహృదయ మునం దు సుస్థిర స్థానమును సంపాదించారు. ఎవ్వరేమన్ననూ మీరు పోటీచేసిన గెలు పొందుట ఖాయము. తక్షణము వెలుగు పార్టీ నాయుడిని ఒక్క తప్పు తన్ని మీ స్థానమును చేజిక్కించుకొని సమయామాసన్నమైనది.
అరుణ వదనము వికసించెను. అది చూచి అతడిలో కాంక్ష విప్పారెను. అతడు ఆమె కంఠమును , పెదవులను వక్షములను చూచి మత్తెక్కి మైమరచెను.
ఆమె అందమును తేనెపట్టు వంటి ఆమె అందమునకు ఒక వజ్రపుటుంగరమను రాయిని విసిరెను. నీ అందమునకు నా బహుమానము అనుచూ ఒక వజ్రపుటుంగ రమును బహూకరించెను. అరుణ వద్దు అనునంతలోనే అతడే ఆమె వేలికి దానిని తొడిగి "నాకు ఎల్లపుడు ఇక్కడ ఒక విలాసమందిరము నిలిపిపెట్టబడి ఉండు" ననిజెప్పి, లలామ లావణ్యమును పెనవేసుకొనెను. తార అతడిని ఒక్క వుదుటున నెట్టి ఉంగరమును అతడి మొఖంపై కొట్టెను. ఇట్టి స్పందననూహించని శశి " అయ్యో తేనెపట్టు చేజారేనే!"అని మెల్లగా అనుకొనెను. "తేనెపట్టుపై రాయి విసిరితివి తేనెటీగ కాటు రుచి చూడుమ."ని అరుణ అతడి చెంప పగుల గొట్టెను. శశి తత్తరపడి చుట్టూ చూసి ఎవ్వరూ చూచుటలేదని చల్లగా జారుకొనెను.
అరుణ నిస్సహాయముగా ఉపహారగృహములో ఒక బల్ల వద్ద కుర్చీలో కూలబడి ఒంటరి
పాటున తన అసహాయతకు చింతించుచుండెను. చుట్టూ మసక వెలుతురావరించి యున్నది. అల్పాహారశాలలో బల్లలన్ని యూ స్త్రీ పురుషులుతో నిండి యున్నవి. మసకవెలుతురులో వారి ముఖములు అస్పష్టముగా గోచరించుచున్నవి. ఈ హఠాత్పరి ణామము నుండి తేరుకొనకముందే వెనుకనుండి అరుణ భుజము నెవరో తాకినారు. అరుణ వెనుకకు తిరిగి చూసెను. ఆమె వెనుక ఒక స్త్రీ చిరునవ్వు తో నిలబడి యున్నది. ఆమె తనతో పాటు మాయ ధారావాహికలో తల్లి పాత్రలో నటించిన దేవయాని. ఆమె అరుణముందు కొచ్చి కుర్చీలో కూర్చొనెను.
“తల్లిపాత్రలో వయసు మళ్లిన దానివలె నటించిన నువ్వు వయసులో చిన్నదానివ”ని అరుణతార నవ్వెను. "వయసుకుతగ్గ పాత్రలు చలన చిత్రరంగమందు మాత్రమూ వచ్చుచున్నావా? పిన్న వయస్కులైన రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటివారు తండ్రి పాత్రలు వేయుచుండగా బాలకృష్ణ, నాగార్జున వంటి వృద్దులింకనూ కుర్రపాత్రలలో నటించుచూకూతురు వయసున్న పిల్లలతో గెంతుచూ కథానాయకులుగా చలామణీ అగుచు న్నారు. అరుణ హ హ్హ హ్హ యని ఒక జీవం లేని నవ్వు నవ్వెను. ఆ విగతహాసము ను పసిగట్టి "ఎందుకో మీరు ఆందోళనలో ఉన్నట్టు స్పష్టమగు చున్నది. మీరు వచ్చినప్పటినుంచి నేను గమనించుచున్నాను."అనెను
"ఆ శశి చేసినదంతయూ చూచితివా?" అని అరుణ అడిగెను. నేనే కాదు ఇచ్చట ఉన్నవారందరూ చూచినారు. నీ అందము స్త్రీలనే వెర్రెత్తించును. ఇక పురుషుల సంగతి చెప్పపనేమున్నది. అయిననూ ఇందు నీవు చేసిన తప్పేమున్నద"ని దేవయాని అరుణను ధైర్య పఱచుచుండగా ఇక దాచాల్సిన పనిలేదనుకొని “ఇందాక శశి నా చేతిని తాకిన దృశ్యమును చూసినావు కదా కొంచెమాందోళన గాయున్నది.పాత్రికేయులా చిత్రము నచ్చువేసి చిలువలుపలువులుగా కల్పించి వ్రాయకుందురా!" అని అరుణ కలత చెందెను.
