Tuesday, December 15, 2020

Bharatavarsha 93

 వర్షుడు, బసవడు, రాఘవుడు , కేశవుడు , సందీపుడు  రాకి , మీనాక్షి , అరుణ , మాలిని, దామిని , మంజూష  నందిని , వలతి , విదిష  రంజిని  మొత్తము బృందమంతయూ కార్యక్రమమైన పిదప ఒక చోట చేరిరి . స్థానిక టీ  వీ ఛానెల్   ప్రతినిధులు వర్షుని తో మాట్లాడు చుండిరి. మరుసటిదినమున  సాహిత్య చర్చ కొరకు అతడినాహ్వానించుచుండిరి.     ఇంతలో బసవడు "    ఢిల్లీలో ఆంధ్రులకు ఆంధ్ర భవనమన్న కడు  ప్రీతి  అచ్చట నోరూరించు ఆంధ్రా భోజనము లభించును. ఇంక అచ్చట  పిండివంటలు రుచి చెప్పనలవికాదు." అనుచుండగా  " అచ్చటికి పోనిచో ఈ రాత్రికి బసవడికి నిద్ర పట్టుట ఎట్లు" అని రాకి అనెను . మన మింటికి పోయి అచ్చట తినవలెను మీరు అందరూ  రెండు రోజులు  అచ్చటనే బసచే య  వలెను.  "  అని అరుణ తార అనెను. " మాకెట్లు కుదురును మాకు హైద్రాబాదు రవీంద్ర  భారతి యందు  కార్యక్రమములు కలవు  రెండు రోజులుండుటకు మాకెంత మాత్రమూ వీలు పడదు. " అని కేశవుడనెను. దామిని రాధాకృష్ణులు , బసవ రాఘవులు, వలతి  నందినులు  మాకెంత మాత్రము వీలు పడదని వట పాడు చుండగా వర్షుడు  తిరిగి వచ్చుచుండెను . ఆంద్ర భవన్కి   బసవడు అందరినీ తోలుకు పోయెను. అరుణ తార సిబ్బంది ముందుగా వాహనములలో పోయి అచ్చట ఏర్పాట్లు చేయుచుండిరి. ఆమె మాత్రము అందరితో నడుచుచుండెను. ఆంధ్రాభవనము చూడగానే బసవడి హృదయ ముప్పొంగెను వెంటనే


అహో ఆంధ్ర భవనమా! అశోక మార్గమందు విశాల సత్రమా!   భోజన ప్రియులకు భూతల కైలాసమా!  ఆంధ్ర రసనపై నీ రుచులాడు చుండ, ఆ చంద్ర తారార్కమై నీకీర్తి  వెలుగుచుండు. అని ఒక చిన్న ఉపోద్ఘాతముతో తన ఆశు కవితను జమ్మని వదిలెను.

ఆవకాయ చవులు   అప్పడముల కరకరలు 

ఎప్పుడు  వలసిన  అప్పుడు దొరుకుచుండు 

గోంగూర ఘుమ్మని రమ్మని పిలుచు కమ్మని

వంటల ఆంద్ర విందు ఆంధ్రభవనులో ఆరగింతు.

అందరూ ఎంతగానో ఆనందించిననూ రాకి మాత్రము " ఛీ ఛీ ఎప్పుడు డ్రామా కంపెనీవాలే  పెద్ద పెట్టున నోరు పెట్టు ఈ బాలుని ప్రక్కనున్నచో నా తల వ్రక్కలగుచున్నది. అనెను . అదివిన్న కేశవుడు వెంటనే " డ్రామా కంపెనీ అన్న అంత  చులకనగా నున్నదా ? " యని అడిగెను   రాకి  కి జరిగిన పొరపాటు అర్ధమయినది. ఆబ్బె  పొరపాటు పడితిని డ్రామా కంపెనీలవల్లే దేశమిట్లు  సుభిక్షంగా నున్నది అని మాట మార్చగా అందరూ నవ్వుకొని లోపలకు ప్రవేశించిరి అందరూ ఎదురెదురుగా కూర్చొనిన పిదప వారి వారికి ఏమి వలయునో ఆజ్ఞాపించి ఎదురు చూచు చుండిరి.  రాఘవుడు ఆంధ్రభవనముపై ఒక చక్కటి తేటగీతి పద్యము చెప్పెను.

వు  రావుర  ననుజిహ్వ    కాయ

చూ, పాయస గారులు చూ ఆగ

లేరుగుత్తివం కాయకూ  రా  గించ

ఆంద్ర భవన మింకెట్లు మరువ గలరు

వీడి పద్యములు ఎప్పుడు తుస్సుమను ప్రయోగములేకదా అని బసవడనెను  పద్యమంతయూ బాగున్నది కానీ చివర పాదమందు యతి ఎచ్చటున్నది. అని నందిని  చెప్పగా రాఘవుడు మరల ప్రయత్నించి తప్పు చేసెను .  అందరూ కోరగా కేశవుడు ఆఖరి పాదమును మార్చి ఇట్లు పాడెను,  అయిననూ పద్యము అర్ధవంతము గా కానరాలేదు.  

వు  రావుర  ననుజిహ్వ    కాయ

చూ, పాయస గారులు చూ ఆగ

లేరు,  గుత్తివం కాయకూ  రా  గించ

మంచి  బొబ్బట్లు తినెట్లు  రువ  గలరు

“ఇందు  ఆంధ్రభవనమను మాట మాయమయ్యెను.” అని మంజూష అనగా  కేశవుడు " ఈ పద్యమందు ఆదిలోనే అంసపాదమున్నది. ఇటువంటి పద్యములను నేను మరమత్తు జేయజాలను.” అని తన సొంతగా ఆటవెలది పద్యమును ఇట్లు పాడెను.

ఆ. ఆంధ్ర భవనము  లోపల ఆజ్ఞ  ఇచ్చి    
తెచ్చు లోపు  రుచులు  తెలియ  వచ్చె 
తెలుగు భోజన మందున  తెలుగు భాష 
యందు  రుచులు  చూడ  యొక్క తీరె.     

చివరకి అందరూ వర్షుని వైపు చూడగా వర్షుడు ఒక్క చిటికలో దానిని మార్చి ఇట్లు పాడెను.

వు  రావుర  ననుజిహ్వ    కాయ

చూ, పాయస గారులు చూ ఆగ

లేరు,  గుత్తివం కాయకూ  చవు లూరు

ఆంద్ర భవన  మీతీరు లరు చుండు.

తేటగీతి చిటికలో సవరించినాడు వర్షుడు . ఆహా ఇందులకే కదా ఇతడికి నేడు పట్టము గట్టిననారు. అని రాధా కృష్ణుడు అనెను. మంజూష అవధానం జేసినవాడు  ఆటవెలదిలు పాడుట ఘనము కాదు అనుచుండగా భోజనములు వచ్చినవి. వారు బల్లలపై పెట్టనంతలో వర్షుడు…

శా. సింగాలే   పదిదూ        కెనాన్ద్ర      భవన        ప్రాకార     మందేల నో  

హంగామా సలిపే         రుకాంత    లుఘన     హ్లాదాన     చెంగల్వ లే     

బంగారు   ప్రభచే          లములం   దునదా    పాడు ప్ర    తాపాల తో 

కంగారె    త్తరచూ           పవింత      జనులే     క్రిగ్గాలి      స్తంబించ దా 

“అబ్బో ఏమి ఇతడి దూకుడు! క్షణకాలంలో ఒక శార్దూలము నొదిలినాడే,” అని మీనాక్షి మెచ్చుకొనుచుండగా “ఒక్కటేమి పది పులులను వదలగలడు”  అని మంజూష అనుచుండగా   “నాబిడ్డ అన్నము తినవలెను ఇట్లు చెప్పి చెప్పి ఎంత చిక్కి పోయెనో కదా.” అని మాలిని గారనెను. అందరూ భోజనము తినసాగిరి  కొలదీసేపు  మాటలాగినవి. బసవడు ప్రపంచ తిండి  పోటీలలో పాల్గొనుచున్నట్లు తినుచుండగా దామిని, అరుణతార , మీనాక్షి విస్తుపోయి చూచుచుండిరి. కేశవునకు చేతినొప్పి అగుటచే రంజిని అతడికి తినిపించుచున్నది. మాలినిగారు అటు చూచుచుండగా కేశవునకు జరిగిన ప్రమాదం గూర్చి చెప్పి “చేతినొప్పి వలన తినలేకుండెను” అనెను మాలినిగారు నవ్వి అందుకు “వివరణ ఏల ఇచ్చుచున్నావు.” అనగా “నాకు కూడా చేతి  నొప్పి కలదు”  అని రాకి  అనగా అందరూ దామిని వైపు చూచి నవ్వ సాగిరి. 


