కిన్నెరసాని పాటలు విన్నారా ? కిన్నెరసాని విశ్వనాథ సత్యనారాయణ సృజన అని తెలుసా ?
కిన్నెరసాని పాటల్లో కథ ఏంటో తెలుసా?
కిన్నెరసాని వచ్చిందమ్మా .. పాట విన్నారా
కొంత మంది విని ఉంటారు ( సినిమా పాట కదా)
కిన్నెరసాని పాటలు 32 పేజీల చిన్న పుస్తకం.
విశ్వనాథ వారి కిన్నెర పాట.
తుద కేమి చేయగా
నెదవోక అలవోక
పతి రాయిగా మారి పడియున్న గుట్టపై
అతివ తన కెరటాల హస్తాలతో చుట్టి
వెతపొంది వెతపొంది బిట్టు గోషించింది
మాటి మాటికి కొండ
మాద్రిగా పడివున్న
తన నీటుకాన్ని చేతుల కౌగిలిస్తుంది
పలకవా యని మ్రోతపడి పల్కరిస్తుంది
పతి గుట్టపై తాను వ్రాలి యేడుస్తుంది
ఓ నాధ! ఓ నాధ!
ఓ నాధ! ఓ నాధ!
"ఈ కధలో జానపద మూలాలు - అంటే - కధ మొత్తం విశ్వనాధ వారి భావంబర విధిలో కల్పింపబదినదే. కాబట్టి దీనికి కధా మూలం జానపద ములాల్లోనే కాదు, ఏ పురాణ వాజ్మయ ప్రపంచంలోనూ లేదనేది స్పష్టం." అని లోగిలి డాట్ కామ్ లో వ్రాసారు కానీ ఇది తప్పు. ఈ బ్లాగుపోస్టు చదివితే లోగిలి డాట్ కామ్ వారు తమ అభిప్రాయం మార్చుకుంటారు
నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము అనే కావ్యము రచించాడు.
ఇది భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామరాజభూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు. ఇది మహా గ్రంధం కాదు 127 పేజీల పుస్తకం. తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.
ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠానపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు.
కోలాహలుడు అనే పర్వతము, శుక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలాహలునికి, శుక్తిమతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు. ఇదీ వృత్తాంతం.
శుక్తిమతి యొక్క నిత్యనిర్మలాకార కాంతిధార కు కోలాహలుడు వశుడవుతాడు శుక్తిమతి తనని ఆదరిస్తుందని కోలాహలు డనుకుంటాడు ఆమె అభిమతం తెలుసుకోకుండా ఆమెను పొందడానికి నిశ్చితాత్ముడు అవుతాడు కోలాహలుడు. శుక్తిమతీ కోలాహల వృత్తాంతాన్నికొందరు రసాభాసమన్నారు.
నదులకు, పర్వతాలకు ప్రణయం పొసగదని శుక్తిమతి అభిప్రాయం. పర్వతాలకు, నదులకు సఖ్యమా? వినటానికే బాగోలేదు. పర్వతాల నుండి నదులు పల్లానికి ప్రవహిస్తాయి.ఆ నదీ జలం పర్వతానికెక్కడం ప్రకృతి విరుద్ధం. జన్య జనక సంబంధంలో పుత్రికా వాత్సల్యం ఉండాలి కాని అనుచతిమైన ప్రణయానురాగం ఉండకూడదని శుక్తిమతి గట్టిగా చెపుతుంది. వావి వరసలు తెలిసి వర్తించాలని బోధిస్తుంది. మదనవికారంలో గౌరవాన్ని మరచిపోకూడదు అంటుంది. పుణ్యదేశాలు తిరిగి భర్తృవియోగ తపనంచేత భర్తను (సముద్రుని) వెదకికొనిపోయె అభిసారికనని అంటుంది. దీనికి కోలాహలుడు తనది జన్మజన్మలప్రేమ అని అతడు చివరికి బలముతో ఆమెను పొందుతాడు.
Percy Bysshe Shelley (1792-1822) అనే ఆంగ్ల కవివిశ్వనాథ కిన్నెరసానిలో ఏంరాసారో అరిథుసా అనే పద్యంలోఅంతకుముందే అదే రాసాడు. నేను విశ్వనాథ కాపీ చేశారు అనటం లేదు. ఆ భావన ను స్వీకరించి ఉండవచ్చు. అంతకముందు ఎక్కడా లేదు అనడం సరికాదు.
అరిథుసా అనే నదిని ఆల్ఫీయస్ అనే పర్వతుడు (పర్వతం) ప్రేమిస్తాడు.
ఆల్ఫీయస్ టైటాన్ తెథిస్ ల కొడుకు . పెండ్లి అయినవాడు.
( పెళ్లి అయినా వారు ప్రేమించడం హిందూ సంస్కృతిలో ఉందా ?)
అరిథుసా ఆర్టిమిస్ ( డయానా) అనుచరురాలు. డయానా అంటే చంద్రవతి . (మన భాషలో చంద్రుడు.)
డయానా రెటిన్యు లో ( రెటిన్యు అంటే అనుచర గణం ) భాగమైన అయిన
అరిథుసాను నది గా మార్చేస్తుంది. అరిథుసా పరుగెత్తి పరిగెత్తి (ప్రవహించి ప్రవహించి)
ఎంత దూరం పోయినా ఆల్ఫీయస్ వదలదు. వెంట పడుతుంటాడు. చివరకు సముద్రంలో కలిసిపోయిన వదలదు. అతడుకూడా నదిగా మారి ఆమెను అందుకుంటాడు. అరిథుసా కిన్నెరసాని ఒకటే. విశ్వనాథ ముగింపు లో చిన్న మార్పు చూబించారు. కిన్నెరసానిని సముద్రుడికి దక్కనివ్వలేదు . కిన్నెరసాని (శీలం )కాపాడారు. మనకి శీలం ముఖ్యం కదా
You are a good analyzer sir. Well compared two stories.
ReplyDeleteThank you
ReplyDelete