అది వినినంతనే దేవయాని ఘొల్లని నవ్వి “పాత్రికేయులకు ఇట్టి దృశ్యములు పరమాన్నములు. “అట్టి లైంగిక ఆరోపణలు. అక్రమ సంబంధముల వార్తలన్న ప్రజల పడిచత్తురు. మన దేశమున అత్యధికముగా చదువు వార్తలివియే!" అని నవ్వసాగెను
అరుణ తార ముఖములో భయము తొంగి చూచెను. అది చూచి దేవయాని మరల నవ్వెను. నీవు ఎంత పవిత్రముగా నున్ననూ పచ్చకామెర్లు వచ్చిన ప్రజలు నిన్ను అర్థము చేసుకొని పద్దతి మారదు. అడ్డదారులు ద్వారా పైకి వచ్చుటకు అవకాశములు కొరకు పక్క లెక్కుటకు సిద్ధముగా నున్న నావంటివారే ఎక్కువగా యున్న చిత్ర పరిశ్రమలో నే నీవునూ యున్నావు. తాటిచెట్టుక్రింద కూర్చుని పాలు తాగిననేమి ప్రయోజనము ?
" నేను కూడా శీలమునకు తిలోదకములిచ్చి అడ్డ దారిన అందలమెక్కవలెనా ?" అరుణకు దుఃఖము పొరలి వచ్చుచుండెను. దేవయాని ఆమెను బాధను అర్థము చేసుకొని "ఆధునికంగా కనిపించే నాట్యతారవి కానీ నీవు సత్తె కాలపు మనిషివి. నేడు సమాజము మారిపోయెను. ఇప్పుడు భారతదేశంలో 76% స్త్రీలు మరియు 61% పురుషులు అక్రమసంబంధములను అనైతిక చర్యగా భావించుట లేదని గణాంకములు జెప్పుచున్నవి.
అరుణ : ఏమీ గణాంకములు ఏమీ విపరీతము. అట్లు చెప్పువారిని చెప్పుతీసి కొట్టవలెను.
దేవయాని : నీవు సత్తె కాలపు మనిషివనుకొంటిని క నీవు నూతిలో కప్పవలెనున్నావే
అక్రమ సంబంధాలు నేరం కాదు. సహజీవనం నేరం కాదు.పెళ్ళికి ముందు శృంగారం నేరం కాదు.
స్వలింగ సంపర్కం నేరం కాదు. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చెయ్యడం నేరం కాదు. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుణ్ని విచారించరాదు.వ్యభిచారము చేయువారిని ఖైదు చేయరాదు. స్త్రీ కి సంతానము కలిగినచో దానికి ఆమె భర్తే తండ్రి అగును.
జాతీయగీతం పాడునపుడు నిలబడకపోయినచో నేరము కాద"ని ఉన్నత న్యాయస్తామే జెప్పెను.
అవాక్కయిన అరుణ మెదడు స్థంభించెను ఆమె దేవయానికి నమస్కరించి విమానాశ్రయములకు బయలుదేరెను. "శశి చెడ్డ వాడైననూ అతడు చెప్పిన మాటలు నీకు వరములని మరువకుము. "అని చెప్పి దేవయాని చేయి ఊపెను.
***
న్యూ ఢిల్లీ ప్రపంచ పుస్తక మహాసభ : ప్రగతి మైదాన్ లో మహా సంద్రమును తలపించి పుస్తక ప్రదర్శన జరుగుచున్నది. అది ప్రధానమంత్రి యువ 2.0 కార్యక్రమము. భారత్ మండపం నందు 2,000 కంటే ఎక్కువ ప్రచురణకర్తలు, పంపిణీదారులు మరియు పుస్తక విక్రేతలు పాల్గొని, విస్తృత శ్రేణి పుస్తకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించుచున్నారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో భారతీయ భాషలను ప్రోత్సహించుటకు యువ రచయితలు రాసిన పుస్తకాలను ఆవిష్కరించుచున్నారు. మొదటగా 14వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త శ్రీ మాధవ మలయాళ అనువాదంను ఆయన విడుదల చేసినారు.