నందిని మాత్రము తన వేళ్ళ వీణియలు మీటుచున్నది.  “అందరి కళ్ళు మా మంజూష పై నే యున్నవి దిష్టి తీయవలెను ' అని దామిని అనెను. “అయినచో ఎత్తుకొని తినిపించుము.” అని రాకి “అనగా ఆపని సందీపుడు చూసుకొనును.” అని వలతి అనెను. "దిష్టి తగిలినది వర్షునకు అందరి కళ్ళు వాడిపైనే యున్నవి ముందు వాడికి దిష్టి తీయవలెను." అని మాలిని అనెను 

బావగారి సంగతి నాకు వదిలిపెట్టవలెను అని నందిని అనుచుండగా విదిష బెదుర కళ్ళ జింక వలె వర్షుని చూచెను. వర్షుడు విదిష వైపు ప్రేమగా చూచుచుండెను.  అందరూ భోజనములు ముగించిన పిమ్మట ఆవరణలో చెట్ల క్రింద నిలిచిరి. అరుణ, మీనా, మీఠాపాన్, తినుచున్నారు. రంజని ఒక మీఠాపాన్ తెచ్చి కేశవునకిచ్చెను. నందిని ఐదు వేళ్ళకు చిలకలు చుట్టిన  తమల పాకులతో  వర్షుని  వద్దకొచ్చి  నోటికందించుచుండెను. విదిష నందిని చేతి వేళ్ళ నుండి

" హు ఏమీ బహిరంగ కుతూహలము. వర్షుడు నావాడు” అనుచూ   ఆ చిలకలూడబీకి కింద పారవేసెను.నందిని  త్రాచువలె లేచెను “వర్షుడు నీవాడా నీకిచ్చి కట్టబెట్టినారా? లేక మంజూషవలె ప్రధానమయినదా?” వారిద్దరి మధ్య ఘర్షణ  పెరుగుచుండగా మాలినిగారు నందినిని ప్రక్కకు కొనిపోయినారు.   విదిష ఆమె వంక కోపముగా చూచుచుండెను. 

రాధాకృష్ణ కేశవునితో " పోయి సముదాయించరాదూ  నీవునూ వారింటి మనిషి వేకదా " అని కేశవుని ఎగదోసినారు. అప్పుడు కేశవుడు " మా గురువుగారే  మిన్న కుండినారు. నాకేల ముప్పు నేనునూ మిన్న కుందును గాక" అనెను.   మంజూష, విదిషతో  "వరసకి బావగారే  కదా చిలక చుట్టి ఇచ్చిన ఏమగును?” మాలినిగారు వారికి సద్దిచెప్పగా అందరూ ఒక చోట చేరినారు. అరుణతారగారు  "నేడు ఎంత   శుభ దినము ఇట్లు మనసు ఇట్లు స్వల్ప విషయములకు పాడుచేసుకొని అమృత తుల్యమైన ఆనందమును జారవిడుచుకొనుచున్నారు .  మీరు అతడిని  గౌరవమందిన చోటనే గాయపరుచుచున్నారు. మాలిని తల్లి మనసు  ఎంత దుఃఖించును ఆలో చించినారా ? ఆడవారి నేమీయూ అనలేక   వర్షుడు దూరంగాపోయినాడు. 

