Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, December 13, 2020

bharatavarsha 92

శిల్ప నిర్మాణ  సౌష్టవమును కలిగి  సాహిత్య సంగీత కళా హారముల కాంతులీను యోష,   త్రివేణీ సంగమ ఘోషను ముహుర్భాషా శ్వాస లో నిలిపి భారత రాజధాని యందు సాహిత్య జ్ఞాన జిజ్ఞాసులకు  సోపానములవలె  జిగజిగ లాడు జియ్య వలె, సనాతని విశ్వరూపమువలె   వెలుగుచు భూరి నగరు యొకటి కోపర్నికస్ మార్గమందు కళాదేవళ ధ్వజ స్తంభమువలె నిలిచియుండెను. 

లలిత్ కళ అకాడమీ, సాహిత్య కళ  అకాడమీ మరియు సంగీత నాటక్ అకాడమీ అను  మూడు జాతీయ అకాడమీల ను కలిగి యుండు Y- ఆకారపు భవనమదియె. అదియే భారతదేశపు ప్రఖ్యాత కవీంద్రుడు రవీంద్రుడు విశ్వవ్యాప్త మొన ర్చిన, భారత కీర్తిని సాదృశ్యకము చేయు హిమాలయము.  1963 లో రూపొందించ బడిన రవీంద్రభవన్  మండి హౌస్ నుండి,  పటౌడీ హౌస్ వద్ద అశోక్ మార్గమందు గల ఆంద్ర భవ నము నుండి నడక దూరమునున్నది. విశాలత పచ్చదనం చూపరుల నాకట్టుకొను రవీంద్రభవనమందు 490 మంది కూర్చొను సామర్థ్య మున్న సభాభవనము (ఆడిటోరియము), బహిరంగ రంగస్థలము( ఓపెన్ ఎయిర్ థియేటర్)  కలవు. 


పొద్దు క్రుంగినది. సభాభవనమంతయూ పూర్తిగా నిండినది. విచ్చేసినవారు  కవి పండితవరేణ్యులు , రచయితలు , మేధావులు , బహు గ్రంథ కర్తలు , బహు సన్మాన గ్రహీతలు బహుపదవీ అలంకృతులు. దీర్ఘ చతురస్రాకారపు సభా వేదికపైన ఇరువది మంది  పెద్దలు కైవారం వెంబడి వేసిన ఆసనముపైఁ కూర్చొని యుండిరి . ఆ వేదిక మధ్యలో ఒక పెద్ద గాజు ఫలముగల కాఫీ బల్ల వద్ద మూడు ఉచితాసనములపై అకాడమీ అధ్యక్షులు , ఉపాధ్యక్షులు మరియు ముఖ్య అతిథి ఆసీనులై ఉండిరి.  

రంగస్థలం నుండి మొదటి రెండవ వరుసనందు పాత్రి కేయులు , దృశ్య మాధ్యమ వార్తా ప్రతినిధులు వారి వారి సిబ్బందితో ఛాయాగ్రహణ  ఏర్పాట్లు గావించుకుని సిద్ధముగా యుండిరి. ముందు నుండి ఎడమవైపు మూడవ వరుసలో బసవ కేశవ, సందీప రాఘవులు కూర్చొని యుండిరి. "హృదయాలజిస్ట్ కు వచ్చినాడు కానీ ఎచ్చటు న్నాడో ఎవరికీ తెలియకుండెను. అటువంటి సందిగ్ద సమూహమందు విదిష వలతి యుండిరి. వారు పన్నెండవ వరసలో        కూర్చొనిరి.  అగస్త్య  లకుమ విదిష లు రాలేక పోయినార"ని అందరూ అనుకొను చుండగా సభ ప్రారంభ మయ్యెను.  . 

 లంగా వోణీ ధరించిన ఒక తీగబోడి ఒక కోకిల కంఠి విఘ్నేశ్వర ప్రార్ధన రాగయుక్తముగా వీనుల విందుగా ఆలపించెను.

  శరణం శరణం గజవదానా శరణం శరణం మూషిక వాహన 

  మోదక భోజనమ్ అంకుశధారి మునిజనపూజిత బహుఫల దాతం

  గౌరీ సుకుమారం పరమ దయాకరం ఆనంద కైలాస మేరు నిరత సితం.