తదుపరి సర్ చార్లెస్ ఎలియట్ రచించిన "హిందుత్వం మరియు బౌద్ధం - ఒక చారిత్రక స్కెచ్ తెలుగు అనువాదమును ఆయన విడుదల చేసిరి. అది భారతవర్ష చేసిన అనువాదం. అనంతరము రచయితకు 2 నిముషములు మాట్లాడుటకు అవకాశమిచ్చిరి.
భారతవర్ష మాట్లాడుతూ " సర్ చార్లెస్ ఎలియట్, రచన హిందూయిజం మరియు బౌద్ధమతంలో ఏది ప్రాచీనమైనది? ఏది ముందు పుట్టింది అని స్పష్టంగా ఉందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధమతం ప్రస్తుత వేద సంప్రదాయాల ( హిందుత్వము) నుండి ఎలా ఉద్భవించిందో రచయిత వివరించాడని తెలియజేసి బౌద్ధమతం తరువాత కాలంలో హిందుత్వమును గణనీయంగా విభేదించి విభిన్నంగా మారింది. ఇది బ్రాహ్మణిజానికి ఒక ప్రతిచర్యగా కనిపిస్తుంది. అంటే బుద్దుడి కంటే ముందే బ్రాహ్మణత్వము ఉన్నది. బౌద్ధమతం ఒక ప్రత్యేక మతంగా పునాది వేద కాలం తర్వాత అభివృద్ధి చెందింది. అని స్పష్టంగా తెలుస్తోందని, కొంతమంది విదేశీ మతాలను అవలంభించే రచయతలు బౌద్ధమే ముందనీ వితండవాదం చేస్తూ హిందు చరిత్రను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని. ఇది తండ్రి కంటే ముందు కొడుకు పుట్టేడన్నట్టుగా ఉందని భారతవర్ష తెలియజేసెను. తదుపరి వర్షుడు రచించిన సరస్వతీ శతకమును విడుదల గావించెను
అట్లు విద్యాశాఖామంత్రి 41 పుస్తకాలను ఆవిష్కరించెను . తరువాత అతడి సరస్వతీ శతకమును మంత్రిగారు విడుదల గావించిరి. పిమ్మట ఆయన భారతీయ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, గర్వించదగిన రాయబారులాగా రచయితలను మెచ్చుకొనిరి. విద్యాశాఖామంత్రి మన వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకువచ్చి భావితరాలకు అందించాలని రచయితలందరి నీ కోరినారు.
ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, జాతీయ పుస్తక సంస్థ అధ్యక్షుడు ఆచార్య మిలింద్ యుజిసి అధ్యక్షుడు ఆచార్య జగదీష్ కుమార్ మరియు జాతీయ పుస్తక సంస్థ దర్శకుడు శ్రీ యువరాజ్ హాజరయ్యారు.
ఆనంద నిలయములో ఆ కార్యక్రమమును ప్రత్యప్రసారములో చూసిన మాలిని మంజూషలు తమ భావములను సీతారత్నముగారి (అప్పుడు అచ్చట యుండుటతో) తో పంచుకొనుటకు ప్రయత్నమూ చేయగా "అమెరికాలో నున్న మా కృష్ణుడు నుండి పిలుపు వచ్చున"ని లేచి వెడలిపోయిరి. మాలిని మంజూషలు తమ భావములను రాధామనోహర పుష్పములతో పంచుకొనిరి.
***
మరునాడు వర్షుడు వాయుయానములో విశాఖ వచ్చెను.అతడు స్నానము చేసి తెల్లని పంచె ధరించి కళాశాలకు బోవుటకు తనగదిలో అద్దము ముందు నిలిచి సిద్ధమగు చుండగా మంజూషవచ్చి నీకోసము అతిథులు వేచియున్నారని చెప్పెను. భారతవర్ష కండువా ధరించి మండువాలోకి వచ్చి చూడగా విదిష కనిపించెను. పక్కనే బసవడి
తండ్రి సర్రాజు గారు కనిపించిరి. "బసవడిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపినారని, వారం రోజులు విశ్రాంతి తీసుకొనమని చెప్పినార"ని చెప్పెను. అదృష్టవంతులు
మీ అబ్బాయికి ఎముకలు ఏమీ విరగలేదు. ప్రమాదమే మీ లేదు!"అని వర్షుడనెను.
"వాడి బుద్ధి మారనంతవరకూ ప్రమాదం వాడిలోనే పొంచి ఉండును. వాడికి మాకంటే నీపైనే గురి ఎక్కువ, వాడి బుద్ధి నెట్లైననూ మంచిదారికి మరలించి పుణ్యము కట్టుకొనుము" అని సర్రాజు గారు అర్థించిరి. ఇంతలో ఉరుములేని పిడుగువలే దామిని హడావుడిగా ప్రత్యక్ష మయ్యెను. మండువాలోనుండి మాలినీ మాలినీ అని పిలవసాగెను. మాలిని వంట గదినుండి పరుగున మండువాలోకి వచ్చి దామిని ముఖములో ఆందోళన ను చూచి "ఏమాయనే అంతా క్షేమమే కదా !" అని అడిగెను " లకుమను పోలీసులు ఠాణాకు పిలుచుకు పోయినారు. నాకు కాళ్ళు చేతులు ఆడకున్నవి. మా ఆయన ఊళ్ళో లేకుండెను. " అని చెప్పెను.
వాళ్ళ అమ్మ ఏమైననూ చిన్న బొమ్మా రాష్ట్రములో పెద్ద పేరున్న నాయిక ఆవిడకు జెప్పక ఎందుకీ ఆందోళన. అది మొన్ననే హైదరాబాదు చేరుకొనెను. పార్టీ లో దాని పరిస్థితి అస్తవ్యస్తముగా నున్నదని నిన్న దూరవాణిలో తెలిపెను. నిన్న లకుమ పరీక్షలు ముగిసినవి. నేడు వాళ్ళ అమ్మ కడకు వెళ్ళవలసి ఉన్నది. ఈ లోపునే ఇట్లు జరిగి పోయెన"ని దామిని వాపోయెను. "ఇంతకీ ఏమి జరిగెనో తెలపక ఏమీ ముసుగులో గుద్దులాట?" అని మాలిని అనగా
"ఆ విషయమును నేను చెప్పెదనని ధ్వజ స్తంభము వలే నున్న ఒక పెద్దమనిషి లోనికి వచ్చెను. అతడే వర్షుడి మిత్రుడు చక్రపాణి. అతడు లకుమ చదువు కొనుచున్న
వాసవి ఇంజినీరింగ్ కళాశాల ప్రధానో పాధ్యాయుడు.
ఇది లకుమ సమస్య కాదు అందరి సమస్య. అంతర్జాలమందు ఉదృతమగ ( వైరల్) ప్రబలుతున్న లఘుచిత్రముల జ్వాలలలో యువత సలభములవలె కాలిపోవుచు న్నారు. అధిక వీక్షణలు పొందిన చిత్రములలో వారేమి జేసిననూ మనవారు అదే చేయుచున్నారు. గోడలపైన, గొందులలోను నాట్యములు చేయుచున్నారు, రహదారుల పై ద్విచక్రికావిన్యాసములతో వీధులు విమానము మోతెక్కించుచున్నారు. మా కళాశాలనుంచి లకుమ, స్నేహ, ఇంకా అనేకులు ఇదే పిచ్చి లో ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై మరియు ఇతర నగరాలతో సహా వివిధ నగరాల్లోని యువకులు ఇదే పిచ్చిలో నున్నారు. అధికారులు ద్విచక్రికా విన్యాసములు(స్టంట్ బైకింగ్)పై కఠిన చర్యలు తీసుకున్నారు. 25,000 నుంచి 2 లక్షల వరకూ భారీ జరిమానాలు విధించుచున్నారు. పోలీసులు ఎంత కఠినముగా వ్యవహరించిననూ వీరి పిచ్చిముదిరి జాతీయ సమస్యగా పరిణమించినది.
వర్షుడు: మన జాతి మొత్తానికి తెగులు పట్టుటకు కారణము అవిద్య. అందుకు కారణముమనము. మనము ఎన్నడైననూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసము గూర్చి పట్టించుకొంటిమా ? ఎప్పుడు చూసిననూ గణముల కొరకు చావగొట్టుటే మనకు తెలిసిన విద్య.
చక్రపాణి: బాబూ నన్ను చావగొట్టకు నేనసలే ఆందోళనలో ఉన్నాను.
వర్షుడు : ఇప్పుడు మీ విద్యార్థులనందరినీ విడిపించవలెనందువు అంతేకదా!
వర్షుడు : విడిపించుట కాదు మరల ఆ పిచ్చి లో పడకుండా చూడవలెను.
మాలిని: సాహిత్యము నిత్యమూ ఆనందమును కలుగజేయును దానిని వదిలి క్షుద్రా నందముల వైపు పరుగిడరాదని చెప్పుచూ వర్షుడు తరుచుగా అవధానములద్వారా రచన ల ద్వారా చెప్పుచుండును.
దామిని: లకుమకు సాహిత్యము, పుస్తకపఠనము తలకెక్కలేదు.
చక్రపాణి కి వెదుకుచున్న తీగ కాలికి తగిలినట్టయి "వసంత పంచమికి మా కళాశాలలో జరుగు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని సరస్వతీ శతకముఆలపించి విద్యార్థులకు మార్గ దర్శనమును చేయవలెన"ని ఆహ్వానించెను.
విదిష భారతవర్ష పుస్తకావిష్కరణ కార్యక్రమమును సజీవ తైలవర్ణ చిత్రముగా లిఖించి తెచ్చి వర్షున కిచ్చెను. అది చూచి విదిషకు చిత్రకళలో నైపుణ్యము పెరిగెనని ఆమెను మాలిని గారు అభినందించిరి. చక్రపాణి ఆ చిత్రము చూచి ముగ్దుడయ్యెను .
"ఆర్ధిక పరిస్థితి వలన చదువు ఆపివేసి చిత్రకళ చేపట్టి రాణించుచున్న ఈ అమ్మాయి పేరు విదిష. మా వర్షుడి బాల్య స్నేహితురాలు" అని మాలిని విదిషను పరిచయము చేసెను. విదిష చక్రపాణి గారి కాళ్ళకు నమస్కరించెను.
"మా కళాశాలలో 12వతరగతి కూడా కలదు. నీవు చదువుకొన్నచో నీకు" .. అట్లనుచున్న చక్రపాణి వైపు భారతర్ష వాలుగా ఒక్క చూపు చూసెను " మీ కళా శాలలో ఒక్కరికైననూ ఈ సంస్కారమబ్బేనా? " అన్నట్టున్నది ఆ చూపు. "సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు!" అని ఆశీర్వదించి చక్రపాణి బయలుదేరెను. భారతవర్ష కూడా బయలుదేరెను. వారిద్దరూ మండువా దాటుచుండగా అగస్త్యుడు చేతిలో వార్తాపత్రిక తో పరుగుపరుగున వచ్చెను.
అతను వార్తాపత్రికను వర్ష చేతుల్లో పెట్టెను. వర్షుడు చదువుట ప్రారంభించెను
"ఒడిశా రైలు ప్రమాదం" పలాస సమీపంలో హౌరా మెయిల్ యొక్క మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. నౌపుడా జంక్షన్ నుండి బయలుదేరిన తర్వాత లెవల్ క్రాసింగ్ వద్ద సాయంత్రం 4 గంటలకు ఎద్దును ఢీకొట్టడంతో ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు మిగితావారికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద గాయాలతో ఉన్న ప్రయాణికులు పలాస రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (ఆ నలుగురు ప్రయాణీకుల ఛాయాచిత్రాలు ముద్రించ బడ్డాయి.) "
రైలు ప్రమాదమునకు మనకు ఏమి సంబంధము? ఇది నాకెందుకిచ్చితివి అని వర్షుడు అగస్త్యనడిగెను. "ప్రమాదం జరిగి రైల్వే ఆసుపత్రి లో ఉన్న వారి చిత్రములు చూడుము" .ఆ మొదటి చిత్రము మా నాన్నది. అని అగస్త్యుడు అనెను.
వర్షుడు: వెళ్లదలచితివా ? అని అడిగెను. అతడి స్వరము నూతులోనుంచి వచ్చినట్టున్నది. అగస్త్యుడు అవునని తలూపెను.
వర్షుడు: చెప్పితిని కదా సమయము వచ్చినచో ధైర్యము, మనసు అవే వచ్చును.
అగస్త్యుడు నవ్వెను . వర్షుడు కూడా నవ్వెను. అగస్త్యుడు రైలు నిలయముకు బయలు దేరెను
***
సరస్వతి పూజ :
వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ తీర్చిదిద్దిన సంక్రాంతి రంగవల్లివలె, బహుళ వర్ణము లలిమిన నింగివలె, ఎర్రని తామరలు నిండిన కొలనువలె మనోహరముగా నయన పరితోషకముగా యున్నది. వర్షుడు ప్రవేశద్వారం కడనిలిచి ఆ అలంకారములు మైమరచి చూచుచుండెను. ప్రధానోపాధ్యాయుడు చక్రపాణి మరియు ఇతర అధ్యాపక సిబ్బంది ఎదురేగి స్వాగతము పలికినారు. విద్యార్థుల లో అల్ప సంఖ్యాకులు పసుపు వర్ణ సంప్రదాయ వస్తములను ధరించి పొద్దుతిరుగుడు పువ్వుల తోటవలె, అమ్మవారి భక్తులవలె అగుపించిరి. కొద్దిమంది విద్యార్థినులు చిలక పచ్చని వస్త్రములను ధరించి చిలకలవలె అగుపించిరి. పెక్కుమంది వేదిక కడ నీలి తూలోరూకములను (జీన్స్) ధరించి పుష్పాలంకృత సరస్వతీ విగ్రహముచుట్టూ చేరియున్నారు.
వారు భక్తి భావము లేక తైలసంస్కారము లేని జుట్టువలె, రక్త హీనతగల మనిషివలె పేలవముగా అగుపించిరి. వారు పాదరక్షలను సైతము విడువక వేళాకోళము లాడుకొనుచున్నారు. వారిని చూచిన వర్షునికి ఎంగిలి మంగలమును సాలిగ్రామముకడ బెట్టినట్టు, మర్కటమునకు బొట్టుకాటుక దిద్దినట్టు, మార్జాలమునకు కిరీటము పెట్టినట్టు, అవలక్షణములవాడిని అలంకరించినట్టు వెగటనిపించెను. వారితో లకుమ కూడా కూడుటతో వర్షుడి వదనమును విషాద ఛాయలు కారు మబ్బులవలె అలిమెను. విద్యార్థుల కలకలమును చూచి కాలహరణము చేయక చక్రపాణి మరియు అధ్యాపకులు వర్షుని నేరుగా వేదికపైకి ఆహ్వానించిరి. వర్షునికి పుష్పగుచ్ఛ మివ్వవలసి నదిగా కళాశాల ప్రధానోపాధ్యాయుడు కోరినప్పుడు ఉత్సాహముగా విద్యార్థులు పోటీపడిరి. అదిచూచి చక్రపాణి "ఆంధ్రావనిలో ఎచ్చటకి పోయిననూ నిన్ను గుర్తింతురు కానీ మా విద్యార్థులుకూడా నిన్ను గుర్తించుటనాకానందదాయకమ"నెను. ఒక అమ్మాయి
వేదికనెక్కి వర్షునకు పుష్పగుచ్ఛమిచ్చెను. పెద్దలు వర్షుని వేదికపై కూర్చొండబెట్టిరి.
అక్కడ ఒక ప్రత్యేక ఆసనము ఖాళీగా యున్నది. భారతవర్ష దాని కేసి చూచుచుండగా చక్రపాణి అది ఒక ఆజ్ఞాత అతిథి కొరకని అతడిని చివరిలో పరిచయము చేసెదనని తెలిపెను.
ప్రధానోపాధ్యాయుడు ముఖ్య అతిథిని దీపం వెలిగించమని ఆహ్వానించెను. భారతవర్ష దీపం వెలిగించి ఉపన్యాసకులందరినీ దీపం వెలిగించమని పిలిచెను. దీప జ్వలనం తరువాత కొంతమంది పసుపు వస్త్రములు ధరించిన విద్యార్థులు సరస్వతికి వందన గీతమును గానం చేసిరి. రువాత వర్షుని ప్రసంగం ప్రారంభమాయెను.
అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు!
వేదిక నలంకరించి పెద్దలందరికీ నమస్కారములు.
విద్యార్థినీ విద్యార్థులకు ఆశీర్వచనములు.
వసంత ఋతువును స్వాగతించడంమరియు జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని గౌరవించడం ఈ వసంత పంచమి ఉద్దేశ్యములు. వసంత పంచమి కొత్త శక్తి, సృజనాత్మ కతలకి ప్రతీక. కళ, జ్ఞానం, సృజనాత్మకత మరియు విద్య కొరకు జ్ఞాన దేవత ఆశీర్వాదం అవసరము. జ్ఞానమునకు అధినాయిక సరస్వతి ... వెనకనుంచి పిల్లి కూతలు వినబడి నవి. వర్షుడు మట్లాడుటాపెను. చక్రపాణి విద్యార్థులను నిశ్శబ్దముగా నుండమని హెచ్చ రించెను. వర్షుడు ప్రారంభించెను. వెనకనుంచి ఆవులింత శబ్దములు వినిపించి నవి. వర్షుడు వరసమార్చెను.
పాశ్చాత్త్య నాగరికతే ఉనికి, ఊపిరి అన్నట్టు వస్త్రధారణ, భక్తి అనిన అజ్ఞానమని గురువులకు నమస్కరించుట అసౌకర్యమని భావించువారు నేటి కాలమున ప్రభలిపోవు చున్నారు. వారు సరస్వతి పూజనేకాక సరస్వతిని కూడా లక్ష్య పెట్టరు. మరి వారు నమ్మునవి ఏమి? అని వర్షుడు అడిగెను.
హ్యుమానిటీ, టెక్నాలజీ, ఈక్వాలిటీ అను మాటలు వెనుకనుంచి వినిపించినవి.
భారతదేశ రక్షణ వ్యయము ఎంతో తెలుసునా? అని అడిగెను. అంతా నిశ్శబ్దము అలుము కొనెను. భారవర్ష "సాలీనా ₹6.81 లక్షల కోట్లు" అనెను. ఒక్క క్షణము
అజాగ్రత్తగా ఉన్నచో రెప్పపాటులో చొరబాటుదారుల ప్రవేశించుచున్నారు దేశములను ఆక్రమించుకొను చున్నారు.మానవత్వము ఎచ్చట కలదు? అధునాతన ఆయుధములు సాంకేతిక పరిజ్ఞానము ఉన్ననూ దురాశ ఆక్రమణ తగ్గినవా? మానవ ప్రవర్తన ఏమి మారినది? మానవత్వమే యున్నచో అధునాతన ఆయుధములను సమకూర్చు కొనుటకు లక్షల కోట్లు ఖర్చుచేసి, భయముతో సరిహద్దుల వద్ద సైనికులను రాత్రి పగలు కాపలాపెట్టి భయముతో వణకవలసిన పనేమి?
దేశభక్తి , దైవ భక్తి లేని వారు ఉన్నచో ఎంత సాంకేతికత యున్ననూ నిరుపయోగమే. మంగోలియన్ల దాడులను అరికట్టుటకు 2000 సంవత్సరములు శ్రమించి చందమామ నుంచి కూడా కనబడు నంత పెద్ద గోడ, చైనా గోడ ను కట్టిన తరువాత చైనాపై దాడులు ఎట్లు జరిగినవి? దేశభక్తి లేని లంచగొడులవల్ల. చక్కటి వ్యక్తిత్వమునకు, జ్ఞానమునకు స్మృతికి భక్తి విశ్వాస ములే మూలము. బ్రహ్మ యొక్క శ్వాస నుండి ఉద్భవించి, ప్రపంచానికి జ్ఞానం, సంగీతంఅందించిన సరస్వతి ని నిర్మల మనసుతో ప్రార్థించ రండు అని సరస్వతి పై ఒక చక్కటి గీతమునఆలాపించెను.
చతురాస్య ముఖజం చతుశృతీ కంఠ నిక్షిప్తం..........
కమల దళ యుగళ నయన పుటం కచ్చపీ కరభూషితం భారతీ వందనం
కళకళలాడే నీ శశివదనం సనాతనం శుభకరం. భారతీ వందనం.
సుధలను చిలికే నీ శుభ వదనం, జ్ఞాన సంగీత సాహిత్య సదనం
బ్రహ్మ ముఖమున శ్వేతాంబరివై వేదములొకచేత వీణను ఒకచేత
పూని జనించిన జ్ఞాన రూపిణి భారతీ వందనం. భారతీ వందనం.
భారతీ వందనం భారతీ వందనం భారతీ వందనం.
సరసిజనాభుకు, పద్మభవునకు విశ్వసృష్టికి బాసటనొసగిన పలుకుజెలికి
ఆ విద్యల తల్లికి వందనం. భారతీ వందనం. భారతీ వందనం.
నీ కన్నులు రెండు కవితాంబుధిలు ఆ అంబుధిఘోషలు నీ శ్వాసలో కదులు
అవి కవిహృదయంలో ఆగక మెదలు
నీ ఉఛ్వాసాన వేలభాషలు నీ నిస్వాసాన వేదఘోషలు
యోగ్యత భాగ్యము గలిగిన యోషలు మార్చరు తమతమ వేష భాషలు
తెలిసిన పురుషులు పరుషములాడక సరసముగా నవరసములు గ్రోలుచు
నీ పదములపై మధుపములైవ్రాలి కవితా సుధలే గ్రోలుచుందురు
కళకళలాడే నీ శశివదనం సనాతనం శుభకరం - భారతీ వందనం
సుధలను చిలికే నీ శుభ వదనం, జ్ఞాన సంగీత సాహిత్య సదనం
నీ శుభ వదనం ప్రతిభకు నిలయం, సుందర కళలకు ఆరంభం
నీ హృదయం కరుణా సదనం సనాతనం శుభకరం భారతీ వందనం
భారతవర్ష పాట ముగించగానే చక్రపాణి "ఇందాక చెప్పిన ఆజ్ఞాత అతిథి ఇప్పుడు వేదిక నలంకరించి సరస్వతీ శతకంలో వంద పద్యములను ఒక గంటలో ఆలపించున"ని ప్రకటించెను. ప్రకటన ముగియుటతోనే వేదికపై మరీదు కనిపించెను. భారతవర్ష ఆశ్చర్యమునకుగురి అయ్యెను. అతడు ఆశ్చర్యము నుండి తేరుకొ నులోపు మరీదు సరస్వతి ప్రార్ధన పద్యములు మొదలుబెట్టెను.
నీరద యాన స నాతని
వారము లోనిల చి యుంటి వాక్జెలి నీకై
నేరము లెంచక రమ్మా
కోరన విద్యల నొసగుము కూరిమి తోడన్
ధనమెం తున్నను అందున
ఘనమే మికలదు తలంప కలిగే యాలో
చనలే ముందుకు నడుపిం
ధనమం చుతెలిసి నవాడు ధన్యుడు ఇలలో
జాపితి కరములు నీకడ
జూపుము నీదయ నొసంగి శుభమగు విద్యన్
చూపుము తోవను ముందుకు
దీపుర మగుకను లతోడ దీపము నీవై
మందమ తినిమతి మరుపును
తొందర తలపు లనెల్ల తొలగిం చమ్మా
అందరు మెచ్చెడి గుణమును
చిందర కానిత లంపులు చిరముగ నిమ్మా
వందన మగునీ వదనము
కుందన కాంతుల నుచిమ్ము కోపము లేకన్
పొందిక కగలధి నాయిక
సుందర రూపము నుచూడ శోకము తొలగున్
వదలను భారతి పదములు
వదలను పుస్తక ముచూపు మార్గము విడిచా
పదలను ఎన్నడు పిలువను
మదకట వెలుతురు నుదెచ్చు మనసుకు విద్యే
వందన మిదిగో భారతి
సుందర సుమముల నుదెచ్చి శోభిత మగునీ
స్కందము లకుమా లగవే
సందమ మగురూ పుచూడ సంతస మవదా
కోరిన విద్యల నిచ్చెడి
భారము నీదిక బలమగు బాటను చేసా
సారము నియ్యగ వేడెద
కూరును నీదయ కలిగిన కోరిన వెల్లన్
ప్రతిమ చదువరి మనసున
ప్రతిష్ట జేసిన దిజాలు ప్రతిభ తానే
పాతము వలెవ చ్చి బడును
స్మృతియు కూడును చదువరి సతకాం తుడగున్
పదికా వ్యముల నింటికి
విధిగా దెచ్చిచ దవంగ విజయం తథ్యం
సుధలే నోటన పొంగగ
బుధుడే నీచెలి మికోరు భుమిలో సుమతీ
మరీదు అట్లు అవలీలగా శతకమును పూర్తి చేసెను. అందరి కరతాళ ధ్వనులమధ్య వర్షుడు మరీదుకి సన్మానము జేసెను. మరీదు కళ్ళు చెమర్చినవి.
***
My god. I had a lump in my throat when I read this
ReplyDeleteI got a great feeling after reading your comments, hope you are also enjoying the language apart from the story. Is my decision of using old Telugu for this novel correct?
ReplyDeleteDear sir it is very tough to write in perfect telugu without using English words. I can understand your efforts. But people addicted to Tinglish(Telugu+English)Very few people can understand this.
DeleteThe language which is used in bharatavarsha remembering my old days of school
ReplyDeleteనాటి సబా సబికులు, ప్రజలు అరుణతార అందమును, ఆదరించినారో లేదో తెలియదు గాని మీ రాతాలలో ఆమెను నేను స్పస్టముగా చూడగలిగాను. మీ వంటి రచయుతలు ఈ రోజులలో కూడా ఉండబట్టే తెలుగు తల్లి బ్రతికి ఉండనే నమ్మకం వస్తుంది. ధన్యోస్మి గురు గారు
ReplyDelete