కోటి రూపాయలు కట్నమిచ్చుటకు అన్నకావలెను. అతడు రేయింబవళ్లు కష్టపడినా శ్రమను మీకొరకు ఉపయోగించుచుండగా కించిత్తు గర్వమును తగ్గించుకొని అతడికి  ఆనందమును పంచలేకున్నారు. నలభై గెడ్డములు  ఒక చోట ఉ న్న నూ భయమే లేదు కానీ నాలుగు కొప్పు లు ఒకచోట ఉన్న చో  ఇట్లే ఉండును అన్న సామెతను నిజము చేసినారు.

 అని చెప్పుచుండగా నందిని విదిష మంజూష వర్షుని వద్దకు పోయి అతడిని తీసుకు వచ్చిరి.

అన్నను  మంజూష నవ్వించ  యత్నించి విఫలమయ్యెను. నందిని సంస్కృత శ్లోకమును గానము చేసెను.


సనాతన  తనయే,  సాహిత్య శైలే  నందిని మానస  జేతే 

 సుందర వదనే  భారతవర్షే  భక్తి   విజయ వనమాలీ 

పండిత  హృదయే  భగవతి  సదనే  క్షమస్తత్వమ్ ఆచార్యం


వర్షుని వదనమందు విషాదము ఛాయలంతరించినవి. వర్షుని పెదవులపై  నవ్వులు పూచినవి. రంజిని “క్షణములలో వర్షునెట్లు మార్చినదో నందిని జాణ  సుమీ”  నీకంటే జాణను కాను  లేవమ్మాగురువుగారు సాహిత్య ప్రియులు. అందునా సంస్కృతమన్న గురువుగారి కి భక్తి ఎక్కువ. మాలినిగారి మనసు పొంగినది.  మంజూష , విదిష , నందిని లు  వర్షుని  విజయమును కొనియాడిరి. వారి మువ్వురిని చంటకు తీసుకొని వారి భుజములపై చేయివేసి ఒక కుటుంబ సభ్యులవలె మురిసి సేద  తీరెను.   మరల అందరూ కొలది సేపు ఆనంద గగన విహారం జేసిరి    


 నందిని మంజూష విశాఖ పోయెదమని , రాఘవుడు సందీపుడు  బెంగుళూరు పోయెదమని బయలు దేరి వెడలిరి. మీనాక్షి కూడా బెంగళూరు పోవుటకు వారితో కలిసెను. 

మాలిని విదిష పక్కపక్కనే నిలబడి యుండిరి అరుణతార వారి వద్ద కొచ్చి " వర్షు డొక వారము ఇచ్చటనే ఉండవలెను కదా, ఈవారము రోజులు మీరు మాఇంటివద్దనే ఉండ   వలెనని చెప్పుచుండగా , కేశవుడు రంజిని తో " ఈ డాక్టరు వలే నేను వెర్రి మొఖమును కాను  మనమునూ  నాలుగు రోజులిచ్చటనే  యుండి ఢిల్లీ చూచి పోయెదము అని  మాలిని గారితో మాత్రము"   మేము హైదరాబాదు పోవలెను మాకు విమానము సిద్ధముగానున్నది " అని చెప్పి బయలుదేరెను.  రాధాకృష్ణ దామినితో " ఆకేశవుని వలే నేను వెర్రి మొఖ మును కాను , అతడెప్పుడూ  డప్పు వాయించుకు తిరుగును, శృంగారమనునది ఉండవలెను. మనమునూ  నాలుగు రోజులిచ్చటనే  యుండి ఢిల్లీ చూచి పోయెదము అని  మాలిని గారితో మాత్రము  "   మేము విశాఖ కు  పోవలెను మాకు విమానము సిద్ధముగానున్నది. "అని చెప్పి బయలుదేరిరి. బసవడు కూడా అందరివద్ద సెలవు తీసుకొని   చెన్నపట్నము పోయెను.  అరుణతార వాహనము ప్రవేశ ద్వారము వద్ద నిలిచి యున్నది. వాహనమందు వర్షుడు విదిష , మాలిని తార కూర్చొనగా వాహనము నార్త్ ఎవెన్యూ ఎం పీ నివాసముల వైపు సాగి పోయెను.


No comments:

Post a Comment

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...