వేదికపై ఒక వారగా మైక్ వద్ద తెల్లని సూట్ ధరించి సెక్రటరీ నిలిచి “Now I request the president of the sahitya academy to welcome the chief guest of the today’s function అనెను ఒక సభ్యురాలు పుష్పగుచ్ఛమును ఒక అట్టపెట్టెను తీసుకొని వచ్చి సెక్రటరీ కివ్వగా, వారిరువురూ వేదికపైనున్న అకాడమీ ఆద్యక్షునికి అందజేయగా ఆయన తనపక్కనే కూర్చొనియున్న ముఖ్యఅతిధికి అందజేయుటకు లేచెను, ముఖ్య అతిథి  కూడా లేచెను  అధ్యక్షుడు ముఖ్య అతిధి కి పుష్పగుచ్ఛమును జ్ఞాపికను అందజేసెను. పిమ్మట వారిరువురూ పరస్పరము వందనమొనర్చుకొని ఆసనములపై కూర్చొనిరి.

సెక్రటరీ మరల మైక్ వద్దకొచ్చి  “ president of the Sahitya academy ..vice president of the academy chief guest of today’s function , respected writers , members of sahitya academy and winners of sahitya academy awards of previous years …a warm welcome to you all. తరువాత అతడు ముఖ్య అతిథి  గొప్పతనమును అతడు చేసిన సాహిత్య సేవను అతడు అలంకరించిన పదవులను చెప్పుచుండగా సభికులందరూ ఆశ్చర్యమునకు లోనయ్యిరి అతడి ప్రసంగము కొనసాగుచుండెను. 

మాలినిగారు "  చూచితివా తారా మంజూషను పంపి విదిష ను పిలిచిననూ రాలేదు”

వర్షుడు పిలవవలెనని ఆమె అనుకొనుచున్నదేమో?

వర్షుడే మంజుషని పంపినాడు, అది విదిష వద్దకు పోవుట నేను చూసితిని  వెంట దీసుకు రమ్మని చెప్పిన నూ  విదిష ని తీసుకురాక వంటరిగా వచ్చినది. తార వెనుకకి తిరిగి చూసి మీ అమ్మాయి వెనుక నే యున్నది నందినితో కలిసి నవ్వులాటలో ములిగినది దామిని " ఇంకా చిన్నతనము కొంచెము వయసు రావలెను " అని అనుచుండగా మాలిని ఆమె వైపు కొరకొరా చూచెను.

He held many positions later on. He was pillar of the academy in good times and drastic times. we miss you  sir but we still need his guidance. వ్రాసిన కొన్ని  గొప్ప  పుస్తకముల గూర్చి చెప్పి ముగించి సభికులందరినీ ఒక్కసారి లేచి కరతాళ ధ్వనులు చేయమని కోరగా సభికులందరూ లేచిరి. దామిని వేడుకకు తిరిగి చూడగా వలతి  పక్కనే నిలుచున్న విదిష కనిపించెను. ఆ విషయమును మాలినిగారికి తెలుపగానే క్షణామాలసించక పోయి విదిషను తీసుకువచ్చి ఆమె స్థానములో దామినిని కూర్చోండ బెట్టెను. ఇంకనూ కరతాళ ధ్వనుల సద్దు మణగ కుండుటచే అందరూ వేదికపై కి చూచు చుండిరి. కొద్దీ క్షణముల పిదప అందరూ స్థలములలో కూర్చొనిరి. అరుణతార తలతిప్పి ప్రక్కనే కూర్చొని యున్న  విదిషను చూసి ఆశ్చర్యపోయేను.  

 Sahitya Akademi, the highest and the most prestigious national academy of letters in India, established in 1954, which has published around 6000 books till date, roughly one book per 19 hours in 24 Indian languages besides organizing a variety of workshops, seminars, conferences and talks on Indian literature and bestowing the most consecrated national literary awards each year. సెక్రటరీ సాహిత్య అకాడెమీ గొప్పతనమును గూర్చి చెప్పుచుండెను.


మాలినిగారు విదిషతో "  నీవిచ్చట లేకున్నా వర్షుడి మనసు వికలమగును , మన కనుల వెలుగు చూడవలెనని , మన ఆనందమున ఆనందమండవలెనని అతడి ఆశను నిరాశచేయువా ఈ సమయము మరల వచ్చునా తల్లీ అని చెప్పి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని పట్టుకుని యుండెను. మీనాక్షి ఆమె ఆపేక్షను కని పరవశమొందుచుండెను.

సుందరి , రంజని ఆదృశ్యము చూసి మోసిముసి నవ్వులు నవ్వుకొని "  ఎంత గట్టిదమ్మా మాలిని , క్షణములో కోడలిని పట్టి తెచ్చెను , కట్టి కూర్చొండబెట్టెను " అనుకోను చుండగా మాలిని వారిని పట్టించుకొనక పిల్లలవలె  వారిని చూచెను.

Among the winning books are six poetry collections, four novels and six books of short stories, besides two books each of essays and criticism. The awards were recommended by distinguished jury members representing 23 Indian languages and approved by the Executive Board of the Akademi, under its President

మొట్టమొదట అస్సామీ రచయిత ని వేదికపైకి ఆహ్వానించిరి. కుల్ధర్ సైనిక వచ్చి వేదిక పై  రచయితల కొరకు ఆసనము పై కూర్చొనగా అకాడమీ ప్రెసిడెంట్ శాలువాకప్పి , జ్ఞాపికను అందజేసెను.   “డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పని చేసిన సైకిక , విశిష్ట సేవలకు గాను భారత  రాష్ట్రపతి నుండి  మెడల్ ను అందుకొని, కథ అవార్డు అందుకొనెను.” అని సెక్రటరి ప్రకటించెను. తరువాత ఢోగ్రి , బోడో భాషల రచయితలను ఆహ్వానించిరి  సెక్రెట్రీ  మైక్  వద్దనుండి ఆహ్వానించుట రచయిత వేదిక మధ్య లో నున్న కుర్చీ పై కూర్చొనుట పక్కనే ఉన్న ప్రెసిడెంట్ ఆ రచయితకు శాలువాకప్పి పురస్కారం అందజేయుట జరిగెను.

The award in Telugu goes to Bhakti Vijayam , Telugu poetry. Now I welcome Bharatvarsha on to the dias. వర్షుడు పంచె కట్టులో వేదికమద్యలోకి వచ్చి కూర్చొనెను . భారత వర్ష కళ్ళు తల్లి కొరకు విదిష కొరకు వెదుకు చుండెను.  మాలిని గారి కళ్ళు వర్షుడి కళ్ళు కలిసినవి  మాలినిగారి కళ్ళు వర్షిచుచుండెను.  తరువాత వర్షుడి కళ్ళు  విదిష కళ్ళు కలిసెను విదిష కళ్లు   మెరియుచుండెను. వర్షుడి గుండె నిండెను. సీక్రెట్రీ వర్షునిగూర్చి ఎదో చెప్పుచున్నారు  కానీ మాలినిగారికి విదిషకి అతడి గురించి తెలుసుకొనవలసినదేమియునూ లేదన్నట్టు తృప్తిగా చూసుకొని మురిసిపోవుచున్నారు . మీనాక్షి, అరుణతార ఆమె మొఖం లోకి చూచి ఆమె ఆనందమును అబ్బురంగా చూచిరి. 

వారి సరసన కూర్చొనుట ఒక యోగముగా భావించవలెను. మరట్టి సభాభవనమునున్న   సభావేదిక పై నీకొడుకు కు సన్మానము జరుగుట చూడవలెను. అని మీనాక్షి తారలు మాలినిని అభినందించిరి. విదిష కూడా అదృష్టవశమున ఇచ్చట నుండుటచే అంతయూ సవ్యముగా జరిగినట్లు భావించవచ్చు నని వారు అనుకొనిరి.

తరువాత వై ప్రెసిడెంట్ గారు హిందీలో సభనుద్దేశించి ప్రసంగించిరి “వచ్చే వారం  జరిగే కార్యక్రమంలో రచయితలకు ఫలకం,  లక్ష రూపాయల చెక్కుతో కూడిన ఈ అవార్డును రచయితలకు అందజేయబడును” అని తెలపగా సభ ముగిసెను. 

1 comment: